రామ్ చరణ్ మైనపు బొమ్మ.. ఎక్కడ ? ఎందుకు ?

Rama Chandra P

May 6, 2025

మేడమ్​ టూస్సాడ్స్​లో రామ్​ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ –  అరుదైన ఘనత దక్కించుకున్న స్టార్ హీరో

టాలీవుడ్ హీరోగా తెరంగేట్రం చేసి… గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడం టుస్సాడ్స్ (లండన్ ) లో చెర్రీ మైనపు బొమ్మ ఆవిష్కరిస్తున్నారు .

రామ్ చరణ్​తో ‘రైమ్​’ స్పెషల్!

సినిమా రంగ0లో విశేష కృషి చేసిన వారిని గౌరవిస్తూ మేడమ్​ టూస్సాడ్స్​ వారి మైనపు విగ్రహాలను తయారుచేసి మ్యూజియంలో ఏర్పాటు చేస్తుంది . అయితే, సెలబ్రిటీల విగ్రహాలు మాత్రమే ఆవిష్కరిస్తుంది. కానీ ప్రస్తుతం రామ్​ చరణ్​తో పాటు ఆయన పెంపుడు శునకం రైమ్​ కూడా ఇందులో భాగం కాబోతోంది. రామ్​ చరణ్​తో పాటు రైమ్​ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించోతున్నారు. అయితే ఇప్పటివరకు సినిమా సెలబ్రిటీల పెంపుడు జంతువులకు ఇలా చేయలేదు. గతంలో క్వీన్ ఎలిజబెత్​ 2 మాత్రమే తన పెంపుడు జంతువుతో కనిపించారు. కాగా, ఆవిష్కరణ తర్వాత విగ్రహాన్ని మేడమ్​ టూస్సాడ్స్​ సింగపూర్​కు తరలిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం మెగా ఫ్యామిలీ మే 11న ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్​ హాల్​లో ఆర్​ఆర్​ఆర్​ లైవ్​ ఆర్కెస్ట్రా ప్రదర్శనలో పాల్గొననున్నారు.

 దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్​ఆర్​ఆర్​ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు రామ్​ చరణ్. ఇప్పుడు ఈ స్టార్​కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్​ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని మే9 ఆవిష్కరించనున్నారు. రామ్​చరణ్​కు దక్కిన ఈ గౌరవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెగా ఫ్యామిలీ లండన్​కు పయనం అయినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, రామ్​ చరణ్- ఉపాసన దంపతులు, కుమార్తె క్లీన్​ కారా, పెంపుడు శునకం రైమ్​ లండన్​కు బయలుదేరి వెళ్లారు .

You May Also Like…