ప్రధాని మోదీ విజయ సంకల్ప రోడ్ షో లో భాగంగా మల్కాజ్గిరిలో హై అలర్డ్ కొనసాగుతోంది. మల్కాజ్గిరిలో 1.3 కిలోమీటర్ల ఈ రోడ్ షో జరగనుంది. దీంతో కేంద్ర రాష్ట్ర బలగాలు రంగంలోకి దిగాయి. ప్రధానంగా ఈ రోడ్డు మార్గాన్ని ఎస్పీజీ బృందం తమ ఆధీనంలోకి తీసుకుంది. కేరళ నుంచి 4.50 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి రానున్న మోదీ.. రోడ్డు మార్గం ద్వారా మీర్జాలగూడ చౌరస్తాకు చేరుకుంటారు. 5.15 నిమిషాలు నుంచి మొదలుకొని 6.15 నిమిషాల వరకు ఈ రోడ్ షోలో పాల్గొన్న ఉన్నారు.
దీంతో ఈ మార్గంలోని ప్రధాన రహదారులకు రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా షాపులను సైతం మూయించేశారు. ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్ చేసిన ఎస్పీజీ బృందం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు మార్గంలో వెళ్లేటటువంటి వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాల్సిందిగా ఇప్పటికే సూచనలను జారీ చేశారు పోలీసు అధికారులు.