చంద్రబాబు .. నెంబర్ – 3 సీఎం …

చంద్రబాబు .. నెంబర్ – 3 సీఎం …

ఇండియా టుడే సర్వేలో వెల్లడైన ప్రజాభిప్రాయం – రేవంత్ కి ఏడోస్థానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనా పటిమతో మరోమారు ప్రజామన్నన పొందారు. దేశంలోనే అగ్రగామి మీడియా ”ఇండియా టుడే ‘ పోల్ లో ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే మూడో స్థానంలో నిలిచారు. గతంలో సీబీఎన్ ఈ రేసులో ఐదవ స్థానంలో ఉండేవారు .

యోగి నెంబర్ వన్ . ..

దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి (ఉత్తర ప్రదేశ్ ) ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్.. చాలా కాలంగా అక్కడి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈయన ఇండియాలోనే నెంబర్ వన్ సీఎంగా స్తానం దక్కించుకున్నారు . రెండో సారి ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత .. చంద్రబాబు టాప్ ఫైవ్ లో ఉన్నారు. ఆరు నెలల కిందట మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు దేశవ్యాప్తంగా టాప్ సీఎంల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. ఆరు నెలల్లో ఆయన తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు. ఈ సర్వే దేశవ్యాప్తంగా అందరి అభిప్రాయాలను సేకరించి ప్రకటించారు . తెలుగు ప్రాంత ప్రజలు కాని వారు కూడా ఇందులో పాల్గొన్నారు . అయితే సాధారణంగా అందరికీ కాల్స్ వెళ్లినప్పుడు తెలుగు ఓటర్లు అభిప్రాయం చెబుతారు.

ఏపీలో కూటమికి 25 లోక్ సభ సీట్లు

తక్షణం ఎన్నికలు జరిగితే.. బీజేపీతో పాటు మిత్రపక్షాలు సీట్లను గణనీయంగా పెంచుకుంటాయని సర్వేలో వెల్లడి అయింది. టీడీపీ, జేడీయూ, శివసేన, వంటి పార్టీలు సీట్లను పెంచుకుంటాయి. అంటే.. ఆ పెరుగుదల కాస్త కాస్త ఎక్కువగానే ఉంది. 11 సీట్లను పెంచుకుంటాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఇప్పటికిప్పుడు జరిగే ఎన్నికలలో 2024 లో ఓడిపోయినా ఆ నాలుగు ఎంపీ సీట్లలోనూ గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వే చెబుతోంది. అంటే ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లు గెలుస్తారు .

లా అండ్ ఆర్డర్ప కడ్బందీగా…

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత . . చంద్రబాబు పాలంలో ఏపీలో లా అండ్ ఆర్డర్ గణనీయంగా మెరుగుపడినట్లు సర్వేలో పాల్గొన్న మెజార్టీ జనం ఓటువేశారు . గత పాలనతో పోలిస్తే . … శాంతిభద్రతల విషయంలో ఎప్పటికీ చంద్రబాబు ఉండాలని పలువురు అభిలషించారు .

ఏపీలో గత ప్రభుత్వ పాలనకు.. ఇప్పటి పాలనకు చాలా తేడా కనిపిస్తోంది. పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ ఉండటంతో పాటు సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయి. ప్రజలకు సంతృప్తి కలుగుతోంది. అభివృద్ధి పనులూ ఆగడం లేదు. దీంతో చంద్రబాబుపై ప్రజా విశ్వాసం పెరుగుతోంది. మరో వైపు వైసీపీ ప్రతిపక్ష. హోదా లేదని.. ప్రతిపక్షంగా హుందాగా వ్యవహరించకుండా రాక్షస మూకగా వ్యవహరించింది . దీంతో 2019-2024 మధ్య అరాచకాలతో ప్రజలను పీడించుకుతిన్నారు . దీంతో వైసీపీని సాగనంపాలని జనమ్ ఏకపక్ష0గా తీసుకున్న నిర్ణయంతో కూటమి అధికారంలోకి వచ్చింది .

ఏపీలో ‘రియల్ ఎస్టేట్’ జోరందుకుంటుందా ?

ఏపీలో ‘రియల్ ఎస్టేట్’ జోరందుకుంటుందా ?

ఇపుడిపుడే పెరుగుతున్న లావాదేవీలు – 2026 జనవరికి మరింత స్పీడ్

అమరావతి రెండవ విడత భూ సమీకరణ అంశంతో వెనుకంజ . .. లేకపోతె మరింత దూకుడు

ఐదారేళ్లుగా కుంటినడకన సాగిన రియల్ ఎస్టేట్ ఏపీలో కాస్త ఊపందుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే ఊపు కొనసాగితే 2026 జనవరి – ఫిబ్రవరి నెలలనాటికి మరింత జోరందుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు . అమరావతిలో రెండవ విడత ల్యాన్డ్ పూలింగ్ అంశం తెరపైకి రావడంతో ఒక్కసారిగా రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కి బ్రేక్ పడింది . ఇది ప్రభుత్వం చేసిన తెలివిమాలిన పనిగా రాజధాని ప్రాంత వాసులు చెపుతున్నారు . భూముల ధరలు పెరిగిన తర్వాత మరోవిడత భూ సమీకరణకు వెళ్లి ఉంటె ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేదని చెపుతున్నారు .

రియల్ ఎస్టేట్ మందగమనానికి ప్రధానంగా ధరలు పెరగడం ఒక కారణమ్ కాగా . … జనం దగ్గర డబ్బు కొరత ఏర్పడటం మరో కారణం . ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగం గత కొన్ని సంవత్సరాలు స్తబ్దతను వీడుతోంది . స్టాంపులు, అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరగదాన్ని పరిశీలిస్తే . .. ఈ రంగం మళ్లీ రికవరీ మొదలు అవుతున్నట్టు కనిపిస్తోంది . రాజధాని అమరావతి, పరిసర ప్రాంతాలలో లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం, ఇతర జిల్లాల్లో పెరుగుతున్న లావాదేవీలు అన్ని కలిపి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఊపిరి ఊపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూ వ్యవహారాలు పెరిగి, కొంతకాలం ఆగిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుబడిదారుల్లో ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపడం ప్రారంభమైంది. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల నుండి వచ్చే ఆదాయం పెరగడం రియల్ ఎస్టేట్ రంగం తిరిగి లాభదాయక దిశలోకి వస్తున్నదని సూచిస్తోంది.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 2024కి పోలిస్తే 44% ఆదాయ వృద్ధి నమోదు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి . అమరావతిలో రూ. 60,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు ప్రారంభం కావడం .. పనులు వేగవంతంగా సాగడం వంటివి కూడా రియల్ భూమ్ పెరుగుదలకు కారణం .

