తన జీవిత చివరి భాగాన్ని ప్రజారోగ్యానికే అంకితం చేస్తున్నట్టు భారత వ్యాపార దిగ్గజం, టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా స్పష్టంచేశారు. ఆయన అసోంలో ఏడు కేన్సర్ ఆసుపత్రులను ప్రారంభించారు. అది ఆ రాష్ట్ర ప్రభుత్వం, టాటా ట్రస్ట్ ల జాయింట్ వెంచర్. అసోం కేన్సర్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. మొత్తం 17 ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘‘అసోం రాష్ట్ర చరిత్రలో ఈ రోజు ఎంతో ముఖ్యమైనది. ఆరోగ్య సంరక్షణ, కేన్సర్ చికిత్సా పరంగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన రోజు. కేన్సర్ ఎంత మాత్రం సంపన్నుల వ్యాధి కాదు. లక్షలాది మందికి చికిత్స చేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి, ప్రధాని మద్దతు లేకుండా ఇవి జరిగేవి కావు’’అని రతన్ టాటా పేర్కొన్నారు.