by Srinivas Vedulla | Apr 8, 2025 | జనరల్
లోతైన గోతిలోకి . . పెద్ద యంత్రాన్ని దించే పనిలో రైతు ఉపాయం గ్రేట్ … ముప్పయ్ – నలభై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది కధ లాంటి నిజం . . 2 నిముషాలు కేటాయించి చదవండి..
కేరళ రాష్ట్రంలో అలెప్పి సమీపంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు . ఆ ప్లాంట్ కనస్ట్రక్షన్ సమయంలో ఒక పెద్ద సమస్య తలెత్తింది . . ఫ్యాక్టరీలో లోతైన గొయ్యి తవ్వారు. ఆ గొయ్యిలో ఒక భారీ యంత్రం పెట్టాలి. కానీ ఆ యంత్రం చాలా బరువుగా ఉండడం వల్ల దాన్ని లోపల పెట్టడం కష్టంగా మారింది.
యంత్రం సైట్కి తీసుకొచ్చారు. కానీ 30 అడుగుల లోతైన గుంతలో దించడం ఎలా అన్నది పెద్ద తలనొప్పిగా మారింది!
యంత్రాన్ని సరిగ్గా ఉంచకపోతే, ఫౌండేషన్కి మరియు యంత్రానికీ నష్టం కలుగుతుంది.
అప్పుడు (1980-85 మధ్య కాలంలో ) పెద్ద బరువులు ఎత్తగలిగే క్రేన్లు అంతగా అందుబాటులో లేవు. కొన్ని క్రేన్లు ఉండవచ్చు, కానీ అవి ఆ లోతు వరకు దించలేవు. దించినా సేఫ్ గా దించడం సాధ్యం కాదని ఇంజినీర్లు చేతులెత్తేశారు.
చివరికి ఆ కంపెనీ ఇంజినీర్లు , ఇతర నిపుణులు తాము చేయలేమని తేల్చేసి, ఈ సమస్యకి ఎవరు పరిష్కారం చూపుతారో తెలుసుకోడానికి టెండర్ పిలిచారు . చాలా మందే తమ తమ ఐడియాలు పంపారు. ఎక్కువమంది క్రేన్ వాడే ఆలోచనతోనే వచ్చారు.
వాళ్లు 10 నుంచి 15 లక్షల వరకు టెండర్ కోడ్ చేశారు.
అయితే, ఆ ఊరికి సమీపంలో ఉండే ఒక రైతు వచ్చి కంపెనీ ఇంజినీర్లను అడిగాడు:
“ఈ మెషిన్ నీటిలో తడిసితే ఏమైనా సమస్య ఉంటుందా?”
కంపెనీ ఇంజినీర్లు : “ఏమీ సమస్య లేదు.”
అయితే ఆ రైతు కూడా టెండర్ వేసాడు. కానీ అతడు కేవలం 5 లక్షలకె పని పూర్తిచేస్తామని కోడ్ చేసాడు . అందుకే ఆ పని అతనికే అప్పగించారు.
అయితే ఆశ్చర్యంగా, అతను తన ప్లాన్ చెప్పలేదు. “నా దగ్గర ఈ పని చేయగలిగే టీమ్ ఉంది, నేను పనిని పూర్తి చేస్తాను” అని మాత్రమే అని వెళ్ళిపోయి . . మరుసటి రోజు వచ్చాడు .
రాగానే కంపెనీ ఉద్యోగులు, మేనేజర్లు, బాస్ అందరూ ఆ పని ఎలా చేస్తాడో చూడడానికి ఉత్కంఠగా ఎదురుచూశారు.
సైట్కి ఎటువంటి ప్రిపరేషన్ కనిపించలేదు. కానీ నిర్ణయించిన సమయానికి చాలా ట్రక్కులు వచ్చాయి. ఆ ట్రక్కులన్నీ మంచు పలకలతో నిండినవి. ఆ మంచు బ్లాక్లను గుంతలో వేసారు.
ఆ తరువాత యంత్రాన్ని తీసుకొచ్చి, మంచు బ్లాక్ల మీద పెట్టారు.
తరువాత మినీ వాటర్ పంప్ ద్వారా గుంత నుంచి నీటిని బయటకి పంపారు. మంచు కరిగిపోయింది, నీరు తిసే కొద్దీ యంత్రం క్రిందకి దిగింది.
4-5 గంటల్లోనే పని పూర్తయ్యింది. మొత్తం ఖర్చు లక్ష రూపాయల లోపే అయ్యింది.
యంత్రం సరిగ్గా స్థిరంగా అమరింది. ఆ వ్యక్తికి నాలుగు లక్షల పైన లాభం వచ్చింది!
ఇది చూస్తే తెలుసుతుంది – వ్యాపారం అయినా , వ్యవహారం అయినా తెలివిగా , సులువుగా చేయడానికి చదువు ఒక్కటే సరిపోదు . అనుభవం , సమయస్ఫూర్తి , సందర్భానుసారం.. వ్యవహార జ్జ్ఞానం ముఖ్యమని . . .
సమస్యలకు సింపుల్ సొల్యూషన్ కనుగొనడం ఒక కళ. అది మన తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది.
ఆ మనిషి తన ఆచరణాత్మక జ్ఞానంతో పెద్ద సమస్యకు సులభమైన పరిష్కారం చూపించి . . ఇంజినీర్లను సైతం నోటిమీద వేలువేసుకునేలా చేసాడు. పదిమందితో శబాష్ అనిపించుకున్నాడు .
