తెలుగు మహిళకు బ్రిటన్‌ పౌర పురస్కారం

తెలుగు మహిళకు బ్రిటన్‌ పౌర పురస్కారం

పూర్ణిమ తణుకు – బ్రిటన్‌ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన సీబీఈ అవార్డుని అందుకున్న తొలి తెలుగు మహిళ

” మా స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట. సొంతూరిలోనే ప్రాథమిక విద్య పూర్తయ్యాక అమలాపురంలోని ఎస్‌కేబీఆర్‌ కాలేజీలో డిగ్రీ చదివా. ఆపై ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేశా. నాన్న విశ్వేశ్వరయ్య, టైపు ఇన్‌స్టిట్యూట్‌ నడిపేవారు. అమ్మ రత్నాంబ, గృహిణి. లండన్‌లో సర్జన్‌గా పని చేస్తున్న డాక్టర్‌ వెంకట సూర్యనారాయణతో పెళ్లవడంతో ఇక్కడే స్థిరపడ్డా. మొదట ఇంజినీరింగ్‌ కంపెనీలో కెరియర్‌ ఆరంభించా. తర్వాత యువత, పిల్లల కోసం పనిచేసే ‘రీజనరేషన్‌ ట్రస్ట్‌’కి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించా. ఆపై జైళ్లలో ఉన్నవారికి విద్యను అందించేందుకు కృషి చేసిన తొలి ఆసియా మహిళగానూ గుర్తింపు దక్కించుకున్నా. ”

 బ్రిటన్‌ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన సీబీఈ అవార్డుని అందుకున్నారు మన తెలుగు మహిళ పూర్ణిమ తణుకు.

బాలల సంరక్షణku పోరాటం : ప్రస్తుతం నేషనల్‌ డే నర్సరీస్‌ అసోసియేషన్‌ (ఎన్‌డీఎన్‌ఏ)కు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నాఋ పూర్ణిమ . . ఇది యూకేలో బాలల సంరక్షణ, హక్కుల కోసం పనిచేసే అతిపెద్ద ఛారిటీ-మెంబర్‌షిప్‌ అసోసియేషన్‌. 2004లో ఈ సంస్థలో చేరారు . అప్పటికి 20 మంది సిబ్బందితో చిన్నగా ఉండేది. ఇప్పుడు మూడు శాఖలతో 100మందికిపైగా ఉద్యోగులతో శక్తిమంతమైన స్వచ్ఛంద సంస్థగా మార్చగలిగారు పూర్ణిమ . . యూకేలోని 15000 డే నర్సరీల హక్కుల కోసం పోరాడి రికార్డ్ క్రియేట్ చేసారు . . దాదాపు పదిలక్షల మందికిపైగా చిన్నారులు, వారి కుటుంబాలకు అత్యున్నత సంరక్షణ విధానాలు అమలయ్యేలా చేయగలిగానని వినంరంగా చెపుతారీమె .

అవార్డు అందుకున్న తొలి తెలుగు మహిళ : ”ఇంగ్లండ్‌ సహా 22 దేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఇలా 20 ఏళ్ల పాటు ఎన్‌డీఎన్‌ఏకు నాయకత్వం వహిస్తూ బాలల విద్యకు చేయూత అందించినందుకు గానూ పలు పురస్కారాలు దక్కాయి. 2011లో బ్రిటన్‌ పౌర పురస్కారాల్లో ఒకటైన ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ)ను కింగ్‌ చార్లెస్‌ చేతుల మీదుగా తీసుకున్నా. తాజాగా కమాండర్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (సీబీఈ)ని చార్లెస్‌ సోదరి ప్రిన్సెస్‌ అనీ అందించారు. ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్, నోబెల్‌ గ్రహీత హెరాల్డ్‌ పింటర్, రగ్బీ ఆటగాడు జొనాథన్‌ పీటర్‌ విల్కిన్సన్‌తోపాటు మనదేశం నుంచి ఈ గౌరవాన్ని పొందినవారిలో లీనా నాయర్‌ ఒకరు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు మహిళను నేనే కావడం గర్వంగా ఉంది.” అంటూ తనకు అవార్డు రావడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ తెలుగు ఆడపడచు పూర్ణిమ .

రష్యా చమురు  –తెరవెనుక కథ

రష్యా చమురు –తెరవెనుక కథ

రష్యా నుంచి చౌకగా కొన్న ముడి చమురు భారత రిఫైనరీలకు, ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలకు వేల కోట్ల లాభాలను తెచ్చిపెడుతోంది . ..

ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ప్రతిగా, పాశ్చాత్య దేశాలు మాస్కో ఆదాయాన్ని దెబ్బతీయడానికి కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించాయి. ఇందులో భాగంగా రష్యా సముద్రమార్గ చమురుపై బ్యారెల్‌కు $60 ధరల పరిమితిని విధించాయి. అయితే, ఈ ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా ఒక రహస్య మార్గాన్ని ఎంచుకుంది. అదే “షాడో ఫ్లీట్“ (ఎలాంటి పర్మిట్లూ లేని “దొంగ” నౌకలు అనేక మోసపూరిత పద్ధతులను అనుసరిస్తాయి. ఈ నౌకల యజమానులు ఎవరో స్పష్టంగా తెలియకుండా ఉండేందుకు సంక్లిష్టమైన కంపెనీ నిర్మాణాలు, షెల్ కంపెనీలను ఉపయోగిస్తారు. పనామా, లైబీరియా, గాబన్ వంటి దేశాల జెండాలను ఎగురవేస్తాయి. ఈ దేశాలలో నిబంధనలు చాలా సరళంగా ఉండటంతో, నౌకల తనిఖీ, భద్రతా ప్రమాణాల నుంచి తప్పించుకోవడం సులభం. ఈ నౌకలకు సరైన భీమా ఉండదు. పాశ్చాత్య భీమా కంపెనీలు ఆంక్షల కారణంగా సేవలు అందించవు. దీంతో, ప్రమాదం జరిగితే నష్టపరిహారం చెల్లించే నాథుడు ఉండడు. ఈ నౌకాదళంలోని చాలా ట్యాంకర్లు 15-20 ఏళ్లకు పైబడినవి. వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువ. తమ కదలికలను దాచిపెట్టడానికి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) ట్రాన్స్‌పాండర్లను ఆపివేస్తాయి. సముద్రం మధ్యలో ఒక నౌక నుంచి మరో నౌకకు చమురును మార్చేసి చమురు ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా చేస్తాయి.వందలాది పాత చమురు ట్యాంకర్లతో కూడిన ఈ రహస్య నెట్‌వర్క్ ద్వారా తన చమురును, ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలకు అమ్ముతూ ప్రపంచ ఇంధన మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది.

ఈ క్రమం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు, పర్యావరణ ప్రమాదాలకు దారితీస్తోంది.

