ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమి … టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోకు ముహూర్తం రెడీ అయింది. రేపే (మంగళవారం) కూటమి మేనిఫెస్టోను విడుదల చేయదానికి ముహూర్తం పెట్టారు. 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో మేనిఫెస్టోను విడుదల చేయదానికి కూటమి పెద్దలు సన్నాహాలు చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , బీజేపీ ముఖ్యనాయకులు మానిఫెస్టో విడుదల కార్యక్రంలో పాల్గొంటున్నారు.
ఏడాది క్రితమే.. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూటమిగా ఏర్పడి మూడు పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలను కూలంకుషంగా చర్చించి.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సూపర్ సిక్స్ ని ఫిక్స్ చేసారు. వీటితో పాటు.. మరిన్ని సంక్షేమ పధకాలను కూడా మానిఫెస్టోలో చేర్చనున్నారు.