హైదరాబాద్ ‘గ్రీనరీ ‘ కి రేవంత్ దెబ్బ

హైదరాబాద్ ‘గ్రీనరీ ‘ కి రేవంత్ దెబ్బ

కంచ గచ్చిబౌలీలో 400 ఎకరాలలో అటవీ ప్రాంతాన్ని వేలం ద్వారా అమ్మకంపై నిరసనలు

హైదరాబాద్ లోని గుర్తింపు పొందిన గ్రీనరీ  ప్రాంతమైన   ‘కంచ గచ్చిబౌలి’లో 400 ఎకరాలను వేలం వేయడం ద్వారా పారిశ్రామిక కేంద్రంగా మార్చాలనుకుంటున్నారు  తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.   హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే కనుమరుగవుతున్న పచ్చదనాన్ని మరింత నాశనం చేయడానికి రేవంత్ కంకణం కట్టుకున్నారా?  అసలు  ఏమి ఆలోచిస్తున్నాడు?

రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో పోగొట్టుకున్న తన ఇమేజ్‌ను తిరిగి తెచ్చుకునేందుకు మరియు తెలంగాణ ( తన) రాష్ట్రం అభివృద్ధి చెందడానికి విదేశాలలో ఉన్న వందలాది తెలంగాణ మూలాల విజయగాథలపై ఆధారపడవచ్చు, తన రాజధాని యొక్క ఆకుపచ్చ ఊపిరితిత్తులపై బుల్డోజర్‌లను నడపకుండానే ఈ పని చేయడం ద్వారా అందరి మన్ననలు పొందవచ్చని తెలుసుకుంటే మంచిది.

కాంగ్రెస్ ఎకో-పార్క్ ఆలోచనతో ముందుకు వెళితే, అది ప్రతిపక్ష BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావు (KTR) ఛాలెంజ్ విసిరాడు . అతను వివాదాస్పదమైన 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూమిని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి పొంది దానిని పర్యావరణ ఉద్యానవనంగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కెటిఆర్ ప్రతిజ్ఞ .. రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా కనిపిస్తోంది .

హైదరాబాద్ దాటి ఆలోచించడం

పట్టణీకరణ లక్ష్యంగా తెలంగాణ హైదరాబాద్ దాటి ఆలోచించాలి. ఒకప్పుడు హైదరాబాద్‌ను పాలించిన వ్యక్తి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ₹85,000 కోట్ల అంచనా వ్యయంతో అమరావతిలో కొత్త రాజధానిని నిర్మించడంలో బిజీగా ఉన్నారు, 

వరంగల్ వంటి నగరాలను విస్తరించడం ద్వారా హైదరాబాద్‌ను రద్దీని తగ్గించడం ఇప్పటికే రాతి పీఠభూమిపై ఉన్న నగరంలోని పచ్చని ప్రాంతాలను పారిశ్రామికీకరించడం కంటే సముచితంగా అనిపిస్తుంది. తెలంగాణ మీదుగా  ప్రవహించే గోదావరి నది వెంబడి ఉన్న పట్టణాలు, మంచిర్యాల,  ప్రముఖ ఆధ్యాత్మిక   పట్టణం భద్రాచలం వంటివి హైదరాబాద్‌కు కొత్త ప్రత్యామ్నాయాలను అందించవచ్చు. భవిష్యత్తులో నీటి అవసరాలకు వీటిని ముందస్తు ప్రణాళికలో భాగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరంపై నిపుణుల సూచనలు తీసుకోవాలి. 

2023 మరియు 2024 మధ్య, నగరంలోని భూగర్భజల పట్టిక రెండు నుండి ఏడు మీటర్ల వరకు తగ్గిపోయిందని గత సంవత్సరం ఒక నివేదిక తెలిపింది.

హైదరాబాదీలు ఆలోచనలు మార్చుకుని , గతం మాదిరి ప్రవర్తించకుండా, కొత్తగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. పచ్చదనం కోసం ప్రయత్నించకపోగా ఉన్న గ్రీనరీని దెబ్బతీసుకోవడం భవిష్యత్ తరాలు క్షమించలేవు .

