దీని వెలువ తొమ్మిది లక్షల కోట్ల పైమాటే . ..
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ (Bill Gates) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సంపదంలో 99 శాతాన్ని పేదల కోసం వెచ్చించాలని నిర్ణయించారు . ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్కు (Gates Foundation) విరాళంగా ప్రకటించారు. ఆ సంపదతో గేట్స్ ఫౌండేషన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలను భారీ స్థాయిలో చేపట్టనున్నారు. 2045 నాటికి ఆ సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసి గేట్స్ ఫౌండేషన్ను పూర్తిగా మూసెయ్యాలని నిర్ణయించుకున్నారు.గేట్స్ ఫౌండేషన్ను బిల్గేట్స్, మిలిందా 2000 సంవత్సరంలో స్థాపించారు. గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఛారిటబుల్ ట్రస్ట్.
ప్రస్తుత లెక్కల ప్రకారం బిల్గేట్స్ సంపదలో 99 శాతం అంటే 107 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీ ప్రకారం 9 లక్షల కోట్ల రూపాయలు. అలాగే దాతల నుంచి విరాళాలు కూడా సేకరించి రాబోయే 20 ఏళ్లలో మరో 200 బిలియన్ డాలర్లు (రూ.16 లక్షల కోట్ల రూపాయలకు పైగా)ను కూడా ఖర్చుపెట్టబోతున్నారు. ఈ డబ్బును పూర్తిగా ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన వంటి సేవా కార్యక్రమాలకు వెచ్చించి, ఆపై సంస్థను శాశ్వతంగా మూసివేయాలని యోచిస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్కు ప్రపంచ కుభేరుడు అయిన వారెన్ బఫెట్ కూడా భారీగా విరాళాలు అందజేస్తుంటారు.



