చంద్రబాబు కూరగాయలు కొన్నారు…

Rama Chandra P

సాగు చేసిన రైతులే విక్రయదారులుగా ఉండే మార్కెట్ రైతు బజార్. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ‘రైతు బజార్ ‘ కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ లో సూపర్ హిట్ అయింది.

శనివారం సీఎం చంద్రబాబు కర్నూల్ వెళ్లారు . ఈ సందర్బంగా కర్నూలులోని సి క్యాంప్ రైతు బజార్‌లో స్థానిక విక్రేతల నుండి తాజా కూరగాయలు కొనుగోలు చేశారు . ఈ సందర్బంగా కూరగాయల విక్రేతలతో మాట్లాడి సాగు వివరాలు క్షున్నంగా తెలుసుకున్నారు .

”కూరగాయలు , కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయడం చాలా అద్భుతంగా ఉంది. నేటి వేగవంతమైన ప్రపంచంలో, సరైన పోషకాహారం ద్వారా మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో మన రైతులు పోషించే కీలక పాత్రను మనం గుర్తించాలి. మా రైతులకు మీ మద్దతును చూపించడానికి మీరందరూ మీ స్థానిక రైతు బజార్‌ను సందర్శించాలని నేను కోరుతున్నాను.” అంటూ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు . ఈ సందర్బంగా కొనుగోలు చేసిన కూరగాయలు , కిరాణా సామాన్లకు ఫోన్ పే ద్వారా సీఎం డబ్బు చెల్లించారు.

రైతన్నలకు వరం :  రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. కేంద్రం ఇచ్చే కిసాన్ నగదుకు సమానంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని హామీ ఇచ్చారు . కర్నూలు(Kurnool) జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ”స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ క్యాంప్ రైతుబజార్‌కు ఆయన వెళ్లారు. కూరగాయలు కొనుగోలు చేశారు . అక్కడ రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్ధాలతో ఎరువుల తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మి నగర్‌లో ఉద్యానవన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

You May Also Like…