ఇరాన్​ భూగర్భ క్షిపణి నగరాలే  లక్ష్యం.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు!

ఇరాన్​ భూగర్భ క్షిపణి నగరాలే లక్ష్యం.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు!

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తన ఆయుధ సంపత్తిని కాపాడుకునేందుకు ఇరాన్ వ్యూహాత్మకంగా నిర్మించుకున్న భూగర్భ క్షిపణి వ్యవస్థ ప్రమాదకరంగా మారింది . సదరు నగరాలు ఇప్పుడు ఆ దేశానికే ప్రతికూలంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్ష యుద్ధం ప్రకటించిన కొన్ని రోజులకే ఇరాన్ వ్యూహం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. భారీ భూగర్భ బంకర్ల నుంచి బయటకు వస్తున్న క్షిపణి లాంచర్లనే లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం, ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అత్యంత పకడ్బందీగా నిర్మించుకున్న క్షిపణి నగరాల్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? టెహ్రాన్ వ్యూహం ఎందుకు విఫలమైంది? 

తాజాగా ఇరాన్‌లోని డజన్ల కొద్దీ భారీ స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. క్షిపణులను ప్రయోగించేందుకు భూగర్భం నుంచి లాంచర్లు బయటకు రాగానే వాటిపై ముప్పేట దాడి చేస్తున్నాయి. అమెరికా భారీ బాంబర్ల దాడులతో ఇరాన్ ఆయుధాలు కొన్ని చోట్ల భూగర్భంలోనే చిక్కుకుపోయినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇరాన్ దక్షిణ నగరమైన షిరాజ్ సమీపంలోని స్థావరాలతో పాటు ఇస్ఫహాన్, తబ్రిజ్, కెర్మాన్‌షా సమీపంలోని స్థావరాలపై దాడులు జరిగినట్లు ఇటీవల తీసిన శాటిలైట్ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. దాడికి గురైన స్థావరాలన్నీ భూగర్భంలో ఉన్నప్పటికీ, వాటి పైభాగంలో ఉన్న భవనాలు, ప్రవేశ ద్వారాలు, రోడ్ల ద్వారా వాటిని సులభంగా గుర్తించి దాడులు చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇరాన్ అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. లాంచర్లను బయటకు తీసుకురాకుండా నేరుగా భూగర్భ బంకర్ల నుంచే క్షిపణులను ప్రయోగించేందుకు కొన్ని స్థావరాల వద్ద ఇరాన్ సైన్యం భూగర్భ గోతులను నిర్మించింది. దక్షిణ ఇరాన్‌లోని ఖోర్ముజ్ పట్టణం సమీపంలో ఉన్న ఒక స్థావరంలో ఇటువంటి సామర్థ్యాలున్న తొమ్మిది భూగర్భ గోతులు ఉన్నట్లు అమెరికా సైనిక మాజీ నిపుణుడు కాలిన్ డేవిడ్ వెల్లడించారు. ఇవి పర్షియన్ గల్ఫ్ వైపు చూసేలా పర్వతాల వాలులో తవ్విన లోతైన గుంతలు. పదే పదే ఈ గోతులను వినియోగించడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందుల వల్ల భూగర్భ ప్రయోగ కేంద్రాల ఆలోచనను ఇరాన్ దాదాపుగా విరమించుకుందని వాషింగ్టన్‌కు చెందిన సీఎన్ఏ కార్పొరేషన్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇరాన్​ను తక్కువ అంచనా వేయడంలేదా ?
ఇజ్రాయెల్, అమెరికా దాడుల నుంచి రక్షించుకునేందుకు యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ అప్రమత్తమైంది. కొన్ని క్షిపణులను, లాంచర్లను బంకర్ల నుంచి బయటకు తరలించి ఉండవచ్చని, తద్వారా వాటిని చెదరగొట్టి దాడుల నుంచి రక్షించుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు ఉన్న భారీ భూగర్భ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసే బంకర్-బస్టింగ్ బాంబులు అమెరికా ఆయుధాగారంలో పరిమితంగానే ఉన్నాయి. అందుకే, లాంచర్లు బయటకు రాగానే ప్రవేశ ద్వారాల వద్దే ధ్వంసం చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. క్షిపణులను అడ్డుకునే ఎయిర్-డిఫెన్స్ ఇంటర్‌సెప్టార్ల నిల్వలు అయిపోకముందే, టెహ్రాన్ ప్రయోగ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని వాషింగ్టన్ భావిస్తోంది.

తాజా దాడుల ప్రభావంతో ఇరాన్ నుంచి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల ప్రయోగాలు తగ్గుముఖం పట్టాయని ఇజ్రాయెల్, అమెరికా అధికారులు ధ్రువీకరిస్తున్నారు. సుదీర్ఘకాలం సాగే యుద్ధం కోసం ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే తన ఆయుధ నిల్వలను ఆదా చేసుకుంటున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ క్షిపణి నిల్వలపై భిన్నమైన అంచనాలున్నాయి. యుద్ధానికి ముందు ఇరాన్ వద్ద 2,500 క్షిపణులు ఉండొచ్చని ఇజ్రాయెల్ అంచనా వేయగా, సుమారు 6,000 వరకు ఉంటాయని అంతర్జాతీయ నిపుణులు అంచనావేస్తున్నారు .

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

తరిగిపోతున్న ఆయుధాలు – ఇరాన్​తో మరో 10 రోజులు యుద్ధం కొనసాగితే అమెరికా క్షిపణి నిల్వలు తగ్గే అవకాశం – పెంటగాన్ హెచ్చరిక

ఇరాన్‌తో సైనిక ఘర్షణ వేళ అమెరికా రక్షణ శాఖ అధికార వర్గాలు కీలక హెచ్చరిక చేసాయ ? అంతర్జాతీయ మీడియా సంస్థలు ఔవుననే చెపుతున్నాయి . ఇరాన్‌పై దాడులు ఇదేరీతిలో 10 రోజులకుపైగా కొనసాగితే అమెరికా మిస్సైళ్ల నిల్వలు మరింత తగ్గిపోయే అవకాశం ఉంటుందని పెంటగాన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారంటూ అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అమెరికా ఇప్పటికే టోమాహాక్ ల్యాండ్ ఎటాక్ మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థల్లో వినియోగించే ఎస్ఎం-3 ఇంటర్‌సెప్టర్ల కొరతను ఎదుర్కొంటోందని ఆ అధికారి చెప్పారని కథనంలో సదరు మీడియా పేర్కొనడం గమనార్హం .

ఏ నిల్వలు తగ్గిపోతాయి ?
సీఎన్ఎస్, ఖతర్ ప్రభుత్వ మీడియా సంస్థ అల్ జజీరా, అమెరికా మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ అంశంపై కథనాలను ప్రచురించాయి. దీర్ఘకాలం పాటు ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తే అమెరికా కీలక ఆయుధ నిల్వలన్నీ తగ్గిపోయే ముప్పు ఉంటుందని దేశాధ్యక్షుడు ట్రంప్‌‌ను హెచ్చరించామని పెంటగాన్ అధికార వర్గాలు, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ డ్యాన్ కైనీ చెప్పారంటూ ఆ కథనాలు పేర్కొన్నాయి. 2025 జూన్‌లో ఇరాన్ – ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ వేళ అమెరికా తన దగ్గరున్న థాడ్ గగనతల రక్షణ వ్యవస్థ ఇంటర్‌సెప్టర్లలో 25 శాతాన్ని వాడేసిందని పేర్కొన్నాయి. ఆ టైంలో ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ సంధించిన డ్రోన్లు, మిస్సైళ్లను అడ్డుకొని నిర్వీర్యం చేయడానికి దాదాపు 150 థాడ్ ఇంటర్‌సెప్టర్లను అమెరికా వినియోగించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

ఖరీదైన యుద్ధం . ..
ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధం ఖర్చు తడిపిమోపెడు అవుతోంది . అత్యు0త భారీగా ఉందని . . అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఉదయం ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి మొదటి 24 గంటల్లోగా అమెరికాకు దాదాపు రూ.7186 కోట్ల ఖర్చు అయినట్లు తెలుస్తోంది . గల్ఫ్ సముద్ర జలాల్లో యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లాంటి ఒక విమాన వాహక యుద్ధ నౌకను, అందులోని సైనికులు, యుద్ధ విమానాలను నిర్వహించడానికి ఒకరోజుకు రూ.59 కోట్ల దాకా ఖర్చు వస్తుందని అంచనా వేశారు. వాస్తవానికి ఇరాన్‌పై దాడులు చేయడానికి, దాదాపు నెల రోజుల ముందు నుంచే గల్ఫ్ సముద్ర జలాల్లో యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకల మోహరింపును అమెరికా మొదలుపెట్టింది.

యుద్ధం 4 వారాలు ఉంటే.. లక్షల కోట్ల ఖర్చు . ..

ట్రంప్ చెప్పినట్టుగా ఇరాన్‌తో సైనిక ఘర్షణ నాలుగైదు వారాల పాటు కొనసాగితే, అమెరికా యుద్ధం మొత్తం ఖర్చు రూ.19.37 లక్షల కోట్లకు చేరుతుందని అమెరికా రక్షణ రంగ అధ్యయన సంస్థ పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్‌కు చెందిన నిపుణుడు కెంట్ స్మెట్టర్స్ తెలిపారు. 2023 అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు రూ.2 లక్షల కోట్ల సైనిక సహాయాన్ని అమెరికా అందించింది. ఈ వ్యవధిలో యెమన్, ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను కాపాడటానికి అమెరికా సొంతంగా దాదాపు రూ.1 లక్ష కోట్ల సైనిక వ్యయాన్ని చేసింది. అంటే గత రెండున్నర ఏళ్లలో ఇజ్రాయెల్ రక్షణ కోసం అమెరికా దాదాపు రూ.3 లక్షల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా . .

ఏకకాలంలో ఎన్ని యుద్ధాలనైనా అమెరికా చేయగలదు : ట్రంప్
‘‘అమెరికా ఆయుధ సప్లైలు బలమైన స్థితిలో ఉన్నాయి. మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఇప్పుడు అమెరికా దగ్గర ఆయుధ నిల్వలు ఉన్నాయి. అన్ లిమిటెడ్‌గా ఆయుధాలను సప్లై చేసే సత్తా అమెరికాకు ఉంది. ఏకకాలంలో ఎన్ని యుద్ధాలనైనా అమెరికా చేయగలదు’’ అని పేర్కొంటూ ఇటీవలే ట్రూత్ సోషల్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పెట్టడం గమనార్హం. ఇలాంటి పోస్టులు చేయడం ట్రంప్ కి ముందు నుంచీ అలవాటే . . అని ప్రముఖులు చెపుతున్నారు .