మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ-4 నిందితుడు దస్తగిరిని అప్రూవర్గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టు (TS High Court)లో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ 9Petition) వేశారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదన్నారు.సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నాడని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడన్నారు. అలాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వటం సరికాదన్నారు. వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది కూడా దస్తగిరి అని చెప్పారు. దస్తగిరి బెయిల్ సమయంలో సీబీఐ సహకరించిందని.. అతనిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదని అన్నారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి ఆ పిటిషన్లో పేర్కొన్నారు.