తుపాన్ల లక్షణాలు ఎందుకు మారిపోతున్నాయ్‌?

తుపాన్ల లక్షణాలు ఎందుకు మారిపోతున్నాయ్‌?

వేగంగా బలపడి, అంత వేగంతో బలహీనపడిన ‘మొంథా’ వాతావరణ పెను మార్పులు

”మొంథా’, తుఫాను సోమవారం ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటబోతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంగా ఈదురు గాలులు వీస్తాయి .. కనుక జిల్లా అధికారులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి . .” అంటూ వాతావరణ శాఖ అధికారులు సీరియస్ గా అప్రమత్తం చేశారు . కాకినాడ జిల్లా యంత్రాంగం కూడా అన్ని చర్యలు చేపట్టింది . అయితే తుపాను తన దిక్కును మార్చుకుంది . ఇలా ఎందుకు జరుగుతుంది . వాతావరణ అంచనాలకు తుపాను వంటి వైపరీత్యాలు అందకపోతే ప్రమాదాలు మరింత పెరుగుతాయా ?

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం రూపంలో ప్రారంభమైన ‘మొంథా’, శనివారం ఉదయానికి వాయుగుండంగా, ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, రాత్రికి తుపానుగా మారింది. మంగళవారం నాటికి ఇది తీవ్రమైన తుపానుగా బలపడింది. కానీ తీరం దాటిన తర్వాత అదే వేగంతో బుధవారం తెల్లవారుజామున తుపానుగా, ఆపై తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.

తుపాన్ల లక్షణాలు మారిపోతున్నాయ్‌: ఏ రెండు తుపాన్లు ఒకేలా ఉండవు. అయితే వాతావరణ మార్పుల ప్రభావంతో ఇప్పుడు తుపాన్ల లక్షణాలు వేగంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘మొంథా’ తుపాను ఏర్పడే వరకు బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగిన విధంగా ఉన్నాయి. కానీ తర్వాత పరిస్థితులు అది బలం పుంజుకునేందుకు, ప్రభావం చూపేందుకు అనుకూలించలేదు. వాతావరణ మార్పుల దృష్ట్యా తుపాన్ల ప్రవర్తన మారిపోతోందని విశాఖపట్నం వాతావరణ నిపుణుడు ఆచార్య భానుకుమార్ తెలిపారు.

క్రైసిస్ మేనేజిమెంటులో బాబు సక్సెస్ ఫార్ములా

క్రైసిస్ మేనేజిమెంటులో బాబు సక్సెస్ ఫార్ములా

తుపాను నష్టం, ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష – రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టంపై అంచనాలు

విపత్కర పరిస్థితులలో సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో చంద్రబాబు అందెవేసిన చేయి . ప్రకృతి వైపరీత్యాలను ఆపేసి టెక్నాలజీ లేకపోయినా . .. పక్కా ప్రణాళిక , నిరంతర మానిటరింగ్ , టెక్నాలజీ ఉపయోగించుకుని సాధ్యమైనంత నష్టం తగ్గించడం , , చంద్రబాబుకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో . ..

..29 ఏళ్ళ వ్యవధిలో విరుచుకు పడిన మూడు పెను తుపానుల మధ్య అతిపెద్ద సాంకేతిక విప్లవం వుంది. ఈ మూడు పెద్ద తుపాను సమయాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉండటం యాదృచ్చికమే . .

. 1996 కొనసీమ తుపాను (నవంబర్ 6, 1996) నాటికి కమ్యూనికేషన్లు, టెక్నాలజీ అంతగా లేవు. పెను తుపాను దెబ్బకి అపుడు 1000 మందికి పైగా చనిపోయారు. 2014 లో హుదూద్ తుపాను నాటికి కమ్యూనికేషన్లు బాగా పెరిగాయి. అపుడు 64 మంది చనిపోయారు. ఇపుడు మొంథా తుపాను నాటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనూహ్యంగా వ్యాపించింది. ఈ తుపానులో మరణాలు రెండుకి పరిమితం కావడం కాస్త బెటర్ . .

రాష్ట్రంలో తుపాను నష్టంపై తాజా వివరాలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.

రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. 59 వేలకుపైగా హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం కలిగిందని ఇంకా భారీ వర్షాలతో 78,796 మంది రైతులు నష్టపోగా, రాష్ట్ర వ్యాప్తంగా 42 పశువులు మృతి చెందాయని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని వివరించారు. దెబ్బతిన్న 2294 కి.మీ. పొడవున ఆర్​అండ్​బీ రహదారుల వల్ల ఆర్​అండ్​బీ శాఖకు రూ.1,424 కోట్లు నష్టం కలిగిందని తెలిపారు. రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్‌ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం వచ్చిందనిని అధికారులు సీఎంకి వివరించారు.

18 లక్షల మందిపై తుపాను ప్రభావం: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణమే జరగాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలని, పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ వేగంగా జరగాలని తేల్చిచెప్పారు. తుపాను తీరం దాటడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ప్రకృతి వైపరీత్యాలను అపేసే టెక్నాలజీలు లేవు. ముందు జాగ్రత్తల వల్ల ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ప్రాణనష్టాన్ని పూర్తిగా తగ్గించ వచ్చు. టెక్నాలజీ ని పూర్తిగా వినియోగించడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇంతటి సాంకేతికత లేనపుడే క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు కి మించిన నాయకుడు లేడన్న పేరు తెచ్చుకున్నారు. అన్ని వనరులను సమీకృతం చేసి పనిచేసే ప్రళాళికలే ఆయన విజయ రహస్యం.

1996 నవంబర్ 6 నాటి కోనసీమ తుపానులో 200 కిలోమీటర్ల గాలివేగానికి పబ్లిక్ ప్రయివేట్ ఆస్ధులు అపారంగా ధ్వంసమయ్యాయి. వెయ్యిమంది చనిపోయారు. కోనసీమ తుపాను నష్టాలకు ప్రధాన కారణం ఉప్పెన/ నీరు. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే ఏర్పడిన ఈ విపత్తులో సహాయక చర్యలకోసం ఆయన రాజమండ్రిలో మకాం వేశారు. సబ్ కలెక్టర్ ఆఫీసే సెక్రటేరియట్ / సిఎం పేషీగా మారిపోయింది. ప్రిస్సిపల్ సెక్రటరీ రమాకాంత రెడ్డి ప్రధాన అధికారిగా, ఆర్ డి ఒ శ్రీధర్ ఆయన ప్రధాన సహాయకుడిగా ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో “తుపాను సహాయక ప్రభుత్వమే” నడిచింది. కకా వికలమైం కోనసీమ కోలుకోడానికి ఆ తర్వాత ఐదారేళ్ళు పట్టింది.

అప్పటికి రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో రెండే కంప్యూటర్లు వున్నాయి. ప్లాస్టిక్ కవర్ తో ముసుగు వేసి వుండేవి. ఎందుకంటే అప్పటికి ఏడాది క్రితమే వచ్చిన “విండోస్ 95” కి ప్రయివేటు రంగం అలవాటు పడుతున్నంతగా ప్రభుత్వ రంగం అలవాటు పడలేదు. నల్లటి స్క్రీన్ మీద తెల్లటి text కనబడే Dos ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి విండోస్ 95 గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ (GUI) తో ప్రామాణికమైన, వినియోగం పెరుగుతున్న ఇంటర్‌ఫేస్‌గా మారింది. దీనిపై చంద్రబాబుకి లోతైన అవగాహన వుంది. ఆయన సూచన మేరకు సబ్ కలెక్టర్ ఆఫీస్ కంప్యూటర్లను అప్ డేట్ చేయించారు. కానీ దానిని వినియోగించే వారు అక్కడ లేకపోవడంతో వేరే చోట నుంచి తీసుకువచ్చారు .

