కార్ల కంటే ఏసీ ఉద్గారాలూ డేంజరే – 2035 నాటికి రెట్టింపు

Abhi Correspondent

September 16, 2025

”మన దేశంలో ఏసీల వినియోగం ఏటేటా గణనీయంగా పెరుగుతోంది . ఇదే పరిస్థితి కొనసాగితే 2035 నాటికి అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి . .. ” అని ఒక ప్రముఖ సంస్థ సర్వ్ వెల్లడించింది .  

2030 నాటికి భారతదేశంలో అత్యధిక గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల చేసే గృహోపకరణాలుగా ఏసీలు ప్రధమ స్థానంలో ఉంటాయని . .. ఓ సర్వే తెలిపింది. అంతేకాకుకండా 2035 నాటికి మొత్తం ఉద్గారులు రెండింతలు పెరిగి 329 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్​కు సమానంగా చేరుతాయని దిల్లీ కేంద్రంగా ఉన్న థింక్ ట్యాంక్ iFOREST తాజా సర్వేలో వెల్లడించింది.

‘2024లో మాత్రమే ఏసీల వల్ల 156.9 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు విడుదలయ్యాయి. ఇది దేశంలోని అన్ని ప్రయాణీకుల కార్ల ఉద్గారాలకు సమానం. ఇందులో 52 మిలియన్ టన్నులు రిఫ్రిజిరేటర్ల లీకేజీల వల్ల వచ్చాయి. జాతీయ రిఫ్రిజరెంట్ డేటాబేస్ ఏర్పాటు చేసి, ఉద్గారాలను తగ్గించడానికి కఠినంగా అమలు చేయాలి. ఈ చర్యల ద్వారా రానున్న దశాబ్దంలో 500 నుంచి 640 మిలియన్ టన్నుల కార్బన ఉద్గారాలను నివారించవచ్చు. ఇవి 25-32 బిలియన్ డాలర్లు ఉంటాయి. కార్బన్ క్రెడిట్ల విలువత పాటు వినియోగదారులకు 10 బిలియన్ డాలర్ల రీఫిల్లింగ్ ఖర్చులను ఆదా చేస్తాయి’ అని నివేదిక తెలిపింది.

భారత్​లో ఒక ఏసీని రెండు సంవత్సరాలకోసారి రీఫిల్ చేస్తే, అది ఒక కారు విడుదల చేసే ఉద్గారాలంత నష్టం చేస్తుందని ఢిల్లీలోని ప్రముఖ ఎన్అజీవి నిర్వాహకుడు సిద్దర్ సూకీ తెలిపారు. ‘వాతావరణ మార్పులకు ఏసీ కూడా కారు మాదిరిగానే హానికరం. ప్రజలు ఎనర్జీ ఎఫిషెన్సీ పట్ల జాగ్రత్తగా ఉన్నారు కానీ రిఫ్రిజిరేటర్ల విషయంలో అవగాహన తక్కువ. ప్లాస్టిక్‌లకు ఉన్నట్లే రిఫ్రిజిరేటర్ల లైఫ్‌సైకిల్‌పై కూడా సమగ్ర నియంత్రణ అవసరం’ అని అయన అన్నారు.

AC వినియోగం స్పీడ్ గా పెరుగుతోంది’
సర్వే ప్రకారం, భారత్​లో ఏసీల సంఖ్య 2024లో 62 మిలియన్ ఉన్నాయి. 2035 నాటికి 245 మిలియన్​కు పెరుగనుంది. వార్షిక విక్రయాలు 14 మిలియన్ నుంచి 40 మిలియన్​కు పెరుగుతాయి. 2020 నుంచి ఏసీ అమ్మకాలు సంవత్సరానికి 15-20శాతం వృద్ధి సాధిస్తున్నాయి. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 3,100 కుటుంబాల సర్వే ప్రకారం,80శాతం ఏసీలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగివి ఉన్నాయి. 87శాతం కుటుంబాలు ఒక్క ఏసీ కలిగి ఉంటే, 13శాతం కుటుంబాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నాయి. చెన్నై, జయపుర్, కోల్‌కతా, పుణెలో బహుళ ఏసీ వినియోగం ఎక్కువగా ఉంది.

డేంజర్ . .. డేంజర్ . .. HFC-32 దేశంలో విస్తృతంగా వాడుతున్న రిఫ్రిజిరేటర్. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే 675 రెట్లు అధిక వేడి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.లీకేజీ కారణంగా ఉద్గారాలు 2024లో 52 మిలియన్ టన్నులు కాగా, 2035 నాటికి 84 మిలియన్ టన్నులు పెరుగుతాయని అంచనా. సగటున కుటుంబాలు రోజుకు 4 గంటలు ఏసీలు వాడుతున్నారు.

You May Also Like…

ఇరాన్​ భూగర్భ క్షిపణి నగరాలే  లక్ష్యం.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు!

ఇరాన్​ భూగర్భ క్షిపణి నగరాలే లక్ష్యం.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు!

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తన ఆయుధ సంపత్తిని కాపాడుకునేందుకు ఇరాన్ వ్యూహాత్మకంగా నిర్మించుకున్న భూగర్భ క్షిపణి...

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

తరిగిపోతున్న ఆయుధాలు - ఇరాన్​తో మరో 10 రోజులు యుద్ధం కొనసాగితే అమెరికా క్షిపణి నిల్వలు తగ్గే అవకాశం - పెంటగాన్...