పాశ్చాత్య దేశాలు రష్యా చమురును బహిష్కరించడంతో, భారత్, చైనాలు అతిపెద్ద కొనుగోలుదారులుగా అవతరించాయి. ముఖ్యంగా, యుద్ధానికి ముందు రష్యా నుంచి నామమాత్రంగా చమురు కొనుగోలు చేసిన భారత్, ఆంక్షల తర్వాత తన దిగుమతులను భారీగా పెంచుకుంది. రష్యా అందించిన తగ్గింపు ధరలను అందిపుచ్చుకుని, తన జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రతను కాపాడుకుంటున్నామని భారత్ వాదిస్తోంది.

రష్యా నుంచి చౌకగా కొన్న ముడి చమురు భారత రిఫైనరీలకు, ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలకు వేల కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సంస్థలు చౌక చమురును శుద్ధి చేసి, పెట్రోలియం ఉత్పత్తులను అధిక ధరలకు అంతర్జాతీయ మార్కెట్లలో, ముఖ్యంగా రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలకే ఎగుమతి చేశాయి. ప్రభుత్వం కూడా ఈ లాభాలపై “విండ్‌ఫాల్” పన్నుల రూపంలో ఆదాయం పొందింది. అయితే, ఈ ప్రయోజనాలు దేశీయ వినియోగదారులకు చేరలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు.

ఈ నీడల నౌకాదళం సముద్ర పర్యావరణానికి పెను ముప్పుగా మారింది. పాత నౌకలు, సరైన నిర్వహణ లేకపోవడం, భీమా సౌకర్యం కొరవడటంతో ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి.రెండు “దొంగ” నౌకలు నల్ల సముద్రంలో డిసెంబర్ 2024 న తుఫానులో చిక్కుకుని ముక్కలవ్వడంతో భారీగా చమురు సముద్రంలో కలిసి, తీవ్ర పర్యావరణ నష్టం జరిగింది.

2024 మార్చి లో రష్యా నుంచి భారత్‌కు వస్తున్న ‘ఇన్నోవా’ అనే ట్యాంకర్ స్కాట్లాండ్ తీరంలో 23 కిలోమీటర్ల పొడవున చమురును కక్కేసింది.

2024 ఫిబ్రవరిలో ఇటలీ తీరంలో ‘అరుణా గుల్కే’ అనే నౌక 47 కిలోమీటర్ల మేర చమురును చిమ్మింది.

మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణాలు

రష్యా చమురు వాణిజ్యం ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్ రష్యా నుంచి చమురు కొనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా, భారతీయ ఎగుమతులపై భారీ సుంకాలను విధించింది. ఇది దశాబ్దాలుగా బలపడుతున్న ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దెబ్బతీసింది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రెండుగా చీలుస్తున్నాయని, డాలర్ ఆధిపత్యానికి సవాలు విసురుతూ బ్రిక్స్ పే (BRICS Pay) వంటి ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు .

ట్రంప్ – మోదీ… ఒకటే బాట..

ట్రంప్ – మోదీ… ఒకటే బాట..

మొండి – జగమొండి రకం వీరిద్దరూ . …

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేత ఒకరు . . మరొకరు అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు. ఒకరు నరేంద్ర మోదీ. ఇంకొకరు డొనాల్డ్ ట్రంప్. వారిద్దరి మధ్య వేల మైళ్ళ దూరం ఉండవచ్చు. వారి రాజకీయ నేపథ్యాలు వేరు కావచ్చు. కానీ వారిద్దరినీ ఒకే గాటన కట్టే అంశాలు చాలా ఉన్నాయి. వారి రాజకీయ ప్రయాణం, పరిపాలన శైలి అచుగుద్దినట్లు అనిపిస్తుంది.

మోదీ, ట్రంప్ ఇద్దరూ రాజకీయాల్లోకి ఓ కొత్త శక్తిలా దూసుకొచ్చారు. అప్పటికే ఉన్న రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాకచక్యంగా వాడుకున్నారు. తాము ఆ వ్యవస్థకు చెందిన వారం కాదని, ప్రజల పక్షాన పోరాడటానికి వచ్చిన బయటి వాళ్ళమని చాటుకున్నారు.

వాషింగ్టన్‌లోని అవినీతి రాజకీయాలపై ట్రంప్ యుద్ధం ప్రకటించారు. ఢిల్లీలోని “ల్యూటెన్స్ మీడియా, మేధావుల వర్గాన్ని” మోదీ లక్ష్యం చేసుకున్నారు. (దేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చే బ్రిటిష్ సామ్రాజ్య ప్రాజెక్టుని ఆర్కిటెక్ట్ ఎడ్విన్ “ల్యూటెన్స్” రూపొందించారు. ఇది పాశ్చాత్య భారతీయ నిర్మాణ శైలుల మిశ్రమాన్ని ప్రతిబింబించే విశాలమైన, చెట్లతో కప్పబడిన అవెన్యూలు, గొప్ప ప్రభుత్వ భవనాలు పెద్ద బంగ్లాలతో వుంటుంది. ఈ ప్రాంతం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇతర ప్రభావవంతమైన వ్యక్తులతో సహా ప్రముఖ నివాసితులకు ప్రసిద్ధి చెందింది. ప్రజలతో సంబందంలేకుండా అన్ని రంగాలను ప్రభావితం చేయగల వారిని ఢిల్లీ ల్యూటెన్స్ అంటారు.) ప్రజల భాషలో మాట్లాడుతూ, వారి భావోద్వేగాలను స్పృశిస్తూ సామాన్యులకు చేరువయ్యారు.

ఈ పాలకులు ఇద్దరి ప్రచారాల్లో జాతీయవాదం ప్రధాన అస్త్రంగా మారింది. “మేక్ అమెరికా గ్రేట్ అగైన్” అంటూ ట్రంప్ అమెరికన్ల దేశభక్తిని తట్టిలేపారు. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” అంటూనే మోదీ ఒక “నవ భారత” నిర్మాణం గురించి మాట్లాడారు. తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని కాపాడటానికే తాము ఉన్నామని ప్రజలను నమ్మించారు. ఈ జాతీయవాద నినాదాలు వారి మద్దతుదారులను ఏకం చేశాయి. వారిని గుడ్డిగా ఆరాధించే భక్త గణాన్ని తయారుచేశాయి.

మెయిన్ స్ట్రీమ్ మీడియాపై దాడి చేయడం వారిద్దరి రాజకీయ వ్యూహంలో మరో కీలక భాగం. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలను, చానెళ్లను ట్రంప్ “ఫేక్ న్యూస్” అని కొట్టిపారేశారు. మోదీ మద్దతుదారులు అలాంటి మీడియాను “ప్రెస్టిట్యూట్స్” అని, (డబ్బు లేదా ఇతర ప్రయోజనాల కోసం తమ వృత్తిపరమైన నిజాయితీని, నైతికతను అమ్ముకుని, వార్తలు రాసే పత్రికలను, మీడియా సంస్థలను, లేదా జర్నలిస్టులను కించపరిచేందుకు వాడే ఒక అవమానకరమైన పదం ఇది.) “దేశద్రోహులు” అని ముద్ర వేశారు. మీడియాను బలహీనపరిచి, తమ సందేశాన్ని నేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇద్దరూ సఫలమయ్యారు. దీనివల్ల తమ చుట్టూ ఒక అభేద్యమైన కోటను నిర్మించుకున్నారు. విమర్శలు ఆ కోట గోడలను తాకలేకపోయాయి.

వ్యక్తి ఆరాధన.. ఇద్దరి పాలనలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ పథకాలైనా, దేశ విజయాలైనా అన్నీ తమ ఘనతగానే ప్రచారం చేసుకున్నారు. తామే దేశానికి రక్షకులమని, తమ వల్లే దేశం సురక్షితంగా ఉందని చాటుకున్నారు. నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగా జరిగాయి. మంత్రులు, అధికారులు నామమాత్రంగా మిగిలిపోయారు. నాయకుడే సర్వస్వం అనే భావన బలపడింది.

ఆర్థిక రంగంలోనూ వారి విధానాల్లో పోలికలు ఉన్నాయి. ఇద్దరూ దేశీయ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ చైనా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు పెంచితే, మోదీ “మేక్ ఇన్ ఇండియా” అంటూ స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించారు. వారి విధానాలు కొన్నిసార్లు ఆర్థికవేత్తల విమర్శలకు గురైనా, తమ మద్దతుదారుల నుంచి మాత్రం బలమైన సమర్థన లభించింది.

ఈ ఇద్దరు నేతల ప్రస్థానం ఆధునిక రాజకీయాల్లో ఒక కొత్త ధోరణికి అద్దం పడుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉంటూ, దాని స్ఫూర్తిని దెబ్బతీసే నాయకత్వ శైలి ఇది. ప్రజల ఆకాంక్షలను, వారి భయాలను చాకచక్యంగా వాడుకుంటూ అధికారాన్ని చేజిక్కించుకుని, దాన్ని నిలబెట్టుకునే సరికొత్త రాజకీయం ఇది. అందుకే మోదీ, ట్రంప్ వేర్వేరు దేశాల నేతలైనా, వారి రాజకీయ పంథా మాత్రం ఒకే దారిలో సాగుతున్నట్టు కనిపిస్తుంది. మీకు కూడా ఓననిపిస్తుందా ?

భారత దిగుమతులపై 25 శాతం ట్రంప్ టారిఫ్స్ అమల్లోకి..

భారత దిగుమతులపై 25 శాతం ట్రంప్ టారిఫ్స్ అమల్లోకి..

ఈ ప్రభావం పై భారత్ నిపుణులు అంచనాలు . .. దిగుమతులపై ఆలోచన

భారత్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధించిన 25 శాతం సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. భారత్​తో సహా పలు దేశాలపై వేసిన కూడా సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్​ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. తన చర్యను సమర్థించుకున్నారు. అమెరికా నుంచి ప్రయోజనాలు పొందిన దేశాల నుంచి బిలియన్‌ డాలర్లు తిరిగి వెనక్కి రానున్నాయని తెలిపారు.

బిలియన్ల డాలర్లు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి రానున్నాయని పోస్ట్​ పెట్టారు. “పరస్పర సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఏళ్ల తరబడి అమెరికాను సద్వినియోగం చేసుకున్నాయి కొన్ని దేశాలు. ఇప్పుడు ఆ దేశాల నుంచి బిలియన్ల డాలర్లు తరలిరానున్నాయి. అమెరికా గొప్పతనాన్ని ఆపగల ఏకైక విషయం ఏమిటంటే, మన దేశం విఫలమవ్వాలని కోరుకునే అతివాద వామపక్ష కోర్టులు!” అని ట్రంప్ మరొక పోస్ట్‌లో అన్నారు.

వారం రోజుల క్రితం . .. ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై విధించే వివిధ సుంకాలను జాబితా చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత ప్రతీకార సుంకాల్లో మరిన్ని మార్పులు అంటూ దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను ఇటీవల పెంచారు. 10% నుంచి 41% వరకు సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై అప్పుడు సంతకం చేశారు. ఆ సమయంలో సిరియాపై అత్యధికంగా 41 శాతం టారిఫ్‌ను విధించారు. బ్రెజిల్‌పై ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాలకు అదనంగా 40 శాతం కలిపారు.

మన దాయాది దేశమెయిన్ పాకిస్థాన్‌కు 29% నుంచి 19 శాతానికి తగ్గించి ప్రేమ చూపించారు. భారత్​పై మాత్రం అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంగా ముందు 25 శాతం టారిఫ్‌ విధించారు. దాన్ని 50 శాతానికి పెంచుతూ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అదనపు 25% సుంకాలు ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్నాయని ప్రకటించారు. మళ్లీ శాంక్షన్స్​ ఉంటాయని సూత్రప్రాయంగా తెలిపారు. దీంతో ట్రంప్ విధించిన సుంకాల్లో భారత్​కే అత్యధికం కావడం విశేషం .

అమెరికా టారిఫ్  ఎఫెక్ట్ – భారత్ పై ఏ మేరకు?

అమెరికా టారిఫ్ ఎఫెక్ట్ – భారత్ పై ఏ మేరకు?

అమెరికా టారిఫ్​లు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచింది. ఈ క్రమంలో అమెరికా సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయా? టారిఫ్​లు ఇండియన్ ఎకానమీపై ప్రభావం చూపుతాయా? తదితర విషయాల గురించి ఆర్​బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఏ అంచనా వేస్తున్నారు . అయన విశ్లేషణ ఏమిటి ??

‘భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది’
అలాగే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలపైనా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ట్రంప్ సుంకాల ప్రకటనలు, కొనసాగుతున్న వాణిజ్య చర్చల గురించి ప్రస్తావించారు. ఈ పరిణామాలు భారతదేశ వృద్ధిని ప్రభావితం చేస్తాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ, సుంకాల వంటి ప్రపంచ వాణిజ్య సమస్యలు సవాళ్లను తీసుకురావచ్చని వివరించారు. “దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న ప్రపంచ అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత నుంచి ఉత్పన్నమయ్యే ఎదురుగాలులు వృద్ధికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకెళ్తోంది. వృద్ధి బలంగా ఉంది” అని సంజయ్ ప్రకటించారు.

ఆర్​బీఐ గవర్నర్ మల్హోత్రా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. తక్కువ వృద్ధి, ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాలసీ మేకర్స్ ఇప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. “ప్రపంచ వాణిజ్య సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, రాజకీయ అనిశ్చితులు కొంత వరకు తగ్గాయి. ఇటీవల కాలంలో మారుతున్న పరిస్థితులను బట్టి భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మంచి అవకాశాలను కలిగి ఉంది. ప్రపంచంలోని పలు దేశాలు తక్కువ వృద్ధిని, ద్రవ్యోల్బణ భారాన్ని ఎదుర్కొంటున్నాయి. కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణంలో పెరుగుదలను కూడా చూస్తున్నాయి” అని సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు.

కీలక విషయాలపై వివరణ
ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్​బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ప్రకటించారు. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు, భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా సుంకాల ఎఫెక్ట్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల గురించి సంజయ్ వివరణ ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉంది? ప్రపంచ వాణిజ్య వాతావరణంలో కొనసాగుతున్న మార్పుల వల్ల అది ఎలా ప్రభావితమవుతుంది? అనే విషయాలను వెల్లడించారు.

“రెపో రేటును 5.5శాతం వద్ద కొనసాగించాలని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇతర కీలక రేట్లు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 5.25శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటు 5.75 శాతం వద్దే స్థిరంగా ఉన్నాయి. ఆగస్టు 4, 5,6 తేదీలలో ఎంపీసీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే పాలసీ రెపో రేటును 5.5శాతం వద్ద స్థిరంగా ఉంచడానికి ఎంపీసీ ఏకగ్రీవంగా ఓటు వేసింది. కొత్త డేటా, మారుతున్న దేశీయ, ప్రపంచ పరిస్థితులపై కమిటీ నిశితంగా నిఘా కొనసాగిస్తుంది. తగిన ద్రవ్య విధాన విధానాన్ని రూపొందించడానికి ఇన్​కమింగ్ డేటా, అభివృద్ధి చెందుతున్న దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులపై నిశితంగా నిఘా ఉంచాలని ఎంపీసీ నిర్ణయించింది. దీని ప్రకారం, సభ్యులందరూ తటస్థ వైఖరిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు” అని సంజయ్ మల్హోత్రా తెలిపారు.

‘వార్ 2’ అందుకే ఒప్పుకున్నా.. రీజన్  చెప్పిన ఎన్టీఆర్

‘వార్ 2’ అందుకే ఒప్పుకున్నా.. రీజన్ చెప్పిన ఎన్టీఆర్

ఈ స్క్రిప్ట్ త‌న‌ను బాగా ఆక‌ర్షించింద‌న్న తార‌క్‌

ఏదైనా కధ నచ్చితే వెనక్కి చూడకుండా నటించడానికి అంగీకరిస్తారు జూనియర్ ఎన్టీఆర్ . యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం ‘వార్ 2’ గురించి నోరు విప్పారు . ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో నటించడానికి తాను ఎందుకు అంగీకరించారో వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 14న మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ మ్యాగ‌జైన్‌ ‘ఎస్క్వైర్‌ ఇండియా’ తాజాగా ఎడిష‌న్ క‌వ‌ర్‌పేజీపై తార‌క్ ఫొటోను ముద్రించింది. ఆ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సిని అభిమానులలో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఒక నటుడిగా తనను తాను సవాల్ చేసుకునే పాత్రలో నటించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు అంగీకరించినట్లు ఎన్టీఆర్ వివరించారు. అందుకు ‘వార్ 2’ స్క్రిప్ట్ క‌రెక్ట్‌గా అనిపించింద‌ని తెలిపారు. బ‌ల‌మైన క‌థ‌తో ఇది రూపొందిన‌ట్లు తార‌క్ చెప్పారు. “భారతీయ ప్రేక్షకులకు ఏదైనా కొత్త ఫీలింగ్ ని పంచే పాత్రతో హిందీలో అడుగుపెట్టాలనుకున్నాను. ‘వార్ 2’లో నా పాత్ర ఆ కోవకు చెందిందే. ఇది నటుడిగా నాకు సవాల్ విసిరింది. 

ఇక‌, ఈ సినిమాలో భాష‌తో సంబంధం లేకుండా అంద‌రూ క‌లిసి ప‌నిచేశారు. ఇక‌పై బాలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్, కోలీవుడ్ అనేవి వుండవు. మన‌మంతా ఒక్క‌టే ఇండ‌స్ట్రీ. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌గా గుర్తించాలి. ఇదే విష‌యాన్ని గ‌తంలో రాజ‌మౌళి కూడా చెప్పారు. ఎంచుకున్న క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా చూపించాలంతే” అని ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

ఈ పీక్శ్చర్ లో హృతిక్ రోషన్ పోషిస్తున్న ‘కబీర్’ పాత్రకు దీటైన శక్తిగా తన పాత్రను తీర్చిదిద్దారని, ఇది కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా మానసిక సంఘర్షణతో కూడి ఉంటుందని తెలిపారు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని తార‌క్ వెల్ల‌డించారు. కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘విక్రమ్’ అనే శక్తిమంతమైన స్పెషల్ ఫోర్సెస్ అధికారి క్యారెక్టర్ లో తెరపై దర్శనం ఇవ్వబోతున్నారు .

కళ్ళకు నెయ్యి స్నానం… ఇదేంటీ ?

కళ్ళకు నెయ్యి స్నానం… ఇదేంటీ ?

కళ్ళకు ‘నెయ్యి స్నానం’ పురాతన ఆయుర్వేద విధానం . . దీన్ని ఇపుడు , ఆధునిక వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు

నిపుణులు చేసే సరైన ఆయుర్వేద సంరక్షణ చాలా ప్రత్యేకమైనది మరియు పురాతన శాస్త్రంలో పాతుకుపోయింది.

కళ్ళకు నెయ్యి స్నానం చేయడం వల్ల అల్లోపతి వైద్యులు మరోసారి ఆయుర్వేద వైద్యులతో పోటీ పడుతున్నారు .

ఆయుర్వేదంలో నేత్ర బస్తీ అని పిలువబడే ఈ ‘స్నానం’ ప్రక్రియ కళ్ళకు పోషణనిస్తుందని మరియు వాటిపై ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతారు. అయితే, అల్లోపతి వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఒక మహిళ నేత్ర బస్తీ చేయించుకుంటున్న వీడియో వెంటనే ఆందోళనకు దారితీసింది, ఆమె కళ్ళ చుట్టూ ఉన్న పిండి ‘ఆనకట్ట’లో నెయ్యి/నూనె పోస్తున్నట్లు చూపించబడింది.

“కొంతమంది ఆయుర్వేద వైద్యులు ఇచ్చే ఈ ‘నేత్ర బస్తీ’ చికిత్స కార్నియల్ గాయం, వినాశకరమైన ఇన్ఫెక్షన్ లేదా తీవ్రమైన అలెర్జీలకు దారితీస్తుంది – వేడిచేసిన నెయ్యి లేదా నూనెతో సంబంధం కారణంగా దృష్టి కోల్పోతుంది” అని ఒక నేత్ర వైద్య నిపుణుడు హెచ్చరించారు.

“ఈ హానికరమైన పద్ధతిని నమ్మవద్దు. ఇది కంటిశుక్లం, పొడిబారడం, మయోపియా లేదా ఏదైనా ఇతర కంటి సమస్యను నయం చేయదు. మీకు కంటి సమస్య ఉన్నప్పుడు, అర్హత కలిగిన నేత్ర వైద్యుడిని సందర్శించండి,” అని ఆయన ఇంకా పేర్కొన్నారు.

నేత్ర బస్తీ ఆయుర్వేదంలో భాగం. అయితే, ముఖ్యంగా పురాతన వైద్యం ఆచారాల పట్ల ఆసక్తి ఉన్న వెల్నెస్ వర్గాలలో, దీని ప్రజాదరణ పెరుగుతోంది, సాంప్రదాయ వ్యవస్థ వాణిజ్యీకరించబడి, తిరిగి ప్యాక్ చేయబడి, తరచుగా లాభం కోసం కరిగించబడినందున ఇది నిబంధనలను అధిగమించింది.

అల్లోపతి వైద్యులు డాక్టర్ డార్విన్ ఆందోళనలను ప్రతిధ్వనించగా, ఆయుర్వేద వైద్యులు నేత్ర బస్తీని సమర్థించారు, సర్టిఫైడ్ నిపుణులు సరిగ్గా నిర్వహించినప్పుడు దీనికి చికిత్సా విలువ ఉంటుందని పట్టుబట్టారు. అటువంటి చికిత్సలు పురాతన వేద గ్రంథాలలో పాతుకుపోయాయని మరియు వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందని, దుర్వినియోగం చేయకూడదని వారు నొక్కి చెప్పారు.

నేత్ర బస్తీ వంటి చికిత్సలు ప్రమాదకరమైనవి మరియు తప్పుదారి పట్టించేవి అని చెన్నైలోని MGM హెల్త్‌కేర్‌లోని నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ సుహాసిని ఎస్ అన్నారు. ఈ ప్రక్రియలో, వెచ్చని నెయ్యి లేదా నూనెను కళ్ళ చుట్టూ ఉన్న పిండి వలయంలో పోస్తారు. ఇది కంటిశుక్లం, సమీప దృష్టి మరియు పొడి కళ్ళకు చికిత్స చేయగలదని కొందరు పేర్కొన్నారు.

“ఇది కళ్ళకు హాని కలిగించవచ్చు” అని ఆమె అన్నారు. కళ్ళ చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది మరియు నూనె నుండి వచ్చే వేడి దానిని కాల్చేస్తుంది. అంతేకాకుండా, ఈ చికిత్సలలో ఉపయోగించే అనేక నూనెలు సరిగ్గా పరీక్షించబడవని లేదా సురక్షితమైన పరిస్థితులలో తయారు చేయబడవని ఆమె హెచ్చరించింది.

కళ్ళు మూసుకున్నప్పుడు కూడా, నూనె బయటకు వచ్చి కంటి లోపలి భాగాన్ని, ముఖ్యంగా దృష్టిని కేంద్రీకరించడానికి సహాయపడే స్పష్టమైన ముందు భాగాన్ని తాకుతుంది.

“బ్యాక్టీరియా, ఫంగల్ మరియు కొన్నిసార్లు పరాన్నజీవి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది” అని ఆమె చెప్పింది. నూనె శుభ్రంగా లేదా సురక్షితంగా లేకుంటే ఈ ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చు. అటువంటి చికిత్సలు చేయించుకున్న తర్వాత రోగులు కాలిన గాయాలు మరియు అలెర్జీ ప్రతిచర్యలతో బాధపడుతున్నట్లు తాను చూశానని డాక్టర్ సుహాసిని చెప్పారు.

కొన్ని సందర్భాల్లో, ఆయుర్వేద నూనెలు లేదా చుక్కలలోని బలమైన పదార్థాలు సమస్యలను మరింత తీవ్రతరం చేశాయి.

ఈ చికిత్సలు ఎందుకు పనిచేయవని కూడా ఆమె వివరించింది. కంటి లెన్స్‌లోని ప్రోటీన్లు వయస్సుతో పాటు విచ్ఛిన్నమైనప్పుడు కంటిశుక్లం సంభవిస్తుంది. నూనె లేదా బాహ్య చికిత్స దానిని తిప్పికొట్టలేవు.

“నూనె పూయడం కంటిశుక్లాన్ని తిప్పికొట్టడంలో సహాయపడే మార్గం లేదు ఎందుకంటే ఇది పూర్తిగా క్షీణించే పరిస్థితి” అని ఆమె చెప్పింది. మయోపియా, లేదా సమీప దృష్టి, కంటి ఆకారం వల్ల వస్తుంది. “ఒకసారి అది విస్తరించబడితే, అది పెరుగుతుంది” అని ఆమె చెప్పింది. ఏ బాహ్య నివారణ కూడా కనుగుడ్డును సాధారణ స్థితికి కుదించలేదు.

కనురెప్పల కోసం ఆముదం నూనె?
“చాలా మంది కనురెప్పల పెరుగుదలకు కూడా ఆముదం నూనెను ఉపయోగిస్తారు. ఇది కూడా సిఫార్సు చేయబడలేదు,” అని ఆమె చెప్పింది. కళ్లలోకి నూనె చేరినప్పుడు, అది రసాయన గాయాలకు కారణమవుతుంది. ఇంకా దారుణంగా, ఇది మెయిబోమియన్ గ్రంథులను నిరోధించవచ్చు – కనురెప్పల వెంట ఉన్న చిన్న నూనె ఉత్పత్తి చేసే గ్రంథులు, ఇవి కళ్ళను తేమగా ఉంచడంలో సహాయపడతాయి.

“ఇది రంధ్రాలను మూసుకుపోతుంది మరియు కనురెప్పల వాపులు, కళ్ళు పొడిబారడం లేదా బ్లెఫరిటిస్ వంటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది,” అని ఆమె వివరించారు .

ఆయుర్వేద మందులు తరచుగా వాటి విషయాలను జాబితా చేయవని డాక్టర్ సుహాసిని కూడా గుర్తించారు. “ఔషధాల కూర్పు అంచనా వేయబడదు లేదా నమోదు చేయబడదు” అని ఆమె అన్నారు.

లేబుల్‌లు, మోతాదులు, గడువు తేదీలు మరియు భద్రతా తనిఖీలను కలిగి ఉన్న సాధారణ మందుల మాదిరిగా కాకుండా, ఆయుర్వేద చికిత్సలు తరచుగా అస్పష్టంగా ఉంటాయి. ఒక ఔషధంలోని విషయాలు తెలియకుండా, రోగులు దాని దుష్ప్రభావాలు లేదా ప్రమాదాలను తెలుసుకోలేరు.

“ప్రతిదీ అందరికీ సరిపోదు,” అని ఆమె జోడించింది, కొంతమంది తెలియని పదార్థాలకు చెడుగా స్పందించవచ్చని హెచ్చరించారు.

ఆమె మెరుగైన అవగాహన కోసం పిలుపునిచ్చింది. “సహజ” లేదా “వైద్యం” చికిత్సల వైపు చాలా మంది ప్రజలు మొగ్గు చూపుతున్నందున, వాస్తవాలను తనిఖీ చేయకుండా ధోరణుల వైపు మొగ్గు చూపడం సులభం అని డాక్టర్ సుహాసిని అన్నారు.

“ప్రజలు ఆరోగ్యాన్ని సమగ్రంగా సంప్రదించాలి, కానీ వారు సమాచారంతో ఉండాలి, రోగ నిర్ధారణ తెలుసుకోవాలి, చికిత్సను అర్థం చేసుకోవాలి మరియు ప్రమాదాల గురించి తెలుసుకోవాలి” అని ఆమె అన్నారు.

