శ్రీపీఠం స్వామీ.. పరిపూర్ణానంద మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. హిందూ ధర్మాన్ని గౌరవించువారికి, హిందువులకు మాత్రమే ఆధార్ కార్డుల జారీ చేయాలి. ఎవరికి పడితే వారికి ఇవ్వొద్దు అంటూ స్వామిపరిపూర్ణానందస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో నిర్వహించిన వీర హనుమాన్ విజయ యాత్రలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు హిందూ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. హిందువులుగా జీవించే వారికి, హిందువులు కాకున్నా హిందువులను గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులను ఇవ్వాలన్నారు. ఈ అంశం దేశవ్యాప్తం కావాలని కోరారు. స్వామి వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.