ఏపీలో ‘రియల్ ఎస్టేట్’ జోరందుకుంటుందా ?

Rama Chandra P

ఇపుడిపుడే పెరుగుతున్న లావాదేవీలు – 2026 జనవరికి మరింత స్పీడ్

అమరావతి రెండవ విడత భూ సమీకరణ అంశంతో వెనుకంజ . .. లేకపోతె మరింత దూకుడు

ఐదారేళ్లుగా కుంటినడకన సాగిన రియల్ ఎస్టేట్ ఏపీలో కాస్త ఊపందుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే ఊపు కొనసాగితే 2026 జనవరి – ఫిబ్రవరి నెలలనాటికి మరింత జోరందుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు . అమరావతిలో రెండవ విడత ల్యాన్డ్ పూలింగ్ అంశం తెరపైకి రావడంతో ఒక్కసారిగా రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కి బ్రేక్ పడింది . ఇది ప్రభుత్వం చేసిన తెలివిమాలిన పనిగా రాజధాని ప్రాంత వాసులు చెపుతున్నారు . భూముల ధరలు పెరిగిన తర్వాత మరోవిడత భూ సమీకరణకు వెళ్లి ఉంటె ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేదని చెపుతున్నారు .

రియల్ ఎస్టేట్ మందగమనానికి ప్రధానంగా ధరలు పెరగడం ఒక కారణమ్ కాగా . … జనం దగ్గర డబ్బు కొరత ఏర్పడటం మరో కారణం . ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగం గత కొన్ని సంవత్సరాలు స్తబ్దతను వీడుతోంది . స్టాంపులు, అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరగదాన్ని పరిశీలిస్తే . .. ఈ రంగం మళ్లీ రికవరీ మొదలు అవుతున్నట్టు కనిపిస్తోంది . రాజధాని అమరావతి, పరిసర ప్రాంతాలలో లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం, ఇతర జిల్లాల్లో పెరుగుతున్న లావాదేవీలు అన్ని కలిపి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఊపిరి ఊపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూ వ్యవహారాలు పెరిగి, కొంతకాలం ఆగిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుబడిదారుల్లో ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపడం ప్రారంభమైంది. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల నుండి వచ్చే ఆదాయం పెరగడం రియల్ ఎస్టేట్ రంగం తిరిగి లాభదాయక దిశలోకి వస్తున్నదని సూచిస్తోంది.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 2024కి పోలిస్తే 44% ఆదాయ వృద్ధి నమోదు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి . అమరావతిలో రూ. 60,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు ప్రారంభం కావడం .. పనులు వేగవంతంగా సాగడం వంటివి కూడా రియల్ భూమ్ పెరుగుదలకు కారణం .

ఇటీవల రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఎక్కువగా కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలలో నమోదయ్యాయి . వీటిలో ఎక్కువ ఆదాయం రికార్డ్ అయింది. అమరావతిలో భూస్థూల ధరలు పెరిగిన తర్వాత కూడా లావాదేవీలు పెరుగుతునే ఉన్నాయి. అమరావతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎన్ మురళి మాట్లాడుతూ . .. 2024 ఎన్నికల తర్వాత భూ స్థల ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొన్ని లావాదేవీలు నెమ్మదిగా జరిగాయి. ఇపుడిపుడే ఊపందుకుంటున్నాయి .

అమరావతి, చుట్టుపక్కల భూములు , సైట్స్ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, డెవలపర్లు మరియు పెట్టుబడిదారులు భవిష్యత్తులో మంచి అవకాశాలున్న సరసమైన ధరల ప్రాంతాలపై ఫోకస్ పెడుతున్నారు . అమరావతి, గుంటూరు, ఒంగోలు , నెల్లూరు, విశాఖపట్టణం వంటి జిల్లాల్లో భూమి మరియు భవనాల ధరలలో కూడా కొంత పెరుగుదల కనిపిస్తోంది . అమరావతిలో కొన్ని ప్రాంతాల్లో ధరలు ఎక్కువగా ఉన్నా, గుంటూరు, రాజమండ్రి , నెల్లూరు, విశాఖ వంటి ప్రాంతాల్లో కొంచెం అందుబాటులో ధరలు ఉన్నాయి. దీని వల్ల కొత్త పెట్టుబడిదారులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే దానిలో కాస్త ఆలోచనలో పడుతున్నారు .

నాలా రద్దుతో గ్రామాల్లో ‘రియల్ జోరు ‘ “” వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించాలంటే భూమార్పిడి జరగాలి . దీనికోసం స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు రియల్టర్లను , పారిశ్రేమికవేత్తలను మామూళ్ల కోసం వేధించేవారు . దీనిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి . ఇదే సమయంలో నాలా బదులు . .. స్థానిక సంస్థలకు కొంత ఫీజు చెల్లించడం వల్ల ఆ నిధులు స్థానికంగా ఖర్చుచేసుకునే సౌబల్యం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సూచన కూడా సర్కార్ పరిగణలోకి తీసుకుంది . దీంతో నాలా రద్దు చేసారు . దీనివల్ల ముక్యంగా గ్రామీణ్ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఊపందుకోనున్నాయ్ .

You May Also Like…