నిద్ర ఎక్కువైనా ప్రమాదమేనట . …

నిద్ర ఎక్కువైనా ప్రమాదమేనట . …

ఓ అధ్యయనంలో వెల్లడైన వైనం

కంటి నిండా నిద్రపోవాలి . .. అంటూ ఉంటారు . అంటే ఎక్కువ సమయ0 అని కాదు . . నిద్రపోయిన సమయంలో ప్రశాంతంగా నిద్రపోవాలనేది ఇందులో దాగి ఉన్న మర్మం .

ఎక్కువ నిద్ర కూడా ప్రమాదకరమే : ప్రతిరోజూ 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల తక్కువ నిద్రతో వచ్చే ఆరోగ్య సమస్యల మాదిరిగానే ఆరోగ్య సమస్యలు వస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది. 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారికి, సాధారణంగా నిద్రపోయే వారితో పోలిస్తే, మరణం సంభవించే ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అతిగా నిద్రపోవడం అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుందని, టైప్ డయాబెటిస్ , హార్ట్ ప్రొబ్లెమ్స్ . . ఊబకాయం, డిప్రెషన్, తలనొప్పి, వైద్య పరిస్థితి కారణంగా చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుందని ఓ కీలక  అధ్యయనంలో పేర్కొంది.

ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఆరోగ్య సమస్యలకు కారణం కాకుండా, ఒక లక్షణం మాత్రమే కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, కోలుకోవడానికి ఎక్కువ సమయం అవసరం కాబట్టి, ఎక్కువసేపు నిద్రపోతారని తెలిపారు. నిద్రలేమి వంటి కొన్ని సమస్యల వల్ల తక్కువ నాణ్యత గల నిద్ర ఉన్నవారు కూడా ఎక్కువ సమయం పడుకుంటారని పేర్కొన్నారు. పొగతాగడం, వ్యాయామం చేయకపోవడం లేదా ఊబకాయం వంటి జీవనశైలి అలవాట్లు ఎక్కువ నిద్రపోయే వారిలో సర్వసాధారణంగా ఉంటాయంటున్నారు. ఎక్కువ నిద్రపోవడం అనేది ఆరోగ్య సమస్యలకు మధ్య బలమైన సంబంధం ఉందని, చాలా వరకు, అంతర్లీన ఆరోగ్య సమస్యలు దీనికి కారణం కావచ్చని వివరించారు.

ఎంత నిద్ర కావలి . ..సాధారణ సాధారణ  ఆరోగ్యవంతుల్లో రాత్రిపూట కనీసం 7 గంటల నిద్ర అవసరమని ఒక అధ్యయనంలో పేర్కొంది. అయితే ఇది సాధారణ నియమమే గానీ కచ్చితమమేమీ కాదని పేర్కొన్నారు. కొంత మందికి 7 గంటల కన్నా తక్కువ నిద్రే సరిపోవచ్చని, మరికొందరకి ఎక్కువగానూ అవసర పడొచ్చని వివరించారు. మొత్తం మీద పడుకొని లేచాక ఎంత హుషారుగా ఉన్నామనేదే కీలకమంటున్నారు. నిద్ర లేచాక ఉత్సాహంగా లేకపోయినా, కునికిపాట్లు పడుతున్నా నిద్ర తగ్గిందనే భావించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు . .

జగన్ – చేజారిన ఆధిపత్యం, వారసత్వం

జగన్ – చేజారిన ఆధిపత్యం, వారసత్వం

మూడున్నర దశాబ్దాల అప్రతిహతంగా దమనకాండ సాగిన . .. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కోట పులివెందుల బద్దలైంది. జడ్పీటీసీ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇది కేవలం ఒక స్థానిక గెలుపు కాదు, వైఎస్ కుటుంబానికి ఐదు దశాబ్దాలుగా ఎదురులేని ఆధిపత్యం ఉన్న గడ్డపై తగిలిన గట్టి దెబ్బ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమైన ప్రజా వ్యతిరేకత ఇంకా ఎంత బలంగా పాతుకుపోయిందో ఈ ఫలితాలు తేల్చి చెప్పాయి.

పులివెందులలో టీడీపీ అభ్యర్థిని లతా రెడ్డి ఏకంగా 6,035 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఆమెకు 6,716 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కేవలం 683 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఒంటిమిట్టలోనూ టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ రెండు చోట్లా 77% నుంచి 86% వరకు భారీ పోలింగ్ నమోదైంది. మార్పు కోసం ప్రజలు ఎంత బలంగా ఉన్నారో చెప్పడానికి ఈ పోలింగ్ శాతమే నిదర్శనం.

1978లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి తొలిసారి గెలిచిన నాటి నుంచి ఆ కుటుంబానికి పులివెందులలో ఓటమి లేదు. వారు నిలబెట్టిన వారే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో వైఎస్సార్, వై.ఎస్. విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి 60 వేల నుంచి 90 వేల ఓట్ల భారీ మెజారిటీలతో గెలిచారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీచినా, జగన్ పులివెందులలో 61 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అలాంటి చోట ఇప్పుడు పార్టీ అభ్యర్థి ఓడిపోవడం అంటే వైఎస్ కుటుంబానికి రాజకీయ ముగింపు కాదు. కానీ, వారి వారసత్వం ఇకపై తిరుగులేనిది కాదని తేలిపోయింది.

వై.ఎస్. రాజారెడ్డి వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి పునాదులు వేశారు. ప్రజల సమస్యలు తీరుస్తూ, విద్యాలయాలు కట్టిస్తూ, వారికి అండగా నిలిచారు. వైఎస్సార్, జగన్ ఆ వారసత్వాన్ని కొనసాగించారు. అయితే, జగన్ తన పాలనలో ఆ పాత బంధాన్ని బలహీనపరిచారు. అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండటం కంటే, కేవలం సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలే పాలనకు ప్రామాణికం అయ్యాయి. కానీ, ఉద్యోగ కల్పన, మౌలిక వసతులు వెనకబడ్డాయి. సంక్షేమాన్ని కూడా ఒక రాజకీయ ఆయుధంగా వాడారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కొన్ని చోట్ల ప్రతిపక్ష మద్దతుదారులను ఇబ్బంది పెట్టడం ప్రజల్లో భయాన్ని, ఆగ్రహాన్ని పెంచాయి. తన బాబాయి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు, సోదరి షర్మిల వ్యతిరేక ప్రచారం కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాయి.

ప్రజలతో ఉన్న పాత సంబంధాన్ని జగన్ ఒక లావాదేవీగా మార్చారు. ఆ లావాదేవీలో బలవంతపు ధోరణి కనిపించడంతో, ప్రజలు తిరగబడ్డారు.

“బొంబులసీమ”గా పేరుపడ్డ చోట, ఎన్నికలు హింసాత్మక ఆధిపత్యానికి బదులు, ప్రజాస్వామ్య పోరాటానికి వేదికగా మారాయి. గత 30 ఏళ్లలో పులివెందుల జడ్పీటీసీ స్థానానికి పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. ఈసారి టీడీపీ దీన్ని “ప్రజాస్వామ్య పునరుద్ధరణ”గా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఇది ఫ్యాక్షనిజం అంతం కాకపోయినా, పోరాటం బాంబుల నుంచి బ్యాలెట్ బాక్సులకు మారిందని చెప్పవచ్చు.

ఈ ఫలితం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యాన్ని నింపింది. జగన్ అజేయుడనే భ్రమను పటాపంచలు చేసింది. “పులివెందుల పరాజయం” వల్ల జగన్ కు 40 శాతం ఓటర్లు ఇంకా మిగిలి లేరని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్ధమౌతుంది. జగన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ విషయం మరింత లోతుగా అర్ధం చేసుకుంటారు. మరోవైపు, టీడీపీకి ఈ విజయం భారీ నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. చంద్రబాబు నాయుడు దూకుడు వ్యూహం ఫలించింది. కూటమి బలం సూక్ష్మస్థాయిలో కూడా పనిచేస్తుందని రుజువైంది.

175 లో ఒక్కటి కూడా వొదిలేది లేదు (వై నాట్ 175) అని అభిమానుల్లో కార్యకర్తల్లో మితిమీరిన నమ్మకం నింపిన జగన్ కూర్చున్న వున్న పులివెందుల కూడా కరిగి పోవడం కేవలం స్వయంకృతమే! చంద్రబాబుని జైలుకి పంపి ప్రభుత్వాన్నే ఆయనకు ఇచ్చేసారు. చంద్రబాబు బాబు కోట కుప్పం మునిసిపాలిటీలో వేళ్ళూ కాళ్ళూ పెట్టిసొంత స్థానమైన పులివెందుల మీదే పట్టుతప్పిపోయారు… అంటే ఈ సంకేతాలు రాబోయే రోజులలో వైసీపీకి తీవ్రమైన గడ్డు పారిస్తుతులే అని చెప్పక తప్పదు .

తెలుగు మహిళకు బ్రిటన్‌ పౌర పురస్కారం

తెలుగు మహిళకు బ్రిటన్‌ పౌర పురస్కారం

పూర్ణిమ తణుకు – బ్రిటన్‌ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన సీబీఈ అవార్డుని అందుకున్న తొలి తెలుగు మహిళ

” మా స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట. సొంతూరిలోనే ప్రాథమిక విద్య పూర్తయ్యాక అమలాపురంలోని ఎస్‌కేబీఆర్‌ కాలేజీలో డిగ్రీ చదివా. ఆపై ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేశా. నాన్న విశ్వేశ్వరయ్య, టైపు ఇన్‌స్టిట్యూట్‌ నడిపేవారు. అమ్మ రత్నాంబ, గృహిణి. లండన్‌లో సర్జన్‌గా పని చేస్తున్న డాక్టర్‌ వెంకట సూర్యనారాయణతో పెళ్లవడంతో ఇక్కడే స్థిరపడ్డా. మొదట ఇంజినీరింగ్‌ కంపెనీలో కెరియర్‌ ఆరంభించా. తర్వాత యువత, పిల్లల కోసం పనిచేసే ‘రీజనరేషన్‌ ట్రస్ట్‌’కి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించా. ఆపై జైళ్లలో ఉన్నవారికి విద్యను అందించేందుకు కృషి చేసిన తొలి ఆసియా మహిళగానూ గుర్తింపు దక్కించుకున్నా. ”

 బ్రిటన్‌ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన సీబీఈ అవార్డుని అందుకున్నారు మన తెలుగు మహిళ పూర్ణిమ తణుకు.

బాలల సంరక్షణku పోరాటం : ప్రస్తుతం నేషనల్‌ డే నర్సరీస్‌ అసోసియేషన్‌ (ఎన్‌డీఎన్‌ఏ)కు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నాఋ పూర్ణిమ . . ఇది యూకేలో బాలల సంరక్షణ, హక్కుల కోసం పనిచేసే అతిపెద్ద ఛారిటీ-మెంబర్‌షిప్‌ అసోసియేషన్‌. 2004లో ఈ సంస్థలో చేరారు . అప్పటికి 20 మంది సిబ్బందితో చిన్నగా ఉండేది. ఇప్పుడు మూడు శాఖలతో 100మందికిపైగా ఉద్యోగులతో శక్తిమంతమైన స్వచ్ఛంద సంస్థగా మార్చగలిగారు పూర్ణిమ . . యూకేలోని 15000 డే నర్సరీల హక్కుల కోసం పోరాడి రికార్డ్ క్రియేట్ చేసారు . . దాదాపు పదిలక్షల మందికిపైగా చిన్నారులు, వారి కుటుంబాలకు అత్యున్నత సంరక్షణ విధానాలు అమలయ్యేలా చేయగలిగానని వినంరంగా చెపుతారీమె .

అవార్డు అందుకున్న తొలి తెలుగు మహిళ : ”ఇంగ్లండ్‌ సహా 22 దేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఇలా 20 ఏళ్ల పాటు ఎన్‌డీఎన్‌ఏకు నాయకత్వం వహిస్తూ బాలల విద్యకు చేయూత అందించినందుకు గానూ పలు పురస్కారాలు దక్కాయి. 2011లో బ్రిటన్‌ పౌర పురస్కారాల్లో ఒకటైన ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ)ను కింగ్‌ చార్లెస్‌ చేతుల మీదుగా తీసుకున్నా. తాజాగా కమాండర్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (సీబీఈ)ని చార్లెస్‌ సోదరి ప్రిన్సెస్‌ అనీ అందించారు. ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్, నోబెల్‌ గ్రహీత హెరాల్డ్‌ పింటర్, రగ్బీ ఆటగాడు జొనాథన్‌ పీటర్‌ విల్కిన్సన్‌తోపాటు మనదేశం నుంచి ఈ గౌరవాన్ని పొందినవారిలో లీనా నాయర్‌ ఒకరు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు మహిళను నేనే కావడం గర్వంగా ఉంది.” అంటూ తనకు అవార్డు రావడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ తెలుగు ఆడపడచు పూర్ణిమ .

అమెరికా టారిఫ్  ఎఫెక్ట్ – భారత్ పై ఏ మేరకు?

అమెరికా టారిఫ్ ఎఫెక్ట్ – భారత్ పై ఏ మేరకు?

అమెరికా టారిఫ్​లు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచింది. ఈ క్రమంలో అమెరికా సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయా? టారిఫ్​లు ఇండియన్ ఎకానమీపై ప్రభావం చూపుతాయా? తదితర విషయాల గురించి ఆర్​బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఏ అంచనా వేస్తున్నారు . అయన విశ్లేషణ ఏమిటి ??

‘భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది’
అలాగే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలపైనా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ట్రంప్ సుంకాల ప్రకటనలు, కొనసాగుతున్న వాణిజ్య చర్చల గురించి ప్రస్తావించారు. ఈ పరిణామాలు భారతదేశ వృద్ధిని ప్రభావితం చేస్తాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ, సుంకాల వంటి ప్రపంచ వాణిజ్య సమస్యలు సవాళ్లను తీసుకురావచ్చని వివరించారు. “దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న ప్రపంచ అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత నుంచి ఉత్పన్నమయ్యే ఎదురుగాలులు వృద్ధికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకెళ్తోంది. వృద్ధి బలంగా ఉంది” అని సంజయ్ ప్రకటించారు.

ఆర్​బీఐ గవర్నర్ మల్హోత్రా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. తక్కువ వృద్ధి, ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాలసీ మేకర్స్ ఇప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. “ప్రపంచ వాణిజ్య సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, రాజకీయ అనిశ్చితులు కొంత వరకు తగ్గాయి. ఇటీవల కాలంలో మారుతున్న పరిస్థితులను బట్టి భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మంచి అవకాశాలను కలిగి ఉంది. ప్రపంచంలోని పలు దేశాలు తక్కువ వృద్ధిని, ద్రవ్యోల్బణ భారాన్ని ఎదుర్కొంటున్నాయి. కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణంలో పెరుగుదలను కూడా చూస్తున్నాయి” అని సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు.

కీలక విషయాలపై వివరణ
ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్​బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ప్రకటించారు. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు, భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా సుంకాల ఎఫెక్ట్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల గురించి సంజయ్ వివరణ ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉంది? ప్రపంచ వాణిజ్య వాతావరణంలో కొనసాగుతున్న మార్పుల వల్ల అది ఎలా ప్రభావితమవుతుంది? అనే విషయాలను వెల్లడించారు.

“రెపో రేటును 5.5శాతం వద్ద కొనసాగించాలని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇతర కీలక రేట్లు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 5.25శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటు 5.75 శాతం వద్దే స్థిరంగా ఉన్నాయి. ఆగస్టు 4, 5,6 తేదీలలో ఎంపీసీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే పాలసీ రెపో రేటును 5.5శాతం వద్ద స్థిరంగా ఉంచడానికి ఎంపీసీ ఏకగ్రీవంగా ఓటు వేసింది. కొత్త డేటా, మారుతున్న దేశీయ, ప్రపంచ పరిస్థితులపై కమిటీ నిశితంగా నిఘా కొనసాగిస్తుంది. తగిన ద్రవ్య విధాన విధానాన్ని రూపొందించడానికి ఇన్​కమింగ్ డేటా, అభివృద్ధి చెందుతున్న దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులపై నిశితంగా నిఘా ఉంచాలని ఎంపీసీ నిర్ణయించింది. దీని ప్రకారం, సభ్యులందరూ తటస్థ వైఖరిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు” అని సంజయ్ మల్హోత్రా తెలిపారు.

‘వార్ 2’ అందుకే ఒప్పుకున్నా.. రీజన్  చెప్పిన ఎన్టీఆర్

‘వార్ 2’ అందుకే ఒప్పుకున్నా.. రీజన్ చెప్పిన ఎన్టీఆర్

ఈ స్క్రిప్ట్ త‌న‌ను బాగా ఆక‌ర్షించింద‌న్న తార‌క్‌

ఏదైనా కధ నచ్చితే వెనక్కి చూడకుండా నటించడానికి అంగీకరిస్తారు జూనియర్ ఎన్టీఆర్ . యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం ‘వార్ 2’ గురించి నోరు విప్పారు . ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో నటించడానికి తాను ఎందుకు అంగీకరించారో వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 14న మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ మ్యాగ‌జైన్‌ ‘ఎస్క్వైర్‌ ఇండియా’ తాజాగా ఎడిష‌న్ క‌వ‌ర్‌పేజీపై తార‌క్ ఫొటోను ముద్రించింది. ఆ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సిని అభిమానులలో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఒక నటుడిగా తనను తాను సవాల్ చేసుకునే పాత్రలో నటించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు అంగీకరించినట్లు ఎన్టీఆర్ వివరించారు. అందుకు ‘వార్ 2’ స్క్రిప్ట్ క‌రెక్ట్‌గా అనిపించింద‌ని తెలిపారు. బ‌ల‌మైన క‌థ‌తో ఇది రూపొందిన‌ట్లు తార‌క్ చెప్పారు. “భారతీయ ప్రేక్షకులకు ఏదైనా కొత్త ఫీలింగ్ ని పంచే పాత్రతో హిందీలో అడుగుపెట్టాలనుకున్నాను. ‘వార్ 2’లో నా పాత్ర ఆ కోవకు చెందిందే. ఇది నటుడిగా నాకు సవాల్ విసిరింది. 

ఇక‌, ఈ సినిమాలో భాష‌తో సంబంధం లేకుండా అంద‌రూ క‌లిసి ప‌నిచేశారు. ఇక‌పై బాలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్, కోలీవుడ్ అనేవి వుండవు. మన‌మంతా ఒక్క‌టే ఇండ‌స్ట్రీ. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌గా గుర్తించాలి. ఇదే విష‌యాన్ని గ‌తంలో రాజ‌మౌళి కూడా చెప్పారు. ఎంచుకున్న క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా చూపించాలంతే” అని ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

ఈ పీక్శ్చర్ లో హృతిక్ రోషన్ పోషిస్తున్న ‘కబీర్’ పాత్రకు దీటైన శక్తిగా తన పాత్రను తీర్చిదిద్దారని, ఇది కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా మానసిక సంఘర్షణతో కూడి ఉంటుందని తెలిపారు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని తార‌క్ వెల్ల‌డించారు. కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘విక్రమ్’ అనే శక్తిమంతమైన స్పెషల్ ఫోర్సెస్ అధికారి క్యారెక్టర్ లో తెరపై దర్శనం ఇవ్వబోతున్నారు .