తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీరంగానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో తోడ్పాటు ఇచ్చారని చెప్పారు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత. కడియం నర్సరీలను ఆమె సందర్శించారు. కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో సందడి చేశారు. కేసీఆర్ ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించి మొక్కలను కడియం నర్సరీల నుండి కొనుగోలు చేసిందన్నారు. ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఈ నర్సీలు విస్తరించి ఉండటం అభినందనీయమని, దేశంలో ఏ మూలకెళ్ళినా కడియం నర్సరీ మొక్కలు కనిపిస్తుంటాయన్నారు.
నర్సరీ మొక్కల ప్రత్యేకతలు వాటి పెంపకం తీరుతెన్నులను రైతులు పుల్లా ఆంజనేయులు, వీరబాబు, రాజశేఖర్ కవితకు వివరించారు. పలు మొక్కలను చూసి కవిత ముచ్చట పడ్డారు. వాటితో ఫోటోలు తీసుకున్నారు. అనంతరం పుల్లా చంటి నర్సరీని సందర్శించారు. ఆ నర్సరీలో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం కూర్పును పుల్లా పెద్ద సత్యనారాయణ కవితకు చూపించారు. అలాగే పల్ల వెంకన్న నర్సరీని కవిత సందర్శించారు. ఇప్పటికే ఈ నర్సరీలో పలు రకాల మొక్కలు తమ గార్డెన్లో ఉన్నాయన్నారు. నర్సరీలో పలు విదేశీ స్వదేశీ మొక్కలను తిలకించారు. కవితకు తొలుత నర్సరీ రైతులు పల్ల సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి, వెంకటేష్,వినయ్లు మొక్కను ఇచ్చి ఘన స్వాగతం పలికారు.