ఇటీవల రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఎక్కువగా కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలలో నమోదయ్యాయి . వీటిలో ఎక్కువ ఆదాయం రికార్డ్ అయింది. అమరావతిలో భూస్థూల ధరలు పెరిగిన తర్వాత కూడా లావాదేవీలు పెరుగుతునే ఉన్నాయి. అమరావతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎన్ మురళి మాట్లాడుతూ . .. 2024 ఎన్నికల తర్వాత భూ స్థల ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొన్ని లావాదేవీలు నెమ్మదిగా జరిగాయి. ఇపుడిపుడే ఊపందుకుంటున్నాయి .

అమరావతి, చుట్టుపక్కల భూములు , సైట్స్ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, డెవలపర్లు మరియు పెట్టుబడిదారులు భవిష్యత్తులో మంచి అవకాశాలున్న సరసమైన ధరల ప్రాంతాలపై ఫోకస్ పెడుతున్నారు . అమరావతి, గుంటూరు, ఒంగోలు , నెల్లూరు, విశాఖపట్టణం వంటి జిల్లాల్లో భూమి మరియు భవనాల ధరలలో కూడా కొంత పెరుగుదల కనిపిస్తోంది . అమరావతిలో కొన్ని ప్రాంతాల్లో ధరలు ఎక్కువగా ఉన్నా, గుంటూరు, రాజమండ్రి , నెల్లూరు, విశాఖ వంటి ప్రాంతాల్లో కొంచెం అందుబాటులో ధరలు ఉన్నాయి. దీని వల్ల కొత్త పెట్టుబడిదారులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే దానిలో కాస్త ఆలోచనలో పడుతున్నారు .

నాలా రద్దుతో గ్రామాల్లో ‘రియల్ జోరు ‘ “” వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించాలంటే భూమార్పిడి జరగాలి . దీనికోసం స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు రియల్టర్లను , పారిశ్రేమికవేత్తలను మామూళ్ల కోసం వేధించేవారు . దీనిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి . ఇదే సమయంలో నాలా బదులు . .. స్థానిక సంస్థలకు కొంత ఫీజు చెల్లించడం వల్ల ఆ నిధులు స్థానికంగా ఖర్చుచేసుకునే సౌబల్యం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సూచన కూడా సర్కార్ పరిగణలోకి తీసుకుంది . దీంతో నాలా రద్దు చేసారు . దీనివల్ల ముక్యంగా గ్రామీణ్ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఊపందుకోనున్నాయ్ .

ఇస్రో ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ నమూనా ఇదిగో

ఇస్రో ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ నమూనా ఇదిగో

అంతరిక్ష రంగంలో ప్రపంచం మనవైపు ఆసక్తిగా చూస్తోంది . దీనికి కారణం భారత్‌ మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. 2035 నాటికి సొంతగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిశ్చయించుకుంది. అందులో భాగంగా తాజాగా ‘భారతీయ అంతరిక్ష్‌ స్టేషన్‌ (BAS​)’ నమూనాను తాజాగా విడుదల చేసింది. దిల్లీలోని భారత మండపంలో శుక్రవారం నుంచి నేషనల్‌ స్పేస్‌ డే వేడుకలు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం అంతరిక్షంలో రెండు స్పేస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. అవి :

  1. ఐదు దేశాల స్పేస్‌ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌’ (ఐఎస్​ఎస్​)
  2. చైనా సొంతంగా నిర్మించుకున్న తియాంగాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌.

2035 సంవసరం నాటికి భారత్‌ కూడా సొంతంగా 5 మాడ్యుల్స్‌తో ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్‌’ను నిర్మించాలని కృతనిశ్చయంతో ఉంది. 2028 నాటికి తొలి మాడ్యుల్‌ను నింగిలోకి పంపించడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసింది.

10 టన్నుల బరువున్న మాడ్యూల్​
బాస్‌-1 మాడ్యుల్‌ సుమారుగా 10 టన్నులు ఉండవచ్చని అంచనా. దీనిని భూమికి 450 కి.మీ ఎత్తులో ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన ఇన్విరాన్‌మెంటల్‌ కంట్రోల్‌ అండ్‌ లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌(ఈసీఎల్‌ఎస్‌ఎస్‌), భారత్‌ డాకింగ్‌ సిస్టమ్‌, భారత్‌ బెర్తింగ్‌ మెకానిజమ్‌, ఆటోమెటెడ్‌ హ్యాచ్‌ సిస్టమ్‌తోపాటు మరిన్ని సౌకర్యాలు ఉంటాయని సమాచారం. అంతరిక్షం, ఔషధాలు, గ్రహాంతర అన్వేషణకు ఈ బాస్​-1 మాడ్యుల్‌ వేదిక కానుంది.

40 అంతస్తుల భవనమంత ఎత్తైన రాకెట్‌ నిర్మాణం
“అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలు అబ్బురపడేలా భారత్​ అద్భుత ప్రగతి సాధించింది. ప్రస్తుతం 40 అంతస్తుల భవనమంత ఎత్తు ఉండే రాకెట్‌ను నిర్మిస్తున్నాం. భవిష్యత్తులో నౌకాదళం కోసం ప్రత్యేక ఉపగ్రహం ప్రయోగించనున్నాం” అని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన 84వ స్నాతకోత్సవంలో, గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా ఆయన గౌరవ డాక్టరేట్‌ ‘డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌’ అందుకున్నారు.

ఈ సందర్భంగా వి . నారాయణన్ మాట్లాడారు . “రష్యా, అమెరికాలకు దీటుగా మనం ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నాం. యూఎస్​కు చెందిన 6,500 కిలోల కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాం. రానున్న 10 ఏళ్లలో భారత్‌ సొంతంగా అంతరిక్ష కేంద్రం నిర్మించనుంది. తొలిసారిగా శుక్రగ్రహంపై ప్రయోగాలు చేస్తున్నది మనమే. ఇస్రో పరిశోధనల లక్ష్యం- కర్షకులు, కార్మికులు సహా ప్రజలందరి దైనందిన జీవితాల్లో వెలుగు నింపడమే” అని అయన స్పష్టం చేసారు .

నిద్ర ఎక్కువైనా ప్రమాదమేనట . …

నిద్ర ఎక్కువైనా ప్రమాదమేనట . …

ఓ అధ్యయనంలో వెల్లడైన వైనం

కంటి నిండా నిద్రపోవాలి . .. అంటూ ఉంటారు . అంటే ఎక్కువ సమయ0 అని కాదు . . నిద్రపోయిన సమయంలో ప్రశాంతంగా నిద్రపోవాలనేది ఇందులో దాగి ఉన్న మర్మం .

ఎక్కువ నిద్ర కూడా ప్రమాదకరమే : ప్రతిరోజూ 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల తక్కువ నిద్రతో వచ్చే ఆరోగ్య సమస్యల మాదిరిగానే ఆరోగ్య సమస్యలు వస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది. 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారికి, సాధారణంగా నిద్రపోయే వారితో పోలిస్తే, మరణం సంభవించే ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అతిగా నిద్రపోవడం అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుందని, టైప్ డయాబెటిస్ , హార్ట్ ప్రొబ్లెమ్స్ . . ఊబకాయం, డిప్రెషన్, తలనొప్పి, వైద్య పరిస్థితి కారణంగా చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుందని ఓ కీలక  అధ్యయనంలో పేర్కొంది.

ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఆరోగ్య సమస్యలకు కారణం కాకుండా, ఒక లక్షణం మాత్రమే కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, కోలుకోవడానికి ఎక్కువ సమయం అవసరం కాబట్టి, ఎక్కువసేపు నిద్రపోతారని తెలిపారు. నిద్రలేమి వంటి కొన్ని సమస్యల వల్ల తక్కువ నాణ్యత గల నిద్ర ఉన్నవారు కూడా ఎక్కువ సమయం పడుకుంటారని పేర్కొన్నారు. పొగతాగడం, వ్యాయామం చేయకపోవడం లేదా ఊబకాయం వంటి జీవనశైలి అలవాట్లు ఎక్కువ నిద్రపోయే వారిలో సర్వసాధారణంగా ఉంటాయంటున్నారు. ఎక్కువ నిద్రపోవడం అనేది ఆరోగ్య సమస్యలకు మధ్య బలమైన సంబంధం ఉందని, చాలా వరకు, అంతర్లీన ఆరోగ్య సమస్యలు దీనికి కారణం కావచ్చని వివరించారు.

ఎంత నిద్ర కావలి . ..సాధారణ సాధారణ  ఆరోగ్యవంతుల్లో రాత్రిపూట కనీసం 7 గంటల నిద్ర అవసరమని ఒక అధ్యయనంలో పేర్కొంది. అయితే ఇది సాధారణ నియమమే గానీ కచ్చితమమేమీ కాదని పేర్కొన్నారు. కొంత మందికి 7 గంటల కన్నా తక్కువ నిద్రే సరిపోవచ్చని, మరికొందరకి ఎక్కువగానూ అవసర పడొచ్చని వివరించారు. మొత్తం మీద పడుకొని లేచాక ఎంత హుషారుగా ఉన్నామనేదే కీలకమంటున్నారు. నిద్ర లేచాక ఉత్సాహంగా లేకపోయినా, కునికిపాట్లు పడుతున్నా నిద్ర తగ్గిందనే భావించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు . .

నది-నాదం: ఒక జీవనధార

నది-నాదం: ఒక జీవనధార

జ్ఞానదీపం: వేదశాస్త్ర పరిషత్ చారిత్రక యాత్ర

వేదంలా ఘోషించే గోదావరి గట్టున వెలసిన రాజమహేంద్రవరం అనాదిగా ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రంగా నిలుస్తోంది. ఆ నదీ ప్రవాహంలాగే ఇక్కడి వైదిక సంప్రదాయం కూడా అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. ఈ పవిత్ర తీరంలో 16-8-2025 న ముగిసిన వేద సభలు ఆ అజరామర వారసత్వానికి ఆధునిక ప్రతిధ్వనుల్లా నిలిచాయి. పండితులు, విద్యార్థులు, ధర్మశ్రేయోభిలాషులు ఒకచోట చేరిన

ఈ సందర్భాలు కేవలం ఉత్సవాలు కాదు. అవి తరతరాల జ్ఞానధారను కాపాడుతూ, భవిష్యత్తుకు అందిస్తున్న ఒక మహాయజ్ఞానికి సాక్ష్యాలు. ఈ వేదఘోష రాజమహేంద్రవరం ఆత్మను, గోదావరి జీవన లయను ఏకకాలంలో ఆవిష్కరించింది.

జ్ఞానదీపం: వేదశాస్త్ర పరిషత్ చారిత్రక యాత్ర

ఈ వైదిక పునరుజ్జీవనంలో వేదశాస్త్ర పరిషత్ పాత్ర అత్యంత కీలకమైనది. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ మహాస్వామి వారి మార్గదర్శకత్వంలో, 1937 ఏప్రిల్ 13న ఉగాది పర్వదినాన ఈ సంస్థ ఆవిర్భవించింది.

ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఈ స్థాపన వెనుక ఉన్న లోతైన ఆలోచన అర్థమవుతుంది. భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ఆ దశలో, కేవలం రాజకీయ స్వేచ్ఛే కాకుండా, దేశ సాంస్కృతిక ఆత్మను కాపాడుకోవాలనే తపనతో ఈ పరిషత్ ఆవిర్భవించింది.

పరిషత్ లక్ష్యం కేవలం వేదాధ్యయనాన్ని ప్రోత్సహించడమే కాదు, అంతరించిపోతున్న జ్ఞానాన్ని కాపాడటం. ఒకప్పుడు వేదాలలో దాదాపు 1,133 శాఖలు ఉండగా, నేడు కేవలం 13 శాఖలు మాత్రమే మిగిలి ఉన్నాయని, అందులోనూ బోధించే గురువులున్నవి ఏడు శాఖలేనని గణాంకాలు చెబుతున్నాయి.

అంటే మన వైదిక విజ్ఞానంలో ఒక శాతం కన్నా తక్కువ మాత్రమే మనకు అందుబాటులో ఉంది. ఈ తీవ్రమైన నష్టాన్ని అరికట్టాలనే అత్యవసర కర్తవ్యంతో పరిషత్ గత తొమ్మిది దశాబ్దాలుగా పనిచేస్తోంది. వేద విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో పరీక్షలు నిర్వహించడం, వారిని ప్రోత్సహించడం, పండితులను గౌరవించడం, వైదిక పాఠశాలలకు ఆర్థికంగా అండగా నిలవడం వంటి బహుముఖ కార్యక్రమాలతో తన సేవలను విస్తరించింది.

తెలుగు రాష్ట్రాల నుంచే కాక బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడి పరీక్షలకు హాజరుకావడం పరిషత్ సాధించిన జాతీయ స్థాయి గుర్తింపునకు నిదర్శనం.

89వ మహాసభ: పాండిత్యం, పట్టాలు, పురస్కారాలు

16-8-2015 వరకూ 6 రోజులు జరిగిన పరిషత్ 89వ వార్షిక మహాసభ ఈ సుదీర్ఘ యాత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. గౌతమీ ఘాట్‌లోని శ్రీ దత్త ముక్తి క్షేత్రంలో వేద విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో పండిత సభ జరిగింది. మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి అధ్యక్షత వహించిన ఈ సభకు ప్రవచన విరించి సామవేదం షణ్ముఖ శర్మ, శ్రీ కార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి వంటి ప్రముఖులు హాజరయ్యారు.

ఆదిశంకరాచార్య సంప్రదాయంలోనే సమగ్ర వేదధర్మం నిక్షిప్తమై ఉందని, వేదరక్షణకే శ్రీకృష్ణుడు అవతరించాడని సామవేదం షణ్ముఖ శర్మ ఉద్బోధించారు.

ఈ సభలో ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఒకవైపు పరిషత్ కార్యదర్శి హోతా శ్రీరామచంద్ర మూర్తి గత 88 ఏళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, మరోవైపు గంగాధర శర్మ వంటి పండితులు వేద విజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో అనుసంధానం చేస్తూ పరిశోధనలు జరగాలని పిలుపునివ్వడం గమనార్హం. ఇది సంప్రదాయం తన మూలాలను కాపాడుకుంటూనే, ఆధునిక ప్రపంచంతో సంభాషించడానికి సిద్ధంగా ఉందని చాటిచెప్పింది.

సభ ముగింపులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు, ప్రతిభావంతులకు స్వర్ణ, రజత పతకాలు ప్రదానం చేశారు. కంచిపీఠం తరపున గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠిని సత్కరించడం వంటి కార్యక్రమాలతో సభ వేద పండితుల గౌరవానికి పెద్దపీట వేసింది.

సంకల్పబలం: అనుబంధ వేదసభల తోడ్పాటు

రాజమహేంద్రవరంలో వేద పరిరక్షణ కేవలం ఒకే సంస్థకు పరిమితం కాలేదు. అది ఒక సామూహిక సంకల్పంగా విస్తరించింది. వేదశాస్త్ర పరిషత్ మహాసభకు అనుబంధంగా జరిగిన ఇతర సభలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. జ్ఞాన సరస్వతి ఆలయంలో కళాగౌతమి వ్యవస్థాపకులు డాక్టర్ బులుసు వి.ఎస్. మూర్తి అధ్యక్షతన ‘బులుసువారి వేద సభ’ జరిగింది. ఈ సభలో 15 మంది నూతన పట్టభద్రులతో పాటు, 150 మంది ఘనపాఠీలు, 100 మంది క్రమపాఠీలను సత్కరించడం ఈ కుటుంబం వేద సంప్రదాయం పట్ల చూపుతున్న అంకితభావానికి నిదర్శనం.

అదేవిధంగా, శంకర మఠంలో రాష్ట్రపతి పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ విశ్వనాథ జగన్నాథ ఘనపాఠి వేదశాస్త్ర పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ వార్షిక వేదసభ జరిగింది. ఈ సభకు తిరుమల తిరుపతి దేవస్థానం వేద ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫణి యజ్ఞేశ్వర ఘనపాఠి వంటి వారు హాజరుకావడం, స్థానిక ప్రయత్నాలకు జాతీయ స్థాయి సంస్థల మద్దతు ఉందని సూచిస్తుంది.

పరిషత్ వంటి పెద్ద సంస్థలు ఒక వ్యవస్థాగతమైన చట్రాన్ని అందిస్తుంటే, బులుసు వారి సభ, విశ్వనాథ వారి ట్రస్ట్ వంటివి సమాజంలో వేద సంస్కృతిని క్షేత్రస్థాయిలో బలంగా నాటుకునేలా చేస్తున్నాయి. ఈ వికేంద్రీకృత వ్యవస్థే ఈ సంప్రదాయం యొక్క స్థితిస్థాపకతకు అసలైన కారణం.

గురుపరంపర: పండిత వందనం, యువతకు స్ఫూర్తి

ఈ సభలన్నీ ఒక సత్యాన్ని బలంగా చాటాయి: వేదజ్ఞానం గురు-శిష్య పరంపర ద్వారానే సజీవంగా ఉంటుంది. విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి వంటి మహామహోపాధ్యాయులు అధ్యక్ష స్థానంలో కూర్చొని, నవయువ వేద విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయడం అది ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానాన్ని, బాధ్యతను అప్పగించే ఒక పవిత్ర కార్యం.

వృద్ధులైన పండితులను సత్కరించడం ద్వారా సమాజం వారి తపస్సుకు, జ్ఞానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. యువ విద్యార్థులను పతకాలతో ప్రోత్సహించడం ద్వారా, ఈ కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నందుకు వారిని అభినందిస్తుంది. ఈ గౌరవం, ఈ ప్రోత్సాహమే కొత్త తరాలను వేదాధ్యయనం వైపు ఆకర్షిస్తుంది. సామవేదం షణ్ముఖ శర్మ వంటి వారు తమ ప్రవచనాల ద్వారా శాస్త్ర విషయాలను సామాన్యులకు చేరువ చేస్తూ, గురువులకు, సమాజానికి మధ్య వారధిగా నిలుస్తున్నారు. గోదావరి నది ప్రవాహం ఎలాగైతే శాశ్వతంగా ఉంటుందో, ఆ తీరంలో వినిపించే వేదఘోష కూడా అలాగే అనంతంగా కొనసాగుతుందనే భరోసాను ఈ సభలు కలిగించాయి.

బడాబాబులు – పేదల మధ్య అంతరాలు తగ్గిస్తారా

బడాబాబులు – పేదల మధ్య అంతరాలు తగ్గిస్తారా

చంద్రబాబు చేపడుతున్న సంస్కరణలపై ఫలితాలు ఆశించవచ్చా ?

ఆర్థిక అంతరాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ సాంకేతికత మరియు స్థిరమైన వృద్ధి వైపు మొగ్గు చూపుతోంది. ఇది శుభ పరిణామమే . . అయితే ఆచరణలో ఏ మేరకు ఫలితాలు సాధిస్తారో చూడాలి .
సేవల రంగంలో వసూళ్లను మెరుగుపరచడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులను కోరారు. ఆంధ్రప్రదేశ్ పన్ను సమాచార వ్యవస్థ ద్వారా కఠినమైన రియల్-టైమ్ పర్యవేక్షణను ఆయన ఆదేశించారు.

ఆగస్టు 14న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, 2025–26 బడ్జెట్‌లో అంచనా వేసిన వృద్ధిని మించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ప్రారంభించిన ₹1,942 కోట్ల వార్షిక ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమంతో సహా ప్రధాన సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడం దీని లక్ష్యం.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సవాళ్లతో సతమతమవుతున్నందున, రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఆదాయాన్ని ఉత్పత్తి చేసే విభాగాల నుండి వచ్చే ఆదాయాలను పెంచడంపై దృష్టి సారించింది.

2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 8 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నందున, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గురువారం, ఆగస్టు 14న జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను మరింత ముమ్మరం చేయాలన్నా ప్రయత్నాలు మొదలెట్టారు .

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం ఇప్పటికే 15 శాతం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని కలిగి ఉంది, ఇది 2025-26 బడ్జెట్ అంచనాల కంటే ఏడు శాతం ఎక్కువ.

రాష్ట్ర సొంత వనరులను పెంచే లక్ష్యంతో టిడిపి-జెఎస్పి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం జరిగింది.

వీటిలో APSRTC బస్సుల్లో మహిళలకు కొత్తగా ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణ పథకం ఉంది, ఇది నాయుడు సూపర్ సిక్స్ వాగ్దానాలలో ఒకటి, ఇది ఒక్కటే రాష్ట్ర ఖజానాపై ఏటా ₹1,942 కోట్ల భారాన్ని జోడిస్తుంది.

సేవా రంగం మరియు ఇంధన పన్ను సమ్మతిపై దృష్టి పెట్టండి
సేవల రంగంలో వసూళ్లను మెరుగుపరచడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నాయుడు అధికారులను కోరారు. ఆంధ్రప్రదేశ్ పన్ను సమాచార వ్యవస్థ ద్వారా కఠినమైన నిజ-సమయ పర్యవేక్షణను ఆయన ఆదేశించారు.