18 ఏళ్ళు గడచిపోయాయి. ఈ మధ్యకాలంలో కమ్యూనికేషన్ సాధనాలైన కాల్ కాన్ఫరెన్సింగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ వీటిని నిర్వహించడానికి నిర్దిష్టమైన బెస్ట్ ప్రాక్టీసెస్ పాటిస్తూ, వాటి విజయాన్ని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేషన్స్ (KPIs) ద్వారా లెక్కగట్టడం మొదలైంది. ఈ సాంకేతికతలు ఫోర్త్ ఐటి రివల్యూషన్ కు ఊతమిచ్చాయి.

2014 అక్టోబర్ 12 న హుదూద్ తుపాను వచ్చింది. 210 కిలోమీటర్ల గాలివేగానికి విశాఖపట్నం ఏరియాలో 64 మంది చనిపోయారు. విద్యుత్ గ్రిడ్ పూర్తిగా కుప్పకూలడం వల్ల 21 వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లింది . హుదూద్ నష్టాలకు ప్రధాన కారణం భారీ గాలి. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విశాఖపట్టణంలో మకాం వేశారు. తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక సహాయ చర్యలు అమలు చేయించారు. విశాఖ ప్రాంతం ఏడాదిలో కోలుకోవడంలో చంద్రబాబు తనవంతు పాత్ర నిర్వహించారు .

ప్లానింగ్ + టెక్నాలజీ = క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు సూత్రం ఇదే . ..

కూలిపోయిన చెట్లను కూలీలతో ముక్కలు చేయించి రోడ్లను క్లియర్ చేయడం ఇందుకు వారాలు వారాలే పట్టడం 1996 నాటి పరిస్ధితి. అడ్డదిడ్డంగా పడిపోయిన స్ధంభాలు చెట్లను ఎత్తి పక్కన పెట్టడానికి క్రెయిన్లు అందుబాటులోకి రావడం 2014 నాటి పరిస్ధితి. ఈ పద్దెనిమేళ్ళలోనూ టెక్నాలజీ అనూహ్యంగా పెరిగింది .

11 ఏళ్ళు గడచిపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) అనూహ్యంగా వికసించింది. టెక్నాలజీ రియల్ టైమ్ గవర్నెన్స్ ను సాధ్యం చేస్తుంది. దీనికి ఫైబర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలు వచ్చాయి. లార్జర్ కనెక్టివిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) విస్తరిస్తోంది.

రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇపుడు వారి వారి డాష్ బోర్డుల మీద మొంథా తుపాన్ ని గమనిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సమస్త ప్రభుత్వ యంత్రాంగమూ ఇదే పనిలో వుంది. ఇందువల్ల ప్రాణ నష్టాన్ని జీరో శాతానికి తెచ్చే అవకాశం వుంది.

టెక్నాలజీ నివినియోగించుకోవడంతో పాటు సమస్యని గుర్తించడం (Identification) పరిష్కారానికి వనరుల్ని సమీకృతం చేయడం(Integration) అన్ని శక్తుల్ని భాగస్వామ్యం చేయడం(Involvement) చిత్తశుద్ధితో పని చేయడం (Integrity) – ఈ “I 4” సూత్రాన్ని పాటించడం వల్లే క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు నాయుడికి మించిన రాజకీయ నాయకుడు లేరన్న గౌరవాన్ని పేరు ప్రఖ్యాతుల్ని అయన గడించుకున్నారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డేటా మెదడు అయితే, కనెక్టివిటీ గుండె. విశాఖలో గూగుల్ AI డేటా సెంటర్ రావడమంటే

అది భారత్ కు మాత్రమే కాక కనీసం 12 దేశాల కనెక్టివిటీకి పెద్ద బ్యాక్ బోన్ గా నిలబడుతుందని చెప్పడం అతిశయోక్తికాదు .

