తెలంగాణలో మెత్తం ఎంపీ సీట్లు గెలవాలన్నదే తమ లక్ష్యం అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ బూత్స్థాయి నేతల సమావేశంలో పాల్గొని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ చేస్తే అంత త్వరగా రీజినల్ రింగ్ రోడ్డు పూర్తవుతుందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవకుండా ఎంఐఎం కుట్రలు చేసిందన్నారు. ముస్లింలు కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటెయ్యాలని ఫత్వా జారీ చేయించిందని ఆరోపించారు. 20 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో 5 యాత్రలు ప్రారంభమవుతాయని, వాటిని విజయవంతం చేయాల కేడర్ను కోరారు.