బీజేపీ లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమైంది. తెలంగాణలో ఇప్పటికే విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు ఆ పార్టీనాయకులు. రాబోయే ఎన్నికల్లో 370 సీట్లను బీజేపీ గెలుస్తుందని ప్రధాని మోదీ లోక్ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సైతం మొత్తం 17 లోక్ సభ సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మార్చి 4, 5 తేదీల్లో రెండు రోజులపాటు పర్యటించబోతున్నారు. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. వాస్తవానికి మార్చి 4వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. మోదీ పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది.
ప్రధాని మోదీ మార్చి 4న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఆదిలాబాద్ లో బహిరంగసభలో పాల్గొంటారు. ఆ రోజు రాత్రి హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో బసచేస్తారు. 5న సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అనతరం బహిరంగసభలో మోదీ మాట్లాడతారు. అనంతరం ఆయన ఢిల్లీకి తిరుగుపయనం ఉంటుంది.