అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ

అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ

”కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామికి అపవిత్రత కలిగించే పని నేను చేయను, ఎవరినీ చేయనివ్వను . .. ” అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ”దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుంది . ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదు . ..” సీఎం చంద్రబాబు ధీమాగా చెప్పారు .

అమరావతిలోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. రూ.260 కోట్లతో రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్‌ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు.

రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకార నిర్మాణం : మొదటి దశలో రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారాన్ని నిర్మిస్తారు. రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, కట్‌ స్టోన్‌ ఫ్లోరింగ్‌ నిర్మిస్తారు. రెండో దశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్‌రోడ్డు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్‌ హౌస్, పరిపాలన భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్‌ వంటి పనుల్ని చేపడతారు. వీటికి రూ.120 కోట్ల వ్యయం కానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

విద్యార్థులకు నైతిక విలువలు నేర్పమని చంద్రబాబు చెప్పారు . ..

విద్యార్థులకు నైతిక విలువలు నేర్పమని చంద్రబాబు చెప్పారు . ..

విద్యార్థులకు “విలువలపై విద్యాసదస్సులో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు .

”ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . .. నాకు ఫోన్ చేసి . .. చిన్నారులకు నైతిక విలువలు , కుటుంబ బాంధ్యవ్యాలు గురించి మీలాంటి వారు చేపితే వింటారు . ఎంతో మార్పు వస్తుంది . మీరు ఈ పని చేయాలి . .. అని కోరారు . పిల్లల కోసం చంద్రబాబు గారు పడుతున్న తపనకు నేను చలించి .. అంగీకరించాను . నాకు పదవుల కోసం మాత్రం కాదు . ..’ అని చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యములో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యార్థులకు “విలువలపై విద్యాసదస్సు”లో చాగంటి మాట్లాడారు . విద్యార్థులకు విలువలపై తమ అద్భుత సందేశాన్ని అందించారు. ముందు కుటుంబము నుండే విద్యార్థులలో విలువలకు బీజం పడుతుందని, అందుకే కుటుంబ అనుబంధములు, విలువలు అత్యంత ప్రధానమని, గురువులను మరియు తల్లిదండ్రులను గౌరవించటం యొక్క ఆవశ్యకతను గురించి అనేక మంది మహానుభావుల జీవిత విశేషాలను ఉటంకిస్తూ ప్రవచించారు. అనంతరం విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలకు వారు సమాధానములు ఇచ్చి, వారిని మరింత ప్రోత్సహించారు.

కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యా శాఖామాత్యులు నారా లోకేష్, విజయవాడ MP కేశినేని శివనాథ్ , పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ , డైరెక్టర్ . . విజయరామరాజు . , NTR జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల , , స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ – సమగ్ర శిక్ష బి శ్రీనివాసరావు ఇతర పురప్రముఖులు, విద్యార్థులు, వారి అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమములో శ్రీ చాగంటి వారు చెప్పిన ప్రతి మాట అమృత తుల్యమైనదని వారందరూ తమ ఆనందమును, కృతఙ్ఞతలు వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా మంత్రి లోకేష్ ,.. చాగంటి కోటేశ్వరరావుకి పాదాభివందనం చేశారు .

గూగుల్ డేటా సెంటర్ పై కుట్ర . ..

గూగుల్ డేటా సెంటర్ పై కుట్ర . ..

భూములు ఇవ్వొద్దంటూ రైతులను రెచ్చగొడుతున్న వైసీపీ

వరల్డ్ ఫెమస్ టెక్నీకల్ సంస్థ గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన డేటా సెంటర్ ను అడ్డుకునే కుట్రకు వైసీపీ నేతలు తెరతీసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి . రాష్ట్ర ప్రభుత్వం గూగుల్‌ డేటా సెంటర్‌ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది. ఐటీ దిగ్గజ సంస్థ ఏకంగా 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో విశాఖలో దీన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణకు కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి. కొందరు రైతుల ఫోర్జరీ సంతకాలతో, చనిపోయిన రైతు పేరుతో హైకోర్టులో పిటిషన్‌ వేశాయి. గూగుల్‌ ప్రాజెక్టుకు భూములు ఇవ్వవద్దని . . మిగతా రైతులనూ రెచ్చగొడుతున్నాయి. ఆ భూములు తమకే ఇస్తే ఎక్కువ డబ్బులిస్తామని ప్రలోభపెడుతున్నాయి. దీని పై స్థానిక తహసీల్దార్‌ ఈ నెల 3న ఫిర్యాదు చేస్తే, పోలీసులు కేసు నమోదు చేశారు.

రిటైర్డ్ ఐఏఎస్‌ బినామీతో కంప్లీన్ట్ . : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ చుట్టుపక్కల రైతులను మభ్యపెట్టి డీ-పట్టా భూముల్ని కొనేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారికి బినామీగా ఉన్న వ్యక్తే ఇప్పుడు ఈ కుట్ర పన్నారు. అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ పేరుతో డీ పట్టా భూముల విక్రయాలకు తెర తీయడంతో ఆ విషయం బయటకు రావడానికి ముందే అప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న ఆ ఐఏఎస్‌ అధికారి విశాఖ చుట్టుపక్కల ఎడాపెడా ఆ భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దానిపై విచారణ కూడా కూటమి సర్కార్ పక్కపెట్టింది . ఆయన తరఫున బినామీగా వ్యవహరించిన వ్యక్తి భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తర్లువాడలో రైతులకు అడ్వాన్స్‌లు చెల్లించి, వారితో ఒప్పందాలు చేసుకొని డీ పట్టా భూములను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు అదే తర్లువాడలో 308 ఎకరాల్ని గూగుల్‌కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 200 ఎకరాల డీ పట్టా, శివాయ్‌ జమేదార్‌ భూములను రైతులకు పరిహారమిచ్చి భూసేకరణ చట్టం ప్రకారం సేకరిస్తోంది. ఆ బినామీ గుప్పిట్లో పెట్టుకున్న 76 ఎకరాలు కూడా ఆ భూముల్లో ఉన్నాయి. దీంతో భూ సేకరణ ప్రక్రియనే అడ్డుకునేందుకు కుట్ర పన్ని రైతులతో కోర్టులో కేసు వేయించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డీపట్టా భూముల కొనుగోలులో దళారిగా వ్యవహరించి, ఆనందపురం మండలంలోని ఒక పంచాయతీ సర్పంచి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు ఆ బినామీ తరఫున రైతుల్ని ప్రలోభ పెట్టే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిని తానేనని కూడా ఆ దళారి ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు వస్తున్న రైతులను అడ్డుకుంటున్న వారిపై, రైతుల సంతకాలు ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దారు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఇలాంటి కుట్రలను అడ్డుకునేందుకు కూటమి సర్కార్ పకడ్బందీగా వ్యవహరించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి .

తులసి బాసో .. ఈ వరి పురాతనమైనది

తులసి బాసో .. ఈ వరి పురాతనమైనది

ఒకసారి నాటితే . .. మూడుసార్లు కోసుకోవచ్చు . . దేశీయ వెరైటీ

తులసి బాసో ….. ఇది ఒక సంప్రదాయ వరి రకం. రామాయణ కాలం నుంచీ ఈ వరి భారతదేశంలో సాగుచేశారని చెపుతారు .

ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర దేశీయ వరి రకం. ఆ రాష్ట్రంలో వందల సంవత్సరాలుగా ఈ అరుదైన వరి రకాన్ని సాగుచేస్తున్నారు . ఒకసారి నాట్లు వేసుకుంటే మూడుసార్లు పంట తీసుకోవచ్చు. ఆ ప్రాంతంలో కొంతమంది రైతులు ఇలాంటి అరుదైన దేశీయ వంగడాలను అంతరించిపోకుండా కాపాడుతున్నారు. వీరు మన సాంప్రదాయ విత్తనాల పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పాలి .

ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆర్గానిక్ మేళాలలో లేదా విత్తన మేళాలలో కలుసుకొని అరుదైన వరి వంగడాలను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు.

ఆ ప్రయత్నంలో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన అభ్యుదయ రైతు చందూల్ కుమార్ రెడ్డి ఈ అరుదైన వరి వంగడాన్ని అలాంటి రైతుల వద్ద సేకరించి, ఇప్పుడు ఒక ఎకరా తులసి బాసో పంట వేసినట్లు చెప్పారు .

తులసి బాసో పరిమళభరితమైన వరి రకం. “తులసి లాంటి సువాసన గల బియ్యం” అని అర్థం. అంటే సెంటెడ్ రకం. బాస్మతి లాగా మంచి సువాసన వస్తుంది. చిట్టి ముత్యాలులాగా చాలా చిన్న గింజ. తినడానికి చాలా మధురంగా ఉంటూ, ఎంత తిన్నా వెగటు అనిపించదు. భుక్తాయాసం రాదు.ఎక్కువ ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న బియ్యంగా గుర్తించబడింది. చిన్నపిల్లల ఎదుగుదలకు కావలసిన మంచి పోషక విలువలు మరియు ఔషధ గుణాలు ఉన్న బియ్యం. దేవాలయాలలో ప్రసాదాలకు, పాయసాలకు చాలా అనువైన రకం. రోజువారి అన్నంగా కూడా వండుకొని తినవచ్చు. కార్బోహైడ్రేట్లు తక్కువ మోతాదులో ఉండటం వలన ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న బియ్యంగా చెప్తారు. ముడి బియ్యంగా తింటే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.

తులసి బాసో పంట కాలం 135 రోజులు. ఖరీఫ్ కి మాత్రమే అనువైన రకం అంటే రోహిణి కార్తెలో వేసుకోగలిగితే మొదటి పంట 135 రోజులకి వస్తుంది. తరువాత 60 నుంచి 70 రోజులకు కోతకు వస్తుంది. మూడో పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. సహజంగా ప్రధాన పంటను కోసిన తర్వాత రెండవసారి మూడోసారి కోసినప్పుడు గింజ పరిమాణం తగ్గుతుంది. కానీ దీని గింజ పరిమాణం తగ్గదు. సువాసన, పరిమళం పెరుగుతుంది. మొదటి కోతకి, రెండవ కోతకి సువాసన పెరుగుతుంది. రెండవ కోతతో పోల్చుకుంటే మూడోసారి కోతకు వచ్చినప్పుడు అందులో సువాసన ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే రైతులు విత్తనానికి వినియోగపరిచేటువంటి వాళ్ళు మొదటి కోతలో ఉన్న పంటను మాత్రమే విత్తనానికి వినియోగించాలి.

రెండవ పంట మూడో పంట విత్తనానికి వినియోగించకపోవడమే మంచిది. ఎందుకంటే దిగుబడి తగ్గుతుంది. దిగుబడి పూర్తిస్థాయిలో మనం చూస్తే 135 రోజుల తర్వాత ఎకరానికి 15 నుంచి 18 క్వింటాల్ వస్తుంది. రెండవ కోతకి 6 నుంచి 8 క్వింటాల్ వస్తుంది. మూడవకోతకి ఐదు నుంచి ఆరు క్వింటాల్ వస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా దీనిని పండించవచ్చు. పంట ఒరగదు. ఎంతటి గాలులకైనా తట్టుకొని నిలబడుతుంది. తుఫాన్లు సైతం తట్టుకొని నిలబడి ఉండే రకం. అన్ని ప్రాంతాల వారు ఈ రకాన్ని పండించుకోవచ్చు.

ఇలాంటి అరుదైన వరి రకాలు సేకరించి,పండిస్తున్న అభ్యుదయ రైతు చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన చందూల్ కుమార్ రెడ్డిని ప్రక్రుతి సాగు రైతులే కాదు . .. అందరూ అభినందించాల్సిందే .

