”సంక్షేమ పథకాలు పేదలకు అవసరమే. అయితే వీటిని ఎర వేసి.. రాష్ట్రంలో ప్రక్రుతి వనరులైన గనులు, ఇసుక, మట్టి, కంకర వంటి ఖరీదైన వాటిని సర్కారు పెద్దలు దోచుకుంటున్నా …లక్షల కోట్ల రూపాయలు బొక్కుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ లో పేదలకు మాత్రం ఇవేమీ పట్టనట్లు కనిపిస్తోంది. లక్షల రూపాయల సాఫ్ట్ వేర్ జాబ్స్ లేకుండా… 5 వేల జీతం ఇచ్చే వాలంటీర్ ఉద్యోగమే ముద్దనుకుంటే ఎవరేం చేయగలరు..> ఆలోచించుకోండి ఎవరికి వారే. ఆలోచన చేయలేని పేద వర్గాలకు ఆయా వర్గాలలో యువత అవగాహనా కల్పించాల్సిన తరుణం ఆసన్నమయింది…”
సంక్షేమ పథకాల అమలులో లంచాలకు తావు లేకుండా చేశామని జగన్ చెప్పుకొంటారు. సంక్షేమం పేరిట ప్రజలకు మజ్జిగ పోస్తూ మీగడ, నెయ్యి మాత్రమే తినడానికి అలవాటు పడిన జగన్ వంటి వారు ఇలాంటి పథకాల అమలులో కక్కుర్తి ఎందుకు పడతారు? తమ ఆకలి తీర్చడానికి ఇసుక, మద్యం వంటివి ఉండనే ఉంటాయి కదా! అందుకే సంక్షేమ పథకాలను పైసా లంచం లేకుండా అందిస్తున్నామని ఆయన చెప్పుకొంటారు. ఇలాంటి వాటిపై మాట్లాడుతుంటే.. పేదలకు, పెత్తందార్లకు యుద్ధం.. అంటూ వారిని పక్కదారి పట్టించడం జగన్ అండ్ కోకు అలవాటుగా మారింది.
సంక్షేమం మాటున పాలకులు చేసే దోపిడీ గురించి తెలుసుకొనే అవసరం గానీ, తీరిక గానీ ప్రజలకు ఉండదు అని జగన్కు బాగా తెలుసు. 2019-2024 మధ్య జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిన విషయాన్ని గమనించి.. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే భవిష్యత్ తరాలకు ఏం సమాధానం చెపుతాం…?