టీమిండియా సొంత గడ్డపై 5 టెస్ట్ ల సిరీస్ ఆడుతోంది. రెండు మ్యాచ్ లు ఇప్పడికే ముగిసిన విషయం తెలిసిందే.. మరో మూడు టెస్టులకు జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ 3 టెస్టులకు తాను అందుబాటులో ఉండనని కోహ్లీ తెలిపాడు. దీంతో ఆయనను జట్టులోకి తీసుకోలేదు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యార్ లు జట్టుకు దూరమైనట్టే. రెండో టెస్టుకు గాయాల కారణంగా దూరమైన జడేజా, కేఎల్ రాహుల్ లకు షరతులో జట్టులో చోటు కల్పించారు. మెడికల్ టీమ్ నుంచి ఫిట్ నెస్ క్లియరెన్స్ వస్తేనే వారిని తుది జట్టులోకి తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది.