తుపాన్ల లక్షణాలు ఎందుకు మారిపోతున్నాయ్‌?

Abhi Correspondent

October 31, 2025

వేగంగా బలపడి, అంత వేగంతో బలహీనపడిన ‘మొంథా’ వాతావరణ పెను మార్పులు

”మొంథా’, తుఫాను సోమవారం ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటబోతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంగా ఈదురు గాలులు వీస్తాయి .. కనుక జిల్లా అధికారులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి . .” అంటూ వాతావరణ శాఖ అధికారులు సీరియస్ గా అప్రమత్తం చేశారు . కాకినాడ జిల్లా యంత్రాంగం కూడా అన్ని చర్యలు చేపట్టింది . అయితే తుపాను తన దిక్కును మార్చుకుంది . ఇలా ఎందుకు జరుగుతుంది . వాతావరణ అంచనాలకు తుపాను వంటి వైపరీత్యాలు అందకపోతే ప్రమాదాలు మరింత పెరుగుతాయా ?

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం రూపంలో ప్రారంభమైన ‘మొంథా’, శనివారం ఉదయానికి వాయుగుండంగా, ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, రాత్రికి తుపానుగా మారింది. మంగళవారం నాటికి ఇది తీవ్రమైన తుపానుగా బలపడింది. కానీ తీరం దాటిన తర్వాత అదే వేగంతో బుధవారం తెల్లవారుజామున తుపానుగా, ఆపై తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.

తుపాన్ల లక్షణాలు మారిపోతున్నాయ్‌: ఏ రెండు తుపాన్లు ఒకేలా ఉండవు. అయితే వాతావరణ మార్పుల ప్రభావంతో ఇప్పుడు తుపాన్ల లక్షణాలు వేగంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘మొంథా’ తుపాను ఏర్పడే వరకు బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగిన విధంగా ఉన్నాయి. కానీ తర్వాత పరిస్థితులు అది బలం పుంజుకునేందుకు, ప్రభావం చూపేందుకు అనుకూలించలేదు. వాతావరణ మార్పుల దృష్ట్యా తుపాన్ల ప్రవర్తన మారిపోతోందని విశాఖపట్నం వాతావరణ నిపుణుడు ఆచార్య భానుకుమార్ తెలిపారు.

You May Also Like…

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

తరిగిపోతున్న ఆయుధాలు - ఇరాన్​తో మరో 10 రోజులు యుద్ధం కొనసాగితే అమెరికా క్షిపణి నిల్వలు తగ్గే అవకాశం - పెంటగాన్...