టీడీపీ మేల్కోవాలి.. ఫించన్ల పంపిణీలో వాలంటీర్లను తప్పించాలని ఎన్నికల కమీషన్ ఆదేశాలతో తమకు రాజకీయంగా నష్టం జరగకుండా ఉండాలంటే.. ఫింఛన్ల పంపిణీ వ్యవహారాన్ని ఈ రెండు నెలలు టీడీపీ, జనసేన కేడర్ కి అప్పగించాలి. వాలంటీర్ల బదులు సచివాలయ ఉద్యోగులకు ఫించన్ల పంపిణీ బాధ్యత అప్పగించనున్నారు. వారు కూడా జగన్ హయాంలో నియమితులైన ఉద్యోగులే. వాలంటీర్ల వ్యవహారం మాదిరే వాళ్ళు కూడా వ్యవహరిస్తారు. టీడీపీకి సున్నితమైన అంశం కాబట్టి ఫించన్లు పంపిణీ చేసే వారితో స్నేహపూర్యకంగా మెలిగి.. లబ్ధిదారులతో అపనమ్మకం తలెత్తకుండా చేయడం టీడీపీ అధిష్టానం ముందున్న సవాల్.
ఫించన్ దారుల వద్దకు వెళ్లి.. సమయానికి ఫించన్ వచ్చిందో లేదో పరిశీలించి.. రాకపోతే దగ్గరుండి వచ్చే ఏర్పాటు చేయాలి.. లేకపోతే.. ఎన్నికలలో ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. ఇది చాలా కీలకం అని గ్రహించకుండా లైట్ తీసుకుంటే టీడీపీ, జనసేన వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకున్నట్లే…
మీడియా చేష్టలతో కూటమికి తీవ్ర నష్టం… టీడీపీ అనుకూల మీడియా ఆంధ్రజ్యోతి, ABN, Tv-5 లాంటి వాటితో ఆ పార్టీ కూటమికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ముఖ్య0గా ”ఆంధ్రజ్యోతి వాలంటీర్లపై రాసే రాతలు టీడీపీ, జనసేన కూటమికి బిగ్ డ్యామేజ్ జరిగింది.. అయినా చంద్రబాబు గారు పట్టించుకోకపోతే వాళ్ళు మనకు మేలు చేస్తున్నామనుకుంటూ పూడ్చుకోలేని నష్టం చేస్తారు. ఇది గ్రహించకపోతే 2019 పునరావృతం అవుతుంది..” అని ఓ టీడీపీ సీనియర్ నేత ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్ళారట.
వాలంటీర్ వ్యవస్థపై జనంలో సానుకూలత
వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రభుత్వ పధకాలు ఇంటికే అందుతున్నాయి. అతి తక్కువ జీతం… 5 వేల రూపాయలతో ప్రజల వద్దకే సేవలు నేరుగా అందించే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయింది. అయితే ముఖ్య0గా వృద్ధాప్య ఫించన్ విషయంలో వాలంటీర్ల సేవలు భేష్. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి .. వాలంటీర్లను నమ్మకమైన వైసీపీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. ఈ పరిస్థితిలో జరగబోతున్న ఎన్నికలలో వాలంటీర్లు జగన్ గెలుపు కోసం ప్రయత్నం చేస్స్తున్నారని టీడీపీ, జనసేన కేడర్ బలంగా నమ్ముతున్నారు. అయితే వాలంటీర్లను తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా వారిని ఎదుర్కోవాలని చూస్తున్న ప్రతిపక్ష నేతలు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వంటి మేధావులు విస్మరిస్తున్న కీలక అంశం.. వాలంటీర్లను రెచ్చగొడితే ఎదురయ్యే రాజకీయ ప్రమాదాన్ని గుర్తించకపోవడం.
పడిగాపులు లేకుండా..
రాష్ట్రంలో సుమారు 64 లక్షల మందికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ ఫించన్లు అందుతున్నాయి. వాలంటీర్లు క్రమం తప్పకుండ ఇళ్లకు వెళ్లి మరీ ముసలాళ్ల చేతిలో ఫించన్ సొమ్ము పెట్టి వస్తున్నారు. ఇంతక్రితం.. ఈ ఫించన్ తీసుకోవడానికి పంచాయితీ ఆఫీసుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది. జగన్ అధికారంలోకి వచ్చాకా ఈ మార్పుతో జనంలో సానుకూలత తెచ్చుకున్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ విషయాన్నీ గుర్తించకపోవడం, వాలంటీర్ల సేవలను అంగీకరించకపోవడం వంటి అంశాన్ని వైసీపీ ఫోకస్ చేస్తోంది. మెజార్టీ వాలంటీర్లు సైతం చంద్రబాబును శత్రువులా భావిస్తున్నారు.
ఈ దశలో జరగబోయే ఎన్నికలలో వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయిస్తారన్న భయంతో వారిని వారించడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించాయని సంబరపడుతున్నారే కానీ, వాలంటీర్లు అందించే సేవలను ప్రభుత్వ సిబ్బందితో బర్తీ చేయాలనీ ఎన్నికల కమిషన్ ఆదేశించినా అవి జరగవన్న విషయాన్నీ చంద్రబాబు అండ్ కో ఎందుకు విస్మరిస్తున్నారో అర్ధం కావడంలేదు.
64 లక్షల ఫించన్ దారులపై ప్రభావం.. ఐదేళ్లుగా వాలంటీర్ల సేవలతో క్రమం తప్పకుండా ఫించన్ అందుకుంటున్న 64 లక్షల మందిపై ఎన్నికల కమిషన్ ఆదేశాలు ప్రభావం చూపనున్నాయ్. నగదు పంపిణీ వంటి ఏ కార్యక్రమాలను వాలంటీర్లు చేపట్టకుండా నిలువరించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో కొన్ని వేల మంది వాలంటీర్లు ప్రతిషాత్మకంగా తీసుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. వాళ్ళ వద్ద ఉన్న ట్యాబ్లు, సెల్ ఫోన్లు, ఇతర పరికరాలను జిల్లా ఎన్నికల కమిషన్ అధికారుల వద్ద డిపాజిట్ చేయాలన్న ఆదేశాలు.. టీడీపీ, జనసేన కూటమికి తీవ్ర నష్టం చేసే ఆదేశాలుగా మేధావులు చెపుతున్నారు.
కుయుక్తులను ఎదుర్కోవాలి… ఫించన్ పంపిణీలో కావాలని ఇబ్బందులు సృష్టిస్తారు..
వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి.. ప్రభుత్య సిబ్బందితో ఇంటికీ ఫించన్ అందించడంలో ఇబ్బందులు పెట్టడానికి కుయుక్తులు పన్నడం రాజకీయ0గా సహజ పరిణామం. ఈ రెండు నెలలు ఫించన్ పంపిణీలో ఇబ్బందులు సృష్టించడం ద్వారా. .. కూటమి అధికారంలోకి వస్తే ఇలాగే ఇబ్బందులు ఎదురవుతాయని ఫించన్ దారులను భయపెట్టే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలు టీడీపీ, జనసేన కూటమికి నష్టం రాకుండా ప్రత్యామ్నాయాలు చేసుకోవాలి. ఇందు కోసం ఆయా పార్టీల కేడర్ ని ఉపయోగించుకుని గెలుపు కోసం మరింత ప్రయత్నం చేయాలి.