by Abhi Correspondent | Jun 12, 2025 | జనరల్
పాకిస్తాన్ దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నప్పటికీ, బ్రహ్మోస్ క్షిపణులను విరివిగా ఎందుకు తయారు చేయలేము ?
ఏ దేశానికి మనం బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించాలన్నా . .. రష్యా అనుమతి తీసుకోవాల్సిందే . అనుమతి అంటే కండిషన్ లాగా కాకుండా . .. మిత్రత్వంతో కూడినదిగా… అని కూడా చెప్పుకోవచ్చు . ..
”ఆపరేషన్ సిందూర్” సందర్భంగా భారత వైమానిక దళం పాకిస్తాన్లోని తొమ్మిది వైమానిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసినప్పుడు, ఆ ప్రభావం ఉపఖండం దాటి చాలా దూరం ప్రతిధ్వనించింది. ఈ సూపర్సోనిక్ క్షిపణుల వల్ల కలిగే ఖచ్చితత్వం, వేగం మరియు విధ్వంసం బిగ్గరగా మరియు స్పష్టమైన సందేశాన్ని పంపాయి. భారతదేశం ఇక ముందు ప్రపంచ స్థాయి భారీ ఆయుధాల కొనుగోలుదారు మాత్రమే కాదు, అది ఉత్పత్తిదారు కూడా అయింది .
అత్యంత ఖచ్చితమైన, అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణులలో పేరొందిన బ్రహ్మోస్, సైనిక వర్గాలలో రాత్రికి రాత్రే సెలబ్రిటీ హోదాను పొందింది. దీనిని భూమి, గాలి లేదా సముద్రం నుండి ప్రయోగించవచ్చు, మాక్ 3 వేగంతో (ధ్వని వేగం కంటే మూడు రెట్లు) ప్రయాణిస్తుంది మరియు దాని లక్ష్యం నుండి ఒక మీటర్ లోపల దాడి చేయగలదు. రఫీకి మరియు మురీద్ వంటి పాకిస్తాన్ స్థావరాలపై దాని భీకర దాడి వారి వైమానిక రక్షణలను నిస్సహాయంగా చేసింది. పాకిస్తాన్ ఒక్క బ్రహ్మోస్ను కూడా ఎగురవేయకుండా ఆపగలదు.
2022లో మొదటి అధికారిక కొనుగోలుదారుగా మారిన ఫిలిప్పీన్స్ వంటి దేశాలు త్వరలోనే వియత్నాం, ఇండోనేషియా, ఈజిప్ట్, యుఎఇ, సౌదీ అరేబియా మరియు బ్రెజిల్లను అనుసరించాయి – ఇవన్నీ పాకిస్తాన్ రక్షణలను దెబ్బతీసిన క్షిపణిని కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి.అయితే, ఒక ముఖ్యమైన అడ్డంకి ఉంది. క్షిపణి పూర్తిగా భారతీయమైనది కానందున భారతదేశం బ్రహ్మోస్ను స్వేచ్ఛగా అమ్మకూడదు.
భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) మరియు రష్యా యొక్క NPO మాషినోస్ట్రోయేనియా మధ్య జాయింట్ వెంచర్ ఫలితంగా బ్రహ్మోస్ ఏర్పడింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ క్షిపణి ఉత్పత్తిని పర్యవేక్షిస్తుంది, కానీ మూడవ దేశానికి ప్రతి అమ్మకానికి రష్యా ఆమోదం అవసరం. రెండు దేశాలకు క్షిపణి సాంకేతికతలో 50-50 వాటా ఉంది. అందువల్ల, రష్యా అధికారిక అనుమతి లేకుండా భారతదేశం దానిని ఎగుమతి చేయదు.
ఈ వీటో అధికారం ప్రధాన వ్యూహాత్మక చిక్కులను కలిగి ఉంది. ఉదాహరణకు, ఇండోనేషియా వంటి దేశం ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, రష్యా దాని భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు లేదా ఇప్పటికే ఉన్న పొత్తుల కారణంగా సంకోచిస్తే చర్చలు నిలిచిపోవచ్చు. సౌదీ అరేబియా లేదా UAE వంటి మధ్యప్రాచ్య దేశాలు, మాస్కోతో సన్నిహిత US సంబంధాలు మరియు సంక్లిష్ట సంబంధాలు కలిగిన దేశాల విషయంలో, రష్యాకు తీవ్రమైన అభ్యంతరాలు ఉండవచ్చు. మరియు దక్షిణ చైనా సముద్రం వంటి ప్రాంతాలలో, ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో, రష్యా బ్రహ్మోస్ అమ్మకాల ద్వారా పరోక్షంగా ఒక వైపు ఆయుధాలు సమకూర్చుకోవడం ద్వారా ఘర్షణలు పెరగకుండా ఉండటానికి ఇష్టపడవచ్చు.
భారతదేశం కీలక రక్షణ భాగస్వాములుగా భావించే దేశాలు కూడా క్రెమ్లిన్ ఆమోదం కోసం వేచి ఉండాలి.
ఈ సంక్లిష్టతకు తోడుగా, భారతదేశం క్షిపణి సాంకేతిక నియంత్రణ పాలన (MTCR) పట్ల నిబద్ధత ఉంది, ఇది సభ్య దేశాలు కాని దేశాలకు 300 కిలోమీటర్లకు మించి పరిధి కలిగిన క్షిపణులను ఎగుమతి చేయడాన్ని నిరోధించే ప్రపంచ ఒప్పందం. కట్టుబడి ఉండటానికి, బ్రహ్మోస్ ఎగుమతి వెర్షన్ 290 కి.మీ పరిమిత పరిధిని కలిగి ఉంది – భారతదేశం ఇప్పుడు ఉపయోగించే విస్తరించిన-శ్రేణి వేరియంట్ల కంటే చాలా తక్కువ, వీటిలో కొన్ని 800 కి.మీ వరకు చేరుకోగలవని నివేదించబడింది.
కాబట్టి, భారతదేశానికి రష్యన్ ఆమోదం అవసరం మాత్రమే కాదు, అంతర్జాతీయ కొనుగోలుదారులకు క్షిపణి సామర్థ్యాలను కూడా పరిమితం చేయాలి.
ఈ ద్వంద్వ పరిమితి, రష్యా సహ-యాజమాన్యం మరియు MTCR నియమాలు, భారతదేశ రక్షణ ఆశయాలలోని వైరుధ్యాన్ని బహిర్గతం చేశాయి. ఒక వైపు, భారతదేశం ప్రపంచ ఆయుధ ఎగుమతిదారుగా మారాలని మరియు విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటుంది.
వ్యంగ్యం ఇంతకంటే పదునుగా ఉండదు. పాకిస్తాన్పై భారతదేశం యొక్క సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించిన అదే క్షిపణి ఇప్పుడు దాని ఆధారపడటాన్ని గుర్తు చేస్తుంది. న్యూఢిల్లీ దౌత్యం మరియు నిరోధ సాధనంగా బ్రహ్మోస్ను ఉపయోగించాలనుకుంటే, అది మాస్కోతో ఎగుమతి నిబంధనలను తిరిగి చర్చించుకోవాలి లేదా ఎటువంటి షరతులు లేకుండా పూర్తిగా స్వదేశీ ప్రత్యామ్నాయ అభివృద్ధిని వేగవంతం చేయాలి.అప్పటి వరకు, బ్రహ్మోస్ భారతదేశం యొక్క అత్యంత ప్రాణాంతక ఆయుధంగా ఉంటుంది, కానీ అది ప్రపంచ వేదికపై పూర్తిగా విడుదల చేయలేనిది.
by Abhi Correspondent | Jun 7, 2025 | ట్రెండింగ్
ప్రపంచ కుబేరుడు , టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన సాంకేతిక సామ్రాజ్యాన్ని భారత్ కి విస్తరిస్తున్నాడు
స్టార్లింక్కు తలుపులు తెరిచిన భారత్- ఇక మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలు
శాటిలైట్ ఇంటర్నెట్ విప్లవానికి భారత్ కొన్నాళ్ల క్రితమే నాంది పలికింది. అడవులు, ఎడారులు, కొండలు, కోనలు, సముద్రాలు, పర్వతాలు, హిమానీనదాలు అని తేడా లేకుండా ఎక్కడైనా అంతర్జాలం సేవలను అందించే విఖ్యాత శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల కంపెనీ స్టార్లింక్కు భారత్ తలుపులు తెరిచింది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన ఈ కంపెనీకి లైసెన్సును భారత టెలికాం శాఖ మంజూరు చేసింది. స్టార్లింక్ రాకతో దేశీయ ఇంటర్నెట్ సేవల ముఖచిత్రం మారే అవకాశం ఉంది. ఫైబర్ కేబుల్స్తో క్షేత్రస్థాయిలో నెట్వర్క్ను నిర్మించాల్సిన అవసరం లేకుండానే దేశంలో ఎక్కడికైనా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చే ‘స్టార్లింక్’ ఎలా పనిచేస్తుంది? స్పీడ్, డేటా వివరాలేంటి? ఇంటర్నెట్ ప్యాకేజీల రేట్లు ఎంత?స్టార్లింక్ రాకతో భారత్కు చేకూరే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అనే వివరాలు ఇపుడు భారత్ లో ఆసక్తికరంగా మారాయి .
బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్,,
2000 సంవసరానికి ముందే శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రయత్నాలు మొదలైనప్పటికీ అవి విశ్వవ్యాప్తం కాలేకపోయాయి. మారుమూల ప్రాంతాలకు వాటిని చేర్చేందుకు ప్రత్యేక కసరత్తు జరగలేదు. దీంతో ఉన్నత వర్గాల వారికే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు పరిమితమయ్యాయి. స్టార్లింక్ ద్వారా ఈ పరిమితులను అధిగమించేలా ఆలోచన చేసిన ఘనుడు ఎలాన్ మస్క్ అని చెప్పొచ్చు. ఆయన ఇంటర్నెట్ కనెక్షన్కు కొత్త నిర్వచనం ఇచ్చారు. బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలకు సముద్ర గర్భం, అండర్ గ్రౌండ్ మొదలుకొని ఇంటి కిటికీ వరకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అవసరం అవుతాయి. టవర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే మారుమూల ప్రాంతాల్లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్తో నెట్వర్క్ నిర్మాణం అనేది భారీ వ్యయంతో కూడుకున్న పని.
42,000 శాటిలైట్స్ …
స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా ఎలాన్ మస్క్దే. ఈ కంపెనీ 2019 నుంచి స్టార్ లింక్ ఉపగ్రహాలను ప్రయోగించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం 7వేలకుపైగా స్టార్ లింక్ ఉపగ్రహాలు భూమి దిగువ కక్ష్య(LEO)లో తిరుగుతున్నాయి. స్పేస్ ఎక్స్కు చెందిన ‘ఫాల్కన్- 9’ రాకెట్ ఒకేసారి 60 స్టార్లింక్ ఉపగ్రహాలను భూమి దిగువ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. అందుకే కేవలం ఆరేళ్ల వ్యవధిలో 7వేలకుపైగా శాటిలైట్ల నెట్వర్క్ను స్టార్లింక్ తయారు చేసుకోగలిగింది. ఒక్కో ఉపగ్రహం 259 కేజీల బరువు ఉంటుంది. రాబోయే కొన్నేళ్లలో తమ శాటిలైట్ల సంఖ్యను 42వేలకు పెంచాలని ఎలాన్ మస్క్ టార్గెట్ల.
స్టార్లింక్ పని తీరు ఇలా ఉంటుంది…
స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు ప్రస్తుతం భూమి దిగువ కక్ష్యలో ఉన్న 7వేల ఉపగ్రహాలే ఆధారం. ఈ శాటిలైట్లతో కూడిన స్టార్లింక్ నెట్వర్క్ అంతరిక్షంలోని శూన్యత ద్వారా రేడియో సిగ్నల్లను ఉపయోగిస్తుంది. స్టార్లింక్ గ్రౌండ్ స్టేషన్లు తమ ఉపగ్రహాలకు రేడియో సిగ్నల్స్ను పంపుతాయి. ఈ రేడియో సిగ్నల్స్ను అందుకోగానే స్టార్లింక్ శాటిలైట్లు ఇంటర్నెట్ డేటాను భూమిపై వివిధ చోట్ల ఉన్న యూజర్ల డివైజ్లకు చేరవేస్తాయి.
by Abhi Correspondent | Jun 6, 2025 | జాతీయం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ప్రధాని మోడీ సింధూరం మొక్కను నాటారు . ‘ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారం ద్వారా 700 కి.మీ మేర విస్తరించి ఉన్న ఆరావళి పర్వతశ్రేణులను హరితభరితం చేయాలనేది మా లక్ష్యం. ప్రజలతో మొక్కలు నాటించి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును బలోపేతం చేయడమే మా సంకల్పం. ఆరావళి పర్వతశ్రేణులు ఈ భూమిపైనే అత్యంత ప్రాచీనమైనవి. ఇవి గుజరాత్, రాజస్థాన్, హరియాణా, దిల్లీలలో విస్తరించి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ పర్వతశ్రేణులు సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. పర్యావరణపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆయా సవాళ్లను అధిగమించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఆరావళి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంచేందుకు మా ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై ఎక్కడికక్కడ స్థానిక అధికార యంత్రాంగాలతో కలిసి పనిచేయబోతున్నాం. జల వ్యవస్థల నిర్వహణను మెరుగుపర్చడం, ఇసుక తుఫానులకు నిరోధించడం, థార్ ఎడారి తూర్పు వైపుగా విస్తరించకుండా నిలువరించడం వంటివన్నీ చేయబోతున్నాం’’ అని పేర్కొంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు .
‘ఆపరేషన్ సిందూర్’ను గుర్తు చేస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ సిందూరం మొక్కను నాటారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గురువారం తన అధికారిక నివాసానికి సమీపంలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్లో మొక్క నాటి ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. దేశంలోని ప్రతీ ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు పాటుపడి, పచ్చదనాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ చేపట్టిన సైనిక చర్య పేరు ‘ఆపరేషన్ సిందూర్’. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధాని మోదీ సిందూరం మొక్కను నాటడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రత్యేకంగా హాజరయ్యారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, దిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా కూడా పాల్గొన్నారు.
by Abhi Correspondent | May 28, 2025 | తెలంగాణ, బిజినెస్
వాస్తవ పరిస్థితులకు భిన్నంగా 200, 300 శాతం ధరలు కృత్తిమంగా పెంచేసి హైప్ చేసిన మార్కెట్లు ఎప్పటికైనా కిందకు దిగి వాస్తవ ధరలకు రావలిసి0దే కదా . …
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. అయితే గత పాలకులు కేసీఆర్, కెటిఆర్ వంటి వారి స్వార్ధ్య ప్రయోజనాల కోసం ఉన్న ధరలకు హెచ్చు చూపించడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మెడకు ఉరితాడు పడినట్లయింది .
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం నాలుగైదేళ్లుగా నేల చూపులు చూస్తోంది. ఇటీవల వరకు దూసుకుపోయిన మార్కెట్ రానున్న రోజుల్లో ఎటువంటి పెరుగుదల చూపే అవకాశం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఏళ్ళ తరబడి స్థిరమైన వృద్ధిని సాధించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం దీర్ఘకాలిక మందగమన సంకేతాలను చూపుతోంది.ప్రస్తుతానికి ధరల పెరుగుదల రోజులు నగరంలో ముగిసిపోవచ్చని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.రాబోయే ఐదు నుండి ఆరు సంవత్సరాలలో, ధరల పెరుగుదల స్థిరంగా ఉంటుందని వార్షిక వృద్ధి కేవలం 3-7%గా ఉంటుందని అంచనా వేశాయి పరిశ్రమవర్గాలు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ప్రస్తుతం ఊపు రాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వాస్తవ ధరలతో పోలిస్తే మార్కెట్ ధర చాలా ఎక్కువ . . ఇప్పటికే అత్యధిక రేట్ల స్థాయికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చేరుకుంది. వచ్చే ఐదేళ్ల తర్వాత ఎంత విలువ ఉంటుందో ముందే అంచనా వేసుకున్న బిల్డర్లు ఇప్పుడే ఆ ధరకు విక్రయాలు ప్రారంభించారు. అందుకే హైదరాబాద్ నగరంలో రియల్ ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి.ఈ నేపథ్యంలో ధరలు కొంత కాలం స్థిరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
మరొక కీలకమైన అంశం ఏంటంటే.. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యం జరగడం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR), మెట్రో రైలు విస్తరణ – రెండూ నగరం యొక్క కనెక్టివిటీ, నివాసయోగ్యతకు గేమ్-ఛేంజర్లుగా ప్రచారం చేయడం ప్రభావం చూపుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కాకుంటే 2026 తర్వాత వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన ఊపును కొనసాగించడానికి ఇబ్బంది పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా, సమర్థవంతంగా అమలు చేయకపోతే, జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించారని.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక తెలిపింది . ప్రస్తుతం సిటీలో అపార్ట్మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.6000 గా ఉంది. ఏడాదిలో అపార్ట్మెంట్ల ధరలు దాదాపు 9 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు మొదలయ్యాయి . అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్లో క్షీణత నమోదయినట్లుగా తెలుస్తోంది. ఇదే పరిస్థితి మరో ఐదారేళ్ళ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు .
by Abhi Correspondent | May 27, 2025 | ఆరోగ్యం
సాధారణ జ్వరంతోనే సరి …. కోవిడ్ ఆందోళన ఎందుకు మరి ? ??
చైనాలోని వుహాన్లో 2019 చివరిలో మొదలైన కోవిడ్-19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించి, ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఎండమిక్ దశలో స్థిరపడినట్లు వివిధ దేశాల వైరాలజిస్టులు కొంతకాలంగా నిర్ధారిస్తున్నారు. ఈ వైరస్ పాండమిక్ (అదుపులేని వ్యాప్తి, ఉదృతి) ఎపిడమిక్( కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వ్యాప్తి, ఉదృతి) ఎండమిక్ (వ్యాప్తి, ఉద్ధృతుల బలహీనం) అనే మూడు కీలక దశల్లో క్రమంగా బలహీనపడి ఇపుడు ఒక సీజనల్ వ్యాధిగా తగ్గిపోయింది.
మూడుదశల కోవిడ్: 1. పాండమిక్ దశ: 2019 డిసెంబరులో కోవిడ్ -19 మొదలైంది. 2020 మార్చి నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని పాండమిక్గా ప్రకటించింది. 180కి పైగా దేశాలకు వ్యాపించిన ఈ వైరస్, 2020 ఏప్రిల్ నాటికి 10 లక్షల కేసులు మరియు 54,000 మరణాలను నమోదు చేసింది. అయితే నమోదు కాని కోవిడ్ మరణాలు లక్షల్లోనే వున్నాయి. భారతదేశంలో మొదటి కేసు 2020 జనవరి 30న కేరళలో నమోదైంది. లాక్డౌన్లు, ప్రయాణ ఆంక్షలు, మరియు ఆర్థిక సంక్షోభం ఈ దశలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపాయి.
2 ఎపిడమిక్ దశ : 2021-22 లో, భారతదేశంలో డెల్టా వేరియంట్తో రెండవ వేవ్ ఎపిడమిక్ లక్షణాలను ప్రదర్శించింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరిగాయి. ఆక్సిజన్ కొరత, ఆసుపత్రి పడకల సమస్యలు, అధిక మరణాలు ఈ దశలో ఆరోగ్య వ్యవస్థను సవాలు చేశాయి. ఈ సమయంలో టీకా కార్యక్రమాలు వేగవంతం కావడంతో క్రమంగా స్థితి మెరుగుపడింది.
3 ఎండమిక్ దశ: 2022 చివరికల్లా, విస్తృత టీకా కార్యక్రమాలు, రోగనిరోధక శక్తి, వైరస్ తీవ్రత తగ్గడంతో కోవిడ్-19 ఎండమిక్ దశలోకి ప్రవేశించింది. ఒక తాజా X (ట్విట్టర్) పోస్ట్ ప్రకారం, 2023 నుండి ఈ వైరస్ సీజనల్ ఫ్లూ లాంటి వ్యాధిగా మారినట్లు నిపుణులు పేర్కొన్నారు.ప్రస్తుత వేరియంట్లపై తాజా సమాచారం పరిమితంగా ఉన్నప్పటికీ, గతంలో దీనిని ఒమిక్రాన్ (BA.1, BA.2, BA.5, JN.1) వంటి ఉప-వేరియంట్లు) 2021-2023 మధ్య ఆధిపత్యం వహించాయి. ఈ వేరియంట్లు డెల్టాతో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఉన్నాయి. WHO , భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త వేరియంట్లపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నాయి.
ప్రస్తుత స్థితి, వేరియంట్లు: 2025 మే నాటికి, కోవిడ్-19 ఎండమిక్ దశలో ఉంది, దీని ప్రభావం సీజనల్ వ్యాధుల స్థాయిలో ఉంది. టీకాలు బూస్టర్ డోసులు విస్తృతంగా అందుబాటులో ఉండటంతో తీవ్రమైన కేసులు గణనీయంగా తగ్గాయి.