by Srinivas Vedulla | Apr 8, 2025 | క్రీడలు
IPL హిస్టరీలో తొలి కెప్టెన్గా రికార్డు! – RAJAT PATIDAR 2025 IPL
ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఆర్సీబీ 2025 ఐపీఎల్ సీజన్ని అద్భుతంగా స్టార్ట్ చేసింది. ఆరు పాయింట్లతో టేబుల్లో మూడో ప్లేస్లో ఉంది. అనేక సంవత్సరాలుగా కొంతమంది స్టార్ ప్లేయర్లపైనే అతిగా ఆధారపడిన ఆర్సీబీ ఇప్పుడు బ్యాలెన్స్డ్గా కనిపిస్తోంది. బలమైన జట్టును నిర్మించి, టీమ్ని అద్భుతంగా నడిపిస్తున్న కెప్టెన్ రజత్ పటీదార్కే ఈ క్రెడిట్ దక్కుతుందని క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్సీబీ ప్రస్తుత సీజన్ ప్రారంభంలో గ్రాండ్ విక్టరీలు అందుకుంది. టాప్ టీమ్లు కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ ని హోమ్ గ్రౌండ్లో ఓడించింది. వరుసగా ఈడెన్ గార్డెన్స్, చెపాక్ వాంఖడేలో అద్భుత విజయాలు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో మరే ఇతర కెప్టెన్ కూడా ఒకే సీజన్లో ఇలా చేయలేక పోయాడు. అరుదైన ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా పటీదార్ నిలిచాడు.అలానే ఓ అరుదైన రికార్డును పటీదార్ సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్లో ఒకే సీజన్లో రెండు జట్లు మాత్రమే తమ సొంత స్టేడియంలలో KKR, CSK, MIలను ఓడించాయి. మొదట పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ XI పంజాబ్ ) 2012లో ఈ ఘనత అందుకుంది. అయితే ఆ జట్టు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు ఆడమ్ గిల్క్రిస్ట్, డేవిడ్ హస్సీ నేతృత్వంలో ఓడించింది. తాజాగా ముంబయిపై ఆర్సీబీ వాంఖడేలో గెలవడంతో అరుదైన రికార్డు అందుకున్న ఏకైక కెప్టెన్గా పటీదార్ నిలిచాడు. ఇది తమకెంతో గర్వకారణంగా ఉందని జట్టులో ఉన్న ఇతర ఆటగాళ్లు హ్యాపీగా చెపుతున్నారు.
by Srinivas Vedulla | Apr 8, 2025 | ఆరోగ్యం
స్టూడెంట్స్ ఊబకాయం..పొంచి ఉన్న ఫ్యాటీ లివర్ ప్రమాదం
నలుగురు కళాశాల విద్యార్థులలో ఒకరు ఊబకాయం, ఐదుగురిలో ఒకరు ప్రీ-హైపర్టెన్సివ్: ‘అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక’
భారతదేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. 257,199 మంది స్క్రీనింగ్ చేయబడిన వ్యక్తులలో 65% మంది దీని బారిన పడ్డారు. ముఖ్యంగా, వారిలో 85% మంది ఎప్పుడూ మద్యం సేవించలేదు, దీనిని జీవక్రియ సమస్యగా వైద్య నిపుణులు హైలైట్ చేస్తున్నారు.
అపోలో నివేదిక ఏమి చెపుతుంది?: అపోలో హాస్పిటల్స్ ఇటీవల జరిపిన పరిశోధన ఫలితాలు.. నివేదిక ప్రకారం, నలుగురు భారతీయ కళాశాల విద్యార్థులలో ఒకరు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు అధిక రక్తపోటు యొక్క ప్రారంభ సంకేతాలను కలిగి ఉంటున్నారు. 2.5 మిలియన్ల మందిపై నిర్వహించిన స్క్రీనింగ్ల ఆధారంగా, “హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025” నివేదిక, రక్తపోటు మరియు మధుమేహం వంటి పెరుగుతున్న ఆరోగ్య సమస్యల తీవ్రతను తెలియచేస్తోంది.
.ఏప్రిల్ 7న ప్రారంభించబడిన ‘’హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక’’, అపోలో ఆసుపత్రులు, క్లినిక్లు మరియు వెల్నెస్ సెంటర్లలో 2.5 మిలియన్లకు పైగా ప్రజల ఆరోగ్య పరీక్షల ఆధారంగా రూపొందించబడింది.
పరీక్షించబడిన విద్యార్థులలో, 28 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్లు ఈ నివేదిక తేటతెల్లం చేస్తోంది. అయితే 19 శాతం మంది ప్రీ-హైపర్టెన్సివ్గా ఉన్నారు – అంటే వారి రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రమాద స్థాయికి దగ్గరలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అన్ని వయసులవారిలో, 26 శాతం మంది ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని మరియు 23 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారని, ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా, నివేదిక వెల్లడిస్తుంది. .
ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి లక్షణాలపై ఆధారపడటం ఇకపై సరిపోదని అపోలో నివేదిక సూచిస్తోంది. ఇది యువకులు మరియు పెద్దలు ఇద్దరూ క్రమం తప్పకుండా నివారణ ఆరోగ్య తనిఖీలు చేయించుకోవడానికి సంకేతాలు ఇచ్చినట్లవుతుంది.
ఈ నివేదిక నేడు భారతదేశంలో మూడు ప్రధాన ఆరోగ్య సవాళ్లను కూడా హైలైట్ చేస్తుంది: కొవ్వు కాలేయ వ్యాధి, రుతుక్రమం ఆగిపోయిన తర్వాత ఆరోగ్య క్షీణత మరియు బాల్య ఊబకాయం, ప్రారంభ జీవనశైలి మార్పులు మరియు వ్యక్తిగతీకరించిన సంరక్షణ కోసం పిలుపునిచ్చింది.
ఈ సందర్బంగా అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి ఒక ప్రకటనలో ఊబకాయులు తీసుకోవాల్సిన ఆరోగ్య చర్యలపై వివరించారు. “ప్రతి ఇంటి గుండెలో ఆరోగ్యాన్ని ఉంచడం ద్వారా భారతదేశం ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాలను సృష్టించే అవకాశాన్ని పొందాలి. నివారణ ఆరోగ్య సంరక్షణ ఇకపై భవిష్యత్ ఆశయం కాదు – ఇది నేటి దేశ శ్రేయస్సుకు మూలస్తంభం. ముందస్తుగా చర్య తీసుకోవడం, లోతుగా పరీక్షించడం మరియు ప్రతి పౌరుడికి జ్ఞానం మరియు ప్రాప్యతతో సాధికారత కల్పించడం అనే మన సమిష్టి బాధ్యతను ఈ నివేదిక ధృవీకరిస్తుంది. ప్రతి విద్యా పాఠ్యాంశాలు, కార్పొరేట్ ప్రయోజనాలు మరియు కుటుంబ దినచర్యలలో నివారణ సంరక్షణను ఏకీకృతం చేయాల్సిన సమయం ఇది. అప్పుడే మనం అనారోగ్యానికి చికిత్స చేయడం నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వైపు మళ్లగలం మరియు రాబోయే తరాలకు స్థితిస్థాపకంగా, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్ధారించగలం.” అని రెడ్డి స్పష్టం చేశారు.
ఫ్యాటీ లివర్: ఎ న్యూ మెటబాలిక్ అలార0
నివేదిక ప్రకారం, ఫ్యాటీ లివర్ వ్యాధి భారతదేశం యొక్క అతిపెద్ద నిశ్శబ్ద ముప్పులలో ఒకటిగా మారుతోంది. పరీక్షించబడిన 257,199 మందిలో 65 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉన్నట్లు కనుగొనబడింది మరియు వారిలో 85 శాతం మంది ఎప్పుడూ మద్యం సేవించలేదు—ఇది కేవలం కాలేయ సమస్య కాదు, పూర్తి స్థాయి జీవక్రియ సమస్య అని నిరూపిస్తోంది.
ఆశ్చర్యకరంగా, ప్రభావితమైన వారిలో సగానికి పైగా సాధారణ రక్త పరీక్షలు చేయించుకున్నారు, సాంప్రదాయ స్క్రీనింగ్ మాత్రమే తరచుగా దాచిన ప్రమాదాలను కోల్పోతుందని చూపిస్తుంది.
“పరీక్షించబడిన వారిలో 66 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు – వారిలో 85 శాతం మంది ఆల్కహాల్ లేనివారు – ఇది కొత్త రోగ నిర్ధారణలు మరియు స్థాయిలో ముందస్తు గుర్తింపు కోసం ఆవశ్యకతను సూచిస్తుంది. సాంప్రదాయ స్క్రీనింగ్ ఇకపై సరిపోదు. అపోలో యొక్క ప్రోహెల్త్ కార్యక్రమం వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని నియంత్రించుకోవడానికి అధికారం ఇవ్వడం మాత్రమే కాదు; ఇది స్కేలబుల్ మరియు ప్రిడిక్టివ్ హెల్త్కేర్కు పునాది వేస్తోంది. నివారణ భారతదేశం యొక్క అత్యంత స్కేలబుల్ హెల్త్కేర్ పరిష్కారం, మరియు అపోలో యొక్క లక్ష్యం నివారణ ఆరోగ్యాన్ని ప్రజాస్వామ్యీకరించడం, ”అని అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి చెపుతున్నారు.
నిద్ర రుగ్మతలు: నలుగురిలో ఒకరు OSA ప్రమాదంలో ఉన్నారు
నిద్ర ఆరోగ్యంలో కూడా ఆందోళనకరమైన ధోరణి ఉద్భవించింది. పరీక్షించబడిన 53,000 మందిలో, 24 శాతం మందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) ప్రమాదం ఎక్కువగా ఉంది – ఇది ఊబకాయం మరియు గుండె జబ్బులతో దగ్గరి సంబంధం ఉన్న నిద్ర రుగ్మతగా రుజువయింది. .
33 శాతం మంది పురుషులు మరియు 10 శాతం మంది మహిళలు అధిక ప్రమాదం ఉన్నట్లు కనుగొనబడింది, 55 సంవత్సరాల తర్వాత ప్రాబల్యం పెరుగుతుంది. OSA తరచుగా నిర్ధారణ చేయబడదు, ఒత్తిడి లేదా అలసటగా తప్పుగా భావించబడుతుంది.
40 ఏళ్లలోపు వారిలో కూడా, దాదాపు సగం మంది పురుషులు మరియు మూడింట ఒక వంతు మంది స్త్రీలు విటమిన్ B12 లోపంతో బాధపడుతున్నారు – ఇది శక్తి, జ్ఞానం మరియు జీవక్రియను ప్రభావితం చేసే సమస్యగా పరిశోధకులు సెలవిస్తున్నారు.
సూక్ష్మపోషక అంతరాలు విస్తృతంగా ఉన్నాయి. 77 శాతం మంది మహిళలు మరియు 82 శాతం మంది పురుషులు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు, అయితే విటమిన్ B12 లోపం 38 శాతం మంది పురుషులు మరియు 27 శాతం మంది స్త్రీలను ప్రభావితం చేసింది
by Srinivas Vedulla | Apr 8, 2025 | ఆంధ్రప్రదేశ్
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అరకు, పరిసర గురుకుల పాఠశాల విద్యార్థులు అరుదైన ప్రపంచ రికార్డు సాధించారు . ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఒకేసారి 21,850 మంది గిరిజన బాలబాలికలు 108 సూర్య నమస్కార ఆసనాలతో చరిత్ర సృష్టించారు. రాజమండ్రికి చెందిన ప్రముఖ యోగ గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరి జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ ప్రదర్శన ఈ వరల్డ్ రికార్డ్ కి వేదికయింది . లండన్ నుంచి వచ్చిన ప్రపంచ రికార్డు యూనియన్ మేనేజర్ అలీస్ రేనాడ్ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రపంచ రికార్డుగా నమోదు చేశారు. రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ దినేశ్కుమార్కు అందజేశారు. యోగ గురువు పతంజలి శ్రీనివాస్ . .. గిరిజన విద్యార్థులకు దశాబ్ద కాలంగా యోగలో శిక్షణ ఇస్తున్నారు. శ్రీనివాస్ నిస్వార్ధ సేవలకు గాను కలెక్టర్ . . దినేష్ ఎక్కడికి బదిలీ అయినా . . ఆయా ప్రాంతాలలో గిరిజనులకు శ్రీనివాస్ సేవలు వినియోగిస్తున్నారు .
by Srinivas Vedulla | Apr 8, 2025 | సినిమా
ఇమేజ్ కోసమా ? అప్పటి కామెడీని కంటిన్యూ చేయడంపై భయమా ?
