ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీని కలవనున్నారు. ఈ రోజు ధిల్లీకి బయలుదేరి రేపు ఉదయం ప్రధానిని కలుసుకుంటారు. ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండానే హఠాత్తుగా జగన్ వెళ్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే. గంటసేపు వారి మధ్య చర్చలు జరిగాయి. పొత్తు గురించే చర్చలు అనే వార్తలు వినిపిస్తున్నాయి. రేపు జగన్ ప్రధాని మోదీని కలవడంపై ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.