ఇంధనం చౌకగా లభించే పొరుగు రాష్ట్రాలలో కాంట్రాక్టర్లు పెట్రోల్ మరియు డీజిల్ కొనుగోలు చేయకుండా నిరోధించడం ఒక ముఖ్యమైన సూచన.

ఆంధ్రప్రదేశ్‌లో పనులు నిర్వహిస్తున్న అన్ని కాంట్రాక్టర్లు రాష్ట్రంలోనే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని ఆయన ఆదేశించారు, నష్టాలను తగ్గించడానికి ఈ చర్య ఉద్దేశించబడింది, ఎందుకంటే రాష్ట్రం గతంలో సరిహద్దు కొనుగోళ్లకు డీజిల్ అమ్మకాలపై దాదాపు ₹20 కోట్ల వ్యాట్‌ను కోల్పోయింది.

ఎక్సైజ్ విషయంలో, ఆదాయ ఉత్పత్తి కంటే ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నాయుడు పునరుద్ఘాటించారు.

2025 సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చే కొత్త ఎక్సైజ్ విధానం, ఖజానాకు గణనీయంగా దోహదపడుతూనే ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడానికి నాణ్యమైన మద్యం అమ్మకానికి ప్రాధాన్యతనిస్తుంది.

ఈ విధానం ద్వారా కేవలం లైసెన్సింగ్ ఫీజుల ద్వారానే ₹700 కోట్లు, ఆర్థిక సంవత్సరానికి మొత్తం ₹27,097 కోట్ల ఎక్సైజ్ ఆదాయం వస్తుందని అంచనా.

ఆస్తి మార్కెట్ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం మరియు AI ద్వారా సమ్మతిని పెంచడం
కృత్రిమ ద్రవ్యోల్బణాన్ని నిరోధించడానికి మరియు ఆస్తి రిజిస్ట్రేషన్లలో పారదర్శకతను నిర్ధారించడానికి భూమి విలువలను శాస్త్రీయంగా అంచనా వేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

2025 ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ 68,000 ఆస్తి రిజిస్ట్రేషన్లను నమోదు చేసి, ₹475 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని అధికారిక రికార్డులు చూపిస్తున్నాయి. స్టాంప్ డ్యూటీ మార్కెట్ విలువలో 5 శాతంగా ఉంది, న్యాయమైన మూల్యాంకనాన్ని నిర్ధారించడానికి ఎంపిక చేసిన ప్రదేశాలలో ఇటీవల 20 శాతం వరకు పెరిగింది.

పన్ను ఎగవేతను ట్రాక్ చేయడానికి, GST ఫైలింగ్‌లలో మోసాన్ని గుర్తించడానికి మరియు ఆదాయ లీకేజీలను అరికట్టడానికి కృత్రిమ మేధస్సు (AI) ఏకీకరణను నాయుడు నొక్కి చెప్పారు.

GST మోసం మరియు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ల దుర్వినియోగాన్ని పర్యవేక్షించడానికి AIని మోహరించిన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మొదటి రాష్ట్రంగా అవతరించింది.

గ్రీన్ మొబిలిటీ చొరవలపై పురోగతిని కూడా సమావేశం సమీక్షించింది. సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 (2024–2029) కింద ఎలక్ట్రిక్ వాహనాలకు (EVలు) సబ్సిడీలను కొనసాగించాలని నాయుడు ఆదేశించారు.

ఈ విధానం మొదటి 5,000 ఛార్జింగ్ స్టేషన్లకు ₹3 లక్షల వరకు 25 శాతం మూలధన సబ్సిడీని అందిస్తుంది.

2024 చివరి నాటికి, రాష్ట్రంలో EVల స్వీకరణ 6.2 శాతంగా ఉందని, ఇది జాతీయ సగటు 7.39 శాతం కంటే కొంచెం తక్కువగా ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.

పన్ను క్రమబద్ధీకరణ, RTGS ఆధారిత వాహన చెల్లింపుల పర్యవేక్షణ మరియు కేంద్ర స్క్రాప్ వాహన విధానాన్ని అమలు చేయడం ద్వారా వినియోగం మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఆదాయ ఉత్పత్తి కోసం సహజ వనరులను ఉపయోగించడం
సహజ వనరుల యొక్క ఉపయోగించని సామర్థ్యాన్ని కూడా నాయుడు నొక్కిచెప్పారు. మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి డ్రోన్‌లు మరియు ఉపగ్రహాలను ఉపయోగించాలని, ఆదాయాలను డేటా విశ్లేషణల ద్వారా ట్రాక్ చేయాలని ఆయన ఆదేశించారు.

ఎర్రచందనంపై, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఉన్న నిల్వల అంతర్జాతీయ అమ్మకాల నుండి దాదాపు ₹1,500 కోట్లు సంపాదించవచ్చని ఆయన గుర్తించారు. గ్లోబల్ మార్కెట్లలో ప్రీమియం గ్రేడ్‌లు టన్నుకు ₹7.5 లక్షల వరకు పొందవచ్చని అధికారిక డేటా సూచిస్తుంది.

మూడు నుండి ఐదు సంవత్సరాలలోపు పండించగల వెదురు యొక్క వాణిజ్య సామర్థ్యాన్ని అన్వేషించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు.

ఫర్నిచర్ మరియు హస్తకళలు వంటి వెదురు ఆధారిత ఉత్పత్తులు ఎకరానికి ₹10 లక్షల వరకు దిగుబడిని ఇస్తాయని, రాష్ట్రానికి ఆదాయం మరియు గ్రామీణ వర్గాలకు జీవనోపాధిని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

అదనపు ఆదేశాలలో భూమి రికార్డుల GIS మ్యాపింగ్, ఆస్తి సరిహద్దులతో ఇ-రిజిస్ట్రేషన్‌ను ఏకీకృతం చేయడం మరియు RTGS-లింక్డ్ డేటా ద్వారా మునిసిపాలిటీలలో ఆటో-మ్యుటేషన్‌ను స్వీకరించడం వంటివి ఉన్నాయి.

జగన్ – చేజారిన ఆధిపత్యం, వారసత్వం

జగన్ – చేజారిన ఆధిపత్యం, వారసత్వం

మూడున్నర దశాబ్దాల అప్రతిహతంగా దమనకాండ సాగిన . .. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కోట పులివెందుల బద్దలైంది. జడ్పీటీసీ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇది కేవలం ఒక స్థానిక గెలుపు కాదు, వైఎస్ కుటుంబానికి ఐదు దశాబ్దాలుగా ఎదురులేని ఆధిపత్యం ఉన్న గడ్డపై తగిలిన గట్టి దెబ్బ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమైన ప్రజా వ్యతిరేకత ఇంకా ఎంత బలంగా పాతుకుపోయిందో ఈ ఫలితాలు తేల్చి చెప్పాయి.

పులివెందులలో టీడీపీ అభ్యర్థిని లతా రెడ్డి ఏకంగా 6,035 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఆమెకు 6,716 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కేవలం 683 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఒంటిమిట్టలోనూ టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ రెండు చోట్లా 77% నుంచి 86% వరకు భారీ పోలింగ్ నమోదైంది. మార్పు కోసం ప్రజలు ఎంత బలంగా ఉన్నారో చెప్పడానికి ఈ పోలింగ్ శాతమే నిదర్శనం.

1978లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి తొలిసారి గెలిచిన నాటి నుంచి ఆ కుటుంబానికి పులివెందులలో ఓటమి లేదు. వారు నిలబెట్టిన వారే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో వైఎస్సార్, వై.ఎస్. విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి 60 వేల నుంచి 90 వేల ఓట్ల భారీ మెజారిటీలతో గెలిచారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీచినా, జగన్ పులివెందులలో 61 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అలాంటి చోట ఇప్పుడు పార్టీ అభ్యర్థి ఓడిపోవడం అంటే వైఎస్ కుటుంబానికి రాజకీయ ముగింపు కాదు. కానీ, వారి వారసత్వం ఇకపై తిరుగులేనిది కాదని తేలిపోయింది.

వై.ఎస్. రాజారెడ్డి వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి పునాదులు వేశారు. ప్రజల సమస్యలు తీరుస్తూ, విద్యాలయాలు కట్టిస్తూ, వారికి అండగా నిలిచారు. వైఎస్సార్, జగన్ ఆ వారసత్వాన్ని కొనసాగించారు. అయితే, జగన్ తన పాలనలో ఆ పాత బంధాన్ని బలహీనపరిచారు. అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండటం కంటే, కేవలం సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలే పాలనకు ప్రామాణికం అయ్యాయి. కానీ, ఉద్యోగ కల్పన, మౌలిక వసతులు వెనకబడ్డాయి. సంక్షేమాన్ని కూడా ఒక రాజకీయ ఆయుధంగా వాడారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కొన్ని చోట్ల ప్రతిపక్ష మద్దతుదారులను ఇబ్బంది పెట్టడం ప్రజల్లో భయాన్ని, ఆగ్రహాన్ని పెంచాయి. తన బాబాయి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు, సోదరి షర్మిల వ్యతిరేక ప్రచారం కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాయి.

ప్రజలతో ఉన్న పాత సంబంధాన్ని జగన్ ఒక లావాదేవీగా మార్చారు. ఆ లావాదేవీలో బలవంతపు ధోరణి కనిపించడంతో, ప్రజలు తిరగబడ్డారు.

“బొంబులసీమ”గా పేరుపడ్డ చోట, ఎన్నికలు హింసాత్మక ఆధిపత్యానికి బదులు, ప్రజాస్వామ్య పోరాటానికి వేదికగా మారాయి. గత 30 ఏళ్లలో పులివెందుల జడ్పీటీసీ స్థానానికి పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. ఈసారి టీడీపీ దీన్ని “ప్రజాస్వామ్య పునరుద్ధరణ”గా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఇది ఫ్యాక్షనిజం అంతం కాకపోయినా, పోరాటం బాంబుల నుంచి బ్యాలెట్ బాక్సులకు మారిందని చెప్పవచ్చు.

ఈ ఫలితం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యాన్ని నింపింది. జగన్ అజేయుడనే భ్రమను పటాపంచలు చేసింది. “పులివెందుల పరాజయం” వల్ల జగన్ కు 40 శాతం ఓటర్లు ఇంకా మిగిలి లేరని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్ధమౌతుంది. జగన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ విషయం మరింత లోతుగా అర్ధం చేసుకుంటారు. మరోవైపు, టీడీపీకి ఈ విజయం భారీ నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. చంద్రబాబు నాయుడు దూకుడు వ్యూహం ఫలించింది. కూటమి బలం సూక్ష్మస్థాయిలో కూడా పనిచేస్తుందని రుజువైంది.

175 లో ఒక్కటి కూడా వొదిలేది లేదు (వై నాట్ 175) అని అభిమానుల్లో కార్యకర్తల్లో మితిమీరిన నమ్మకం నింపిన జగన్ కూర్చున్న వున్న పులివెందుల కూడా కరిగి పోవడం కేవలం స్వయంకృతమే! చంద్రబాబుని జైలుకి పంపి ప్రభుత్వాన్నే ఆయనకు ఇచ్చేసారు. చంద్రబాబు బాబు కోట కుప్పం మునిసిపాలిటీలో వేళ్ళూ కాళ్ళూ పెట్టిసొంత స్థానమైన పులివెందుల మీదే పట్టుతప్పిపోయారు… అంటే ఈ సంకేతాలు రాబోయే రోజులలో వైసీపీకి తీవ్రమైన గడ్డు పారిస్తుతులే అని చెప్పక తప్పదు .

తెలుగు మహిళకు బ్రిటన్‌ పౌర పురస్కారం

తెలుగు మహిళకు బ్రిటన్‌ పౌర పురస్కారం

పూర్ణిమ తణుకు – బ్రిటన్‌ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన సీబీఈ అవార్డుని అందుకున్న తొలి తెలుగు మహిళ

” మా స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట. సొంతూరిలోనే ప్రాథమిక విద్య పూర్తయ్యాక అమలాపురంలోని ఎస్‌కేబీఆర్‌ కాలేజీలో డిగ్రీ చదివా. ఆపై ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేశా. నాన్న విశ్వేశ్వరయ్య, టైపు ఇన్‌స్టిట్యూట్‌ నడిపేవారు. అమ్మ రత్నాంబ, గృహిణి. లండన్‌లో సర్జన్‌గా పని చేస్తున్న డాక్టర్‌ వెంకట సూర్యనారాయణతో పెళ్లవడంతో ఇక్కడే స్థిరపడ్డా. మొదట ఇంజినీరింగ్‌ కంపెనీలో కెరియర్‌ ఆరంభించా. తర్వాత యువత, పిల్లల కోసం పనిచేసే ‘రీజనరేషన్‌ ట్రస్ట్‌’కి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించా. ఆపై జైళ్లలో ఉన్నవారికి విద్యను అందించేందుకు కృషి చేసిన తొలి ఆసియా మహిళగానూ గుర్తింపు దక్కించుకున్నా. ”

 బ్రిటన్‌ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన సీబీఈ అవార్డుని అందుకున్నారు మన తెలుగు మహిళ పూర్ణిమ తణుకు.

బాలల సంరక్షణku పోరాటం : ప్రస్తుతం నేషనల్‌ డే నర్సరీస్‌ అసోసియేషన్‌ (ఎన్‌డీఎన్‌ఏ)కు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నాఋ పూర్ణిమ . . ఇది యూకేలో బాలల సంరక్షణ, హక్కుల కోసం పనిచేసే అతిపెద్ద ఛారిటీ-మెంబర్‌షిప్‌ అసోసియేషన్‌. 2004లో ఈ సంస్థలో చేరారు . అప్పటికి 20 మంది సిబ్బందితో చిన్నగా ఉండేది. ఇప్పుడు మూడు శాఖలతో 100మందికిపైగా ఉద్యోగులతో శక్తిమంతమైన స్వచ్ఛంద సంస్థగా మార్చగలిగారు పూర్ణిమ . . యూకేలోని 15000 డే నర్సరీల హక్కుల కోసం పోరాడి రికార్డ్ క్రియేట్ చేసారు . . దాదాపు పదిలక్షల మందికిపైగా చిన్నారులు, వారి కుటుంబాలకు అత్యున్నత సంరక్షణ విధానాలు అమలయ్యేలా చేయగలిగానని వినంరంగా చెపుతారీమె .

అవార్డు అందుకున్న తొలి తెలుగు మహిళ : ”ఇంగ్లండ్‌ సహా 22 దేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఇలా 20 ఏళ్ల పాటు ఎన్‌డీఎన్‌ఏకు నాయకత్వం వహిస్తూ బాలల విద్యకు చేయూత అందించినందుకు గానూ పలు పురస్కారాలు దక్కాయి. 2011లో బ్రిటన్‌ పౌర పురస్కారాల్లో ఒకటైన ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ)ను కింగ్‌ చార్లెస్‌ చేతుల మీదుగా తీసుకున్నా. తాజాగా కమాండర్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (సీబీఈ)ని చార్లెస్‌ సోదరి ప్రిన్సెస్‌ అనీ అందించారు. ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్, నోబెల్‌ గ్రహీత హెరాల్డ్‌ పింటర్, రగ్బీ ఆటగాడు జొనాథన్‌ పీటర్‌ విల్కిన్సన్‌తోపాటు మనదేశం నుంచి ఈ గౌరవాన్ని పొందినవారిలో లీనా నాయర్‌ ఒకరు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు మహిళను నేనే కావడం గర్వంగా ఉంది.” అంటూ తనకు అవార్డు రావడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ తెలుగు ఆడపడచు పూర్ణిమ .

రష్యా చమురు  –తెరవెనుక కథ

రష్యా చమురు –తెరవెనుక కథ

రష్యా నుంచి చౌకగా కొన్న ముడి చమురు భారత రిఫైనరీలకు, ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలకు వేల కోట్ల లాభాలను తెచ్చిపెడుతోంది . ..

ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ప్రతిగా, పాశ్చాత్య దేశాలు మాస్కో ఆదాయాన్ని దెబ్బతీయడానికి కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించాయి. ఇందులో భాగంగా రష్యా సముద్రమార్గ చమురుపై బ్యారెల్‌కు $60 ధరల పరిమితిని విధించాయి. అయితే, ఈ ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా ఒక రహస్య మార్గాన్ని ఎంచుకుంది. అదే “షాడో ఫ్లీట్“ (ఎలాంటి పర్మిట్లూ లేని “దొంగ” నౌకలు అనేక మోసపూరిత పద్ధతులను అనుసరిస్తాయి. ఈ నౌకల యజమానులు ఎవరో స్పష్టంగా తెలియకుండా ఉండేందుకు సంక్లిష్టమైన కంపెనీ నిర్మాణాలు, షెల్ కంపెనీలను ఉపయోగిస్తారు. పనామా, లైబీరియా, గాబన్ వంటి దేశాల జెండాలను ఎగురవేస్తాయి. ఈ దేశాలలో నిబంధనలు చాలా సరళంగా ఉండటంతో, నౌకల తనిఖీ, భద్రతా ప్రమాణాల నుంచి తప్పించుకోవడం సులభం. ఈ నౌకలకు సరైన భీమా ఉండదు. పాశ్చాత్య భీమా కంపెనీలు ఆంక్షల కారణంగా సేవలు అందించవు. దీంతో, ప్రమాదం జరిగితే నష్టపరిహారం చెల్లించే నాథుడు ఉండడు. ఈ నౌకాదళంలోని చాలా ట్యాంకర్లు 15-20 ఏళ్లకు పైబడినవి. వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువ. తమ కదలికలను దాచిపెట్టడానికి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) ట్రాన్స్‌పాండర్లను ఆపివేస్తాయి. సముద్రం మధ్యలో ఒక నౌక నుంచి మరో నౌకకు చమురును మార్చేసి చమురు ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా చేస్తాయి.వందలాది పాత చమురు ట్యాంకర్లతో కూడిన ఈ రహస్య నెట్‌వర్క్ ద్వారా తన చమురును, ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలకు అమ్ముతూ ప్రపంచ ఇంధన మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది.

ఈ క్రమం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు, పర్యావరణ ప్రమాదాలకు దారితీస్తోంది.

పాశ్చాత్య దేశాలు రష్యా చమురును బహిష్కరించడంతో, భారత్, చైనాలు అతిపెద్ద కొనుగోలుదారులుగా అవతరించాయి. ముఖ్యంగా, యుద్ధానికి ముందు రష్యా నుంచి నామమాత్రంగా చమురు కొనుగోలు చేసిన భారత్, ఆంక్షల తర్వాత తన దిగుమతులను భారీగా పెంచుకుంది. రష్యా అందించిన తగ్గింపు ధరలను అందిపుచ్చుకుని, తన జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రతను కాపాడుకుంటున్నామని భారత్ వాదిస్తోంది.

రష్యా నుంచి చౌకగా కొన్న ముడి చమురు భారత రిఫైనరీలకు, ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలకు వేల కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సంస్థలు చౌక చమురును శుద్ధి చేసి, పెట్రోలియం ఉత్పత్తులను అధిక ధరలకు అంతర్జాతీయ మార్కెట్లలో, ముఖ్యంగా రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలకే ఎగుమతి చేశాయి. ప్రభుత్వం కూడా ఈ లాభాలపై “విండ్‌ఫాల్” పన్నుల రూపంలో ఆదాయం పొందింది. అయితే, ఈ ప్రయోజనాలు దేశీయ వినియోగదారులకు చేరలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు.

ఈ నీడల నౌకాదళం సముద్ర పర్యావరణానికి పెను ముప్పుగా మారింది. పాత నౌకలు, సరైన నిర్వహణ లేకపోవడం, భీమా సౌకర్యం కొరవడటంతో ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి.రెండు “దొంగ” నౌకలు నల్ల సముద్రంలో డిసెంబర్ 2024 న తుఫానులో చిక్కుకుని ముక్కలవ్వడంతో భారీగా చమురు సముద్రంలో కలిసి, తీవ్ర పర్యావరణ నష్టం జరిగింది.

2024 మార్చి లో రష్యా నుంచి భారత్‌కు వస్తున్న ‘ఇన్నోవా’ అనే ట్యాంకర్ స్కాట్లాండ్ తీరంలో 23 కిలోమీటర్ల పొడవున చమురును కక్కేసింది.

2024 ఫిబ్రవరిలో ఇటలీ తీరంలో ‘అరుణా గుల్కే’ అనే నౌక 47 కిలోమీటర్ల మేర చమురును చిమ్మింది.

మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణాలు

రష్యా చమురు వాణిజ్యం ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్ రష్యా నుంచి చమురు కొనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా, భారతీయ ఎగుమతులపై భారీ సుంకాలను విధించింది. ఇది దశాబ్దాలుగా బలపడుతున్న ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దెబ్బతీసింది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రెండుగా చీలుస్తున్నాయని, డాలర్ ఆధిపత్యానికి సవాలు విసురుతూ బ్రిక్స్ పే (BRICS Pay) వంటి ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు .

ట్రంప్ – మోదీ… ఒకటే బాట..

ట్రంప్ – మోదీ… ఒకటే బాట..

మొండి – జగమొండి రకం వీరిద్దరూ . …

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేత ఒకరు . . మరొకరు అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు. ఒకరు నరేంద్ర మోదీ. ఇంకొకరు డొనాల్డ్ ట్రంప్. వారిద్దరి మధ్య వేల మైళ్ళ దూరం ఉండవచ్చు. వారి రాజకీయ నేపథ్యాలు వేరు కావచ్చు. కానీ వారిద్దరినీ ఒకే గాటన కట్టే అంశాలు చాలా ఉన్నాయి. వారి రాజకీయ ప్రయాణం, పరిపాలన శైలి అచుగుద్దినట్లు అనిపిస్తుంది.

మోదీ, ట్రంప్ ఇద్దరూ రాజకీయాల్లోకి ఓ కొత్త శక్తిలా దూసుకొచ్చారు. అప్పటికే ఉన్న రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాకచక్యంగా వాడుకున్నారు. తాము ఆ వ్యవస్థకు చెందిన వారం కాదని, ప్రజల పక్షాన పోరాడటానికి వచ్చిన బయటి వాళ్ళమని చాటుకున్నారు.

వాషింగ్టన్‌లోని అవినీతి రాజకీయాలపై ట్రంప్ యుద్ధం ప్రకటించారు. ఢిల్లీలోని “ల్యూటెన్స్ మీడియా, మేధావుల వర్గాన్ని” మోదీ లక్ష్యం చేసుకున్నారు. (దేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చే బ్రిటిష్ సామ్రాజ్య ప్రాజెక్టుని ఆర్కిటెక్ట్ ఎడ్విన్ “ల్యూటెన్స్” రూపొందించారు. ఇది పాశ్చాత్య భారతీయ నిర్మాణ శైలుల మిశ్రమాన్ని ప్రతిబింబించే విశాలమైన, చెట్లతో కప్పబడిన అవెన్యూలు, గొప్ప ప్రభుత్వ భవనాలు పెద్ద బంగ్లాలతో వుంటుంది. ఈ ప్రాంతం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇతర ప్రభావవంతమైన వ్యక్తులతో సహా ప్రముఖ నివాసితులకు ప్రసిద్ధి చెందింది. ప్రజలతో సంబందంలేకుండా అన్ని రంగాలను ప్రభావితం చేయగల వారిని ఢిల్లీ ల్యూటెన్స్ అంటారు.) ప్రజల భాషలో మాట్లాడుతూ, వారి భావోద్వేగాలను స్పృశిస్తూ సామాన్యులకు చేరువయ్యారు.

ఈ పాలకులు ఇద్దరి ప్రచారాల్లో జాతీయవాదం ప్రధాన అస్త్రంగా మారింది. “మేక్ అమెరికా గ్రేట్ అగైన్” అంటూ ట్రంప్ అమెరికన్ల దేశభక్తిని తట్టిలేపారు. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” అంటూనే మోదీ ఒక “నవ భారత” నిర్మాణం గురించి మాట్లాడారు. తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని కాపాడటానికే తాము ఉన్నామని ప్రజలను నమ్మించారు. ఈ జాతీయవాద నినాదాలు వారి మద్దతుదారులను ఏకం చేశాయి. వారిని గుడ్డిగా ఆరాధించే భక్త గణాన్ని తయారుచేశాయి.

మెయిన్ స్ట్రీమ్ మీడియాపై దాడి చేయడం వారిద్దరి రాజకీయ వ్యూహంలో మరో కీలక భాగం. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలను, చానెళ్లను ట్రంప్ “ఫేక్ న్యూస్” అని కొట్టిపారేశారు. మోదీ మద్దతుదారులు అలాంటి మీడియాను “ప్రెస్టిట్యూట్స్” అని, (డబ్బు లేదా ఇతర ప్రయోజనాల కోసం తమ వృత్తిపరమైన నిజాయితీని, నైతికతను అమ్ముకుని, వార్తలు రాసే పత్రికలను, మీడియా సంస్థలను, లేదా జర్నలిస్టులను కించపరిచేందుకు వాడే ఒక అవమానకరమైన పదం ఇది.) “దేశద్రోహులు” అని ముద్ర వేశారు. మీడియాను బలహీనపరిచి, తమ సందేశాన్ని నేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇద్దరూ సఫలమయ్యారు. దీనివల్ల తమ చుట్టూ ఒక అభేద్యమైన కోటను నిర్మించుకున్నారు. విమర్శలు ఆ కోట గోడలను తాకలేకపోయాయి.

వ్యక్తి ఆరాధన.. ఇద్దరి పాలనలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ పథకాలైనా, దేశ విజయాలైనా అన్నీ తమ ఘనతగానే ప్రచారం చేసుకున్నారు. తామే దేశానికి రక్షకులమని, తమ వల్లే దేశం సురక్షితంగా ఉందని చాటుకున్నారు. నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగా జరిగాయి. మంత్రులు, అధికారులు నామమాత్రంగా మిగిలిపోయారు. నాయకుడే సర్వస్వం అనే భావన బలపడింది.

ఆర్థిక రంగంలోనూ వారి విధానాల్లో పోలికలు ఉన్నాయి. ఇద్దరూ దేశీయ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ చైనా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు పెంచితే, మోదీ “మేక్ ఇన్ ఇండియా” అంటూ స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించారు. వారి విధానాలు కొన్నిసార్లు ఆర్థికవేత్తల విమర్శలకు గురైనా, తమ మద్దతుదారుల నుంచి మాత్రం బలమైన సమర్థన లభించింది.

ఈ ఇద్దరు నేతల ప్రస్థానం ఆధునిక రాజకీయాల్లో ఒక కొత్త ధోరణికి అద్దం పడుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉంటూ, దాని స్ఫూర్తిని దెబ్బతీసే నాయకత్వ శైలి ఇది. ప్రజల ఆకాంక్షలను, వారి భయాలను చాకచక్యంగా వాడుకుంటూ అధికారాన్ని చేజిక్కించుకుని, దాన్ని నిలబెట్టుకునే సరికొత్త రాజకీయం ఇది. అందుకే మోదీ, ట్రంప్ వేర్వేరు దేశాల నేతలైనా, వారి రాజకీయ పంథా మాత్రం ఒకే దారిలో సాగుతున్నట్టు కనిపిస్తుంది. మీకు కూడా ఓననిపిస్తుందా ?