దేశంలోని ఐదు ఎయిమ్స్ విద్యా సంస్థలను ప్రారంభించి జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. గుజరాత్లోని రాజ్కోట్ నుంచి వర్చువల్గా ఈ ప్రారంభోత్సవం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నంలోని పెదవాల్తేరు ఈఎన్ టీ ఆస్పత్రి ప్రాంగణంలోని ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఫుడ్ టెస్టింగ్ ల్యాబరేటరీని ప్రారంభించారు. కేంద్ర ప్రాయోజిత పథకం నిధులతో మొత్తం రూ.4.77 కోట్లతో ఈ ప్రయోగశాలను నిర్మించారు. వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
విశాఖలో ఐఐఎం, కడప, మంగళగిరి ప్రాంతాల్లో ఎయిమ్స్, వంటివి ప్రారంభించామని మోదీ చెప్పారు. ఈ ల్యాబ్ రాష్ట్రానికే గుండె లాంటిదని కొనియాడారు. విశాఖతో పాటు పలు ముఖ్య పట్టణాల్లో డయేరియా లాంటి సమస్యలు వచ్చినపుడు ఆహారం, తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు జరిపేందుకు వసతులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని విశాఖ కలెక్టర్ మల్లిఖార్జున తెలిపారు.