రాందేవ్ బాబా సన్సెస్ మంత్ర.. 10 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కథ తెలుసా ?

Rama Chandra P

చిన్న ఆశ్రమం పెట్టుకుని యోగా నేర్పించడం ప్రారంభించిన బాబా రాందేవ్ ఈ స్థాయికి చేరడానికి . ,?

 స్వామి రాందేవ్, ఆచార్య బాలకృష్ణ ఆధ్వర్యంలో పతంజలి సంస్థ సామాజిక వ్యాపారానికి కొత్త దిక్సూచి అనడంలో సందేహంలేదు . యోగ, ఆయుర్వేదం, స్వదేశీ ఉత్పత్తులతో స్వయం ఉపాధికి మార్గం చూపిస్తూ, లక్షల మందికి జీవనోపాధి కల్పి0చడమే రాందేవ్ మొదటి విజయంగా చెప్పవచ్చు . రైతుల నుంచి చిన్న పరిశ్రమల వరకు సమగ్ర అభివృద్ధికి ఈ మోడల్ మార్గదర్శకంగా మారింది.

యోగా గురువు బాబా రామ్‌దేవ్ యాజమాన్యంలోని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఇటీవల 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఆశాజనకమైన ఫలితాలను నివేదించింది. గత ఆర్థిక సంవత్సరం 2024-25 మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.358.53 కోట్ల నికర లాభాన్ని, 74 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.206.31 కోట్లు. మార్చి త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.9,744.73 కోట్లుగా ఉండగా, 2023-24 ఇదే త్రైమాసికంలో ఇది రూ.8,348.02 కోట్లుగా ఉంది.

బాబా రామ్‌దేవ్ యోగా, ఆయుర్వేదం , స్వదేశీ ఉత్పత్తుల ప్రజాదరణను ఉపయోగించి తన కంపెనీని రూ. 10,000 కోట్లకు పైగా విలువైనదిగా చేశారు. దీని వెనుక అనేక వినూత్న ఆలోచనలతోపాటు . … దేశభక్తి , అంకితభావం అసలైన కారణాలుగా చెప్పవచ్చు .

బ్రాండింగ్,మార్కెటింగ్: బాబా రామ్‌దేవ్ స్వయంగా పతంజలిని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రోత్సహించారు. వారు ఉత్పత్తులను ప్రచారం చేయడానికి టీవీ, సోషల్ మీడియా , వారి యోగా ప్రచారాన్ని ఉపయోగించారు.పతంజలి ఆయుర్వేద ఔషధాలను దాటి FMCG, కాస్టిక్ సోడా, దుస్తులు, ఆహార ఉత్పత్తులు, విద్య , ఆరోగ్య సంరక్షణకు విస్తరించింది. ఆ విధంగా, బాబా రామ్‌దేవ్ తన పతంజలి కంపెనీని ప్రతిచోటా విస్తరించాడు. దీని వలన పతంజలి బాగా ప్రాచుర్యం పొందింది.

ఆయిల్ పామ్ పరిశ్రమ . .. కాకినాడ సమీపంలో 3 పామాయిల్ ఫ్యాక్టరీస్ ను పతంజలి ఆరేళ్ళ క్రితమే కొనుగోలు చేసింది . రుచి సొయా నుంచి రూ 1600 కోట్లకు ఈ డీల్ జరిగింది . ఇపుడు 25 వేల ఎకరల పామాయిల్ సాగు రైతులతో పతంజలి ఒప్పందం చేసుకుంది .

పతంజలి “ఫార్మ్ టు ఫార్మసీ” మోడల్ ద్వారా రైతుల నుంచి నేరుగా ఔషధ మొక్కలు కొంటోంది. దీనివల్ల రైతులకు సరైన ధర లభిస్తోంది. చాలా మంది రైతులు రసాయనాలను వదిలేసి సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లారు. ఇది వారి ఖర్చులను తగ్గించి ఆదాయాన్ని పెంచింది.

పతంజలి చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME)ను తోడ్పాటు ఇస్తూ స్థానిక తయారీదారులకు టెక్నాలజీ, బ్రాండింగ్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ లభించేలా చేసింది. దాంతో వారు మార్కెట్‌లో పోటీ ఇవ్వగలుగుతున్నారు. ప్రస్తుతం 2 లక్షల మందికి పైగా పతంజలి నేరుగా ఉద్యోగాలను కల్పించగా, 10 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లాభం పొందుతున్నారు.

You May Also Like…