ఐదేళ్లుగా యదేచ్చగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలాక్ ఇచ్చింది. ఇన్నాళ్లు దోచిన దానిని మాత్రం కక్కించడానికి మాత్రం ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు.
అక్రమ తవ్వకాలపై ఉన్నతన్యాయస్థానం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను (Illegal Sand Mining)వెంటనే నిలిపివేయాలని జగన్ సర్కార్ను సుప్రీం ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేకుండా చేపట్టిన ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది అక్రమ ఇసుక తవ్వకాలపై తీసుకున్న చర్యలపై మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖను ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తేదీలోపు అక్రమ ఇసుక తవ్వకాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్జీటీ తీర్పుపైన ఎలాంటి స్టే విధించలేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.