అమరావతి వంటి నగరం నిర్మించుకోవాలి: హైదరాబాద్ పై ఒత్తిడి పెరిగిపోతోంది . నగర విస్తరణతో గ్రీన్ బెల్ట్ నాశనం అయింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2035 నాటికి నివాసయోగ్యంకాని నగరాల జాబితాలో హైదరాబాద్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. వీటిని దృష్టిలో ఉంచుకుని అమరావతి వంటి గ్రీన్ ఫీల్డ్ నగర నిర్మాణంపై తెలంగాణ సర్కార్ , సీఎం రేవంత్ రెడ్డి ద్రుష్టి సారించాలి. లేకపోతె తెలంగాణ భవిష్యత్ తరాలు రేవంత్ , కాంగ్రెస్ పార్టీని తూర్పారబెట్టే దుస్థితి తలెత్తుతుంది.

ఇద్దరు స్నేహితులు  నిర్మించిన సామ్రాజ్యం..మైక్రోసాఫ్ట్

ఇద్దరు స్నేహితులు నిర్మించిన సామ్రాజ్యం..మైక్రోసాఫ్ట్

బిల్ గేట్స్ – పాల్ అలెన్ మైక్రోసాఫ్ట్ స్థాపించి 50 ఏళ్లయింది . ..

అల్లరి – చిల్లరగా తిరిగే వయసు. జీవితంలో సాధించాల్సిన లక్ష్యాల గురించి కూడా పెద్దగా ఫోకస్ పెట్టే మెచ్యూరిటీ కూడా కాని ఆ వయసులో ఇద్దరు స్నేహితులు ప్రారంభించిన చిన్న సంస్థ . .ఇపుడు ప్రపంచ స్థాయిలో దిగ్గజ కంపెనీగా ఎదిగింది.

1975 ఏప్రిల్ 4న ఇద్దరు స్నేహితులు ప్రారంభించిన సంస్థ . . .. ఎన్నో ఇబ్బందులు, మరెన్నో సవాళ్లను ఎదుర్కొని వాటిని గుణపాఠాలుగా మలచుకుని . . విజయవంతంగా ముందుకు దూసుకుపోతోంది . ఈ సందర్భంగా ఇద్దరు స్నేహితులు నిర్మించిన ఈ మైక్రోసాఫ్ట్ అప్రతిహత విజయదరహాసాన్ని ఒకసారి నెమరువేసుకుందాం . …

మైక్రోసాఫ్ట్ ప్రారంభం: ఇద్దరు చిన్ననాటి స్నేహితులు బిల్ గేట్స్, పాల్ అలెన్​కు వచ్చిన ఒక చిన్న ఆలోచనతో ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ జన్మించింది . ప్రతి ఇంట్లో ఒక కంప్యూటర్ ఉండాలనేది అప్పట్లోనే ఈ ఇద్దరు స్నేహితుల కల . ఎందుకంటే ఆ సమయంలో కంప్యూటర్లు పెద్దవిగా ఉండటం, ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటిని వినియోగించడం క్లిష్టంగా ఉండేది.

వారి ఇరువురి పురోగతి MS-DOS (మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్) తో మొదలైంది. ఇది పర్సనల్ కంప్యూటింగ్‌కు పునాది వేసిన ప్రారంభ ఆపరేటింగ్ సిస్టమ్ (OS).

1975-1980: బిల్ గేట్స్, పాల్ అలెన్ అందరికీ పర్సనల్ కంప్యూటింగ్‌ను తీసుకురావాలనే విజన్​తో పనిచేశారు. ఈ క్రమంలో వారు మొట్టమొదటి వ్యక్తిగత కంప్యూటర్లలో ఒకటైన ఆల్టెయిర్ 8800 కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి వారి మొదటి పెద్ద విజయాన్ని సాధించారు. ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన కార్పొరేషన్లలో ఒకటిగా ఎదిగింది.

1975: బిల్ గేట్స్, పాల్ అలెన్ ఇద్దరూ కలిసి 1975 ఏప్రిల్ 4న మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారు. ఆల్టెయిర్ BASICను అభివృద్ధి చేసి ప్రపంచ సాంకేతిక సామ్రాజ్యానికి పునాది వేసింది. ఆ తర్వాత ఈ కంపెనీ న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుంచి వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌కు మారింది. ఈ క్రమంలో 1979-1978 చివరి నాటికి దీని సేల్స్ $1 మిలియన్లకు చేరుకున్నాయి.

1981-1990: ఇది మైక్రోసాఫ్ట్‌ను ఇంటింటికి పరిచయం చేసిన దశాబ్దం. ఆగస్టు 1981లో మైక్రోసాఫ్ట్ తన కొత్త ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ (MS-DOS)ను విడుదల చేసింది. ఇది IBM పర్సనల్ కంప్యూటర్లలో పనిచేయడం ప్రారంభిస్తుంది. భవిష్యత్తులో వ్యక్తిగత కంప్యూటింగ్ వ్యవస్థలపై కంపెనీ ఆధిపత్యానికి ఇది కీలకమైన క్షణం.

1983: 1983లో మైక్రోసాఫ్ట్ తన కొత్త సాఫ్ట్‌వేర్ ‘విండోస్’ను సాగరవంగా ప్రకటించింది. ఇది విజువల్ ఫీచర్లతో MS-DOS ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

1985: 1985లో విండోస్ 1.0 విడుదలైంది. ఇది కంప్యూటింగ్‌ను రూపొందించే గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్‌ను పరిచయం చేసిన కీలక కంపెనీ .

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 1985: 1985లో మైక్రోసాఫ్ట్ విండోస్ 1.0ని ప్రారంభించింది. ఈ విధానంలో కంప్యూటర్లను ఉపయోగించడాన్ని చాలా సులభతరం చేయడంలో ఒక టర్నింగ్ పాయింట్. మైక్రోసాఫ్ట్ సంవత్సరాలుగా విండోస్‌ను మెరుగుపరుస్తూనే ఉంది. వీరు రూపొందించిన ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్‌గా మారింది.

1986: మైక్రోసాఫ్ట్ తన కార్పొరేట్ ప్రధాన కార్యాలయాన్ని వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌కు మార్చింది. ఇది ఒక్కో షేరుకు $21 చొప్పున పబ్లిక్‌గా విడుదలైంది. తర్వాత ఇది దాదాపు $60 మిలియన్లను సేకరించి విజ యం సాధించారు . . దీంతో బిల్ గేట్స్ 31 సంవత్సరాల వయసులో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా మారడానికి ఇది కారణంగా నిలిచింది .

1987: మైక్రోసాఫ్ట్ పర్సనల్ కంప్యూటర్ల కోసం వరల్డ్ లోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థగా అవతరించింది.

1988: 1987లో విండోస్ 2.0 రాకతో, కార్యాలయంలో కంప్యూటర్లు అనేవి సాధారణం కావడం ప్రారంభమైంది. దీంతో ప్రపంచ అమ్మకాల ఆధారంగా మైక్రోసాఫ్ట్ అతిపెద్ద PC సాఫ్ట్‌వేర్ కంపెనీగా అవతరించింది.

ఇంటర్నెట్ అండ్ ఎక్స్​పెన్షన్ 1990: 1990లలో మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ప్రపంచంలోకి ప్రవేశించి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను ప్రవేశపెట్టింది. సర్వర్ సాఫ్ట్‌వేర్, బిజినెస్ టూల్స్​ను క్రియేట్ చేయడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించింది.

1995లో విండోస్ 95: స్టార్ట్ మెనూ, టాస్క్‌బార్, ప్లగ్-అండ్-ప్లే సపోర్ట్​ను ప్రవేశపెట్టిన విప్లవాత్మక అభివృద్ధి. మొదటి ఐదు వారాల్లో 7 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ విండోస్ 95 ప్లస్‌లో తొలిసారిగా ప్రారంభమైంది.

1995: ఇంటర్నెట్ రాకతో మైక్రోసాఫ్ట్ తన వెబ్ బ్రౌజర్ ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్’ను పరిచయం చేసింది.

1998: విండోస్ మొదటి వినియోగదారు వెర్షన్ అయిన విండోస్ 98 విడుదలైంది. అదే ఏడాది అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ మైక్రోసాఫ్ట్ తన ప్రోగ్రామ్‌లను దాని ఆపరేటింగ్ సిస్టమ్‌లలో కలిపినందుకు దానిపై’ యాంటీట్రస్ట్’ అభియోగాలను నమోదు చేసింది . సాఫ్ట్‌వేర్, గుత్తాధిపత్య పద్ధతుల్లో కంపెనీ తన ఆధిపత్యాన్ని ఉపయోగించి పోటీదారులను వ్యాపారం నుంచి తరిమికొట్టిందని US నియంత్రణ సంస్థలు చేసిన ఆరోపణలు అప్పట్లో దుమారం లేపాయి . వీటన్నింటినీ తట్టుకుని బిల్ గేట్స్ నిలబడ్డారు .

రామాయణం.. కథ కాదు – జీవన గాధ

రామాయణం.. కథ కాదు – జీవన గాధ

రామ కధ తెలుసుకున్నాకా,, నైతికత , జీవన విలువలతో ఎంత మార్పు వచ్చింది ? గమనించాలి. ఆచరించాలి

రామాయణంలో నాయక , ప్రతి నాయక పాత్రలు మనకు ఎంతో సందేశాన్నిస్తున్నాయ్. మనం ఎలా ఉండాలో చెప్పడమే కాదు . . ఎలా ఉండకూడదో కూడా వివరిస్తోంది రామాయణం .

ఇందులో ఆయా పాత్రలు బోధించే మంచిని స్వీకరించి , చెడును తిరస్కరించగలుగుతున్నామో లేదో మనల్ని మనం విశ్లేషించుకోవడం ‘శ్రీరామ నవమి ‘ లాంటి పండగల ఉపయోగపడతాయి . రామాయణాన్ని మలుపుతిప్పిన మంథర వక్రబుద్ధి ..

ఉత్తమురాలిగా పేరొందిన కైకేయి సైతం మంధర వంటి దుష్ట బుద్ది కలిగిన మహిళ మాయమాటల్లోపడిపోయింది. విచక్షణ కోల్పోయి . . చరిత్రహీనురాలిగా మిగిలిపోయింది . అందుకే ఎవరు ఏమి చెప్పినా , విని , తర్వాత పరిశీలన చేసుకోవాలి . సావధానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి . అంతేకానీ పోసుకోలు కబుర్లు చెప్పేవారి మాటలు విని తొందరపడకూడదు .

కలియుగంలో ఎందరో మందరలు మన మద్యే ఉన్నారు. చాలా సందర్భాలలో మన మనస్సే మందర వలె వ్యవహరిస్తోంది . మనలోనే లేనిపోని ఊహాజనిత విష వలయాన్ని అల్లుతుంది . అపార్ధాలను సృష్టిస్తుంది . ఇతరుల పట్ల ఈర్ష్య, ద్వేషాలను రగిలిస్తుంది . బుద్దిని కోల్పోయేలా చేస్తుంది . మన మద్యే ఉండే మందరల మాటలు వింటే ఏమవుతుందో ఆలోచించుకోండి .

కైకేయి మందర చెప్పిన మాటల్లోని నిజానిజాలను తెలుసుకోకుండా తొందరపడింది. వాస్తవం తెలుసుకోవడానికి దశరదుడ్ని కానీ , కౌసల్యనుగానీ, రాముడిని కానీ అడిగి ఉంటే అంత అనర్ధం జరిగి ఉండేది కాదు. రాముదంతటి మహనీయుడిని అడవులకు పంపడానికి కారణమై.. జనుల నిందను మోయవలసి వచ్చేది కాదు . తర్వాత కైకేయి ఈ విషయాన్నీ గ్రహించినా , , జరగాల్సిన నష్టం జరిగిపోయింది . దీనినిబట్టి మనం కూడా తోటివారి మాయమాటల వలలో పడకూడదన్న వాస్తవాన్ని గ్రహించాలి . ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మి అయినవాళ్లను దూరం చేసుకోకూడదు . అపార్ధాలు కొనితెచ్చుకోకూడదు . చెప్పుకోలు మాటలు వింటే జరిగే అనర్ధాలపై అప్రమత్తంగా వ్యవహరించాలి . రామాయణంలో ఇలాంటి నీతి సూత్రాలు ఎన్నో ఉన్నాయ్ . తెలుసుకోవడమే కాదు . . ఆచరణలో పెడితే మన జీవితాలకు ”శ్రీరామ రక్షా’ కవచం అండగా ఉంటుంది.

షేర్ మార్కెట్ పతనం ఖాయమా ?

షేర్ మార్కెట్ పతనం ఖాయమా ?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెంపర్మెంట్ మనపైనా అత్యంత ప్రభావం చూపుతుంది.

అమెరికాకు వస్తువులు ఎగుమతి చేస్తున్న దేశాలపై టారిఫ్ ల దెబ్బ ప్రపంచాన్ని కుదిపేస్తోంది . ఈ ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్ ను కుదిపేస్తోంది. టారిఫ్ ల ప్రకటనకు ముందే మన మార్కెట్ పతనమైంది . అయినా మరోమారు . .. టారిఫ్ ప్రకటన రోజున కూడా భారీగా పడిపోయింది .

మరింత పతనం అయ్యే ప్రమాదం ? టారిఫ్ ల ప్రభావం వల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది . అమెరికాతో పోలిస్తే మన మార్కెట్ కొంత మెరుగని చెప్పాలి. అయితే టారిఫ్ ల భయం మాత్రం మదుపరులు , కంపెనీలపై ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. భారత్ మార్కెట్ లు హై నుంచి 13-15 శాతం పతనమయ్యాయి . ఈ ప్రభావం మరింత ఉంటుందని చెపుతున్నారు . 18- 20 శాతం వరకు పతనం ఉండొచ్చని అంచనావేస్తున్నారు.

30-40 శాతం పడిన స్మాల్ క్యాప్: స్మాల్ క్యాప్ షేర్స్ 30-40 శాతం పడ్డాయ్. మిడ్ క్యాప్ 20-25 శాతం పతనమయ్యాయి. అయితే అమెరికా టారిఫ్ లు మనదేశం కంటే చైనా వంటి పలు దేశాలపై మరింత ఎక్కువ విధించారు. ఈ ప్రభావం కూడా మన మార్కెట్ కి కొంతవరకు మెరుగని చెప్పాలి.

పతనమైన కోలుకునే ఛాన్స్ : సోమ, మంగళ వారాలలో మన షేర్ మార్కెట్ భారీగా పడినా , , క్రమంగా కోలుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. టారిఫ్ ల ప్రభావం వల్ల తాత్కాలికంగా బలహీనపడిన , , నాలుగైదు నెలల వ్యవధిలో పెరుగుతుందని చెపుతున్నారు .

రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళన.. ఇంకెన్నాళ్ళకు ?

రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళన.. ఇంకెన్నాళ్ళకు ?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ లో చోటుచేసుకున్న తప్పులు , అక్రమాలు సరిదిద్దడంలో కూటమి సర్కార్ సక్సెస్ కాలేదు

    ఏపీలో రెవిన్యూ ప్రక్షాళన చేస్తారా? రైతుల ఇబ్బందులు పట్టించుకోవడానికి కూటమి పెద్దలకు తీరికలేదా >

సర్వేయర్ల వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా.. భూ సమస్యలు పరిష్కరించాలని కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు.. 

   గత పాలకులపై విమర్శలు మాని.. పరిష్కారం దిశగా అడుగులు వేయాలి.. 

గతంలో జరిగిన తప్పిదాలను పదే పదే ఎత్తి చూపుతూ , గత పాలకులపై దుమ్మెత్తిపోస్తూ..   చంద్రబాబు సర్కార్ కాలం వెళ్లబుచ్చుతున్నట్లు కనిపిస్తోంది. ఆ తప్పులను సరిదిద్దుతారన్న నమ్మకంతో గెలిపించిన ప్రజలకు పరిష్కార మార్గాలు చూపడంలో మీన మేషాలు లెక్కించడం ఇంకెన్నాళ్లు… అని ప్రశ్నిస్తున్న ప్రజలకు కూటమి సర్కార్ ఏమి సమాధానం చెపుతుంది. ఎలా సంతృప్తి పరుస్తుంది. సమస్య పరిస్కారంపై ద్రుష్టి సారించాల్సిన సమయం దాటిపోతున్నా,, గత పాలకులపై దుమ్మెత్తి పొసే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడంలో అర్ధంలేదు. 

 వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన ‘జగనన్న సమగ్ర భూ సర్వే’ లో వందలు, వేలు కాదు.. లక్షల సంఖ్యలో తప్పిదాలు జరిగాయి. సర్వే తప్పుల తడకతో  రైతులు మధ్య  భూ వివాదాలు ఏర్పడ్డాయి. వాటిని సరిదిద్దెందుకు కూటమి సర్కార్ ఇప్పటికి రెండు దఫాలుగా నిర్వహించిన ‘రెవిన్యూ సదస్సులలోనూ 25 శాతం కూడా పరిష్కారం కాలేదు. 

   2024 అక్టోబర్, నెలలో 13,325 పంచాయతీలలో నిర్వహించిన గ్రామ సభలలో .. 53,342 ఫిర్యాదులు వచ్చాయి. డిసెంబర్ 2024లో నిర్వహించిన రెవిన్యూ సదస్సులలో.. 62,732 ఫిర్యాదులు నమోదు చేశారు. అంటే రెండు విడతల సభలలో.. మొత్తం.. 1,26,074 ఫిర్యాదులు రైతుల నుంచి ప్రభుత్వానికి వచ్చాయి. 

వీటిలో..  సర్వే సమస్యలు, సరిహద్దు వివాదాలు,  రైతు భూములను నిషేధిత జాబితాలో చేర్చిన అంశాలే ప్రధానంగా ఉన్నాయ్. 

   . 

 కొన్ని చోట్ల  అప్పటి అధికార వైసీపీ పెద్దల ఒత్తిడితో ప్రభుత్వ భూములకు రికార్డులు సృష్టించి భూములు కొట్టేసారు.  గ్రామాలలో భూములు ఉండి సదరు భూ యజమానులు పట్టణాలు, నగరాలలో ఉండే వారిలో కొందరి భూముల రికార్డులు కూడా మార్చేసి క్రయ, విక్రయాలు చేసిన సంఘటనలపై కూడా వేల సంఖ్యలో ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోకుండా  పెండింగ్ లో ఉన్నాయి. 

సీఎం చంద్రబాబు సీరియస్.. 

   రెవిన్యూ సదస్సులలో సమస్యలు పరిష్కారం కావడంలేదని ఫీడ్ బాక్ వస్తుందని ఇటీవల అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ‘త్వరలో పరిష్కారం అవుతాయి సార్..’ అని రెవిన్యూ స్పెషల్ సెక్రటరీ సిసోడియా సమాధానం చెప్పారు. ‘మనకు ఓపిక ఉంది.. ప్రజలకు, రైతులకు ఓపిక ఉండాలి కదా.. ఎన్ని రోజులు సహిస్తారు?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. 

సీఎం రెవిన్యూ అధికారులపై ఈ విధంగా సీరియస్ అవ్వడం.. ఈ ఆరు నెలల కాలంలో పదుల సంఖ్యలో జరిగింది. అయినా పరిస్థితులలో మార్పు కనిపించడంలేదంటే … ట్రీట్ మెంట్ ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? అనే దానిపై యంత్రాంగానికి పూర్తి క్లారిటీ వచ్చినట్లు కనిపించడంలేదని రెవిన్యూ శాఖలో కీలక అధికారి ఒకరు అనధికారికంగా చెప్పారు. 

 తప్పు చేసిన వారు ఎలా సరిచేస్తారు?

   జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు ‘’జగనన్న సమగ్ర భూ సర్వే ‘ నిర్వహించారు. 45-50 శాతం భూములలో ఈ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు చెపుతున్నారు. ఆ సమయంలో సర్వే అసమగ్రంగా, అడ్డదారులలో సాగినట్లు అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చేవి. అయినా అప్పట్లో అధికారులు పట్టించుకోలేదు. 

    సర్వేలో సచివాలయ సర్వేయర్ల పాత్ర కీలకం. వీరిలో కొంతమందికి అవగాహనలేకపోవడ0, మరికొంతమంది సర్వేయర్లు మామూళ్లకు కక్కుర్తిపడి ఒక రైతు భూమి, మరో రైతు పేరుతో నమోదు చేయడం వంటి తప్పిదాలు చేశారు. కొన్ని చోట్ల రైతు జిరాయితీ భూములను సైతం.. నిషేధిత జాబితా (22 A ) లో చేర్చారు. ఆ జాబితా నుంచి తమ భూములను తొలగించాలంటే రెవిన్యూ, సర్వే అధికారులకు మామ్మూళ్లు ఇవ్వాల్సిందే. 

     వైసీపీ హయాంలో సర్వే నిర్వహించిన వారే.. ఇంకా ఆయా గ్రామాలలో సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో తప్పు చేసిన ఉద్యోగులే.. ఆ తప్పులను సరిచేయాల్సిన దుస్థితి ఎదురయింది. ఇపుడు సరిచేస్తే.. గతంలో తాము చేసిన తప్పులు బయటపడతాయన్న భయంతో సదరు ఉద్యోగులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ఉదాహరణలు ఇవిగో.. 

    కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన బి. శివరామ కృష్ణ అనే ఆదర్శ రైతుకి ఒక చోట 2 ఎకరాల భూమి ఉంది. జగనన్న సమగ్ర భూ సర్వేలో .. 20 సెంట్ల భూమి తక్కువ వచ్చినట్లు చూపారు. అయితే రికార్డ్ ప్రకారం 2 ఎకరాలు, కొలత ప్రకారం కూడా 2 ఎకరాలు ఉంది. ‘’ గతంలో తక్కువ చూపిన   సర్వేయర్లు, రెవిన్యూ సిబ్బంది.. ఇపుడు సరిచేయడానికి ఇష్టపడటంలేదు.. ఎన్ని దరఖాస్తులు చేసినా పట్టించుకోవడంలేదు. నాకు దీనిపై అవగాహన ఉంది కాబట్టి పట్టువదలకుండా ప్రయత్నం చేస్తున్నాను. సాధిస్తాను. చిన్న రైతులు, అవగాహళనలేని వాళ్ళ సంగతి ఏమిటి? నాకు తెలిసి 50 సెంట్ల  భూమి ఉన్న ఓ చిన్న రైతు భూమిలో.. సర్వే తప్పుల వల్ల.. 23 సెంట్ల భూమి తక్కువ చూపుతున్నారు. ఇలాంటివి సరిచేయకపోతే ప్రభుత్వాలు ఎందుకు? పాలన ఎందుకు?’’ అని శివ రామ కృష్ణ ప్రశ్నిస్తున్నారు. 

‘’ భూ సమస్యలు, సర్వే తప్పులు సరి చేయడానికి.. ప్రభుత్వం ప్రత్యేకమైన ఆన్ లైన్ విధానం పెట్టాలి. 100 పదాలతో వారికి ఉన్న సమస్యపై యాప్ లో  నమోదు చేసుకునే ఛాన్స్ కల్పించాలి. లేదా వాట్సాప్ వంటి ఫ్లాట్ ఫామ్స్ ద్వారా.. ఫిర్యాదులు స్వీకరించి..  పరిష్కారం కోసం అధికారులకు డెడ్ లైన్ విధించాలి. టక్నాలజీ.. టెక్నాలజీ అని చంద్రబాబు ప్రచారం చేసుకోవడమే కాదు.. ఇలాంటి వాటికీ టెక్నాలజీ వాడాలి..’’ అని రైతు శివరాం ప్రసాద్.. 

 ‘అభి న్యూస్ “ ప్రతినిధితో  తో మాట్లాడుతూ ప్రభుత్వానికి సూచన చేసారు. 

‘’ సమగ్ర భూ సర్వేలో 1.80 ఎకరాల భూమిలో 20 సెంట్ల భూమి తక్కువ చూపి.. 1.60 ఎకరాలు మాత్రమే ఉందని సర్వేయర్ రికార్డ్ చేశారు. దీనిపై అధరాలు ఇచ్చినా సరిదిద్దలేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం, RTI ద్వారా ప్రశ్నించడం., ఇలా మూడు, నాలుగు నెలలు రెవిన్యూ, సర్వే అధికారులకు ఫిర్యాదులపై, ఫిర్యాదులు చేసిన తర్వాత నా సమస్య పరిష్కారం అయింది..వేలమంది రైతులు ఈ భూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. సర్కార్ దీనిపై ద్రుష్టి సారించి.. త్వరగా పరిష్కారం చూపాలి..’’ అని కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన రైతు ఉండవల్లి నాగేంద్ర ‘’అభిన్యూస్ ‘ ప్రతినిధికి  తన సమస్య చెప్పారు.      

‘’ అధికారం చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా,, గత ప్రభుత్వం చేసిన తప్పులను దెప్పుతూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప సరిదిద్దడంలో చంద్రబాబు సర్కార్  విఫలమవుతుంది.  సమస్యను పదే పదే ఫోకస్ చేస్తున్న కూటమి నేతలు.. పరిష్కారం దిశగా ప్రయత్ని0చి.. రైతుల సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి.. గత పాలకులు తప్పులు చేశారనే వారిని సాగనంపి మిమ్మల్ని గద్దె నెక్కించారు. మీరూ అలాగే చేస్తే.. వారి పరిస్థితే మీకూ ఎదురవుతుంది.. ‘’ అని నెల్లూరు జిల్లా కావలి కి చెందిన రైతు నాయకుడు పి. ఎస్ కె కన్నారావు ‘ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు.  

రాష్ట్రంలోని మొత్తం 16 వేల గ్రామాలకు గాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భూ సమగ్ర సర్వే కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి దాదాపు 7 వేల గ్రామాల్లో హడావుడిగా పూర్తి చేసింది. అయితే క్షేత్ర స్థాయి అధికారులు రైతులు, భూ యజమానులు ఫిర్యాదులతో తమ వద్దకు వెళ్లినా సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. అనేక గ్రామాల రైతులు తమ భూమి సరిహద్దులు మార్చారని లేదా అసలు పత్రాల్లో పేర్కొన్న భూమి విస్తీర్ణం మార్చారని ఫిర్యాదులు చేస్తున్నారు. 

 భూమి రిజిస్టర్లలో తప్పుగా నమోదు చేయడం చాలా చోట్ల సమస్యలను సృష్టించింది. కొన్ని సందర్భాల్లో మరణించిన వ్యక్తుల పేర్లను కూడా చేర్చారు. 

  టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరిన్ని చిక్కులు తలెత్తకుండా భూ సర్వే కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని భావించింది. అయినప్పటికీ, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రన్‌సైటన్ ప్రోగ్రామ్ (డిఐఎల్‌ఆర్‌ఎంపి)లో భాగంగా ఉన్నందున ఈ కార్యక్రమాన్ని అదనపు జాగ్రత్తల తో కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. “భూ యజమానుల హక్కుల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే గత పాలనలో దాదాపు 21 లక్షల భూ రికార్డులు పంపిణీ చేయబడ్డాయి. ‘’దాదాపు 25-30% రికార్డులలో తప్పు నమోదులు జరిగాయని మేము అంచనా వేస్తున్నాము” అని సీనియర్ రెవిన్యూ  అధికారి ఒకరు ‘అభి న్యూస్ ‘ కు  తెలిపారు.

కొందరు సర్వేయర్లు ఎటువంటి సర్వే చేయకుండా నోటిస్,హాజరు,అంగీకార పత్రాలు పై సంతకాలు తీసుకొంటున్నారని .. ఇలా రైతు సమస్య పరిష్కారం కాకుండా అంగీకార పత్రంపై సంతకం చేస్తే.. ఆ సమస్య పరిష్కరించినట్లు నమోదవుతుందని.. ఇలా చేయవద్దని రైతు నాగేంద్ర .. తోటి రైతులకు సూచిస్తున్నారు. 

– కొందరు సర్వేయలు కొన్ని చోట్ల డాక్యుమెంట్స్,భూమి ఉన్న సరే , గవర్నమెంట్ రికార్డ్స్ లో వాటిని మాయం చేసి ఎటువంటి LPM NO ఇవ్వకుండా పక్క రైతులతో ఏదో విదముగా కలిసి వాటిని వారి డాక్యుమెంట్ లో చూపి0చారు. 

 – ఒక పూరా సర్వే లో ఒకరికి తక్కువ , ఎక్కువ ఉంటే సర్వేయర్లు ఎక్కువ ఉన్న వారి వద్ద నుండి సమ్మతి లెటర్ తెచ్చుకోండి అంటున్నారు. —- ఇది చాలా తప్పు. తక్కువ ఎక్కువ లు సరి చేయాలిసిన బాద్యత వారిదే.

  • ఇక సర్వేయర్లు , అధికార్లు వైపు నుంచి ఆలోచిస్తే..   వారికి ప్రభుత్వం నుండి  ఒత్తిడి ఉంది, తొందరగా పూర్తి చేయాలి అని, అందువల్ల ఆ ఒత్తిడితో హడావుడిగా పనిచేయాల్స వస్తుంది. 
  • రాష్ట్రమంతా ఒకేసారి సర్వే పూర్తి చేయాలంటే అయ్యే పనికాదు. అంచలంచెలుగా ఇది చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.