రెండో విడత భూములు ఇవ్వకపొతే… అమరావతి మున్సిపాలిటీయే . .. చంద్రబాబు బెదిరింపు వెనుక . …

రెండో విడత భూములు ఇవ్వకపొతే… అమరావతి మున్సిపాలిటీయే . .. చంద్రబాబు బెదిరింపు వెనుక . …

33 వేల ఎకరాలు.. అమరావతి మున్సిసిపాలిటీయే . .. సీఎం చంద్రబాబు బెదిరింపు వెనుక ఏమి జరిగింది . .. రైతులలో ఆందోళన

కూటమి సర్కార్ అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తవుతున్నా …. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కూడా పూర్తిగా కేటాయించలేదు . రైతులు రోడ్డెక్కుతామని హెచ్చరిస్తే . .. కాస్త భయపడిన సర్కార్ వాళ్ళతో చర్చలకు దిగి వచ్చింది . లేకపోతె అంతే సంగతులు .

”అమరావతి విశ్వ నగరంగా ఎదగాలంటే మరింత భూమి కావాలి . ఇపుడున్న భూములతోనే నగరాన్ని అభివృద్ధి చేయాలంటే కుదరదు . విశ్వ నగరంగా రూపుదిద్దాలంటే మరోవిడత భూసమీకరణ తప్పనిసరి . లేకపోతె అమరావతి కేవలం ఒక మున్సిసిపాలిటీగా మిగిలిపోతుంది . దీనిపై రైతులు ఆలోచించుకోవాలి . ..” అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి ? 33 వేళా ఎకరాల భూమిని ఇచ్చింది . .. మున్సిసిపాలిటీ కోసమా ? ఈ ధోరణితో మాట్లాడటం సీఎం స్థాయికి తగునా ? రైతులను బెదిరిస్తున్నారు ? బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ? అన్న సందేహం కలగకమానదు .

”రైతులు రాజధాని కోసం త్యాగాలు చేసారు . వారి త్యాగాలకు వారి తర్వాత తరాలకు ప్రతిఫలం అందేలా చేస్తున్నాం . .” ఆంటు చంద్రబాబు పదేపదే చెపుతూ ఉంటారు . అలాంటి మాటలు చెప్పే చంద్రబాబు . .. 33 వేల ఎకరాలకు పరిమితం అయితే మిసిసిపాలిటీ గా మిగిలిపోతుంది . .. అంటూ అమరావతిపై నెగిటివ్ కామెంట్స్ చేయడంపై రైతులు , పలువురు మేధావులలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది . సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేత ఈ విధమైన బెదిరింపు ధోరణితో చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాలలో చర్చ సాగుతోంది .

ల్యాన్డ్ పూలింగ్ కి గ్రీన్ సిగ్నల్ . ..

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో వివాదాస్పద కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌ చేపట్టాలని రాష్ట్ర కేబినెట్‌లో ఆమోదం తెలిపింది. ఈ దశలో మరో16 వేల ఎకరాల సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. రాజధాని అమరావతి కోసం మొత్తం 50 వేల ఎకరాలు రైతుల నుంచి భూ సమీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. మొదటి దశలో రైతుల నుంచి 34 వేల ఎకరాల సమీకరణ.. రెండో దశలో మరో 16 వేల ఎకరాలపై కసరత్తు చేస్తోంది. త్వరలో ల్యాండ్‌ పూలింగ్‌‌కు సంబంధించిన నోటిఫికేషన్‌‌ను సీఆర్డీఏ విడుదల చేయనుంది.మొత్తం ప్రభుత్వ భూమి, రైతుల వద్ద నుంచి తీసుకున్న భూమితో కలిపి 74 వేల ఎకరాలలో రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఇక ఈ రెండో విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూ సేకరణ చేయనుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయిలో 2,168 ఎకరాలు, కర్లపూడిలో 2,946 ఎకరాలు, వడ్డమానులో 1,915 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అసైన్డ్‌ భూములతో కలిపి మొత్తం 20, 496 ఎకరాల భూ సేకరణ ద్వారా సీఆర్డీఏ తీసుకోనుంది.

