అయోధ్యలో భూముల ధరలు ఎందుకంత హైప్ ..?

అయోధ్యలో భూముల ధరలు ఎందుకంత హైప్ ..?

రామజన్మభూమి ఆలయానికి సమీపంలో 10 కిలోమీటర్ల మేర భూముల ధరలు 150 శాతానికి పైగా పెరిగాయి.

అధ్ధ్యాత్మికతకు ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలలో భూముల ధరల పెరుగుదల సహజ ప్రక్రియ. అయితే ఇటీవల కాలంలో జనంలో పాపభీతి పెరిగి . .. పుణ్యక్షేత్రాలలో నివాసం ఉండాలని భావించేవారు సంఖ్య పెరుగుతోంది . ఈ ప్రభావం కూడా అయోధ్య వంటి చోట్ల భూముల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి .

 అయోధ్యలో భవ్యరామాలయ నిర్మాణంతో భూముల లావాదేవీలు, మార్కెట్ విలువ అమాతం పెరిగింది. ఇందుకు అనుగుణంగా ఇప్పుడు అక్కడి భూముల సర్కిల్ రేట్లకు తాజాగా రెక్కలు వచ్చాయి. భూముల సర్కిల్ రేట్లను 30 నుంచి 200 శాతం వరకూ పెంచారు. గత ఎనిమిదేళ్లలో భూముల రేట్లను పెంచడం ఇదే మొదటిసారి. కొత్త రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు.

రామజన్మభూమి ఆలయానికి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకూ కొత్త రేట్ల ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ఇక్కడ భూముల ధరలు 150 శాతానికి పైగా పెరిగాయి. 2004 సెప్టెంబర్‌లో భూముల ధరల పెంపు కోరుతూ ఒక ప్రతిపాదన తమకు రావడంతో సవరించిన రేట్లను అమల్లోకి తెచ్చినట్టు సదర్ (ఫైజాబాద్) సబ్‌ రిజిస్ట్రార్ శాంతి భూషణ్ చౌబే తెలిపారు. కొత్త సర్కిల్ రేట్లకు జిల్లా మెజిస్ట్రేట్ ఆమోదం తెలుపడంతో ఇప్పుడు అమల్లోకి తెచ్చామని చెప్పారు. కొత్త రేట్ల ప్రకారం జిల్లాలోని రాకాబ్‌గంజ్, దేవ్‌కాళి ప్రాంతాల్లో భూముల రేట్లు భారీగా పెరుగుతాయన్నారు. అయోధ్య ఆధ్యాత్మక పర్యటనా కేంద్రంగా అందరినీ ఆకర్షిస్తుండటం, మౌలిక వసతు కల్పన కారణంగా రామాలయం చుట్టూ ఉన్న సర్కిల్ రేట్లు చదరపు మీటరుకు రూ.26,660 నుంచి రూ.27,900 వరకూ పెరుగుతుందని చెప్పారు. గతంలో ఈ రేటు రూ.6,650 నుంచి రూ.6,975 వరకూ ఉండేది. ల్యాండ్ రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్ అనే కేటిగిరిల కింద వివిధ రేట్లలో భూముల పెరుగుదల ఉంటుందని చౌబే వివరించారు. రానున్న రోజులలో ఈ పెరుగుదల మరింత ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు .

మస్క్ అసాధారణ ప్రవర్తన.. ‘హైపోమేనియా’

మస్క్ అసాధారణ ప్రవర్తన.. ‘హైపోమేనియా’

ఎలాన్ మస్క్ విచిత్ర ప్రవర్తనను విశ్లేషించిన డాక్టర్ డ్రూ

  • అతి ఉత్సాహం, తక్కువ నిద్ర, వేగంగా మాట్లాడటం ‘హైపోమేనియా’ లక్షణాలు
  • జన్యుపరమైన కారణాలు, రసాయనాల అసమతుల్యత, ఒత్తిడి ప్రధాన హేతువులు
  • మానసిక వైద్యుల పర్యవేక్షణలో నిర్ధారణ, చికిత్స అవసరం
  • నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలని నిపుణుల హెచ్చరిక
  • కొన్ని సందర్భాలలో ఆత్మహత్యకు పూనుకునే ప్రమాదం

”రోజుకి ఐదారు గంటలు మాత్రమే నిద్రపోతాను . ..” అని తరచూ చెప్పే ఎలాన్ మస్క్ మానసిక పరిస్థితి తేడా కొడుతోంది . టెస్లా, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్ వంటి ప్రఖ్యాత సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి తెలియని వారుండరు. ఆయన సాధించిన విజయాలు ఎంత గొప్పవో, కొన్నిసార్లు ఆయన ప్రవర్తించే తీరు కూడా అంతే వివాదంగా , చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా, ప్రముఖ సైకాలజిస్ట్, ఎడిక్షన్స్ వైద్య నిపుణుడు డాక్టర్ డ్రూ పిన్స్కీ, మస్క్ ప్రవర్తనపై హాట్ కామెంట్స్ చేశారు. మస్క్ ప్రవర్తన ‘హైపోమేనియా’ అనే మానసిక స్థితికి దగ్గరగా ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. గతంలో మస్క్ తనకు ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ ఉందని స్వయంగా వెల్లడించినప్పటికీ, ఆయన బహిరంగ ప్రవర్తన వెనుక మరో కారణం ఉండొచ్చని డాక్టర్ డ్రూ సూచిస్తున్నారు.

తాజాగా ఓ న్యూస్‌మ్యాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ డ్రూ పిన్స్కీ, ఎలాన్ మస్క్ మేధస్సును, ఆయన సాధించిన విజయాలను ప్రశంసించారు. అయితే, “మస్క్ విజయం వెనుక మరో కోణం కూడా ఉంది. ఆయన బహుశా హైపోమేనియాతో బాధపడుతుండవచ్చు” అని వ్యాఖ్యానించారు. మస్క్ ప్రదర్శించే అపారమైన శక్తి, నిరంతరం చేసే ట్వీట్లు, కొన్నిసార్లు అదుపుతప్పిన వ్యాఖ్యలు, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో వివాదాలు వంటివి కేవలం ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ పరిధిలోకి రావని, ఇవి హైపోమేనిక్ ఎపిసోడ్‌లకు సంబంధించిన మూడ్ డిజార్డర్‌ను సూచిస్తున్నాయని డాక్టర్ డ్రూ అభిప్రాయపడ్డారు.

హైపోమేనియా అంటే ఏమిటి?

హైపోమేనియా అనేది ఒక రకమైన మానసిక రుగ్మత. ఈ స్థితిలో వ్యక్తి మానసిక స్థితి అసాధారణంగా ఉత్సాహంగా లేదా చిరాకుగా ఉంటుంది. శక్తి స్థాయిలు అమాంతం పెరిగి, కనీసం నాలుగు రోజుల పాటు విపరీతమైన చురుకుదనం కనిపిస్తుంది. ఇది పూర్తిస్థాయి మేనియా కన్నా తీవ్రతలో తక్కువగా ఉంటుంది. హైపోమేనియాలో సాధారణంగా వాస్తవికతతో సంబంధం కోల్పోవడం (సైకోసిస్) లేదా ఆసుపత్రిలో చేర్పించాల్సినంత తీవ్రమైన లక్షణాలు ఉండవు. అయినప్పటికీ, ఇది వ్యక్తి సాధారణ మానసిక పనితీరులో గణనీయమైన మార్పును సూచిస్తుంది. మానసిక రుగ్మతల విశ్లేషణ మార్గదర్శిని అయిన డీఎస్ఎమ్-5 ప్రకారం, ఇది బైపోలార్ II డిజార్డర్‌లోని ఒక దశగా పరిగణిస్తారు.

క్రియేటివిటీతోపాటు . ..

కొన్నిసార్లు హైపోమేనియా అద్భుతమైన సృజనాత్మకతకు లేదా ఉత్పాదకతకు దారితీయవచ్చని, అందుకే కొందరు దీనిని “జీనియస్ జోన్” అని కూడా అంటారని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో, హఠాత్తు నిర్ణయాలు తీసుకోవడం, ప్రమాదకర ప్రవర్తనలకు పాల్పడటం వంటివి కూడా దీనివల్ల జరగవచ్చు. కుటుంబంలో ఎవరికైనా బైపోలార్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఉండటం, మెదడులోని రసాయనాల అసమతుల్యత, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, కొన్ని రకాల మందుల వాడకం వంటివి హైపోమేనియాకు కారణాలు కావచ్చని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

అప్పట్లో ఇవన్నీ లేవు . , కానీ . ,

అప్పట్లో ఇవన్నీ లేవు . , కానీ . ,

ఓ తండ్రి . . కొడుక్కి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు మీరూ చదవండి . ..

తండ్రిని ఒక కొడుకు అడిగిన ఒక సందేహం…. (పాతికేళ్ల క్రితం నాటి కధ . . అయినా కొత్తగానే ఉంటుంది . ..)

నాన్నా ! మీ కాలంలో;;;;

1. ఇంత టెక్నాలజీ లేదు..

2. ఆర్డర్ పెడితే పది నిమిషాలలో ఫుడ్ ఇంటికొచ్చే సౌకర్యంలేదు . ..

3. వేగవంతమైన ఇంటర్నెట్ లేదు..

4. ఆధునిక TV లు లేవు..

5.  కంప్యూటర్లు లేవు..

6. ఏసీ లు లేవు..

7. లగ్జరీ కార్ లు లేవు..

8. మొబైల్ ఫోన్ లు లేవు… మీరెలా బ్రతికేవారు? 

*దానికి ఆ తరము తండ్రి గారు ఇచ్చిన జవాబు అందరూ చదవవలసిందే*.

మీ తరమువారు ఈ రోజుల్లో  ఎలాగైతే

1. ప్రార్ధన లేకుండా..

2. మర్యాద లేకుండా

3. ప్లానింగ్ లేకుండా

4. క్రమశిక్షణ లేకుండా..

5. పెద్దల ఎడల గౌరవం లేకుండా..

6. మన చరిత్ర పై అవగాహన లేకుండా..

7. కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా.

8. ఏ మోరల్ వేల్యూస్ లేకుండా…   రోజులు ఎలా గడిపేస్తున్నారో!

మేము ఆ Morals అన్నీ పాటిస్తూ ఆనందముగా జీవించాము.

మేము మీలాగా…

1. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు..

2. పాఠశాల వేళలు అయిన

తరువాత చీకటి పడేదాకా ఆడుకున్నాము. TV లు చూడలేదు…

3. ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితులతో గడిపాము..

4. దాహము వేస్తే కుళాయి నీరు, బావి నీరు త్రాగాము. బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు..

5. ఒకే గ్లాస్ లో నలుగురం జ్యూస్ త్రాగినా, కాకి ఎంగిలి చేసిన జామకాయలు తిన్నా

మాకెప్పుడూ జబ్బులు రాలేదు..

6. మూడు పూటలా అన్నమే తిన్నా మాకు ఊబకాయం రాలేదు…

7. షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా

మాకు కీళ్ళ నొప్పులు రాలేదు..

8. సొంత ఆట వస్తువులు తయారు చేసికొని ఆడుకున్నాము,, అష్టా చెమ్మా, ఏడు పెంకులు, కోతి కొమ్మచ్చి, వైకుంఠ పాళీ ఆడుకున్నాము.

బంధువులతో కలసి మెలసి ఆనందముగా ఉన్నాము,

9. పిలువక పోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి తినుబండారాలు ఆరగించాము..

10. మావి black and వైట్ ఫొటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు…..

    బహుశా మాతల్లి దండ్రులు చెప్పినది ఆచరించిన చివరి తరం మేమే.

మా వారసులు శాసించినది పాటించే మొదటి తరమూ మాదే కావచ్చు…..

అయినప్పటికీ..

మీ యాంత్రిక జీవితానికి యధాశక్తి సహాయ పడుతున్న వాళ్ళము…

మేము ఒక limited ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము…..

అందుకే మా విన్నపము ఏమంటే..

*భూమి పైనుండి మేము వెళ్ళిపోకముందే మా జీవితాలనుండి,  ఎంతో కొంత మానుండి మీరు నేర్చుకోండి*.…….

మమ్మల్ని చక్కగా పెంచిన మంచి తల్లిదండ్రులకు వందనాలు,

మేము అలా పెంచడం చేతకాని ఈ సమాజంలో,

ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులం అవుతామేమో . …. ఈ కధ సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూ ఉంటుంది . ఇలాంటి ఆలోచింపచేసే కధలు , వాస్తవాలను నేటి తరం పిల్లలకు ఏదోలా చేరవేయాలి . కనీసం ఒక్క్కసారైనా దీనిపై ఆలోచన చేస్తారు . అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ఎప్పుడైనా అనిపిస్తే . .. అటుగా అడుగులు వేసే ప్రయత్నం అయినా మొదలెడతారు . . పాజిటివ్ గా ఆలోచిద్దాం . ..

రష్యా..ఇండియా..చైనా.. కలిస్తే ఏమవుతుంది ?

రష్యా..ఇండియా..చైనా.. కలిస్తే ఏమవుతుంది ?

ఐక్యమత్యంతోనే ఈ సాంకేతిక యుగంలో ముందుకెళ్లగలం

“ఆపరేషన్ సిందూర్” తో భారత్ …పాకిస్థాన్ ను గోడకుర్చీ వేయించింది/ అంతకు మించి ప్రపంచంలో శక్తివంతమైన “ఇండో పసిఫిక్” రాజకీయ, ఆర్ధిక డైనమిక్స్ ముందువరుసలో భారత్ ను తీసుకువెళ్తుంది. 

ఇండో పశిఫిక్ ప్రాంతం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం: హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం  పశ్చిమ, మధ్య భాగాలను ఇండో-పసిఫిక్ ప్రాంతం అంటారు. ఇందులో తూర్పు ఆఫ్రికా నుండి పశ్చిమ అమెరికా వరకు విస్తరించిన భూభాగం ఉంటుంది. ఈ ప్రాంత భౌగోళిక లక్షణాలు రాజకీయ ఆర్థిక డైనమిక్స్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఇండో-పసిఫిక్ యొక్క భౌగోళిక రాజకీయ మరియు ఆర్థిక ముఖచిత్రం యొక్క కీలక భౌగోళిక అంశాలు ఉన్నాయి.

ప్రపంచ వాణిజ్యంలో 50% కంటే ఎక్కువ జరిగే సముద్ర మార్గాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వున్నాయి. మలక్కా జలసంధి ద్వారా సంవత్సరానికి 100,000 ఓడలు దాటుతాయి, ఇవి చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఇంధనాన్ని వస్తువులను రవాణా చేస్తాయి. సింగపూర్, హాంకాంగ్, మరియు షాంఘై వంటి ఓడరేవులు ఈ ప్రాంతంలో ఆర్థిక కేంద్రాలుగా ఉన్నాయి.

ప్రపంచం “పెద్దన్న” గా భావించే అమెరికా నేతృత్వంలో జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా దేశాల కూటమి ఇండో పశిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యం వహిస్తోంది. అమెరికా ఉద్దేశ్యపూర్వకంగానే భారత్ ను ఇందులో కలపలేదు.

ఆపరేషన్ సిందూర్ తరువాత ప్రపంచదేశాల్లో భారత్ పట్ల ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చింది. ఇది కేవలం సైనిక విజయం వల్ల మాత్రమే కాదు. ఆరు సంవత్సరాలుగా ఆర్ధిక రంగంలో వృద్ధి ప్రభావం. ఆర్ధికంగా 10 వస్ధానం నుంచి 4 వ స్థానానికి చేరుకున్న భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం కుతూహలంగా గమనిస్తోంది. ఆపరేషన్ సిందూర్ ఒక ట్రిగ్గర్ గా పనిచేసింది.

మరోవైపు ఇండో పశిఫిక్ ప్రాంతంలో అమెరికా పక్కనపెట్టిన భారత్ ఇదే ప్రాంతంలోని తైవాన్ తో వాణిజ్యం, ఫిలిప్పీన్స్ తో మిసైల్స్ సరఫరా, జపాన్ తో టెక్నాలజీ సప్లైస్, వియత్నాంతో సైనిక సహకారం, ఇండోనేషియాతో సముద్ర భద్రత ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఇదే అదనులో రష్యా ప్రతిపాదించిన రష్యా ఇండియా చైనా (RIC) ప్రతిపాదన మరోసారి తెరమీదికి వచ్చింది.

RIC ఒక త్రైపాక్షిక సహకార వేదికను సూచిస్తుంది. ఇది ఈ మూడు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక, మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఏర్పాటైన ఒక అనధికారిక ఏర్పాటు. RIC సమావేశాలు సాధారంణంగా ఈ దేశాల విదేశాంగ మంత్రుల స్థాయిలో జరుగుతాయి.

వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగం, మరియు సాంకేతికతలో సహకారాన్ని పెంచడం RIC లక్ష్యం.

ప్రపంచ రాజకీయాలలో పాశ్చాత్య దేశాల ఏకపక్ష వ్యతిరేకించి, ప్రపంచ వ్యవస్థను ప్రోత్సహిస్తాయి. ఉగ్రవాదం, సైబర్ భద్రత, మరియు ప్రాంతీయ స్థిరత్వంపై సమిష్టి చర్యలపై చర్చలు జరుగుతాయి.ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా, మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం కోసం సహకారం. విద్య, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం.

ఆపరేషన్ సిందూర్ తరువాత RIC కూటమి బలోపేతం కాగల అవకాశాలు బాగా మెరుగయ్యాయి. ప్రపంచ జనాభాలో ఈ మూడుదేశాల జనాభా 36 శాతం. అలాగే ప్రపంచ వాణిజ్యంలో ఈ మూడుదేశాల వాటా 37 శాతం. RIC బలపడితే ఈ సహజ సామర్ధ్యమే!

ఈ కూటమి దేశాల సమస్యలను చర్చలద్వారా పరిష్కరించుకోగలిగి, ఏకాభిప్రాయంతో ముందుకి వెళ్ళగలిగితే సూపర్ పవర్ కాగలుగుతాయి.

ఆధిపత్యాన్ని నిలబెట్టుకోడానికి విభజించి పాలించడం ఒక కుటిలనీతి. అపుడు బ్రిటన్, ఇపుడు అమెరికా ఇదే దుర్నీతి పాటించాయి. ఫలితంగా పుట్టిన ద్వేషాగ్నితో ఇప్పటికీ ఇండియా, పాకిస్థాన్ – రష్యా, ఉక్రెయిన్ మండిపోతున్నాయి. వనరులను సద్వినియోగం చేసుకోగలిగిన సామర్థ్యమే శక్తిగా మారుతుంది. ఆ శక్తితో పాటు దౌత్యనీతి కూడా భారత్ ను పెద్ద ఇన్ ఫ్లుయెన్సర్ గా  నిలబెడుతోంది. ఇలాంటి ఇన్ ఫ్లుయెన్సే విద్వేషాల్ని చల్లార్చగలుగుతుంది.

మన స్వరం పెంచి ఐక్యరాజ్య సమితి ని నిలదీసే వరకూ భారత్ ఇన్ ఫ్లుయెన్స్ పెరిగింది. సమితిలో శాశ్వత సభ్యత్వం, వీటో అధికారాల కోసం ఇండియా చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. సమితి భద్రతామండలి తాజాసమావేశంలో సెక్రెటరీ మేరీ జాన్సన్ ఈ అంశాన్ని ప్రస్తావించి “భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే. అభివృద్ది చెందాక వీటో అధికారం కూడా వస్తుంది” అన్నారు. దీనిపై విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ భారత్ ఏ రంగంలో ఏమేమి  సాధించిందో వివరిస్తూ, భారత్ ఎక్కడ వెనుకబడిందో చెప్పాలని అడిగినపుడు సెక్రెటరీ మాట్లాడలేకపోయారు. అంటే పరిస్థితి ఏవిధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు .

ఎలాన్ మాస్క్ స్టార్ లింక్ తో భారత్ కి ఎంత ప్రయోజనం?

ఎలాన్ మాస్క్ స్టార్ లింక్ తో భారత్ కి ఎంత ప్రయోజనం?

ప్రపంచ కుబేరుడు , టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన సాంకేతిక సామ్రాజ్యాన్ని భారత్ కి విస్తరిస్తున్నాడు

స్టార్‌లింక్‌కు తలుపులు తెరిచిన భారత్‌- ఇక మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలు

శాటిలైట్ ఇంటర్నెట్ విప్లవానికి భారత్ కొన్నాళ్ల క్రితమే నాంది పలికింది. అడవులు, ఎడారులు, కొండలు, కోనలు, సముద్రాలు, పర్వతాలు, హిమానీనదాలు అని తేడా లేకుండా ఎక్కడైనా అంతర్జాలం సేవలను అందించే విఖ్యాత శాటిలైట్ ఇంటర్నెట్‌ సర్వీసుల కంపెనీ స్టార్‌లింక్‌కు భారత్ తలుపులు తెరిచింది. అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఈ కంపెనీకి లైసెన్సును భారత టెలికాం శాఖ మంజూరు చేసింది. స్టార్‌లింక్‌ రాకతో దేశీయ ఇంటర్నెట్ సేవల ముఖచిత్రం మారే అవకాశం ఉంది. ఫైబర్‌ కేబుల్స్‌తో క్షేత్రస్థాయి‌లో నెట్‌వర్క్‌ను నిర్మించాల్సిన అవసరం లేకుండానే దేశంలో ఎక్కడికైనా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చే ‘స్టార్‌లింక్‌’‌ ఎలా పనిచేస్తుంది? స్పీడ్, డేటా వివరాలేంటి? ఇంటర్నెట్ ప్యాకేజీల రేట్లు ఎంత?స్టార్‌లింక్‌‌ రాకతో భారత్​కు చేకూరే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అనే వివరాలు ఇపుడు భారత్ లో ఆసక్తికరంగా మారాయి .

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌,,
2000 సంవసరానికి ముందే శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రయత్నాలు మొదలైనప్పటికీ అవి విశ్వవ్యాప్తం కాలేకపోయాయి. మారుమూల ప్రాంతాలకు వాటిని చేర్చేందుకు ప్రత్యేక కసరత్తు జరగలేదు. దీంతో ఉన్నత వర్గాల వారికే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు పరిమితమయ్యాయి. స్టార్‌లింక్ ద్వారా ఈ పరిమితులను అధిగమించేలా ఆలోచన చేసిన ఘనుడు ఎలాన్ మస్క్ అని చెప్పొచ్చు. ఆయన ఇంటర్నెట్ కనెక్షన్‌కు కొత్త నిర్వచనం ఇచ్చారు. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలకు సముద్ర గర్భం, అండర్ గ్రౌండ్‌ మొదలుకొని ఇంటి కిటికీ వరకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అవసరం అవుతాయి. టవర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే మారుమూల ప్రాంతాల్లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌తో నెట్‌వర్క్ నిర్మాణం అనేది భారీ వ్యయంతో కూడుకున్న పని.

42,000 శాటిలైట్స్ …
స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా ఎలాన్ మస్క్‌దే. ఈ కంపెనీ 2019 నుంచి స్టార్ లింక్ ఉపగ్రహాలను ప్రయోగించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం 7వేలకుపైగా స్టార్ లింక్ ఉపగ్రహాలు భూమి దిగువ కక్ష్య(LEO)లో తిరుగుతున్నాయి. స్పేస్ ఎక్స్‌కు చెందిన ‘ఫాల్కన్- 9’ రాకెట్ ఒకేసారి 60 స్టార్‌లింక్ ఉపగ్రహాలను భూమి దిగువ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. అందుకే కేవలం ఆరేళ్ల వ్యవధిలో 7వేలకుపైగా శాటిలైట్ల నెట్‌‌వర్క్‌ను స్టార్‌లింక్ తయారు చేసుకోగలిగింది. ఒక్కో ఉపగ్రహం 259 కేజీల బరువు ఉంటుంది. రాబోయే కొన్నేళ్లలో తమ శాటిలైట్ల సంఖ్యను 42వేలకు పెంచాలని ఎలాన్ మస్క్ టార్గెట్ల.

స్టార్‌లింక్ పని తీరు ఇలా ఉంటుంది…
స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు ప్రస్తుతం భూమి దిగువ కక్ష్యలో ఉన్న 7వేల ఉపగ్రహాలే ఆధారం. ఈ శాటిలైట్లతో కూడిన స్టార్‌లింక్ నెట్‌వర్క్ అంతరిక్షంలోని శూన్యత ద్వారా రేడియో సిగ్నల్‌లను ఉపయోగిస్తుంది. స్టార్‌లింక్ గ్రౌండ్ స్టేషన్లు తమ ఉపగ్రహాలకు రేడియో సిగ్నల్స్‌ను పంపుతాయి. ఈ రేడియో సిగ్నల్స్‌ను అందుకోగానే స్టార్‌లింక్ శాటిలైట్లు ఇంటర్నెట్ డేటాను భూమిపై వివిధ చోట్ల ఉన్న యూజర్ల డివైజ్‌లకు చేరవేస్తాయి.