విత్తనాల కొరకు ఈ రైతును మీరు సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తూ పండించే విధానం, రైతులకు వివరిస్తారు. ఈ రైతుని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 6300027502, 9440809364

మావోయిస్టుల అలజడి

మావోయిస్టుల అలజడి

ఏపీలో 50 మందికి పైగా మావోయిస్టులు అరెస్టు – ఏకకాలంలో 5 జిల్లాల్లో మావోయిస్టుల కోసం పోలీసుల సోదాలు

దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత జోరుగా సాగుతోంది. 2027 నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలన్నది కేంద్ర సర్కార్ నిశ్చయం . ఇందులో భాగంగా వరుసగా మావోయిస్టుల ఏరివేత సాగుతోంది . స్వచ్చందంగా లొంగిపోవాలని ఇప్పటికే సర్కార్ అల్టిమేటం జారీచేసింది . లొంగకపోతే మట్టుపెడతామని వార్నింగ్ ఇచ్చారు . ఈ నేపథ్యంలో ఏరివేత శరవేగంగా సాగుతోంది . ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలం తర్వాత మావోయిస్టుల అలజడి రేగింది. ఆపరేషన్‌ కగార్‌తో వరుస ఎన్ కౌంటర్లు, అగ్రనేతల మృతితో ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌ వైపు వచ్చారన్న సమాచారంతో కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఏకకాలంలో రాష్ట్రంలోని అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్‌ బృందాలు ఆపరేషన్‌ చేపట్టాయి. ఇప్పటి వరకు విజయవాడలో 28, కాకినాడలో 2, ఏలూరులో 15 మందిని మిగతా ప్రాంతాల్లో మరికొంతమందితో కలుపుకుని మొత్తంగా రాష్ట్రంలో 50 మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేశారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు డంప్‌ల కోసం గాలింపు కొనసాగుతుంది. హిడ్మా డైరీ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు.విజయవాడలోని కానూరు వద్ద ఉన్న కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనంలో మావోయిస్టులు బస చేస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు జరిపారు. స్థానిక పోలీసుల సహకారంతో నలువైపుల నుంచి భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అల్లూరి జిల్లాలోని మారేడుమల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్​లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్ది హిడ్మా, అతని భార్య రాజే, నలుగురు అనుచరులు ఎన్‌కౌంటర్ అయిన కొద్ది సేపటికే విజయవాడ శివారులో భద్రతా బలగాల సోదాలు చేపట్టారు.

“మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు చనిపోయారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేశాం. మెుత్తం 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. అరెస్టైన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈరోజు ఉదయం 6.30 నుంచి 7 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. రెండ్రోజులుగా ఇంటలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలు విస్తృతం చేశాం.” -మహేష్ చంద్ర లడ్హా, ఇంటెలిజెన్స్ ఏడీజీ

క్రైసిస్ మేనేజిమెంటులో బాబు సక్సెస్ ఫార్ములా

క్రైసిస్ మేనేజిమెంటులో బాబు సక్సెస్ ఫార్ములా

తుపాను నష్టం, ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష – రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టంపై అంచనాలు

విపత్కర పరిస్థితులలో సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో చంద్రబాబు అందెవేసిన చేయి . ప్రకృతి వైపరీత్యాలను ఆపేసి టెక్నాలజీ లేకపోయినా . .. పక్కా ప్రణాళిక , నిరంతర మానిటరింగ్ , టెక్నాలజీ ఉపయోగించుకుని సాధ్యమైనంత నష్టం తగ్గించడం , , చంద్రబాబుకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో . ..

..29 ఏళ్ళ వ్యవధిలో విరుచుకు పడిన మూడు పెను తుపానుల మధ్య అతిపెద్ద సాంకేతిక విప్లవం వుంది. ఈ మూడు పెద్ద తుపాను సమయాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉండటం యాదృచ్చికమే . .

. 1996 కొనసీమ తుపాను (నవంబర్ 6, 1996) నాటికి కమ్యూనికేషన్లు, టెక్నాలజీ అంతగా లేవు. పెను తుపాను దెబ్బకి అపుడు 1000 మందికి పైగా చనిపోయారు. 2014 లో హుదూద్ తుపాను నాటికి కమ్యూనికేషన్లు బాగా పెరిగాయి. అపుడు 64 మంది చనిపోయారు. ఇపుడు మొంథా తుపాను నాటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనూహ్యంగా వ్యాపించింది. ఈ తుపానులో మరణాలు రెండుకి పరిమితం కావడం కాస్త బెటర్ . .

రాష్ట్రంలో తుపాను నష్టంపై తాజా వివరాలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.

రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. 59 వేలకుపైగా హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం కలిగిందని ఇంకా భారీ వర్షాలతో 78,796 మంది రైతులు నష్టపోగా, రాష్ట్ర వ్యాప్తంగా 42 పశువులు మృతి చెందాయని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని వివరించారు. దెబ్బతిన్న 2294 కి.మీ. పొడవున ఆర్​అండ్​బీ రహదారుల వల్ల ఆర్​అండ్​బీ శాఖకు రూ.1,424 కోట్లు నష్టం కలిగిందని తెలిపారు. రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్‌ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం వచ్చిందనిని అధికారులు సీఎంకి వివరించారు.

18 లక్షల మందిపై తుపాను ప్రభావం: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణమే జరగాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలని, పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ వేగంగా జరగాలని తేల్చిచెప్పారు. తుపాను తీరం దాటడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ప్రకృతి వైపరీత్యాలను అపేసే టెక్నాలజీలు లేవు. ముందు జాగ్రత్తల వల్ల ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ప్రాణనష్టాన్ని పూర్తిగా తగ్గించ వచ్చు. టెక్నాలజీ ని పూర్తిగా వినియోగించడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇంతటి సాంకేతికత లేనపుడే క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు కి మించిన నాయకుడు లేడన్న పేరు తెచ్చుకున్నారు. అన్ని వనరులను సమీకృతం చేసి పనిచేసే ప్రళాళికలే ఆయన విజయ రహస్యం.

1996 నవంబర్ 6 నాటి కోనసీమ తుపానులో 200 కిలోమీటర్ల గాలివేగానికి పబ్లిక్ ప్రయివేట్ ఆస్ధులు అపారంగా ధ్వంసమయ్యాయి. వెయ్యిమంది చనిపోయారు. కోనసీమ తుపాను నష్టాలకు ప్రధాన కారణం ఉప్పెన/ నీరు. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే ఏర్పడిన ఈ విపత్తులో సహాయక చర్యలకోసం ఆయన రాజమండ్రిలో మకాం వేశారు. సబ్ కలెక్టర్ ఆఫీసే సెక్రటేరియట్ / సిఎం పేషీగా మారిపోయింది. ప్రిస్సిపల్ సెక్రటరీ రమాకాంత రెడ్డి ప్రధాన అధికారిగా, ఆర్ డి ఒ శ్రీధర్ ఆయన ప్రధాన సహాయకుడిగా ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో “తుపాను సహాయక ప్రభుత్వమే” నడిచింది. కకా వికలమైం కోనసీమ కోలుకోడానికి ఆ తర్వాత ఐదారేళ్ళు పట్టింది.

అప్పటికి రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో రెండే కంప్యూటర్లు వున్నాయి. ప్లాస్టిక్ కవర్ తో ముసుగు వేసి వుండేవి. ఎందుకంటే అప్పటికి ఏడాది క్రితమే వచ్చిన “విండోస్ 95” కి ప్రయివేటు రంగం అలవాటు పడుతున్నంతగా ప్రభుత్వ రంగం అలవాటు పడలేదు. నల్లటి స్క్రీన్ మీద తెల్లటి text కనబడే Dos ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి విండోస్ 95 గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ (GUI) తో ప్రామాణికమైన, వినియోగం పెరుగుతున్న ఇంటర్‌ఫేస్‌గా మారింది. దీనిపై చంద్రబాబుకి లోతైన అవగాహన వుంది. ఆయన సూచన మేరకు సబ్ కలెక్టర్ ఆఫీస్ కంప్యూటర్లను అప్ డేట్ చేయించారు. కానీ దానిని వినియోగించే వారు అక్కడ లేకపోవడంతో వేరే చోట నుంచి తీసుకువచ్చారు .

18 ఏళ్ళు గడచిపోయాయి. ఈ మధ్యకాలంలో కమ్యూనికేషన్ సాధనాలైన కాల్ కాన్ఫరెన్సింగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ వీటిని నిర్వహించడానికి నిర్దిష్టమైన బెస్ట్ ప్రాక్టీసెస్ పాటిస్తూ, వాటి విజయాన్ని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేషన్స్ (KPIs) ద్వారా లెక్కగట్టడం మొదలైంది. ఈ సాంకేతికతలు ఫోర్త్ ఐటి రివల్యూషన్ కు ఊతమిచ్చాయి.

2014 అక్టోబర్ 12 న హుదూద్ తుపాను వచ్చింది. 210 కిలోమీటర్ల గాలివేగానికి విశాఖపట్నం ఏరియాలో 64 మంది చనిపోయారు. విద్యుత్ గ్రిడ్ పూర్తిగా కుప్పకూలడం వల్ల 21 వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లింది . హుదూద్ నష్టాలకు ప్రధాన కారణం భారీ గాలి. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విశాఖపట్టణంలో మకాం వేశారు. తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక సహాయ చర్యలు అమలు చేయించారు. విశాఖ ప్రాంతం ఏడాదిలో కోలుకోవడంలో చంద్రబాబు తనవంతు పాత్ర నిర్వహించారు .

ప్లానింగ్ + టెక్నాలజీ = క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు సూత్రం ఇదే . ..

కూలిపోయిన చెట్లను కూలీలతో ముక్కలు చేయించి రోడ్లను క్లియర్ చేయడం ఇందుకు వారాలు వారాలే పట్టడం 1996 నాటి పరిస్ధితి. అడ్డదిడ్డంగా పడిపోయిన స్ధంభాలు చెట్లను ఎత్తి పక్కన పెట్టడానికి క్రెయిన్లు అందుబాటులోకి రావడం 2014 నాటి పరిస్ధితి. ఈ పద్దెనిమేళ్ళలోనూ టెక్నాలజీ అనూహ్యంగా పెరిగింది .

11 ఏళ్ళు గడచిపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) అనూహ్యంగా వికసించింది. టెక్నాలజీ రియల్ టైమ్ గవర్నెన్స్ ను సాధ్యం చేస్తుంది. దీనికి ఫైబర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలు వచ్చాయి. లార్జర్ కనెక్టివిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) విస్తరిస్తోంది.

రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇపుడు వారి వారి డాష్ బోర్డుల మీద మొంథా తుపాన్ ని గమనిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సమస్త ప్రభుత్వ యంత్రాంగమూ ఇదే పనిలో వుంది. ఇందువల్ల ప్రాణ నష్టాన్ని జీరో శాతానికి తెచ్చే అవకాశం వుంది.

టెక్నాలజీ నివినియోగించుకోవడంతో పాటు సమస్యని గుర్తించడం (Identification) పరిష్కారానికి వనరుల్ని సమీకృతం చేయడం(Integration) అన్ని శక్తుల్ని భాగస్వామ్యం చేయడం(Involvement) చిత్తశుద్ధితో పని చేయడం (Integrity) – ఈ “I 4” సూత్రాన్ని పాటించడం వల్లే క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు నాయుడికి మించిన రాజకీయ నాయకుడు లేరన్న గౌరవాన్ని పేరు ప్రఖ్యాతుల్ని అయన గడించుకున్నారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డేటా మెదడు అయితే, కనెక్టివిటీ గుండె. విశాఖలో గూగుల్ AI డేటా సెంటర్ రావడమంటే

అది భారత్ కు మాత్రమే కాక కనీసం 12 దేశాల కనెక్టివిటీకి పెద్ద బ్యాక్ బోన్ గా నిలబడుతుందని చెప్పడం అతిశయోక్తికాదు .