ప్రముఖ హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత ఏవీ రాజు ఆమెపై చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక రాజకీయ నాయకుడు రూ.25 లక్షలు ఇచ్చి త్రిషను రిసార్ట్ కు పిలిపించుకున్నారని ఆయన వీడియో క్లిప్ లో చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు రచ్చ రేపుతోంది. దీనిపై తమిళ సినీ ప్రముఖులతో పాటు, పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజును పార్టీ నుంచి అన్నాడీఎంకే నాయకత్వం సస్పెండ్ చేసింది.
దీనిపై త్రిష స్పందిస్తూ.. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఎంతకైనా దిగజారే నీచమైన వ్యక్తులను చూడటం అసహ్యంగా ఉందని ఎక్స్ వేదికగా మండిపడింది. ఇలాంటి వారిని ఉపేక్షించనని.. కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. అంతా తన లీగల్ టీమ్ చూసుకుంటుందని చెప్పింది.