టికెట్లు దక్కని నేతలు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరుగుతున్నారు. కొంతమంది పార్టీలు మారుతున్నారు. ఇంకొందరు పార్టీలోనే ఉంటూ దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, పర్వత ప్రసాద్, జ్యోతుల చంటిబాబు … ఈ ముగ్గురికి టికెట్ నిరాకరించారు జగన్. వీళ్ళు పార్టీ మారలేదు. అలా అని జగన్ పెట్టిన వారికి సపోర్టుగా నిలబడలేదు. అయితే పార్టీలో ఉంటూనే వీళ్ళు వైసీపీ అభ్యర్థుల ఓటమికి శక్తివంచన లేకుండా పాటుపడతారు.
ఇదే పరిస్థితి… జగన్ సీట్లు మార్చిన అన్ని చోట్ల ఎదురుకావచ్చు. సుమారు 70 అసెంబ్లీ స్థానాలలో జగన్ ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దీనికితోడు… పలు చోట్ల వైసీపీలో గ్రూప్ తగాదాలు మరీ ఎక్కువయ్యాయి. ఇవన్నీ జగన్ కి తలనొప్పిగా మారాయ్. ఇదే సందర్భంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించబోతోందంటూ.. ఇండియా టుడే సి-ఓటర్ సర్వే తేల్చి చెప్పడం.. వైసీపీ మరింత మైనస్ లోకి వెళ్ళిపోయింది.
షర్మిల గోల మరింత: వైసీపీకి ఆ పార్టీ టికెట్లు దక్కని అభ్యర్థుల దెబ్బ ఒకవైపు … సొంత చెల్లెలు.. షర్మిల దెబ్బ ఇంకో వైపు.. 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలపై షర్మిల అన్న.. జగన్మోహన్రెడ్డిని అడుగడుగునా నిలదీస్తున్నారు. దోపిడీపైనా కడిగిపాడేస్తున్నారు. రాయలసీమలో షర్మిల దెబ్బ జగన్ పార్టీకి గట్టిగ తగిలేలా కనిపిస్తోంది.