అప్పుడు రిక్వస్ట్… ఇపుడు వార్న్0గ్ … రాజధాని కోసం భూ సమీకరణ సమయంలో రైతులు , రైతు నేతలను బతిమాలి భూసమీకరణకు ఒప్పించారు . అదే చంద్రబాబు టీమ్ . ..ఇపుడు భూములు ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీగా ఉండిపోతుంది . .. తర్వాత మీ ఇష్టం . ..అంటూ హెచ్చరికలు చేయడంపై రైతుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది . ”మొదటి విడత తీసుకున్న భూములను అభివృద్ధి చేసి . … రెండో విడత భూ సమీకరణ అంటే మేము సహకరిస్తాం . … ఏమీ లేకుండా మళ్ళీ భూములు అంటే . .. రాజకేయం తారుమారై . … జగన్ మళ్ళీ గెలిస్తే . .. మా పరిస్థితి ఎవరికీ చెప్పుకోవాలి . . ఇపుడు టీడీపీ , జనసేన ఎమ్మెల్యేల అరాచకాలకు ప్రజలలో తిరుగుబాట వచ్చి . .. కూటమి ఓటమిపాలైతే … జగన్ వచ్చి అమరావతిని స్మశానం చేస్తే . .. మా తర్వాత తరాల వారు ఏమి కావలి . ..దీని గురించి ఆలోచన చేయాలి . .. అని రైతులు కోరుతున్నారు .

అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ

అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ

”కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామికి అపవిత్రత కలిగించే పని నేను చేయను, ఎవరినీ చేయనివ్వను . .. ” అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ”దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుంది . ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదు . ..” సీఎం చంద్రబాబు ధీమాగా చెప్పారు .

అమరావతిలోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. రూ.260 కోట్లతో రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్‌ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు.

రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకార నిర్మాణం : మొదటి దశలో రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారాన్ని నిర్మిస్తారు. రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, కట్‌ స్టోన్‌ ఫ్లోరింగ్‌ నిర్మిస్తారు. రెండో దశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్‌రోడ్డు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్‌ హౌస్, పరిపాలన భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్‌ వంటి పనుల్ని చేపడతారు. వీటికి రూ.120 కోట్ల వ్యయం కానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

విద్యార్థులకు నైతిక విలువలు నేర్పమని చంద్రబాబు చెప్పారు . ..

విద్యార్థులకు నైతిక విలువలు నేర్పమని చంద్రబాబు చెప్పారు . ..

విద్యార్థులకు “విలువలపై విద్యాసదస్సులో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు .

”ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . .. నాకు ఫోన్ చేసి . .. చిన్నారులకు నైతిక విలువలు , కుటుంబ బాంధ్యవ్యాలు గురించి మీలాంటి వారు చేపితే వింటారు . ఎంతో మార్పు వస్తుంది . మీరు ఈ పని చేయాలి . .. అని కోరారు . పిల్లల కోసం చంద్రబాబు గారు పడుతున్న తపనకు నేను చలించి .. అంగీకరించాను . నాకు పదవుల కోసం మాత్రం కాదు . ..’ అని చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యములో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యార్థులకు “విలువలపై విద్యాసదస్సు”లో చాగంటి మాట్లాడారు . విద్యార్థులకు విలువలపై తమ అద్భుత సందేశాన్ని అందించారు. ముందు కుటుంబము నుండే విద్యార్థులలో విలువలకు బీజం పడుతుందని, అందుకే కుటుంబ అనుబంధములు, విలువలు అత్యంత ప్రధానమని, గురువులను మరియు తల్లిదండ్రులను గౌరవించటం యొక్క ఆవశ్యకతను గురించి అనేక మంది మహానుభావుల జీవిత విశేషాలను ఉటంకిస్తూ ప్రవచించారు. అనంతరం విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలకు వారు సమాధానములు ఇచ్చి, వారిని మరింత ప్రోత్సహించారు.

కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యా శాఖామాత్యులు నారా లోకేష్, విజయవాడ MP కేశినేని శివనాథ్ , పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ , డైరెక్టర్ . . విజయరామరాజు . , NTR జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల , , స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ – సమగ్ర శిక్ష బి శ్రీనివాసరావు ఇతర పురప్రముఖులు, విద్యార్థులు, వారి అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమములో శ్రీ చాగంటి వారు చెప్పిన ప్రతి మాట అమృత తుల్యమైనదని వారందరూ తమ ఆనందమును, కృతఙ్ఞతలు వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా మంత్రి లోకేష్ ,.. చాగంటి కోటేశ్వరరావుకి పాదాభివందనం చేశారు .

గూగుల్ డేటా సెంటర్ పై కుట్ర . ..

గూగుల్ డేటా సెంటర్ పై కుట్ర . ..

భూములు ఇవ్వొద్దంటూ రైతులను రెచ్చగొడుతున్న వైసీపీ

వరల్డ్ ఫెమస్ టెక్నీకల్ సంస్థ గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన డేటా సెంటర్ ను అడ్డుకునే కుట్రకు వైసీపీ నేతలు తెరతీసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి . రాష్ట్ర ప్రభుత్వం గూగుల్‌ డేటా సెంటర్‌ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది. ఐటీ దిగ్గజ సంస్థ ఏకంగా 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో విశాఖలో దీన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణకు కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి. కొందరు రైతుల ఫోర్జరీ సంతకాలతో, చనిపోయిన రైతు పేరుతో హైకోర్టులో పిటిషన్‌ వేశాయి. గూగుల్‌ ప్రాజెక్టుకు భూములు ఇవ్వవద్దని . . మిగతా రైతులనూ రెచ్చగొడుతున్నాయి. ఆ భూములు తమకే ఇస్తే ఎక్కువ డబ్బులిస్తామని ప్రలోభపెడుతున్నాయి. దీని పై స్థానిక తహసీల్దార్‌ ఈ నెల 3న ఫిర్యాదు చేస్తే, పోలీసులు కేసు నమోదు చేశారు.

రిటైర్డ్ ఐఏఎస్‌ బినామీతో కంప్లీన్ట్ . : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ చుట్టుపక్కల రైతులను మభ్యపెట్టి డీ-పట్టా భూముల్ని కొనేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారికి బినామీగా ఉన్న వ్యక్తే ఇప్పుడు ఈ కుట్ర పన్నారు. అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ పేరుతో డీ పట్టా భూముల విక్రయాలకు తెర తీయడంతో ఆ విషయం బయటకు రావడానికి ముందే అప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న ఆ ఐఏఎస్‌ అధికారి విశాఖ చుట్టుపక్కల ఎడాపెడా ఆ భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దానిపై విచారణ కూడా కూటమి సర్కార్ పక్కపెట్టింది . ఆయన తరఫున బినామీగా వ్యవహరించిన వ్యక్తి భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తర్లువాడలో రైతులకు అడ్వాన్స్‌లు చెల్లించి, వారితో ఒప్పందాలు చేసుకొని డీ పట్టా భూములను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు అదే తర్లువాడలో 308 ఎకరాల్ని గూగుల్‌కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 200 ఎకరాల డీ పట్టా, శివాయ్‌ జమేదార్‌ భూములను రైతులకు పరిహారమిచ్చి భూసేకరణ చట్టం ప్రకారం సేకరిస్తోంది. ఆ బినామీ గుప్పిట్లో పెట్టుకున్న 76 ఎకరాలు కూడా ఆ భూముల్లో ఉన్నాయి. దీంతో భూ సేకరణ ప్రక్రియనే అడ్డుకునేందుకు కుట్ర పన్ని రైతులతో కోర్టులో కేసు వేయించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డీపట్టా భూముల కొనుగోలులో దళారిగా వ్యవహరించి, ఆనందపురం మండలంలోని ఒక పంచాయతీ సర్పంచి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు ఆ బినామీ తరఫున రైతుల్ని ప్రలోభ పెట్టే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిని తానేనని కూడా ఆ దళారి ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు వస్తున్న రైతులను అడ్డుకుంటున్న వారిపై, రైతుల సంతకాలు ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దారు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఇలాంటి కుట్రలను అడ్డుకునేందుకు కూటమి సర్కార్ పకడ్బందీగా వ్యవహరించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి .

తులసి బాసో .. ఈ వరి పురాతనమైనది

తులసి బాసో .. ఈ వరి పురాతనమైనది

ఒకసారి నాటితే . .. మూడుసార్లు కోసుకోవచ్చు . . దేశీయ వెరైటీ

తులసి బాసో ….. ఇది ఒక సంప్రదాయ వరి రకం. రామాయణ కాలం నుంచీ ఈ వరి భారతదేశంలో సాగుచేశారని చెపుతారు .

ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర దేశీయ వరి రకం. ఆ రాష్ట్రంలో వందల సంవత్సరాలుగా ఈ అరుదైన వరి రకాన్ని సాగుచేస్తున్నారు . ఒకసారి నాట్లు వేసుకుంటే మూడుసార్లు పంట తీసుకోవచ్చు. ఆ ప్రాంతంలో కొంతమంది రైతులు ఇలాంటి అరుదైన దేశీయ వంగడాలను అంతరించిపోకుండా కాపాడుతున్నారు. వీరు మన సాంప్రదాయ విత్తనాల పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పాలి .

ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆర్గానిక్ మేళాలలో లేదా విత్తన మేళాలలో కలుసుకొని అరుదైన వరి వంగడాలను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు.

ఆ ప్రయత్నంలో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన అభ్యుదయ రైతు చందూల్ కుమార్ రెడ్డి ఈ అరుదైన వరి వంగడాన్ని అలాంటి రైతుల వద్ద సేకరించి, ఇప్పుడు ఒక ఎకరా తులసి బాసో పంట వేసినట్లు చెప్పారు .

తులసి బాసో పరిమళభరితమైన వరి రకం. “తులసి లాంటి సువాసన గల బియ్యం” అని అర్థం. అంటే సెంటెడ్ రకం. బాస్మతి లాగా మంచి సువాసన వస్తుంది. చిట్టి ముత్యాలులాగా చాలా చిన్న గింజ. తినడానికి చాలా మధురంగా ఉంటూ, ఎంత తిన్నా వెగటు అనిపించదు. భుక్తాయాసం రాదు.ఎక్కువ ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న బియ్యంగా గుర్తించబడింది. చిన్నపిల్లల ఎదుగుదలకు కావలసిన మంచి పోషక విలువలు మరియు ఔషధ గుణాలు ఉన్న బియ్యం. దేవాలయాలలో ప్రసాదాలకు, పాయసాలకు చాలా అనువైన రకం. రోజువారి అన్నంగా కూడా వండుకొని తినవచ్చు. కార్బోహైడ్రేట్లు తక్కువ మోతాదులో ఉండటం వలన ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న బియ్యంగా చెప్తారు. ముడి బియ్యంగా తింటే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.

తులసి బాసో పంట కాలం 135 రోజులు. ఖరీఫ్ కి మాత్రమే అనువైన రకం అంటే రోహిణి కార్తెలో వేసుకోగలిగితే మొదటి పంట 135 రోజులకి వస్తుంది. తరువాత 60 నుంచి 70 రోజులకు కోతకు వస్తుంది. మూడో పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. సహజంగా ప్రధాన పంటను కోసిన తర్వాత రెండవసారి మూడోసారి కోసినప్పుడు గింజ పరిమాణం తగ్గుతుంది. కానీ దీని గింజ పరిమాణం తగ్గదు. సువాసన, పరిమళం పెరుగుతుంది. మొదటి కోతకి, రెండవ కోతకి సువాసన పెరుగుతుంది. రెండవ కోతతో పోల్చుకుంటే మూడోసారి కోతకు వచ్చినప్పుడు అందులో సువాసన ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే రైతులు విత్తనానికి వినియోగపరిచేటువంటి వాళ్ళు మొదటి కోతలో ఉన్న పంటను మాత్రమే విత్తనానికి వినియోగించాలి.

