ఢిల్లీలోకి చొరబడి కొందరు రైతులు పౌరుల జీవనానికి భంగం కలిగించడం, న్యూసెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు అదిష్ అగర్వాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్కు లేఖ రాశారు. రైతులపై సుమోటోగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రైతు ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచి రైతులు అధిక సంఖ్యలో ఢిల్లీకి తరలివస్తుండడంతో తాను ఈ లేఖ రాయాల్సి వచ్చిందని అదిష్ తెలిపారు.