” మనిషి ఆశా జీవి. వ్యక్తిగత లబ్ది కోసం ఎగబడి చూసే జనం ఎక్కువైపోయారు. పాలకులు కూడా ఇందుకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి జనానికి పంచడమే పరమావధిగా పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్ ఐదేళ్లూ లక్షల కోట్లు అప్పులు చేసి పప్పుబెల్లాల్లా పంచారు. చేసిన అప్పులు 13 లక్షల కోట్లు అయితే.. జనానికి పంచింది మాత్రం 3 లక్షల కోట్లు లోపే. ఇందులో భారీ దోపిడీ జరిగిన విషయం ప్రస్తుతానికి అప్రస్తుతం..
2019-2024 మధ్య ఐదేళ్లలో జగన్ పేద వర్గాలకు డబ్బు పంపిణీ చేసారు. 2024 ఎన్నికల్లో మరిన్ని పధకాలు పెడతారని.. మళ్ళీ గెలవడానికి బాగుటుందని భ్రమలు పెట్టుకున్న వైసీపీ అభ్యర్థులు, నాయకులు జగన్ మానిఫెస్టోలో కొత్త అంశాలు లేకపోవడంతో డీలా పడిపోయారు.
జనం ఎపుడు కొత్త కోరుకుంటారు. ఇప్పటి వరకు చేసిన దాని గురించి కాకుండా.. ఇంకా కొత్తది ఏమి చేస్తారు.. అని ఎదురు చూడటం జనానికి అలవాటు.. సరిగ్గా జగన్మోహన్రెడ్డి ఇక్కడే ఫెయిల్ అయినట్లు కనిపిస్తోంది.
గతంలో ఇచ్చే సంక్షేమ పథకాలే డబ్బు పెంచి ఇస్తే సరిపోతుందని భావించినట్లున్నారు. అవే మానిఫెస్టోలో చేర్చారు.
గతంలో ఇచ్చి నెరవేర్చలేని హామీల జోలికిపోలేదు.
మధ్య నిషేధం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్., ప్రతినెలలో జాబ్ కాలెండర్, మెగా DSC, ఇస్లానిక్ బ్యాంక్, నియోజకవర్గానికి ఒక అనాధ ఆశ్రమం.. నిరుద్యోగ భృతి, మైనార్టీలకు 5 లక్షల ఉచిత ఋణం.. ఇలా అనేక హామీలు అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలం అయ్యారు. వాటి గురించి మానిఫెస్టోలో ప్రస్తావన లేకుండా.. కొన్నింటిని మాత్రమే చేర్చి… లబ్ది పొందుతున్న ఆయా వర్గాలను తమకు ఓటు వేసేలా చేసుకుందుకు ప్రయతించారు. ”
వైసీపీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులు మాత్రం.. 2 లక్షల వరకు రైతు రుణ మాఫీ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. , మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటివి ఆశించారు. అయితే ఇవేవీ జగన్ మానిఫెస్టోలో లేకపోవడంతో ఆయా అభ్యర్థులలో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి.
ఉద్యోగులు, యువతను పూర్తిగా విస్మరించారు..
గత 2019 మానిఫెస్టోలో ఇచ్చిన cps రద్దు.. ఉద్యోగుల బకాయిల చెల్లింపు వంటి హామీలు ఈసారి కనిపించలేదు. ఎందుకంటే వాటిని నెరవేర్చడానికి జగన్ ఏ మాత్రం ప్రయత్నం చేయకపోగా వాటిపై వ్యంగంగా మాట్లాడటం జరిగింది.
”- 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ , రు . 400 కె గ్యాస్ సిలిండర్ వంటి పధకాలను వైసీపీ నాయకులు ఇప్పటికే జనంలోకి తీసుకువెళ్లా0… 2024 ఎన్నికల మానిఫెస్టోలో ఇవేవీ చేర్చకపోవడంతో మా నాయకులు గెలుపుపై ఆందోళన చెందుతున్నారు.” అని ఓ కీలక నేత వ్యాఖ్యనించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల మానిఫెస్టో: ముఖ్యాంశాలు
1.–ఉన్న పథకాలకు కొనసాగిస్తూ ఇచ్చే నిధుల పెంపు
2. సంక్షేమం, అభివృద్దికి పెద్దపీట వేసేలా రూపకల్పన
3.అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధుల పెంపు
4. యువతకి ఉపాధి అవకాశాలపైనా ప్రత్యేక ఫోకస్
5. రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500 దాకా పెంపు
6.అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్ చేయూత తదితర పథకాల కొనసాగింపు
7. వైఎస్సార్ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు
8. అమ్మ ఒడి రెండు వేలకు పెంచుతాం. రూ. 17వేలు చేస్తాం. తల్లుల చేతికి రూ.15 వేలు. మిగిలిన 2 వేలు స్కూల్స్ లో మరుగుదొడ్ల నిర్వహణకు కేటాయిస్తారట…
9. వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ
10. వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దఫాల్లో 60 వేల నుంచి లక్షా 20వేలకు పెంపు
11. నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తం 45 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంపు
12. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం
13. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కొనసాగింపు
14. అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు