చిలకలూరిపేట స్కూల్ కి సొంత నిధులతో 25 కంప్యూటర్స్
రాజకీయ నేతలు ఇచ్చిన హామీని రోజులలోనే మర్చిపోవడం ఈ రోజులలో అత్యంత సహజం . అయితే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నం . పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థులకు ఇచ్చిన హామీ తక్షణం నెరవేర్చారు. ఈ నెల 5న పాఠశాలలో జరిగిన మెగా టీచర్స్–పేరెంట్స్ మీటింగ్లో విద్యార్థుల కోరిక మేరకు తన సొంత నిధులతో చెప్పిన పది రోజుల లోపే 25 కంప్యూటర్లు దానికి తగిన విధంగా ఫర్నిచర్ గదిని కంప్యూటర్ ల్యాబ్ అత్యంత సుందరీకరణ చేశారు.
రూ.25 లక్షల సొంత నిధులతో పవన్ కల్యాణ్ చేసిన ఈ సాయంతో చిలకలూరిపేట విద్యార్థులకు నూతన దిశా నిర్దేశం లభించిందని అన్నారు. మొత్తం రూ. 25 లక్షల సొంత నిధులతో ఇంత విలువైన సదుపాయాలు ఏర్పాటు చేయడం పవన్ కల్యాణ్ సేవా దృక్పథానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు కృతజ్ఞతలను తెలియజేశారు. కేవలం పది రోజుల లోపే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు గాను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు ఎప్పుడూ రుణపడి ఉంటామని విద్యార్థులంతా కొనియాడారు.
పుస్తకాలతో లైబ్రరీ నింపేశారు: పాఠశాలలో పుస్తకాలు అరకొరగా ఉండడాన్ని గమనించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ రోజు జరిగిన సమావేశంలో లైబ్రరీ నిండుగా పుస్తకాలు, 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తొమ్మిది రోజుల్లో కంప్యూటర్లతో అధునాతన స్కిల్ ల్యాబ్ ను ఏర్పాటు చేయించారు. పవన్ ని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయా నాయకులు , ప్రజాప్రతినిధులు, స్థానికులు ఎవరికీ వారు ముందుకు వచ్చి . .. స్థానికంగా స్కూల్స్ లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడితే పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది .



