సున్నితమైన అంశాల్లో జనాన్ని రెచ్చగొట్టడం వైసీపీకి వెన్నతోపెట్టిన విద్య అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగ్గంపేటలో వారాహి యాత్రలో జగన్ అరాచకాలపై నిప్పులు చెరిగారు.
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే వైసీపీ నేతలు కోనసీమలో అల్లర్లు సృష్టించారని.. ఇలాంటి వాటిని ప్రతివారు వ్యతిరేకించాలన్నారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో “వారాహి విజయభేరి” భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నాయకుడైనా సరే అన్ని కులాలను కలుపుకుని పోవాలే తప్ప.. సాటి కులస్తులలో అమాయకులను రెచ్చగొట్టి పబ్బంగడుప కూడదని హితవు పలికారు.