నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. దేవస్థానం భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యంగా పాదయాత్రతో వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పింస్తొంది. వెంకటాపురం, నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం అటవీ ప్రాంతాలలో అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. వైద్యం, తాగునీరు, టాయ్ లెట్లు,చలవ పందిర్లు గత సంత్సరం కంటే 20 శాతం ఎక్కువగా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులను ఆదేశించారు.
అటవీ అధికారుల సహకారంతో జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని, నాగులూటి వద్ద కోనేరును శుభ్ర పరచాలని ఆదేశించారు. కాలిబాటగా అటవీ మార్గంలో వచ్చే భక్తులకు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, అటవీ మార్గంలో మార్గ సూచిక బోర్డ్స్ ఏర్పాట్లు చేసి అలానే అవసరమైన మందులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాలని దేవస్థానం వైద్య విభాగాన్ని ఆదేశించారు.