నేత్ర బస్తీ అనేది చట్టబద్ధమైన మరియు కాలపరీక్షించబడిన చికిత్స, దీనిని తరచుగా ఆధునిక వైద్యం తప్పుగా అర్థం చేసుకుంటుంది లేదా తప్పుగా సూచిస్తుంది. “ఇది యాదృచ్ఛిక స్పా చికిత్స కాదు, ఇది మన క్లాసికల్ ఆయుర్వేద వ్యవస్థలో ఒక భాగం,” అని ఆమె చెప్పింది, సరిగ్గా చేసినప్పుడు రోగుల విజయగాథలు దాని ప్రభావాన్ని సమర్థిస్తాయని జోడించింది.

కొన్ని చికిత్సలు ఆయుర్వేద లేబుల్ క్రింద దుర్వినియోగం చేయబడుతున్నాయని లేదా తప్పుగా మార్కెట్ చేయబడుతున్నాయని ఆమె అంగీకరించింది. “అది ఆయుర్వేదం కాదు” అని ఆమె నొక్కి చెప్పింది. సరైన ఆయుర్వేద సంరక్షణ చాలా ప్రత్యేకమైనది మరియు పురాతన శాస్త్రంలో పాతుకుపోయింది.

ప్రసిద్ధ ఆయుర్వేద కంపెనీల ఉత్పత్తులు స్పష్టమైన లేబుల్‌లు, గడువు తేదీలు, తయారీ వివరాలు మరియు తరచుగా కూర్పుతో వస్తాయని డాక్టర్ కన్నోత్ అన్నారు. “నిశితంగా చూడండి, అంతా ఉంది” అని డాక్టర్ జోడించారు. నెయ్యి వంటి కొన్ని పదార్థాలు వయస్సుతో పరిపక్వం చెందుతాయని మరియు ఎల్లప్పుడూ రసాయన ఔషధాల మాదిరిగానే చికిత్స చేయబడవని కూడా ఆమె పేర్కొన్నారు.

ఆయుర్వేదం ఒకే పరిమాణానికి సరిపోయే వ్యవస్థ కాదని కూడా డాక్టర్ వివరించారు. ఇది శరీరంలోని వివిధ భాగాలకు ప్రత్యేక శాఖలను కలిగి ఉంది. కంటి మరియు ENT రుగ్మతలకు ఉపయోగించే శాలక్యతంత్ర అనే చికిత్సను ఆమె ప్రస్తావించారు. అల్లోపతి వైద్యులు తిరస్కరించిన రోగులు ఆయుర్వేద పద్ధతుల ద్వారా కోలుకుంటున్న ఉదాహరణలను కూడా ఆమె ఉదహరించారు.

అమెరికా వాణిజ్య యుద్ధం.. భారత్ నో కాంప్రమైజ్

అమెరికా వాణిజ్య యుద్ధం.. భారత్ నో కాంప్రమైజ్

అమెరికా విచ్చలవిడిగా ప్రపంచ దేశాలని విధిస్తున్న సుంకాల వ్యవహారంలో భారత్ మాత్రం ఎక్కడ కాంప్రెమైజ్ కావడంలేదు . భారత్‌తో వాణిజ్య సంబంధాలలో ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తూ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1, 2025 నుంచి ఈ సుంకాలు అమలులోకి వస్తాయని, రష్యాతో భారత్ కొనసాగిస్తున్న రక్షణ, ఇంధన సంబంధాల కారణంగా అదనపు జరిమానాలు కూడా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలను రేకెత్తించడమే కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, భారత్‌ను “టారిఫ్ కింగ్” అని అభివర్ణించారు.

అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలను విధించడం, వాణిజ్యంలో ఉన్న అడ్డంకులను ఆయన ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. 2024లో అమెరికాకు భారత్‌తో ఉన్న వాణిజ్య లోటు 45.7 బిలియన్ డాలర్లకు పెరగడం కూడా ఈ నిర్ణయం వెనుక ఉన్న మరో ముఖ్య కారణం.

అయితే, ఈ చర్య కేవలం వాణిజ్యపరమైనది కాదు. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున సైనిక పరికరాలు, ఇంధనాన్ని కొనుగోలు చేయడాన్ని ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించడం, ఈ సుంకాలను ఒక భౌగోళిక-రాజకీయ సాధనంగా కూడా అమెరికా ఉపయోగిస్తోందని స్పష్టం చేస్తోంది.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే భారత ఆర్థిక మార్కెట్లు తీవ్రంగా స్పందించాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 52 పైసలు పతనమై, నాలుగు నెలల కనిష్ట స్థాయి అయిన 87.43 వద్ద ముగిసింది. ఈ సుంకాలు ఆర్థిక సంవత్సరం మొత్తం కొనసాగితే, భారత జీడీపీ వృద్ధి 0.2% నుంచి 0.5% వరకు తగ్గే అవకాశం ఉందని, ఎగుమతి ఆదాయం 7 బిలియన్ డాలర్ల వరకు నష్టపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెరికా విధిస్తున్న ఈ సుంకాల ప్రభావం అన్ని రంగాలపై ఒకేలా ఉండదు. అమెరికా వ్యూహాత్మకంగా కొన్ని రంగాలను లక్ష్యంగా చేసుకుని, మరికొన్నింటికి మినహాయింపు ఇచ్చింది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ (స్మార్ట్‌ఫోన్లు), రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు, ఉక్కు వంటి ఉపాధి కల్పించే కీలక రంగాలపై 25% సుంకం విధించారు. ఇది ఈ రంగాలలోని ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌లను సరఫరా చేసే అతిపెద్ద దేశంగా భారత్ ఇటీవల అవతరించిన నేపథ్యంలో ఈ సుంకాలు పెద్ద దెబ్బ.

అమెరికా తన సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్ల వంటి కీలక రంగాలకు సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది. అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ భారత జనరిక్ మందులపై ఎంతగానో ఆధారపడి ఉంది. భారత ఔషధాల వల్ల అమెరికాకు బిలియన్ల డాలర్లు ఆదా అవుతున్నందున, ఈ రంగంపై సుంకాలు విధించడం ఆత్మహత్యాసదృశ్యం అవుతుందని అమెరికా భావించింది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ప్రదర్శిస్తోంది. అమెరికా ఒత్తిడికి లొంగకుండా, వ్యవసాయం, పాడి వంటి కీలక రంగాలలో రాయితీలు ఇచ్చే ప్రసక్తే లేదని గతంలోనే స్పష్టం చేసింది. అయితే, చర్చల మార్గాన్ని మూసివేయలేదు. ఆగస్టు చివరిలో అమెరికా వాణిజ్య ప్రతినిధి బృందం చర్చల కోసం న్యూఢిల్లీకి రానుంది. మరోవైపు, అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా, ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనల ప్రకారం ప్రతీకార సుంకాలను విధించే హక్కును భారత్ రిజర్వ్ చేసుకుంది.

ఈ వాణిజ్య వివాదం, చైనాను ఎదుర్కోవడానికి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలకమైన అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పరీక్షిస్తోంది. గతంలో రష్యా నుంచి S-400 క్షిపణులను కొనుగోలు చేసినప్పుడు CAATSA ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చిన అమెరికా, ఇప్పుడు అదే కారణంతో సుంకాలు విధించడం గమనార్హం. రాబోయే చర్చలు ఇరు దేశాల మధ్య ఉన్న లోతైన బంధం, వాణిజ్య ఘర్షణలను ఎలా సమన్వయం చేస్తుందో తేలుస్తాయి

దుబాయ్‌లో బంగారం ధర చీప్- నిజమేనా ?

దుబాయ్‌లో బంగారం ధర చీప్- నిజమేనా ?

ఒక్కో వ్యక్తి దుబాయ్ నుంచి ఎంత గోల్డ్ తెచ్చుకోవచ్చు

‘బంగారు నగరం’గా దుబాయ్ కి పేరు . పేరుకు తగ్గట్టే ఆ ‘గోల్డ్ సిటీ’లో రోజూ జోరుగా పసిడి షాపింగ్ జరుగుతుంటుంది. ప్రజలు దేశవిదేశాల నుంచి వచ్చి మరీ పెద్దఎత్తున స్వర్ణాన్ని కొనేస్తుంటారు. ఈ క్రేజ్ వల్లే గోల్డ్ సిటీగా దుబాయ్ విశ్వ ఖ్యాతిని గడించింది. ఇంతకీ దుబాయ్‌లో బంగారాన్ని కొనేందుకు జనం ఎందుకు ఎగబడుతున్నారు? అంటే, అక్కడ పసిడి రేట్లు తక్కువ. భారత్ కంటే దుబాయ్‌లో తక్కువ రేటుకే స్వర్ణం లభిస్తుంది. అక్కడ పసిడి ధర ఎందుకు తక్కువగా ఉంది? పన్నులేం విధించరా? అక్కడి బంగారం స్వచ్ఛత విషయంలో ఫర్వాలేదా ? లేక క్వాలిటీ తేడా ఉంటుందా ? ??

దుబాయ్‌ నుంచి భారత్‌, చైనాలకూ గోల్డ్
దుబాయ్‌లో బంగారం రేటు తక్కువగా ఉండటంపై పలువురిలో కొన్ని అపోహలు ఉన్నాయి. అక్కడ బంగారు గనులు ఉండబట్టే, తక్కువ రేటుకు గోల్డ్‌ను అమ్ముతున్నారని కొందరు భావిస్తుంటారు. అయితే ఇందులో వాస్తవం లేదు. దుబాయ్‌లో ఒక్క గోల్డ్ మైన్ కూడా లేదు. అక్కడ విక్రయిస్తున్న బంగారమంతా ఆఫ్రికా దేశాలు, తుర్కియే (టర్కీ), స్విట్జర్లాండ్, రష్యా దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాలు భారత్‌, చైనా. ఈ రెండు దేశాలకు చెందిన బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలు ఏటా వందల టన్నుల బంగారాన్ని దుబాయ్‌లోని హోల్‌సేల్ గోల్డ్ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటాయి. ఇందుకోసం ఈ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. భారత, చైనాల పౌరులు కూడా దుబాయ్‌ టూర్‌కు వెళ్లినప్పుడు, బంగారాన్ని కొని తెచ్చుకుంటారు. అయితే దీనికి నిర్దిష్ట పరిమితి ఉంటుంది.

ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు? పన్నులు ఎంత ?

  • మన దేశంలో మనం ఎంతైనా బంగారాన్ని కొనొచ్చు. దానిపై ఎలాంటి పరిమితి లేదు. భారతీయులు దుబాయ్‌లో ఎంత బంగారాన్ని కొని తెచ్చుకోవచ్చు? అనే దానిపై నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి. అంతకుమించిన మోతాదులో బంగారాన్ని దుబాయ్‌ నుంచి మనదేశానికి తీసుకురావడానికి వీల్లేదు.
  • లగేజీలో గరిష్ఠంగా ఒక కేజీ దాకా బంగారాన్ని దుబాయ్ నుంచి భారత్‌కు తెచ్చుకోవచ్చు. అయితే విదేశాల్లో కనీసం ఆరు నెలల పాటు గడిపి, భారత్‌కు తిరిగొస్తున్న వారికే ఈ పరిమితి వర్తిస్తుంది. ఈ బంగారంపై అన్ని రకాల సుంకాలను చెల్లించాలి. కొనుగోలుకు సంబంధించిన పత్రాలన్నీ కస్టమ్స్ అధికారులకు చూపించాలి.
  • పురుషులు 50 నుంచి 100 గ్రాముల బంగారం, మహిళలు/బాలల 100 నుంచి 200 గ్రాముల బంగారంపై 6 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.
  • పురుషులు 100 గ్రాములకుపైగా బంగారం, మహిళలు/బాలల 200 గ్రాములకుపైగా బంగారంపై 10 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.
  • వాణిజ్య అవసరాల కోసం బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలు దుబాయ్ నుంచి తెచ్చుకునే బంగారంపై జీఎస్‌టీ, వ్యవసాయ మౌలిక సదుపాయాల వికాస సెస్ (ఏఐడీసీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ విధిస్తారు.
  • భారతీయ మహిళలు, 15 ఏళ్లలోపు బాలలు గరిష్ఠంగా 40 గ్రాములు లేదా రూ.1 లక్ష విలువైన బంగారు ఆభరణాలను ధరించి దుబాయ్ నుంచి తెచ్చుకోవచ్చు. భారతీయ పురుషులు గరిష్ఠంగా 20 గ్రాములు లేదా రూ.50వేలు విలువైన బంగారు ఆభరణాలను ధరించి దుబాయ్ నుంచి తెచ్చుకోవచ్చు. ఈ క్రమంలో భారతీయ మహిళలు, పురుషులు, బాలలు ఎలాంటి సుంకాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకొచ్చే బంగారం బరువు ఒక కేజీకి మించకూడదు. కొనుగోలుకు సంబంధించిన రశీదులన్నీ విమానాశ్రయంలోని అధికార వర్గాలకు చూపించాలి.
  • వ్యక్తిగతంగా దుబాయ్ నుంచి తెచ్చుకునే బంగారంపై, దాని మోతాదు ఆధారంగా 3 శాతం, 6 శాతం, 10 శాతం మేర భారత్‌లో కస్టమ్స్ సుంకాన్ని విధిస్తారు.
  • పురుషులు 20 నుంచి 50 గ్రాముల బంగారం, మహిళలు/బాలల 40 నుంచి 100 గ్రాముల బంగారంపై 3 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.

దుబాయ్‌లో గోల్డ్ రేట్లు ఎందుకు తక్కువ?
భారత్‌తో పోలిస్తే దుబాయ్‌లో బంగారం రేట్లు తక్కువ. దీనికి ప్రధాన కారణం అక్కడి పన్నుల వ్యవస్థే. దుబాయ్‌లో బంగారం విక్రయాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ను విధించరు. అయితే ప్రతీ విక్రయంపై 5 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను విధిస్తారు. వ్యాట్‌పై మనకు ఫుల్ రీఫండ్ లభిస్తుంది. అయితే దీన్ని పొందేందుకు నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. మొత్తం మీద ఎలాంటి ట్యాక్స్ లేకుండానే దుబాయ్‌లో బంగారాన్ని కొనేయొచ్చన్న మాట. ఈ ప్రత్యేకత వల్లే బంగారు నగరంగా దుబాయ్ అవతరించింది.

దుబాయ్‌లో బంగారం క్వాలిటీ ???
దుబాయ్‌లో విభిన్న రకాల స్వచ్ఛతలతో కూడిన బంగారం లభిస్తుంది. 24 క్యారట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైంది. అంటే ఈ బంగారంలోని 1000 భాగాల్లో 1000 కూడా స్వచ్ఛంగా ఉంటాయన్న మాట. 22 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 916.66 భాగాలు స్వచ్ఛమైనవి. ఇందులో 22 క్యారట్ల బంగారం, 2 భాగాల్లో జింక్, కాపర్, నికెల్, ఐరన్, కాడ్మియం, అల్యూమినియం, సిల్వర్, ప్లాటినం, పలాడియంల మిశ్రమం ఉంటుంది. వీటిని ‘అలాయ్డ్ మెటల్స్’ అంటారు. ఇవన్నీ ఉండటం వల్ల 22 క్యారట్ల బంగారం ఆభరణాల తయారీకి అనువుగా ఉంటుంది. 21 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 875 భాగాలు ప్యూర్. దీన్ని గోల్డ్ 875 అని కూడా పిలుస్తారు. ఇందులో 21 క్యారట్ల బంగారం, 3 భాగాల్లో ‘అలాయ్డ్ మెటల్స్’ ఉంటాయి. 18 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 750 భాగాలు ప్యూర్. దీన్ని గోల్డ్ 750 అని అంటారు. ఇందులో 18 క్యారట్ల బంగారం, 6 భాగాల్లో ‘అలాయ్డ్ మెటల్స్’ ఉంటాయి.

ఉపరాష్ట్రపతి రాజీనామా – రాజ్యాంగ విలువలపై కొత్త చర్చ

ఉపరాష్ట్రపతి రాజీనామా – రాజ్యాంగ విలువలపై కొత్త చర్చ

మేధావుల చర్చలలో జాతీయ స్థాయి డిబేట్ … సరికొత్త సూచనలు . .

భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం జాతీయ రాజకీయాల్లో ఒక చర్చను మొదలుపెట్టింది. “ఆరోగ్య కారణాలు” అని రాజీనామా పేర్కొన్నప్పటికీ, దీని వెనుక బీజేపీ అధిష్టానం వైఖరితో విభేదాలు, రాజ్యాంగ పదవికి జరిగిన అవమానమే అసలు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ అనూహ్య పరిణామం ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక పెద్ద అంతర్గత తిరుగుబాటుకు సంకేతమంటూ, రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది.

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నిర్వహణలో భాగంగా, ఇద్దరు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టాలని బీజేపీ నిర్ణయించింది. అయితే, రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్న ధన్‌ఖడ్, ఈ విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా స్వతంత్ర వైఖరిని ప్రదర్శించారు. ముఖ్యంగా, జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన ప్రతిపాదనలో సాంకేతిక లోపాలున్నాయని బహిరంగంగా వ్యాఖ్యానించడమే కాకుండా, ఆ తీర్మానాలను సభలో లిస్ట్ చేయాలని పార్లమెంట్ సెక్రటరీ జనరల్‌ను ఆదేశించారు. చైర్మన్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం బీజేపీ అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

ధన్‌ఖడ్ వైఖరికి ప్రతిగా, బీజేపీ తన అసంతృప్తిని పరోక్షంగా కానీ బలంగా కానీ తెలియజేసింది. పార్లమెంటరీ ఎజెండాను నిర్ణయించే కీలకమైన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (BAC) సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరూ గైర్హాజరయ్యారు. చైర్మన్‌కు కనీస ముందస్తు సమాచారం లేకుండా జరిగిన ఈ చర్యను ధన్‌ఖడ్ తీవ్ర అవమానంగా, తన ఆత్మగౌరవానికి భంగంగా భావించారు. రాజ్యాంగబద్ధమైన తన విధులకు అడ్డుకట్ట వేయడాన్ని సహించలేక, మౌనంగా వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది.

ఇటీవల గుండెకు స్టెంట్ వేయించుకున్నప్పటికీ, ఆయన చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, జైపూర్ పర్యటనకు కూడా సిద్ధమయ్యారని, కాబట్టి “ఆరోగ్య కారణం” అనేది గౌరవంగా తప్పుకోవడానికి చూపిన ఒక సాకు మాత్రమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పదేళ్ల తర్వాత స్పష్టమైన మెజారిటీ లేకుండా, మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ధన్‌ఖడ్ రాజీనామా ఒక గట్టి హెచ్చరిక లాంటిది. మెజారిటీ ఉంది కదా అని రాజ్యాంగ పదవులను, వాటి నిబంధనలను తేలికగా తీసుకోకూడదని, సంకీర్ణ ధర్మాన్ని, రాజ్యాంగ విలువలను గౌరవించాలని ఈ సంఘటన ఒక బలమైన సందేశం పంపింది.

బీజేపీ నియమించిన వ్యక్తే, ఆ పార్టీ వైఖరిని నిరసిస్తూ పదవిని త్యజించడం, ఒకరకంగా ఇది తీవ్రమైన అంతర్గత తిరుగుబాటుగానే పరిగణించాలి.

ఒకప్పుడు ధన్‌ఖడ్ పక్షపాత వైఖరితో ఉన్నారని ఆయనపై అవిశ్వాసం ప్రకటించిన కాంగ్రెస్, ఇప్పుడు ఆయనను “విలువలకు కట్టుబడిన వ్యక్తి” అని ప్రశంసించడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

ధన్ ఖడ్ రాజీనామా ఉపసంహరింపచేసే బాధ్యత ప్రధానమంత్రిదే అని కాంగ్రెస్ ఓపెన్ గా చేసిన విన్నపంలో “మీరు నియమించిన వ్యక్తినే మీరు ఒప్పించలేకపోతున్నారు” అనే దెప్పిపోటు కూడా వుంది.

ప్రస్తుతం, ఎన్డీఏ ప్రభుత్వం ముందు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సిన తక్షణ సవాలు నిలిచింది. “ఒకే దేశం, ఒకే ఎన్నికలు” వంటి కీలక బిల్లులను రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలంటే, సభను సమర్థవంతంగా నడిపించే చైర్మన్ పాత్ర అత్యంత కీలకం. ఈ ఎంపిక కోసం మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలతో విస్తృత సంప్రదింపులు జరపడం బీజేపీకి తప్పనిసరి.

జగదీప్ ధన్‌ఖడ్ రాజకీయ ప్రస్థానం ఇక్కడితో ముగియదని, ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా జాట్ సామాజిక వర్గం రైతుల ప్రతినిధిగా ఆయన ఒక కొత్త రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలున్నాయని అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన రాజీనామా భారత రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది, రాబోయే రోజుల్లో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.