కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సస్పెన్స్కు తెరదించారు. కొద్దిసేపటి క్రితం వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతోపాటు ఆయన తనయుడు గిరి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇటీవల జనసేన నేతలు ముద్రగడతో చర్చలు జరపడంతో ఆ పార్టీలో చేరడం ఖాయమని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా వైసీపీలో చేరబోతున్నట్టు ముద్రగడ ఇటీవల ప్రకటించారు. మొన్ననే ఆయన పార్టీలో చేరాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు నేడు వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ నేతగా మారారు.