మావోయిస్టుల అలజడి

Rama Chandra P

ఏపీలో 50 మందికి పైగా మావోయిస్టులు అరెస్టు – ఏకకాలంలో 5 జిల్లాల్లో మావోయిస్టుల కోసం పోలీసుల సోదాలు

దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత జోరుగా సాగుతోంది. 2027 నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలన్నది కేంద్ర సర్కార్ నిశ్చయం . ఇందులో భాగంగా వరుసగా మావోయిస్టుల ఏరివేత సాగుతోంది . స్వచ్చందంగా లొంగిపోవాలని ఇప్పటికే సర్కార్ అల్టిమేటం జారీచేసింది . లొంగకపోతే మట్టుపెడతామని వార్నింగ్ ఇచ్చారు . ఈ నేపథ్యంలో ఏరివేత శరవేగంగా సాగుతోంది . ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలం తర్వాత మావోయిస్టుల అలజడి రేగింది. ఆపరేషన్‌ కగార్‌తో వరుస ఎన్ కౌంటర్లు, అగ్రనేతల మృతితో ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌ వైపు వచ్చారన్న సమాచారంతో కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఏకకాలంలో రాష్ట్రంలోని అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్‌ బృందాలు ఆపరేషన్‌ చేపట్టాయి. ఇప్పటి వరకు విజయవాడలో 28, కాకినాడలో 2, ఏలూరులో 15 మందిని మిగతా ప్రాంతాల్లో మరికొంతమందితో కలుపుకుని మొత్తంగా రాష్ట్రంలో 50 మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేశారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు డంప్‌ల కోసం గాలింపు కొనసాగుతుంది. హిడ్మా డైరీ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు.విజయవాడలోని కానూరు వద్ద ఉన్న కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనంలో మావోయిస్టులు బస చేస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు జరిపారు. స్థానిక పోలీసుల సహకారంతో నలువైపుల నుంచి భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అల్లూరి జిల్లాలోని మారేడుమల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్​లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్ది హిడ్మా, అతని భార్య రాజే, నలుగురు అనుచరులు ఎన్‌కౌంటర్ అయిన కొద్ది సేపటికే విజయవాడ శివారులో భద్రతా బలగాల సోదాలు చేపట్టారు.

“మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు చనిపోయారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేశాం. మెుత్తం 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. అరెస్టైన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈరోజు ఉదయం 6.30 నుంచి 7 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. రెండ్రోజులుగా ఇంటలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలు విస్తృతం చేశాం.” -మహేష్ చంద్ర లడ్హా, ఇంటెలిజెన్స్ ఏడీజీ

You May Also Like…