పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు నేడు చివరిరోజు.. ఉభయ సభల్లో రామమందిరంపై కేంద్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఎంపీలు రూల్ 193 కిందకు తీసుకురానున్నారు. సత్యపాల్ సింగ్, ప్రతాప్ చంద్ర సారంగి, సంతోష్ పాండే రాజ్యసభలో మోషన్ రూల్ 176 కింద తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. సత్యపాల్ సింగ్, శ్రీకాంత్ షిండే రామ్ లల్లా ప్రతిష్టపై చర్చను లేవనెత్తనున్నారు. ఉభయసభలలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు.