”భూ యాజమాన్య హక్కు చట్టం..” ల్యా0డ్ టైటిలింగ్ యాక్ట్.. ఇపుడు ఆంధ్రప్రదేశ్ అంతటా జనంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. అత్యంత దారుణమైన అంశం ఏమిటంటే.. ఈ చట్టంలో కోర్టుకి వెళ్ళడానికి అవకాశంలేకుండా ఉండటం. గతంలో ఏ చట్టం ఈ విధంగాలేదని న్యాయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఈ చట్టం అమలులోకి వస్తే… సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో ఒరిజినల్ డ్యాక్యుమెంట్స్ ఇవ్వకపోవడం ఒక్కటే కాదు.. ఒరిజినల్స్ ఉన్నా.. భూమిపై హక్కులు స్పష్టంగా లేవు. భారత దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఇటువంటి చట్టం లేదు. కోర్టులకు వెళ్ళడానికి లేదు.. అంటేనే ఈ చట్టాన్ని అనుమానించాల్సి ఉంటుంది… ఇంత దుర్మార్గమైన చట్టం తీసుకురావడానికి జగ్మోహన్ రెడ్డి సర్కారు.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో తొలిసారిగా ద్రాక్షారామం షబ్ రిజిస్ట్రార్ కార్యాలంలో ఈ చట్టానికి సంబంధించి.. ఒరిగినల్స్ ఇవ్వడంలేదు. ఏప్రిల్ 25 వ తేదీన రాష్ట్రం వ్యాప్తంగా మరో 16 సబ్ రిజిస్ట్రార్లు కార్యాలయాలలో భూ యాజమాన్య హక్కు చట్టం అమలులోకి తీసుకువచ్చారు.
వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు.. ఈ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. ఈ పార్టీలోనే కొందరు మాత్రం…ఇంకా పూర్తిగా అమలులో లేదు కదా..ని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి లాంటి వారు జగన్ వెనక్కి తగ్గబోరని చట్టం అమలు చేసి తీరుతారని మరింతధీమాగా చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్రామాల్లో ఎన్ని భూ సమస్యలు ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ భూసమస్యలను అడ్డంపెట్టుకుని తమ ఆస్తుల్ని వైసీపీ నేతలు లాగేసుకుంటారన్న భయంతో ఎక్కువ మంది ఉన్నారు. పార్టీలు,కులాల తేడా లేకుండా..అందరిలోనూ అదే భయం కనిపిస్తోంది. దీన్ని వైసీపీ నేతలు మరింత పెంచుకుంటున్నారు తప్ప.. ఎలా డీల్ చేయాలో తెలియడం లేదు. తీసేస్తామంటే.. తప్పుడు చట్టం తెచ్చినట్లే కదా అని అంటారు… ఉంచుతామంటే.. భూములు కొట్టేస్తారేమో.. అని విమర్శిస్తారు. ఎలా చూసినా..ఏది మైన… వైసీపీకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెను సమస్యగా మారింది.
టీడీపీ, జనసేన కేడర్ ఈ చట్టంపై పెద్దగా జననానికి అవగాహన కల్పించడంలేదు. తటస్థ ఓటర్లు మాత్రం దీనిపై ఎక్కడికక్కడ మాట్లాడటంతో జనంలోకి వెళుతోంది. కూటమి పార్టీలు దీనిపై మరింత ద్రుష్టి పట్టి జనంలోకి తీసుకువెళ్లగలిగితే వైసీపీపై గెలుపులో ఈ చట్టం 50 శాతం పనిచేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .