యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని అబుదాబిలో ప్రధాని మోదీ సభ ‘అహ్లాన్ మోదీ’ (అరబిక్ లో హలో మోదీ) జరగనుంది. అయితే భారీ వర్షాల కారణంగా సభకు వచ్చే వారి సంఖ్యను తగ్గించి నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సభ 85 వేల మందితో నిర్వహించాల్సి ఉంది. వర్షాలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో 35వేల మందికి మాత్రమే అనుమతించినట్టు నిర్వాహకులలో ఒకరైన సంజీవ్ పురుషోత్తమన్ తెలిపారు.
అబుదాబిలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అలాగే భారీ హిందూ దేవాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఇది అబుదాబిలోనే తొలి హిందూ దేవాలయం. గల్ఫ్ లోనే అతిపెద్దది. 27 ఎకరాల్లో నిర్మించిన విషయం తెలిసిందే.