అరాచకవాదులపై చర్యలేవీ? చంద్రబాబు ఎందుకు తటపటాయిస్తున్నారు ?

అరాచకవాదులపై చర్యలేవీ? చంద్రబాబు ఎందుకు తటపటాయిస్తున్నారు ?

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ పై గంటల వ్యవధిలోనే చర్యలు

భువనేశ్వరి, చంద్రభాబు , పవన్ కళ్యాణ్ , లోకేష్ , హోంమంత్రి అనిత, తదితరులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని వదిలేశారా ?

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ని పార్టీ నుంచి సస్పండ్ చేసి , , వెంటనే అరెస్ట్ చేశారు. మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని చెప్పిన మాటపై చంద్రబాబు నిలబడ్డారని ప్రజలలో మంచి పేరు సంపాదించారు. ఈ ఎపిసోడ్ లో పార్టీకి కూడా మైలేజ్ వచ్చింది. ఇంతవరకు ఒకే . కిరణ్ ని అరెస్ట్ చేయడం , సస్పండ్ చేయడం లో ఎవరికీ అభ్య0తరాలు లేవు . ‘తప్పు చేస్తే తమవాడైన వదిలేది లేదు . ‘ అనే సంకేతం పార్టీకి , ప్రభుత్వానికి మంచిదే . కానీ , అరాచకాలు చేసిన అవతలివాళ్ళను మాత్రం వదిలేస్తాం . . మనవాళ్లయితే లోపలేస్తాం . . అన్నట్లు కనిపిస్తోంది చంద్రబాబు ధోరణి.. అంటూ టీడీపీ సీనియర్ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయ్ .

అంతకుముందు . .. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి నేతలు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసారు. అంతటితో ఆగకుండా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయించారు. తప్పు తెలుసుకుని తర్వాత క్షమాపణ కూడా చెప్పలేదు . భారతిపై వ్యాఖ్యలు చేసిన కిరణ్ తప్పు తెలుసుకుని ”అలా మాట్లాడటం తప్పే ‘ ‘ అని లెంపలేసుకున్నాడు . అయినా అరెస్ట్ చేశారు . తప్పు అని చెప్పినా వదలమని కాదు . గతంలో భువనేశ్వరి , వంగలపూడి అనిత , చంద్రబాబు నాయుడు , లోకేష్ , పవన్ కళ్యాణ్ వంటి నేతలపై అసభ్య పదజాలాలతో విరుచుకుపడ్డారు . ఒకరోజు , రెండు రోజులు కాదు . . నెలల తరబడి జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు . అయినా వారిపై ఎలాంటి చర్యలు లేవు . చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు . అరాచకవాదుల ఆట కట్టిస్తాడనుకున్నారు . కానీ ఒకరిద్దరిని లోపలేశారు . చేతులు దులుపుకున్నారు . . అన్నట్లు చేస్తున్నారు . వైసీపీ అరాచకవాదులు ఇంకా పదుల సంఖ్యలో బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు . అయినా వారిపై చర్యలకు కూటమి సర్కార్ , ముక్యంగా సీఎం చంద్రబాబు చొరవ తీసుకోకపోవడానికి కారణాలపై టీడీపీ , జనసేన కేడర్ లలో అనుమానాలు రేకెత్తుతున్నాయి . వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు , లోకేష్, పవన్ కళ్యాణ్ లపై నే ఉంది .

నాసా బంపర్ ఆఫర్​! ఆ  సలహా ఇస్తే రూ.25కోట్లు

నాసా బంపర్ ఆఫర్​! ఆ సలహా ఇస్తే రూ.25కోట్లు

చంద్రుడిపై దాగి ఉన్న విశ్వ రహస్యాలను శోధించేందుకు దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. సుమారు 50 ఏళ్లుగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ జాబిల్లిపైకి తమ వ్యోమగాములను పంపుతోంది. అయితే అపోలో మిషన్‌లో భాగంగా చంద్రడిపైకి వెళ్లిన నాసా వ్యోమగాముల 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వచ్చారు. 1969-72 మధ్య అపోలో మిషన్‌లో భాగంగా నాసా ఆరు సార్లు వ్యోమగాములను జాబిల్లికి పంపించింది. ఆ సమయంలో వ్యోమగాములు అక్కడి నుంచి రాళ్లు, ఇతర నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి తీసుకొచ్చారు. లూనార్ మాడ్యూల్స్‌లో స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకొని 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వస్తున్నారు.

తమిళనాడులో ఏపీ తరహా పాలిటిక్స్

తమిళనాడులో ఏపీ తరహా పాలిటిక్స్

అన్నాడీయంకె తో చేతులు కలిపిన బీజేపీ – 2026 ఎన్నికల కోసం ఏడాది ముందే రంగంలోకి . ,

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మరియు మిత్ర పక్ష పార్టీలతో కలిసి పోటీ చేయడానికి ఎఐఎడిఎంకె తిరిగి ఎన్డీఏలోకి చేరింది. ఈ కూటమి ఎన్నికల్లో గెలిస్తే సీట్ల భాగస్వామ్యం మరియు ప్రభుత్వ కూర్పు వంటి విధానాలను తరువాత చర్చిస్తారు.

తమిళనాడు లో బీజేపీకి 3 శాతం కూడా ఓట్లు లేవు. అయినా 2026 ఎన్నికలలో ఆ రాష్ట్రంలో కాలుమోపెందుకు , 2029 సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాదిలో బలోపేతం అయ్యే సంకల్ప0తో కమలనాధులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు . 2024 లో ఆంధ్రప్రదేశ్ లో సైతం . .. 2 శాతం ఓట్లులేని బీజేపీ 8 అసెంబ్లీ , నాలుగు లోక్ సభ సీట్లను గెలుపొందడం ద్వారా తమ సత్తా చాటుకుంది .

తమిళనాడులో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, ఎఐఎడిఎంకె ఇతర మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తాయి.

చెన్నైలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా బిజెపి-ఎఐఎడిఎంకె కూటమి పునరుద్ధరణను ప్రకటించారు. ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి హాజరైనప్పటికీ, విలేకరుల సమావేశంలో మాత్రం అంతా ఆయన మౌనంగానే ఉన్నారు.

అన్నామలైను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాతే ఈ కూటమి ఏర్పడిందా అని అడిగినప్పుడు, షా మాట్లాడుతూ, “అందులో కొంచెం కూడా నిజం లేదు ఎందుకంటే అన్నామలై ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు మరియు అందుకే ఆయన నా పక్కనే కూర్చున్నారు” అని అన్నారు.

పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్య మరియు ప్రభుత్వ కూర్పు – కూటమి ఎన్నికల్లో గెలిచిన తర్వాత – తరువాత చర్చిస్తామని షా అన్నారు. “వాటి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు.

డీఎంకే ప్రభుత్వ వైఫల్యం, శాంతిభద్రతల సమస్యలు మరియు మహిళలకు భద్రత లేకపోవడం వంటి అంశాలను సనాతన ధర్మం, త్రిభాషా విధానం మరియు నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలను లేవనెత్తడం ద్వారా డీఎంకే ప్రభుత్వ వైఫల్యం, శాంతిభద్రతల సమస్యలు మరియు మహిళలకు భద్రత లేకపోవడం వంటి అంశాలను మళ్లిస్తున్నారని బీజేపీ నాయకుడు అన్నారు.

నీట్ అంశంపై, డీఎంకే ప్రజల దృష్టిని మళ్లించడానికి తన సమస్యలను ఉపయోగిస్తోందని షా అన్నారు.

బిజెపి ఎల్లప్పుడూ తమిళ ప్రజలను, తమిళ రాష్ట్రాన్ని మరియు తమిళనాడును గౌరవిస్తుందని హోంమంత్రి అన్నారు.

“ఆ గౌరవం మరియు తమిళ వారసత్వాన్ని గౌరవిస్తూ, శ్రీ నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్‌ను ప్రతిష్టించారు. కానీ డిఎంకె దానిని తప్పుగా సూచిస్తోంది” అని ఆయన మండిపడ్డారు .

“మేము తిరుక్కురల్‌ను వివిధ ప్రపంచ భాషలలోకి అనువదిస్తున్నాము, ఇది ఇప్పటికే 63 భాషలలోకి అనువదించబడింది. అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు తమిళనాడులో శాస్త్రీయ తమిళంలో పరిశోధనలు చేస్తున్నాయి. ప్రధాన మంత్రి మోడీ తమిళ సాహిత్య పండితుల రచనలను కూడా ప్రచురించారు. నేడు, తమిళనాడులోని యువత తమిళంలో ఐఎఎస్ మరియు ఐపిఎస్ వంటి పోటీ పరీక్షలు రాయగలరు. కానీ కేంద్రంలో డిఎంకె కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇది సాధ్యం కాలేదు” అని కూడా ఆయన అన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఆయా రాష్ట్ర భాషలలో వైద్య మరియు ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తుందని షా అన్నారు. “గత మూడు సంవత్సరాలుగా, నేను తమిళనాడును సందర్శించిన ప్రతిసారీ, నేను దీని గురించి ఎంకె స్టాలిన్‌ను కోరుతున్నాను. అయితే, ఈ కోర్సులు ఇప్పటికీ తమిళంలో అందించడం లేదు” అని ఆయన అమిత్ షా చేసిన ఆరోపణలను ఈ సందర్బంగా గుర్తుచేసుకోవాలి .

డీఎంకేపై షా నిప్పులు చెరిగారు
డీఎంకే తన ఎక్సైజ్ విధానం ద్వారా ₹39,000 కోట్ల అవినీతికి పాల్పడిందని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఉచిత ధోతీ పంపిణీ మరియు 100 రోజుల ఉపాధి పథకం MGNREGA కూడా అవినీతిలో కూరుకుపోయాయని ఆయన అన్నారు.

“డీఎంకే ఇసుక అవినీతి మరియు విద్యుత్ అవినీతితో సహా వివిధ అవినీతి కార్యకలాపాలకు పాల్పడింది. వారు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు” అని ఆయన అన్నారు.

ఏఐఏడీఎంకే నాయకులు కేపీ మునుసామి, ఎస్పీ వేలుమణి మరియు తంగమణి కూడా ఎడప్పాడితో ఉన్నారు.

మార్చి 25న ఎడప్పాడి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రతినిధి బృందం ఢిల్లీలోని షా నివాసంలో ఆయనను సందర్శించిన తర్వాత తమిళనాడులో సంబంధాలను పునరుద్ధరించే చర్యలు బహిరంగంగా వెలువడ్డాయి.

అమరావతి దూసుకుపోతుందా ?

అమరావతి దూసుకుపోతుందా ?

ఆంధ్రుల రాజధాని అమరావతి నిజంగానే దూసుకుపోతుందా? కూటమి నేతలు చెపుతున్నట్టు ‘ప్రపంచంలోనే టాప్ – 5 సిటీస్ ‘ లో చోటు దక్కించుకుంటుందా ? వీరు చేస్తున్న ప్రకటనలకు , ఫీల్డ్ లో జరుగుతున్న పనులకు పొంతన కనిపిస్తుందా ? కనీసం పదేళ్ళకయినా ప్రపంచ నగరాలతో పోటీపడే ప్లాన్ తో అమరావతి నిర్మాణం కొనసాగుతుందా ?

ఈ నేపథ్యంలో నాలుగైదేళ్ల వరకు అమరావతి ప్రాంతంలో భూముల ధరలలో పెద్ద మార్పు ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు . అయితే ప్లాట్లు యజమానులు మాత్రం …. ఇపుడు ప్రకటించిన ప్రాజెక్టులు ప్రారంభం అయితే . .. ఐదారు నెలలలోనే గజం లక్షకు పెరుగుతుందని ఆశతో ఉన్నారు.

హైదరాబాద్ ఎఫెక్ట్ : 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రా నుంచి పెట్టుబడులు హైదరాబాద్ తరలిపోయాయి . ఆ సమయంలో హైదరాబాద్ మంచి హైప్ లో ఉంది. అక్కడ వందల కోట్ల రూపాయలు పెట్టి భూములు , విల్లాలు కొనుగోలు చేశారు . ఇటీవల రెండేళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనం అంచున సాగుతోంది . ఈ నేపథ్యంలో అక్కడ విక్రయించి . . అమరావతిలో పెట్టుబడులు పెడదామని భావిస్తున్న ఆంధ్రులకు అవకాశం దొరకడంలేదు . దీంతో అమరావతికి వచ్చే పెట్టుబడులు నిరాశాజనకంగా ఉన్నట్లు రియల్ ఎస్టేట్ సంస్థలు భావిస్తున్నాయి.

పదేళ్ల సమయం పడుతుంది : అమరావతి విశ్వనగరంగా అవతరించాలంటే కనీసం పదేళ్ల సమయం పడుతుంది . ఇపుడు జరుగుతున్న అభివృద్ధికి బ్రేక్ లేకుండా . .. 2029 లో కూడా కూటమి అధికారంలోకి వస్తే ఈ పనులు కొనసాగుతాయి . పొరపాటునో , గ్రహపాటునో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే అమరావతిని మళ్ళీ భ్రష్టు పట్టించారని చెప్పలేం . .. ఇదే కారణంతో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మెజారిటీ పెట్టుబడిదారులు తటపటాయిస్తున్నారు . దీనిపై కూటమి సర్కార్ , ,, కేంద్ర పెద్దలతో మాట్లాడుకుని జనంలో బలమైన నమ్మకం కలిగేలా చేయగలగాలి . లేకపోతె చంద్రబాబు చెపుతున్న కబుర్లకు , జరుగుతున్న పనులకు కొంత గ్యాప్ ఉండటంతో ప్రజల్లో విశ్వాసం కలగదు. దీనిని కూటమి నేతలు గుర్తెరగాలి .

లోకేష్ కి టీడీపీ పగ్గాలు :  పిఠాపురం వర్మ

లోకేష్ కి టీడీపీ పగ్గాలు : పిఠాపురం వర్మ

”లోకేష్ ని డిప్ట్యూటీ సీఎం చేయాలి . .” అంటూ మూడు నెలల క్రితం టీడీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రి , చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని సరికొత్త పల్లవి అందుకున్నారు.  కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో మాట్లాడిన వర్మ పార్టీకి లోకేశ్ నాయకత్వం ఎంతో అవసరమని స్పష్టం చేసారు . రాష్ట్ర రాజకీయాలలో యువతకు స్ఫూర్తివంతమైన నేతగా లోకేష్ గుర్తింపు పొందారన్నారు . లోకేశ్ తెలుగుదేశం పార్టీ రథసారథిగా నియమించాలని ఈ సందర్బంగా టీడీపీ అధిష్టానానికి , చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారని, అది పార్టీ విజయానికి దోహదం చేసిందని వర్మ అన్నారు. 

పిఠాపురం అసెంబ్లీ నుంచి బరిలో తప్పుకుని జనసేన అధినేత పవన్ కి టికెట్ ఇచ్చారు . ఇందుకు ప్రతిగా వర్మకు ఎమ్ఎల్సి ఇస్తామని చంద్రబాబు , పవన్ హామీ ఇచ్చారు . అయితే వర్మకు ఘలక్ ఇచ్చారు . అయినా వర్మ పార్టీకి విధేయంగానే ఉన్నారు . ఈ సమయంలో వర్మపై జనసేన నేత నాగబాబు చేసిన కామెంట్స్ పై పిఠాపురం టీడీపీ కేడర్ ఆగ్రహంగా ఉంది . దీనిపై టీడీపీ అధిష్టానం సైతం వర్మను సముదాయించే పని చేయడంలేదు . అయినా వర్మ తన ఆగ్రహాన్ని బయటపెట్టకుండా టీడీపీని వెన్నంటే ఉన్నారు .

కాకినాడ సభలో వర్మ . .. పార్టీ భవిష్యత్తు కోసం 2047 ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లోకేశ్ నాయకత్వానికి కార్యకర్తలు సంపూర్ణ మద్దతు చెపుతున్నారని కూడా చెప్పుకొచ్చారు .