ప్లాస్టిక్ భూతం… ఆలోచిద్దాం ఒక్క నిమిషం

ప్లాస్టిక్ భూతం… ఆలోచిద్దాం ఒక్క నిమిషం

ప్లాస్టిక్ … విచ్చలవిడిగా వాడితే పర్యావరణం దెబ్బతుంటుంది . . ఇదే కదా మనమంతా అనుకునేది . ఇదొక్కటే కాదు . పర్యావరణం దెబ్బతినేకంటే ముందు మనం దెబ్బతింటాం . ప్లాస్టిక్ విరివిగా వాడేవాళ్లు ఆరోగ్యాలు పెనుప్రమాదంలో పడతాయి . ఇది గమనిస్తే పర్యావరణం మాట పక్కనపెడితే ముందు మానవ ఆరోగ్యాలు కదా . …

ఒకప్పుడు మనం స్నానం చేయడానికి వాడే బక్కెట్ లు ఇత్తడివి ఉండేవి, లేదా అల్యూమినియం బక్కెట్ ఉండేవి ,, అవన్నీ చాలా మంచిదే

చాలా హుందా తనమే,

ఒకసారి కొంటె కొన్ని సంవత్సరాలపాటు అలానే ఉంటాయి కొన్ని సార్లు వారు వాడి వారి పిల్లలాకు కూడా ఇచ్చేవారు మరి అలాంటివన్నీ కనుమరుగయ్యి వాటి స్థానం లో

ప్లాస్టిక్ అనే భూతం వచ్చేసింది

ప్లాస్టిక్ బక్కెట్ లో వేడి నీరు పోస్తే అది కచ్చితం గా నీటిలో కలుస్తుంది,,

ఆలోచించామా . … లేదే . .

చక్క పీటలు. లేవు

స్టూళ్లు లేవు,

ప్లాస్టిక్ స్టూల్ వచ్చేసాయి, వాటిమీద కూర్చుంటే వేడి జనరేట్ అవుతుంది సీట్ కింద 🥰

వెదురు బద్దలతో అల్లిన చాటలు . .. మెంతులు పేపర్లు నానబెట్టి చిక్కగా అలికిన అందమైన చాటలు, అల్లిక బుట్టలు పోయి

ప్లాస్టిక్ చాటలు వచ్చాయి

వంట గదిలో,

పప్పుల డబ్బాలు, పోపుల డబ్బాలు ఇత్తడివి, అల్యూమినియం, స్టీల్ వి విలువైనవి ఆరోగ్యాకరమైనవ వాటిని తోసేసి హానికలిగించే ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చి పెట్టేసాము

పచ్చళ్ళు, కారాలు సంవత్సరమ్ పాటు నిల్వ చేసుకునే పింగాని, జాడీలు, మట్టి కుండలు పోయి #ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేసాయి

అసలు ఎందుకు ఇలా మారామో కాస్త ఆలోచించండి

ఒక్కసారి కొంటె రొండు తరాలు లేదా మూడు తరాలు వాడగలిగే విలువైన వాటిని వదిలేసి

ఎప్పుడు కొనాల్సి వస్తూ మన ఆరోగ్యాన్ని దెబ్బతిసే విషాన్ని మనం ఎందుకు కొంటున్నామో ఆలోచించండి

ఇదంతా మనకు తెలియకుండా మన మెదళ్ళలో జోప్పించే మార్కెట్ మాయాజాలం. కూడా ఉంది

నీకు ఏది అవసరమో తెలియని ముర్కత్వంమూ ఉంది

ఒకే వస్తువును వాడటం నామోషీ., కొత్తదనం పేరుతో మారిపోతుండాలనే వెర్రితనం.

దానివలన

ఆరోగ్య పరంగా. ఎంత నష్టాన్ని కలగచేస్తుందో ఆలోచించాలి

నీ నుండి పుట్టబోయే నెక్స్ట్ తరాన్ని నాశనం చేస్తుంది కదా

ఏది మనకు అవసరమో ఆలోచిస్తే

మన తరువాతీ తరాన్ని మనం కాపాడుకోగలుగుతాం . (ప్రక్రుతి వ్యవసాయ రైతు . .. విజయా … గారి వాల్ నుంచి )

లేని “బాధితుడి” పై అల్లరికి జగన్ పార్టీ ప్రయత్నం

లేని “బాధితుడి” పై అల్లరికి జగన్ పార్టీ ప్రయత్నం

(కామినేని-బాలకృష్ణ-చిరంజీవి వివాదం కథ)

ఈ సారి అధికారంలోకి వచ్చేది మేమే అని ప్రజల్ని నమ్మించడానికి “ఏ ఒక్కరినీ వొదిలేది లేదు” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి పదే పదే చేసే చేస్తున్న ప్రయత్నాలు విఫలమైపోతూనే వున్నాయి. ప్రజల్లో జగన్ పై వ్యతిరేకత తగ్గలేదన్న నివేదికలను ఈ వైఫల్యాలు దృవపరస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ “కామినేని శ్రీనివాస్ – నందమూరి బాలకృష్ణ – చిరంజీవి” వివాదం.

