గౌతమ మహర్షి ఆదర్శనీయం . . చాగంటి

 నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో “వ్యక్తి-గుణ వైభవము” అంశముపై , “ప్రవచన చక్రవర్తి” బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములు జరుగుచున్నవి. ప్రతి మనిషి అలవరచుకోవలసిన సద్గుణములను గూర్చి గౌతమ మహర్షి అందించిన సందేశం ఆధారంగా పూజ్య గురువు గారు ప్రవచనం చేశారు.  వేల సంఖ్యలో శ్రీహరికోటలోని SHAR ఉద్యోగస్తులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. SMPC, SDSC SHAR డిప్యూటీ డైరెక్టర్ శ్రీ రమేష్ బాబు గారు SHAR తరుపున పూజ్య గురుదేవులను సత్కరించారు.
ఈరోజు సాయంత్రం కూడా ఇదే అంశముపై పూజ్య గురువుగారు శ్రీహరికోటలోని పులికాట్ నగర్ లో ప్రవచనం చేయనున్నారు.