ఫోన్ ట్యాపింగ్ లో ‘కెసిఆర్’ ఇరుక్కోవాల్సిందే…

Ram Maddipati

ఫోన్ ట్యాపింగ్‌. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మ‌రోసారి సంచ‌ల‌నంగా మారింది . తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, BRS చీఫ్ కేసీఆర్ ప్ర‌భుత్వ హ‌యాంలో మొద‌లై ఆ త‌ర్వాత ఇటు ఏపీకి కూడా ఈ అరాచ‌కం విస్త‌రించిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తెలంగాణలో ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వ ద‌ర్యాప్తులో వెలుగుచూసిన‌ట్టు వ‌స్తున్న వార్త‌లు అటు రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌తోపాటు ఇటు సామాన్య ప్ర‌జ‌ల‌ను కూడా నివ్వెర‌ప‌రచేవే. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌తోపాటు ప‌లువురుపారిశ్రామికవేత్త‌లు, సినీ ప్ర‌ముఖులు, వ్యాపారులు కూడా ఈ ఘ‌ట‌న‌లో బాధితులేన‌ని వార్త‌లు వెలువ‌డుతుండ‌టం వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో కొంద‌రు నేత‌ల కార‌ణంగా విలువ‌లు ఎంత‌గా దిగ‌జారిపోయాయో స్పష్టం అవుతోంది .

గ‌తంలో ఏపీ.. తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్ న‌గ‌రంలో నాడు టీడీపీ నేత‌గా ఉన్న రేవంత్‌రెడ్డిపై జ‌రిగిన స్టింగ్ ఆప‌రేష‌న్ ఓటుకు నోటు కేసు. రాజ‌కీయంగా అప్ప‌ట్లో అదో సంచ‌ల‌నం. తెలంగాణలో త‌మ పార్టీని శాశ్వ‌తంగా అంతం చేయాల‌ని జ‌రిగిన రాజ‌కీయ కుట్ర‌గా టీడీపీ ఆ ఘ‌ట‌న‌ను చెప్పుకున్నా.. టీడీపీకి రేవంత్‌రెడ్డికి అదో మ‌చ్చ‌గా మిగిలింద‌నే చెప్పాలి. ఈ కేసు కార‌ణంగానే గ‌తంలో కేసీఆర్ ప్ర‌భుత్వం రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి జైలులో పెట్టిన సంగ‌తి తెలుగు ప్ర‌జ‌లు అంత తేలిక‌గా మ‌ర‌చిపోలేరు. అంతేకాదు.. ఈ కేసులో నాటి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును నాడు కేసీఆర్ ప్ర‌భుత్వం టార్గెట్ చేయ‌డంతో ఫోన్ ట్యాపింగ్ అంశం అప్పట్లోనే తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఈ అనుమానంతోనే చంద్ర‌బాబునాయుడు ప‌దేళ్ల‌పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్నా హైదరాబాద్ ను వ‌దిలి ఏపీ నుంచే పాల‌న సాగించేందుకు సిద్ధ‌ప‌డ్డారన్న విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.

అయితే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ స‌హాయంతో చేసిన కుట్ర‌గా భావించిన రేవంత్‌రెడ్డి ఆ త‌ర్వాత కాలంలో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఆయ‌న సీఎం అయిన నాటినుంచి గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై గ‌ట్టిగా దృష్టి సారించారు. నాటి ప్ర‌భుత్వంలో దీనికి సంబంధించి ప‌నిచేసిన కీల‌క అధికారుల విచార‌ణ‌లో విస్తుగొలిపే అంశాలు బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పోలీస్ అధికారిని అరెస్ట్ చేసిన విషయం విదితమే . అతను వెల్లడించిన సమాచారం ఆధారంగా కెసిఆర్ అండ్ కో కు కూడా ఉచ్చు బిగుస్తోంది .

ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి. మించిదని చెప్పాలి . ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు . చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నారు . ఆ సమయంలో జగన్ కోరిక మేరకు కెసిఆర్ . .. చంద్రబాబు తదితరుల ఫోన్లు ట్యాపింగ్ చేయించాయినట్లు బలమైన ఆరోపణలు తెరపైకి వచ్చాయి . దీనికి సంభిందించి ఇప్పటికే కొన్ని అధరాలు సేకరించినట్లు తెలుస్తోంది .

You May Also Like…