ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించింది. అయోధ్యలో చారిత్రాత్మక రామమందిర ప్రారంభోత్సవంలో కీలక పాత్ర పోషించినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. భారత్ లో మిలియన్ల మంది మనోభావాలు ప్రతిధ్వనిస్తున్నాయన్నారు.
“కొంతమంది వ్యక్తులు కేవలం చరిత్రను చదివితే, మరికొందరు దానిని తిరగరాసే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మీరు రెండో వర్గానికి చెందినవారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా కొత్త చరిత్రను తిరగరాశారు. అంటూ రియాక్ట్ అయ్యింది.