Tragedy: ఫోన్ మాట్లాడుతూ చంకలో హీటర్ పెట్టుకున్న వ్యక్తి .. కరెంట్ షాక్ తో మృతి

Tragedy Incident in Khammam: ప్రస్తుతం చాలా మంది ఓ వైపు ఫోన్ మాట్లాడుతూ అదే సమయంలో ఇతర పనులను కూడా చేస్తుంటారు. అనాలోచితంగా చేయడం వలన ప్రాణాలను కోల్పోయే ప్రమాదం కూడా వస్తుంది. అటువంటి తరహా సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని స్థానిక కాల్వ ఒడ్డు దగ్గరలోని హనుమాన్ ఆలయం సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు అనే వ్యక్తి కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఆదివారం రాత్రి సమయంలో వేడినీళ్ల కోససం హీటర్ ఆన్ చేయబోయారు. అదే సమయంలో ఫోన్ రావడంతో మాట్లాడుతూ.. హీటర్ ను నీటిలో బదులు చంకలో పెట్టుకుని స్వీచ్ ఆన్ చేశారు. దీంతో కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మహేశ్ బాబు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారని మూడవ పట్టణ పోలీసులు తెలిపారు.