తెలంగాణలో సగానికి పైగా లోక్ సభ స్థానాలు గెలుచు కోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. అందుకు సంబంధించి 10 రోజుల పాటు విజయ సంకల్ప్ యాత్రను ప్లాన్ చేసింది. ఈ యాత్రను నాలుగు వేర్వేరు ప్రాంతాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు ఒకేసారి జెండా ఊపి ప్రారంభించారు.
అసాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ పార్లమెంట్ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ తో కలిసి బాసర ఆలయం వద్ద కొమరం భీమ్ క్లస్టర్ నుంచి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తాండూరులోని రాజ రాజేశ్వరి క్లస్టర్ నుంచి ర్యాలీలు ప్రారంభించారు. విజయ సంకల్ప యాత్రలో పాల్గొనడానికి 24న హైదరాబాద్ కు అమిత్ షా రానున్నారు. మార్చి 1న ఈ యాత్ర ముగియనున్నది.