సైకత శిల్ప కళద్వారా జనంలో అవగాహన కల్పిస్తున్నందుకు దక్కిన ఛాన్స్ . .
తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన సోహిత , దేవిన ధన్యత సోదరీమణులు . వీరు పదేళ్లుగా సైకత శిల్ప కళ ద్వారా జనంలో అవగాహనా తీసుకువస్తున్నారు . వ్యవసాయ సంక్షోభం , ఆడపిల్లల పట్ల వివక్షత , వంటి సామాజిక వివక్షతలపై అవగాహన కల్పిస్తున్న వీరిని రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసింది . ఈ అమ్మాయిల తండ్రి దేవిన శ్రీనివాస్ సైకత శిల్పి . ఆర్టిస్ట్ . జాతీయ , అంతర్జాతీయ సైకత శిల్ప పోటీలలో శ్రీనివాస్ పాల్తొన్నారు .
ఉగాది సందర్బంగా గురువారం విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతులమీదుగా సోహిత , ధన్యత ఉగాది పురస్కారాలు అందుకున్నారు .