ఇది యాదృచ్ఛిక పరిణామం కాదు. ఒక రాజకీయ వ్యూహం బెడిసికొట్టి, దాన్ని ప్రారంభించిన వారికే ఇబ్బందికరంగా మారిన ఉదంతం ఇది.

2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి, గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి శాసనసభను వేదికగా చేసుకుంది. ఈ క్రమంలో, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఒక వ్యూహాత్మక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల ధరల వివాదంపై చర్చించడానికి, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారని గుర్తుచేశారు.

చంద్రబాబుకి, చిరంజీవికి ఎన్ టి ఆర్ కుటుంబానికి సన్నిహితుడైన కామినేని ఉభయకుశలోపరి అన్నట్టుగా

చిరంజీవి గట్టిగా నిలదీస్తేనే జగన్ సమావేశానికి అంగీకరించారని కామినేని వ్యాఖ్యానించారు. దీని ద్వారా జగన్‌ను అహంకారిగా చిత్రీకరిస్తూ, అదే సమయంలో కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవిని హీరోగా ప్రశంసించడం ఆయన ఉద్దేశం.

కామినేని మాటలు ముగియకముందే, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జోక్యం చేసుకున్నారు. జగన్‌ను ఎవరూ నిలదీయలేదని కామినేని వాదనను ఖండించారు. అంతటితో ఆగకుండా, జగన్‌ను “సైకోగాడు” అంటూ అసభ్య పదజాలం ఉపయోగించారు. ఇది మిత్రపక్ష ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. జగన్‌కు ప్రధాన విమర్శకుడిగా తనకున్న ఇమేజ్‌కు, కామినేని వ్యాఖ్య భంగం కలిగిస్తుందని బాలకృష్ణ భావించి ఉండవచ్చు. ఏమైనా ఆయన ఆవేశపూరిత వ్యాఖ్యలు, కూటమిలోని సమన్వయ లోపాన్ని బయటపెట్టాయి.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి లౌక్యంగా ముగింపు పలికారు. ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తనను ఏమాత్రం అవమానించలేదని, సమావేశం స్నేహపూర్వకంగా జరిగిందని స్పష్టం చేశారు. గతంలో జగన్ – చిరంజీవి దంపతులను భోజనానికి ఆహ్వానించి సాదరంగా గౌరవించారు. తరువాత సినిమా రంగం ప్రతినిధులతో కలిసి చిరంజీవి వెళ్ళినపుడు జగన్ వీరిని పట్టించుకోనట్టు వ్యవహరించి తన ఆధిక్యత చూపించారు. ఇందులో చిరంజీవి పాక్షిక వాస్తవాన్ని మాత్రమే అశ్వద్ధామ హత: కుంజర అన్నట్టు ప్రస్తావించి అంతేకాకుండా, తన చొరవ వల్లే సినిమా టికెట్ ధరలు పెరిగాయని, అది బాలకృష్ణ నటించిన “వీర సింహారెడ్డి” చిత్రానికి కూడా మేలు చేసిందని సున్నితంగా గుర్తుచేశారు. ప్రత్యక్ష దాడికి దిగకుండా, వాస్తవాలతోనే ఆయన బాలకృష్ణకు సమాధానమిచ్చారు. తనను ఒక రాజకీయ పావుగా వాడుకోవడాన్ని నిరాకరిస్తూ, తన గౌరవాన్ని, స్వతంత్రతను చాటుకున్నారు.

బాలకృష్ణ వ్యాఖ్యలతో మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల బాలకృష్ణ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ వివాదం కూటమి ఐక్యతకు నష్టం చేస్తుందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే జోక్యం చేసుకున్నారు. ఆయన ఆదేశాలతో కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం ద్వారా వివాదాన్ని తుంచేశారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని వివరిస్తూ, రికార్డుల నుంచి తొలగించాలని పెద్దరికంతో హుందాగా స్పీకర్‌ను కోరారు. స్పీకర్, కామినేని, బాలకృష్ణ ఇద్దరి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.

ఈ వివాదాన్ని వైఎస్ఆర్సిపి తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించింది. కూటమిలో అంతర్గత కలహాలు ఉన్నాయని, వారు అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని తమ మీడియా ద్వారా ప్రచారం చేసింది. అయితే, ఈ వ్యూహం పూర్తిగా విఫలమైంది. చిరంజీవి ప్రకటనతో, ఈ కథనంలో “బాధితుడు” లేకుండా పోయారు. కూటమి నాయకత్వం వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించడంతో, వైఎస్ఆర్సిపి ప్రచారానికి ఆయుష్షు లేకుండా పోయింది.

ఈ సంఘటన వైఎస్ఆర్సిపికి రాజకీయంగా నష్టాన్నే మిగిల్చింది. ఎలాగంటే ఈ వివాదం కూటమిలోని బలహీనతను కాకుండా, సంక్షోభాన్ని పరిష్కరించగల వారి నాయకత్వ బలాన్ని ప్రదర్శించింది. చిన్న సమస్యపై అతిగా దృష్టి పెట్టడం ద్వారా, వైఎస్ఆర్సిపి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను విస్మరించిందని ప్రజలకు మరోసారి బోధపడింది. ఈ వివాదం, సినీ పరిశ్రమతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఉన్న ఘర్షణాత్మక గతాన్ని ప్రజలకు తిరిగి గుర్తు చేసింది. ఇది వారికి “బూమరాంగ్” అయింది.

భారత్‌పై   బిల్ గేట్స్  ప్రశంసలు .. ఎందుకు >?

భారత్‌పై బిల్ గేట్స్ ప్రశంసలు .. ఎందుకు >?

  • ఆవిష్కరణల రంగంలో ఇండియా ఓ గ్లోబల్ లీడర్ అవుతుందంటూ కితాబు
  • ‘వికసిత భారత్ 2047’ లక్ష్యానికి మద్దతుగా గేట్స్ ప్రకటన
  • భారత పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి మేలు చేస్తాయని వ్యాఖ్య

. ”ఆవిష్కరణల రంగంలో భారత్ ఒక ప్రపంచ స్థాయి నాయకుడిగా నిలుస్తోంది .., అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శకంగా ఉంది … అని బిల్ గేట్స్ కొనియాడారు. భారత పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మెరుగుపరిచే శక్తిని కలిగి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికాలోని సియాటిల్‌లో భారత కాన్సులేట్ జనరల్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన బిల్ గేట్స్ మాట్లాడుతూ… “ఈ రోజు భారత్ ఆవిష్కరణల్లో గ్లోబల్ లీడర్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను కాపాడి, మెరుగుపరిచే పరిష్కారాలను అందిస్తోంది. ‘వికసిత భారత్ 2047’ లక్ష్య సాధనలో భారత్‌తో మా భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు. గాంధీజీ ఆశయాలైన సమానత్వం, గౌరవం తమ ఫౌండేషన్ పనికి పునాది వంటివని గేట్స్ పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతి, కళలు, సంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. వాషింగ్టన్, సియాటిల్ నగర ప్రభుత్వాల నుంచి సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో ‘ప్రస్తుత ప్రపంచంలో గాంధీ విలువల ప్రాముఖ్యత’ అనే అంశంపై యూఎస్ గ్లోబల్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడు జొనాథన్ గ్రానోఫ్ ప్రత్యేక ప్రసంగం చేశారు.

బెల్వ్యూ పబ్లిక్ లైబ్రరీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి, సియాటిల్ సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.