రెండవ పంట మూడో పంట విత్తనానికి వినియోగించకపోవడమే మంచిది. ఎందుకంటే దిగుబడి తగ్గుతుంది. దిగుబడి పూర్తిస్థాయిలో మనం చూస్తే 135 రోజుల తర్వాత ఎకరానికి 15 నుంచి 18 క్వింటాల్ వస్తుంది. రెండవ కోతకి 6 నుంచి 8 క్వింటాల్ వస్తుంది. మూడవకోతకి ఐదు నుంచి ఆరు క్వింటాల్ వస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా దీనిని పండించవచ్చు. పంట ఒరగదు. ఎంతటి గాలులకైనా తట్టుకొని నిలబడుతుంది. తుఫాన్లు సైతం తట్టుకొని నిలబడి ఉండే రకం. అన్ని ప్రాంతాల వారు ఈ రకాన్ని పండించుకోవచ్చు.

ఇలాంటి అరుదైన వరి రకాలు సేకరించి,పండిస్తున్న అభ్యుదయ రైతు చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన చందూల్ కుమార్ రెడ్డిని ప్రక్రుతి సాగు రైతులే కాదు . .. అందరూ అభినందించాల్సిందే .

విత్తనాల కొరకు ఈ రైతును మీరు సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తూ పండించే విధానం, రైతులకు వివరిస్తారు. ఈ రైతుని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 6300027502, 9440809364

మావోయిస్టుల అలజడి

మావోయిస్టుల అలజడి

ఏపీలో 50 మందికి పైగా మావోయిస్టులు అరెస్టు – ఏకకాలంలో 5 జిల్లాల్లో మావోయిస్టుల కోసం పోలీసుల సోదాలు

దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత జోరుగా సాగుతోంది. 2027 నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలన్నది కేంద్ర సర్కార్ నిశ్చయం . ఇందులో భాగంగా వరుసగా మావోయిస్టుల ఏరివేత సాగుతోంది . స్వచ్చందంగా లొంగిపోవాలని ఇప్పటికే సర్కార్ అల్టిమేటం జారీచేసింది . లొంగకపోతే మట్టుపెడతామని వార్నింగ్ ఇచ్చారు . ఈ నేపథ్యంలో ఏరివేత శరవేగంగా సాగుతోంది . ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలం తర్వాత మావోయిస్టుల అలజడి రేగింది. ఆపరేషన్‌ కగార్‌తో వరుస ఎన్ కౌంటర్లు, అగ్రనేతల మృతితో ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌ వైపు వచ్చారన్న సమాచారంతో కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఏకకాలంలో రాష్ట్రంలోని అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్‌ బృందాలు ఆపరేషన్‌ చేపట్టాయి. ఇప్పటి వరకు విజయవాడలో 28, కాకినాడలో 2, ఏలూరులో 15 మందిని మిగతా ప్రాంతాల్లో మరికొంతమందితో కలుపుకుని మొత్తంగా రాష్ట్రంలో 50 మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేశారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు డంప్‌ల కోసం గాలింపు కొనసాగుతుంది. హిడ్మా డైరీ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు.విజయవాడలోని కానూరు వద్ద ఉన్న కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనంలో మావోయిస్టులు బస చేస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు జరిపారు. స్థానిక పోలీసుల సహకారంతో నలువైపుల నుంచి భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అల్లూరి జిల్లాలోని మారేడుమల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్​లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్ది హిడ్మా, అతని భార్య రాజే, నలుగురు అనుచరులు ఎన్‌కౌంటర్ అయిన కొద్ది సేపటికే విజయవాడ శివారులో భద్రతా బలగాల సోదాలు చేపట్టారు.

“మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు చనిపోయారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేశాం. మెుత్తం 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. అరెస్టైన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈరోజు ఉదయం 6.30 నుంచి 7 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. రెండ్రోజులుగా ఇంటలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలు విస్తృతం చేశాం.” -మహేష్ చంద్ర లడ్హా, ఇంటెలిజెన్స్ ఏడీజీ