టాలీవుడ్ లో ఏ కేరెక్టర్ అయినా ఇట్టే ఒదిగిపోగల నటుడు జూనియర్ ఎన్టీఆర్ . తాను పోషించిన పాత్రకు 100 శాతం న్యాయం చేయగల అరుదైన నటులలో ముందువరసలో ఉంటారు తారక్. అయినా అదుర్స్ సీక్వల్ ఎందుకు చేయనంటున్నారు ఈ యాక్టర్.
”అన్ని కేరెక్టర్ లలోకి కామెడీ చేయడమే కష్టం. అందునా అదుర్స్ లో చేసిన కామెడీ ఇప్పుడు చేయాలంటే నాకు భయంగానే ఉంది. మళ్ళీ ఆ టెంపో వస్తుందో లేదో అన్న ఆందోళన ఉంది . అందుకే అదుర్స్ – 2 చేయనని చెపుతున్నాను . చేయనంటే .. ఇప్పట్లో చేయనని చెపుతున్నాను . ..” అని ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో చెప్పుకొచ్చారు జూనియర్. ఔన్ మరి అతను చెప్పింది నిజమే . .. అప్పట్లో అదుర్స్ లో ఎన్టీఆర్ , బ్రహ్మనందం కాంబినేషన్ కూడా అంతలా అదిరింది. ఒక విధంగా చెప్పాలంటే జూనియర్ అప్పట్లోనే ప్రయోగం చేశారనే చెప్పాలి . అంతకు ముందు సింహాద్రి వంటి వయొలెన్స్ సినిమాలు చేసి . .. సడన్ గా పూర్తీ స్థాయి హాస్య ప్రధాన పాత్ర చేయడం సాహసమే . అందునా తెలుగులో ఇలాంటి ప్రయోగాలు పొరపాటున వికటిస్తే ఇక సదరు ప్రయోగం చేసిన నటుడి కెరీర్ దాదాపు క్లోస్ అనే చెప్పాల్సి ఉంటుంది . ఆంత సాహసం చేసినందుకే జూనియర్ కి ఇప్పటికీ అదుర్స్ ఒక మైలురాయిలా మిగిలిపోయింది .
by Srinivas Vedulla | Apr 7, 2025 | బిజినెస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కుప్పకూలిపోయాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించడంతో, చైనా కూడా రివెండ్ టారిఫ్స్తో ఎదురుదాడి చేసింది. దీనితో వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా మదుపరుల సంపద సోమవారం మార్కెట్ ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలోనే .. ఏకంగా రూ.20 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
- ఈ సెషన్స్ లో టాటా మోటార్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. వాస్తవానికి అమెరికాలోకి దిగుమతి అయ్యే ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించిన రోజే ఈ కంపెనీ షేర్లు కుదేలయ్యాయి . ఈ నేపథ్యంలోనే టాటా మోటార్స్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమెరికాకు ఎగుమతులను నిలిపివేసిందన్న వార్తలు రావడంతో టాటా మోటార్స్ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం మేర క్షీణించి రూ.552 వద్ద లోయర్ సర్క్యూట్ను తాకాయి.
- టాటాలకు చెందిన రిటైల్ సంస్థ ట్రెంట్ షేర్లు కూడా నేడు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 19.2 శాతం పతనమై రూ.4,491 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. 2020 మార్చి తర్వాత కంపెనీ షేర్లు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
- అలాగే టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ట్రెంట్ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడి కారణంగా, మొత్తంగా రూ.1.28 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 2,226 పాయింట్లు నష్టపోయి 73,137 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 742 పాయింట్లు కోల్పోయి 22,161 వద్ద ముగిసింది. ఇంత దారుణమైన పతనంలోనూ కొన్ని షేర్స్ లాభపడ్డాయి .
- లాభపడిన షేర్లు : హిందూస్థాన్ యూనిలివర్
- నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఎస్బీఐ, సన్ఫార్మా, టైటాన్, టీసీఎస్.
-
- కేంద్రం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని ఒక్కొక్కటి రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం భారతదేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీల (OMCలు) షేర్ ధరలలో గణనీయమైన తగ్గుదలకు దారితీసింది. కీలకమైన OMCలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL), దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ మార్కెటింగ్, పంపిణీకి ప్రధాన భూమిక వహిస్తాయి. ఈ ప్రకటన తర్వాత, ఆయా ఆయిల్ కంపెనీల స్టాక్ ధరలు భారీగా తగ్గాయి
- ఏయే కంపెనీలు ఏ మేరకు తగ్గాయి:
- BPCL: 6.24% తగ్గాయి
- HPCL: 4.31% తగ్గాయి
- IOC: 5.99% తగ్గాయి
by Srinivas Vedulla | Apr 7, 2025 | ఆరోగ్యం
డీప్ ఫ్రై చేసిన ఆహారాలు అంటే విపరీతమైన ఇష్టమా? అయితే మీ హెల్త్ డేంజర్ లో ఉన్నట్లే
బాగా ఫ్రై చేసిన కొన్ని పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు సాధారణం కంటే రెట్టింపు ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని పదార్థాలను ఎక్కువగా ఫ్రై చేసి తీసుకోకూడదని వివరిస్తున్నారు శాస్త్రవేత్త లు .
చికెన్ : చికెన్ , మీట్ ( మాంసాన్ని )ఎక్కువ సేపు ఫ్రై చేయడం వల్ల అందులో క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు సెలవిస్తున్నారు . ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాంసాన్ని వండినప్పుడు, హెటెరోసైక్లిక్ అమైన్స్ (HCAs), పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) అనే రసాయనాలు ఏర్పడతాయని అంటున్నారు. ఈ రసాయనాలు DNA ను దెబ్బతీసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి . ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేయించడం వల్ల క్యాన్సర్కు కారకమయ్యే కార్సినోజెన్స్ అనే రసాయానాలు ఉత్పత్తి అవుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాంసాన్ని కుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు .
ఆలూ చిప్స్ : బంగాళదుంపలు : ఇటీవల కాలంలో యూత్ చిప్స్ అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు . వీరిని చూసి చిన్నారులు కూడా చిప్స్ పై మోజు పెంచుకుంటున్నారు . సైడ్ డిష్గా, స్నాక్స్గా వీటిని తింటుంటారు. అయితే, బంగాళ దుంపలను చాలా సేపు అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెలో వేయించడం వల్ల హానీకారక అక్రిలైమైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని, ఫలితంగా క్యాన్సర్కు దారితీస్తుందని తెలుపుతున్నారు. అందుకే చిప్స్ కాకుండా వీటిని ఉడకబెట్టడం లేదా బేక్ చేసుకుని తినాలని సూచిస్తున్నారు.
బ్రెడ్ : చాలా మంది బ్రెడ్తో ఆమ్లెట్, టోస్ట్ లాంటి రకరకాల వంటకాలు ఇష్టపడుతుంటారు . బ్రేడ్ ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయడం వల్ల క్యాన్సర్ కారక అక్రిలైమైడ్ ఉత్పత్తి అవుతుందని చెపుతున్నారు . అందుకే మరీ ఎక్కువగా కాకుండా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కాల్చుకోవాలని లేదా బేక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
సూచన : అభి న్యూస్ అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసమే . శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని ఇచ్చాము . అభి న్యూస్ హెల్త్ శీర్షికను ఫాలో అయ్యే వారు తమ సొంత వైద్యులు , డైటీషియన్స్ సలహా ప్రకారం ఆహారపు అలవాట్లలో మార్పులు, చేర్పులు చేసుకోవాలని మనవి .
by Srinivas Vedulla | Apr 7, 2025 | ఆరోగ్యం, పరిశీలన
ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ఒక్క చూయింగ్ గమ్ ముక్క వందల నుండి వేల వరకు మైక్రోప్లాస్టిక్ కణాలను లాలాజలంలోకి విడుదల చేస్తుంది, ఇది నమలడం వల్ల కలిగే ప్రమాదాన్ని మరియు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలను తెలుసుకోండి.
చూయింగ్ గమ్ నమిలి . . దానిని బుడగలా ఊది.. సరదా పడటం మనందరికీ తెలిసిన విద్య . . అయితే ఇక అలాంటివాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది .
UCLA నుండి వచ్చిన తాజా అధ్యయనం ప్రకారం.., ”చూయింగ్ గమ్ మైక్రోప్లాస్టిక్లకు ఊహించని మూలం కావచ్చు. ఒకే ముక్క లాలాజలంలోకి 3,000 ప్లాస్టిక్ కణాలను విడుదల చేయగలదు . . ” అని ఇటీవల పరిశోధకులు కనుగొన్నారు, సింథటిక్ మరియు సహజ చిగుళ్ళు రెండూ ఒకే విధమైన ఫలితాలను చూపుతాయి. ఆరోగ్య ప్రభావం ఇంకా అస్పష్టంగా ఉంది, దీనిపై మరింత లోతైన పరిశోధన చేస్తే మరిన్ని ప్రమాదకర పరిణామాలు వెలుగులోకి వస్తాయని చెపుతున్నారు .
ఆధునిక జీవితంలో ప్లాస్టిక్ ఒక అనివార్యమైన భాగంగా మారింది, గృహోపకరణాల నుండి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వరకు ప్రతిదానిలోనూ ఇది కనిపిస్తుంది.కటింగ్ బోర్డులు, సింథటిక్ దుస్తులు మరియు శుభ్రపరిచే స్పాంజ్లు వంటి రోజువారీ వస్తువులు మైక్రోప్లాస్టిక్లు అని పిలువబడే సూక్ష్మ ప్లాస్టిక్ ముక్కలను విసర్జిస్తాయి, ఇవి పీల్చడం, తినడం లేదా చర్మాన్ని తాకడం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించగలవు.
ఇప్పుడు, పరిశోధకులు మైక్రోప్లాస్టిక్ ఎక్స్పోజర్కు మరొక ఊహించని మూలాన్ని గుర్తించారు – అదే చూయింగ్ గమ్.
“మా లక్ష్యం ఎవరినీ భయపెట్టడం కాదు” అని లాస్ ఏంజిల్స్ (UCLA)లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రాజెక్ట్ యొక్క ప్రధాన పరిశోధకుడు మరియు ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సంజయ్ మొహంతి తన పరిశోధన ఫలితాలను వివరిస్తూ ఒక ప్రకటనలో తెలిపారు.
చూయింగ్ గమ్లు రబ్బరు బేస్, స్వీటెనర్లు, సువాసనలు మరియు ఇతర పదార్థాలతో కూడి ఉంటాయి. సహజ గమ్ ఉత్పత్తులు సరైన నమలడం సాధించడానికి చికిల్ లేదా ఇతర చెట్టు రసం వంటి మొక్కల ఆధారిత పాలిమర్ను ఉపయోగిస్తాయి, అయితే మరికొన్ని పెట్రోలియం ఆధారిత పాలిమర్లతో తయారు చేయబడిన సింథటిక్ రబ్బరు బేస్లపై ఆధారపడతాయి.
సింథటిక్ గమ్లలో బేస్ ఒక రకమైన ప్లాస్టిక్ కాబట్టి వాటిలో చాలా ఎక్కువ మైక్రోప్లాస్టిక్లు ఉంటాయని మా ప్రారంభ పరికల్పన,” అని UCLAలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్గా ప్రాజెక్ట్ను ప్రారంభించి పరిశోధనను సమర్పించిన లోవ్ అన్నారు.
గమ్ దేనితో తయారు చేయబడింది
ఆహారం, పానీయాలు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్, పూతలు మరియు తయారీ ప్రక్రియల ద్వారా మానవులు ప్రతి సంవత్సరం పదివేల మైక్రోప్లాస్టిక్లను – 1 మైక్రోమీటర్ నుండి 5 మిల్లీమీటర్ల వెడల్పు వరకు – వినియోగిస్తారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందినప్పటికీ, మైక్రోప్లాస్టిక్ల మూలంగా చూయింగ్ గమ్ను విస్తృతంగా అధ్యయనం చేయాల్సి ఉంది .
దీని ఫలితంగా మొహంతి మరియు తన ప్రయోగశాలలో గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన లిసా లోవ్ సహజ మరియు సింథటిక్ గమ్లను నమలడం ద్వారా ఒక వ్యక్తి ఎన్ని మైక్రోప్లాస్టిక్లను తీసుకోవచ్చో అన్వేషించడానికి దోహదపడింది .
చూయింగ్ మరియు లాలాజల పరీక్షలు
పరిశోధకులు ఐదు బ్రాండ్ల సింథటిక్ గమ్ మరియు ఐదు బ్రాండ్ల సహజ గమ్ను పరీక్షించారు, అన్నీ వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్నాయి. వ్యక్తిగత నమలడం అలవాట్లు మరియు లాలాజల కూర్పు కారణంగా వైవిధ్యాన్ని తగ్గించడానికి, వారు ప్రతి బ్రాండ్ నుండి ఏడు ముక్కలను ఒకే వ్యక్తి నమిలారు.
ప్రయోగశాల లోపల, ఈ వ్యక్తి ప్రతి ముక్కను 4 నిమిషాలు నమిలి, ప్రతి 30 సెకన్లకు లాలాజల నమూనాలను అందించాడు, తరువాత శుభ్రమైన నీటితో తుది మౌత్ వాష్ చేశాడు. వీటిని తర్వాత ఒకే నమూనాగా కలిపారు. ఒక ప్రత్యేక పరీక్షలో, మైక్రోప్లాస్టిక్ విడుదల రేటును ట్రాక్ చేయడానికి 20 నిమిషాల వ్యవధిలో లాలాజల నమూనాలను సేకరించారు.
ప్రతి నమూనాలో ఉన్న మైక్రోప్లాస్టిక్ల సంఖ్యను అప్పుడు కొలుస్తారు. ప్లాస్టిక్ కణాలను ఎరుపు రంగులో మరక చేసి సూక్ష్మదర్శిని కింద లెక్కించారు లేదా ఫోరియర్-ట్రాన్స్ఫార్మ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి విశ్లేషించారు, ఇది పాలిమర్ కూర్పును కూడా గుర్తించింది.
సగటున, లోవ్ ఒక గ్రాము గమ్కు 100 మైక్రోప్లాస్టిక్లను విడుదల చేసినట్లు నమోదు చేశారు, కొన్ని ముక్కలు గ్రాముకు 600 మైక్రోప్లాస్టిక్లను విడుదల చేశాయి. ఒక సాధారణ గమ్ ముక్క 2 మరియు 6 గ్రాముల మధ్య బరువు ఉంటుంది కాబట్టి, ఒక పెద్ద ముక్క 3,000 ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తుంది.
సగటు వ్యక్తి సంవత్సరానికి 160 నుండి 180 చిన్న గమ్ స్టిక్లను నమలడం ఊహిస్తే, ఇది ఏటా సుమారు 30,000 మైక్రోప్లాస్టిక్లను తీసుకోవడానికి దారితీస్తుందని అధ్యయనం అంచనా వేసింది. ప్రజలు ఇప్పటికే ప్రతి సంవత్సరం పదివేల మైక్రోప్లాస్టిక్లను వినియోగిస్తున్నందున, చూయింగ్ గమ్ ఆ సంఖ్యను గణనీయంగా పెంచుతుంది.
“ఆశ్చర్యకరంగా, సింథటిక్ మరియు సహజ చిగుళ్ళు రెండింటిలోనూ మనం నమిలినప్పుడు ఒకే రకమైన మైక్రోప్లాస్టిక్లు విడుదలయ్యాయి” అని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ లోవ్ చెప్పారు.
సారాంశం : చూయింగ్ గమ్ నమిలే అలవాటున్న వారు వెంటనే ఆపండి. మీ చిన్నారులను క్రమంగా దీనికి దూరం చేయండి. ఎందుకంటే వెంటనే బలవంతంగా చూయింగ్ గమ్ అలవాటు నుంచి వారిని దూరం చేయాలనీ ప్రయత్నిస్తే . . అందులో ఏదో ఉందన్న భ్రమలు వాళ్లలో నెలకొంటాయి . అందుకే దానిపట్ల వారికి ఏహ్య భావం కలిగేలా మీ టాలెంట్ ఉపయోగించి ప్రయత్నించండి . ఖచ్చితంగా అది నెరవేరుతుంది.
by Srinivas Vedulla | Apr 7, 2025 | తెలంగాణ
కంచ గచ్చిబౌలీలో 400 ఎకరాలలో అటవీ ప్రాంతాన్ని వేలం ద్వారా అమ్మకంపై నిరసనలు
హైదరాబాద్ లోని గుర్తింపు పొందిన గ్రీనరీ ప్రాంతమైన ‘కంచ గచ్చిబౌలి’లో 400 ఎకరాలను వేలం వేయడం ద్వారా పారిశ్రామిక కేంద్రంగా మార్చాలనుకుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే కనుమరుగవుతున్న పచ్చదనాన్ని మరింత నాశనం చేయడానికి రేవంత్ కంకణం కట్టుకున్నారా? అసలు ఏమి ఆలోచిస్తున్నాడు?
రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో పోగొట్టుకున్న తన ఇమేజ్ను తిరిగి తెచ్చుకునేందుకు మరియు తెలంగాణ ( తన) రాష్ట్రం అభివృద్ధి చెందడానికి విదేశాలలో ఉన్న వందలాది తెలంగాణ మూలాల విజయగాథలపై ఆధారపడవచ్చు, తన రాజధాని యొక్క ఆకుపచ్చ ఊపిరితిత్తులపై బుల్డోజర్లను నడపకుండానే ఈ పని చేయడం ద్వారా అందరి మన్ననలు పొందవచ్చని తెలుసుకుంటే మంచిది.
కాంగ్రెస్ ఎకో-పార్క్ ఆలోచనతో ముందుకు వెళితే, అది ప్రతిపక్ష BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావు (KTR) ఛాలెంజ్ విసిరాడు . అతను వివాదాస్పదమైన 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూమిని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి పొంది దానిని పర్యావరణ ఉద్యానవనంగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కెటిఆర్ ప్రతిజ్ఞ .. రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా కనిపిస్తోంది .
హైదరాబాద్ దాటి ఆలోచించడం
పట్టణీకరణ లక్ష్యంగా తెలంగాణ హైదరాబాద్ దాటి ఆలోచించాలి. ఒకప్పుడు హైదరాబాద్ను పాలించిన వ్యక్తి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ₹85,000 కోట్ల అంచనా వ్యయంతో అమరావతిలో కొత్త రాజధానిని నిర్మించడంలో బిజీగా ఉన్నారు,
వరంగల్ వంటి నగరాలను విస్తరించడం ద్వారా హైదరాబాద్ను రద్దీని తగ్గించడం ఇప్పటికే రాతి పీఠభూమిపై ఉన్న నగరంలోని పచ్చని ప్రాంతాలను పారిశ్రామికీకరించడం కంటే సముచితంగా అనిపిస్తుంది. తెలంగాణ మీదుగా ప్రవహించే గోదావరి నది వెంబడి ఉన్న పట్టణాలు, మంచిర్యాల, ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం భద్రాచలం వంటివి హైదరాబాద్కు కొత్త ప్రత్యామ్నాయాలను అందించవచ్చు. భవిష్యత్తులో నీటి అవసరాలకు వీటిని ముందస్తు ప్రణాళికలో భాగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరంపై నిపుణుల సూచనలు తీసుకోవాలి.
2023 మరియు 2024 మధ్య, నగరంలోని భూగర్భజల పట్టిక రెండు నుండి ఏడు మీటర్ల వరకు తగ్గిపోయిందని గత సంవత్సరం ఒక నివేదిక తెలిపింది.
హైదరాబాదీలు ఆలోచనలు మార్చుకుని , గతం మాదిరి ప్రవర్తించకుండా, కొత్తగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. పచ్చదనం కోసం ప్రయత్నించకపోగా ఉన్న గ్రీనరీని దెబ్బతీసుకోవడం భవిష్యత్ తరాలు క్షమించలేవు .
అమరావతి వంటి నగరం నిర్మించుకోవాలి: హైదరాబాద్ పై ఒత్తిడి పెరిగిపోతోంది . నగర విస్తరణతో గ్రీన్ బెల్ట్ నాశనం అయింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2035 నాటికి నివాసయోగ్యంకాని నగరాల జాబితాలో హైదరాబాద్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. వీటిని దృష్టిలో ఉంచుకుని అమరావతి వంటి గ్రీన్ ఫీల్డ్ నగర నిర్మాణంపై తెలంగాణ సర్కార్ , సీఎం రేవంత్ రెడ్డి ద్రుష్టి సారించాలి. లేకపోతె తెలంగాణ భవిష్యత్ తరాలు రేవంత్ , కాంగ్రెస్ పార్టీని తూర్పారబెట్టే దుస్థితి తలెత్తుతుంది.
by Srinivas Vedulla | Apr 6, 2025 | బిజినెస్
బిల్ గేట్స్ – పాల్ అలెన్ మైక్రోసాఫ్ట్ స్థాపించి 50 ఏళ్లయింది . ..
అల్లరి – చిల్లరగా తిరిగే వయసు. జీవితంలో సాధించాల్సిన లక్ష్యాల గురించి కూడా పెద్దగా ఫోకస్ పెట్టే మెచ్యూరిటీ కూడా కాని ఆ వయసులో ఇద్దరు స్నేహితులు ప్రారంభించిన చిన్న సంస్థ . .ఇపుడు ప్రపంచ స్థాయిలో దిగ్గజ కంపెనీగా ఎదిగింది.
1975 ఏప్రిల్ 4న ఇద్దరు స్నేహితులు ప్రారంభించిన సంస్థ . . .. ఎన్నో ఇబ్బందులు, మరెన్నో సవాళ్లను ఎదుర్కొని వాటిని గుణపాఠాలుగా మలచుకుని . . విజయవంతంగా ముందుకు దూసుకుపోతోంది . ఈ సందర్భంగా ఇద్దరు స్నేహితులు నిర్మించిన ఈ మైక్రోసాఫ్ట్ అప్రతిహత విజయదరహాసాన్ని ఒకసారి నెమరువేసుకుందాం . …
మైక్రోసాఫ్ట్ ప్రారంభం: ఇద్దరు చిన్ననాటి స్నేహితులు బిల్ గేట్స్, పాల్ అలెన్కు వచ్చిన ఒక చిన్న ఆలోచనతో ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ జన్మించింది . ప్రతి ఇంట్లో ఒక కంప్యూటర్ ఉండాలనేది అప్పట్లోనే ఈ ఇద్దరు స్నేహితుల కల . ఎందుకంటే ఆ సమయంలో కంప్యూటర్లు పెద్దవిగా ఉండటం, ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటిని వినియోగించడం క్లిష్టంగా ఉండేది.
వారి ఇరువురి పురోగతి MS-DOS (మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్) తో మొదలైంది. ఇది పర్సనల్ కంప్యూటింగ్కు పునాది వేసిన ప్రారంభ ఆపరేటింగ్ సిస్టమ్ (OS).
1975-1980: బిల్ గేట్స్, పాల్ అలెన్ అందరికీ పర్సనల్ కంప్యూటింగ్ను తీసుకురావాలనే విజన్తో పనిచేశారు. ఈ క్రమంలో వారు మొట్టమొదటి వ్యక్తిగత కంప్యూటర్లలో ఒకటైన ఆల్టెయిర్ 8800 కోసం సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి వారి మొదటి పెద్ద విజయాన్ని సాధించారు. ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన కార్పొరేషన్లలో ఒకటిగా ఎదిగింది.
1975: బిల్ గేట్స్, పాల్ అలెన్ ఇద్దరూ కలిసి 1975 ఏప్రిల్ 4న మైక్రోసాఫ్ట్ను స్థాపించారు. ఆల్టెయిర్ BASICను అభివృద్ధి చేసి ప్రపంచ సాంకేతిక సామ్రాజ్యానికి పునాది వేసింది. ఆ తర్వాత ఈ కంపెనీ న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుంచి వాషింగ్టన్లోని బెల్లేవ్కు మారింది. ఈ క్రమంలో 1979-1978 చివరి నాటికి దీని సేల్స్ $1 మిలియన్లకు చేరుకున్నాయి.
1981-1990: ఇది మైక్రోసాఫ్ట్ను ఇంటింటికి పరిచయం చేసిన దశాబ్దం. ఆగస్టు 1981లో మైక్రోసాఫ్ట్ తన కొత్త ఆపరేటింగ్ సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ (MS-DOS)ను విడుదల చేసింది. ఇది IBM పర్సనల్ కంప్యూటర్లలో పనిచేయడం ప్రారంభిస్తుంది. భవిష్యత్తులో వ్యక్తిగత కంప్యూటింగ్ వ్యవస్థలపై కంపెనీ ఆధిపత్యానికి ఇది కీలకమైన క్షణం.
1983: 1983లో మైక్రోసాఫ్ట్ తన కొత్త సాఫ్ట్వేర్ ‘విండోస్’ను సాగరవంగా ప్రకటించింది. ఇది విజువల్ ఫీచర్లతో MS-DOS ఇంటర్ఫేస్ను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
1985: 1985లో విండోస్ 1.0 విడుదలైంది. ఇది కంప్యూటింగ్ను రూపొందించే గ్రాఫికల్ ఇంటర్ఫేస్ను పరిచయం చేసిన కీలక కంపెనీ .
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 1985: 1985లో మైక్రోసాఫ్ట్ విండోస్ 1.0ని ప్రారంభించింది. ఈ విధానంలో కంప్యూటర్లను ఉపయోగించడాన్ని చాలా సులభతరం చేయడంలో ఒక టర్నింగ్ పాయింట్. మైక్రోసాఫ్ట్ సంవత్సరాలుగా విండోస్ను మెరుగుపరుస్తూనే ఉంది. వీరు రూపొందించిన ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్గా మారింది.
1986: మైక్రోసాఫ్ట్ తన కార్పొరేట్ ప్రధాన కార్యాలయాన్ని వాషింగ్టన్లోని రెడ్మండ్కు మార్చింది. ఇది ఒక్కో షేరుకు $21 చొప్పున పబ్లిక్గా విడుదలైంది. తర్వాత ఇది దాదాపు $60 మిలియన్లను సేకరించి విజ యం సాధించారు . . దీంతో బిల్ గేట్స్ 31 సంవత్సరాల వయసులో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా మారడానికి ఇది కారణంగా నిలిచింది .
1987: మైక్రోసాఫ్ట్ పర్సనల్ కంప్యూటర్ల కోసం వరల్డ్ లోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ తయారీ సంస్థగా అవతరించింది.
1988: 1987లో విండోస్ 2.0 రాకతో, కార్యాలయంలో కంప్యూటర్లు అనేవి సాధారణం కావడం ప్రారంభమైంది. దీంతో ప్రపంచ అమ్మకాల ఆధారంగా మైక్రోసాఫ్ట్ అతిపెద్ద PC సాఫ్ట్వేర్ కంపెనీగా అవతరించింది.
1989లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్: మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 1989లో ప్రారంభమైంది. ఇందులో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఉన్నాయి. వీటిని నేటికీ ఇళ్లు, స్కూల్స్, ఆఫీస్లలో విస్తృతంగా వినియోగిస్తున్నారు.
ఇంటర్నెట్ అండ్ ఎక్స్పెన్షన్ 1990: 1990లలో మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ప్రపంచంలోకి ప్రవేశించి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ను ప్రవేశపెట్టింది. సర్వర్ సాఫ్ట్వేర్, బిజినెస్ టూల్స్ను క్రియేట్ చేయడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించింది.
1990-1995: విండోస్ 3.0 1990లో విడుదలైంది. దీనికి 5 సంవత్సరాల తర్వాత విండోస్ 95 రిలీజ్ అయింది. దీని సేల్స్ నాలుగు రోజుల్లోనే ఏకంగా 1 మిలియన్ కాపీలు దాటాయి. ఈ కంప్యూటర్లు ఇళ్లు, పాఠశాలలు, వ్యాపారాలలోకి ప్రవేశించడంతో PC అమ్మకాలు పెరిగాయి. దీంతో దీన్ని ‘విండోస్ యుగం’ (Windows Era) అని పిలిచేవారు.
1995లో విండోస్ 95: స్టార్ట్ మెనూ, టాస్క్బార్, ప్లగ్-అండ్-ప్లే సపోర్ట్ను ప్రవేశపెట్టిన విప్లవాత్మక అభివృద్ధి. మొదటి ఐదు వారాల్లో 7 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ విండోస్ 95 ప్లస్లో తొలిసారిగా ప్రారంభమైంది.
1995: ఇంటర్నెట్ రాకతో మైక్రోసాఫ్ట్ తన వెబ్ బ్రౌజర్ ‘ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్’ను పరిచయం చేసింది.
1998: విండోస్ మొదటి వినియోగదారు వెర్షన్ అయిన విండోస్ 98 విడుదలైంది. అదే ఏడాది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మైక్రోసాఫ్ట్ తన ప్రోగ్రామ్లను దాని ఆపరేటింగ్ సిస్టమ్లలో కలిపినందుకు దానిపై’ యాంటీట్రస్ట్’ అభియోగాలను నమోదు చేసింది . సాఫ్ట్వేర్, గుత్తాధిపత్య పద్ధతుల్లో కంపెనీ తన ఆధిపత్యాన్ని ఉపయోగించి పోటీదారులను వ్యాపారం నుంచి తరిమికొట్టిందని US నియంత్రణ సంస్థలు చేసిన ఆరోపణలు అప్పట్లో దుమారం లేపాయి . వీటన్నింటినీ తట్టుకుని బిల్ గేట్స్ నిలబడ్డారు .