- ఐదేళ్లుగా జైల్లోనే ..
- ఎట్టకేలకు ఊరటనిచ్చిన కోర్టు
గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి జగన్ పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఐదేళ్లుగా శ్రీను జైల్లోనే మగ్గిపోతున్న సంగతి తెలిసిందే..
కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని కోర్టు షరతు విధించింది. రూ.25 వేల పూచీకత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని చెప్పింది. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్ లో హాజరుకావాలని ఆదేశించింది. ర్యాలీల్లో పాల్గొనకూడదని కూడా షరతు విధించింది.