మేడమ్ టూస్సాడ్స్లో రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ – అరుదైన ఘనత దక్కించుకున్న స్టార్ హీరో
టాలీవుడ్ హీరోగా తెరంగేట్రం చేసి… గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడం టుస్సాడ్స్ (లండన్ ) లో చెర్రీ మైనపు బొమ్మ ఆవిష్కరిస్తున్నారు .
” వరల్డ్ ఫెమస్ టుస్సాడ్స్ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను . చిన్నప్పుడు మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియం చూసినప్పుడు ఎంతో ఆనంద0గా లెజెండ్స్ విగ్రహాలతో ఫొటోలు తీసుకోవడానికి ఉత్సాహం చూపేవాడిని . అలంటి అరుదైన మ్యూజియంలో నా విగ్రహం ఏర్పాట్లు చేయడం, తన కెరీర్ తొలి నాళ్లలోనే ఇలా జరగడం ఊహించలేదు . . ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తోంది . …” – రామ్ చరణ్ భావోద్వేగ ప్రకటన
రామ్ చరణ్తో ‘రైమ్’ స్పెషల్!
సినిమా రంగ0లో విశేష కృషి చేసిన వారిని గౌరవిస్తూ మేడమ్ టూస్సాడ్స్ వారి మైనపు విగ్రహాలను తయారుచేసి మ్యూజియంలో ఏర్పాటు చేస్తుంది . అయితే, సెలబ్రిటీల విగ్రహాలు మాత్రమే ఆవిష్కరిస్తుంది. కానీ ప్రస్తుతం రామ్ చరణ్తో పాటు ఆయన పెంపుడు శునకం రైమ్ కూడా ఇందులో భాగం కాబోతోంది. రామ్ చరణ్తో పాటు రైమ్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించోతున్నారు. అయితే ఇప్పటివరకు సినిమా సెలబ్రిటీల పెంపుడు జంతువులకు ఇలా చేయలేదు. గతంలో క్వీన్ ఎలిజబెత్ 2 మాత్రమే తన పెంపుడు జంతువుతో కనిపించారు. కాగా, ఆవిష్కరణ తర్వాత విగ్రహాన్ని మేడమ్ టూస్సాడ్స్ సింగపూర్కు తరలిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం మెగా ఫ్యామిలీ మే 11న ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఆర్ఆర్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా ప్రదర్శనలో పాల్గొననున్నారు.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు రామ్ చరణ్. ఇప్పుడు ఈ స్టార్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని మే9 ఆవిష్కరించనున్నారు. రామ్చరణ్కు దక్కిన ఈ గౌరవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెగా ఫ్యామిలీ లండన్కు పయనం అయినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్- ఉపాసన దంపతులు, కుమార్తె క్లీన్ కారా, పెంపుడు శునకం రైమ్ లండన్కు బయలుదేరి వెళ్లారు .



